-
నీ అభిమానం చల్లగుండా..
● ఐస్క్రీమ్ బండి నిర్వాహకుడే స్టార్ క్యాంపెయినర్ ● జగనన్న మళ్లీ సీఎం కావాలంటూ బైక్పై ప్రచారం యడ్లపాడు: సాధారణ ప్రజలే వైఎస్సార్ సీపీకి ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. నవరత్నాలు పథకాలతో తమకు ఎంతో ఇచ్చిన సీఎం జగనన్నకు అందులో కొంతైనా తిరిగివ్వాలని నిర్ణయించుకున్నారు. తమ ఊరి బడి రూపురేఖలు మార్చి, తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇంగ్లిష్ మీడియం తెచ్చిన.. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఇలా బండి కట్టుకుని ఉప్పరపాలేనికి చెందిన విప్పర్ల జాన్సన్ ఊరూరా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తను ఐసీక్రీమ్ బండి నిర్వహిస్తూ జీవిస్తున్నానని, వైఎస్ జగన్ సీఎం అయ్యాక తన బిడ్డల చదువులకు భరోసా లభించిందని చెప్పుకొచ్చాడు. ఇంకా కొన్ని జాన్సన్ మాటల్లోనే...‘ మా గ్రామంలోని పాఠశాలకు ఐదేళ్ల కిందట ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు. నాడు–నేడు కార్యక్రమంతో పాఠశాల రూపురేఖలు మారాయి. ప్రతి సబ్జెక్టు ఒక టీచర్ ఉన్నారు. మా పిల్లలే కాదు ఊరిలోని పేదలందరి పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివే గొప్ప అవకాశం కలిగింది. ఇవన్నీ నాకు స్ఫూర్తిని రగిల్చాయి. నేను ఎందుకు వైఎస్సార్ సీపీ స్టార్ క్యాంపెయినర్ కాకూడదని భావించాను. అందుకే నా సొంత వాహనానికి ప్రచార సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నాను. సమావేశాలు, సభలకు, నామినేషన్ల సమయంలో విస్తృతంగా పాల్గొన్నా.. సీఎం జగన్ పథకాలు, వివిధ సభల్లోని ఆయన ప్రసంగాలను ఊరూరా వినిపిస్తున్నాను. చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్కుమార్ యాదవ్ను ఫ్యాను గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నాను.’ -
హోం ఓటింగ్ వినియోగించుకున్న వృద్ధులు
చీరాల టౌన్: ఇంటి నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు రెండు రోజులు హోం ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి జి.సూర్యనారాయణరెడ్డి తెలిపారు. చీరాల రూరల్, మున్సిపాలిటీ, వేటపాలెం మండలంలో మొత్తం 225 మందికి హోం ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. మొదటిరోజు మంగళవారం 103 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆర్వో వెల్లడించారు. చీరాల మండలంలోని గవినివారిపాలెంలో జరుగుతున్న హోం ఓటింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అలానే మున్సిపాలిటీలో జరుగుతున్న ఓటింగ్ను మున్సిపల్ కమిషనర్ కె.చక్రవర్తి, ఏఈఆర్వో పి.చక్రవర్తి పరిశీలించారు. బుధవారం హోం ఓటింగ్ జరుగుతుందని, దరఖాస్తు చేసుకున్న ఓటర్లు విధిగా వారి నివాస గృహాల్లో అందుబాటులో ఉండాలని కోరారు. నియోజకవర్గంలో హోం ఓటింగ్కు ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశామని ఆర్వో తెలిపారు. -
మళ్లీ నువ్వే రావాలి..
నరసరావుపేట రూరల్: దొండపాడులో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జగనన్న నువ్యే మళ్లీ రావాలి అంటూ ప్లకార్డు పట్టి ప్రచారంలో పాల్గొన్నారు. ప్యాను గుర్తుకే మీ ఓటు.. అంటూ బొమ్మలతో ఆకట్టుకున్నారు. జగన్ మామయ్య మళ్లీ వస్తేనే అమ్మ ఒడి, విద్యా కానుక వస్తాయని, గోరుముద్ద అందుతుందని చిన్నారులు చెప్పడం అందరిని ఆలోచింపజేసింది. కదలిన నారీ లోకం నరసరావుపేట రూరల్: ఎన్నికల ప్రచారంలో నారీ లోకం కదిలింది. మండలంలో పర్యటించిన వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పి.అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికింది. దొండపాడులో అధిక సంఖ్యలో మహిళలు వారికి హారతులు పట్టి, విజయ తిలకం దిద్దారు. కేసానుపల్లిలో గుమ్మడి కాయలతో దిష్టితీశారు. -
టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా
అమరావతి: మండల కేంద్రమైన అమరావతి టీడీపీ కార్యాలయం ముందు మంగళవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నుండి అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు భారతీయ జనతాపార్టీలో చేరారు. మంగళవారం కూటమిలో పార్టీ నాయకుడైన మేకల హనుమంతరావు ఇంటికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్ది భాష్యం ప్రవీణ్ వెళ్లి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నేపధ్యంలో అమరావతి గోపాల్నగర్లోని యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 150 మంది వచ్చి స్థానిక టీడీపీ ఎన్నికల కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మండల స్థాయి నాయకులు ఎంత సర్ధి చెప్పినా వారు వినలేదు. తాము గత ఐదు సంవత్సరాల్లో ఎంతో మానసిక క్షోభ అనుభవించామని, అర్దికంగా కూడా నష్టపోయి కేసులు పెట్టించుకున్నామని వారు వాపోయారు. తమపై కేసులు పెట్టి అరెస్టులకు తాళలేక ఊరు వదిలి వెళ్లామని, మా బాధలు ఇలా ఉంటే మీరు వెళ్ళి కలవటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్యకర్తలు బిగ్గరగా కేకలు వేశారు. -
ఇంటి నుంచే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్
జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.రఘు గుంటూరు ఎడ్యుకేషన్: పట్టభద్రులైన విద్యావంతులు ఉపాధి కల్పన కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంట్లో నుంచే ఆన్లైన్ విధానంలో ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చునని జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.రఘు తెలిపారు. మంగళవారం గుజ్జనగుండ్ల సర్కిల్లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో మాట్లాడారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు www.empoyment.ap.gov.in సైట్కు మొబైల్, ఆధార్ నంబరు, ఈ–మెయిల్ ద్వారా లాగిన్ అయ్యి సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని చెప్పారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు జాబ్మేళాలను నిర్వహించే సమయంలో వాటి సమాచారం నేరుగా చేరుతుందని చెప్పారు. రెన్యువల్ను ఆన్లైన్ పోర్టల్లోనే చేసుకోవచ్చునని సూచించారు. ఎంప్లాయిమెంట్, రెన్యూవల్ కోసం ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకున్న 48 గంటల లోగా ఎంప్లాయిమెంట్ కార్డు జనరేట్ అవుతుందని తెలిపారు. జిల్లాలో విద్యావంతులైన నిరుద్యోగ యువతీ, యువకులు ఎంప్లాయింట్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కఠెవరం పొలాల్లో జార్ఖండ్ వాసి మృతదేహం తెనాలి రూరల్: తెనాలి మండలం కఠెవరం పొలాల్లో జార్ఖండ్ వాసి మృతి చెంది ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో రూరల్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు, సిబ్బంది ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. మృతదేహం వద్ద సెల్ఫోన్ ఉండడంతో దాని ద్వారా అతను జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోరెన్ విజయ్(39)గా గుర్తించారు. తన తోటి కూలీలతో కలసి చైన్నెలో పనులకు వెళ్తూ ఆదివారం తెనాలిలో రైలు దిగి అది కదిలే లోపు ఎక్కలేకపోయాడు. సోమవారం ఉదయం పట్టాల వెంబడి నడుచుకుంటూ కఠెవరం పొలాల వైపు వచ్చి బహిర్భూమికి వెళ్లి రైలు కింద పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించి అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement