-
నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా?
సచిన్ టెండుల్కర్.. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో అరుదైన ఘనతలెన్నో సాధించి క్రికెట్ దేవుడిగా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. నభూతో న భవిష్యతి అన్న రీతిలో అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా వంద సెంచరీలు సాధించి శిఖరాగ్రాన నిలిచాడు. అయితే, సచిన్ వ్యక్తిగతంగా లెక్కకు మిక్కిలి రికార్డులు కొల్లగొట్టినా ఒక్కటంటే ఒక్క వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడటానికి 22 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తాను భాగమైన భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంతో సచిన్ టెండుల్కర్ చిరకాల కల నెరవేరింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సచిన్ టెండుల్కర్ అప్పట్లో తనలో స్ఫూర్తిని నింపాడంటూ తాజాగా గుర్తుచేసుకున్నాడు.. నాటి అరంగేట్ర, ‘యువ’ బౌలర్. ‘‘ఆరోజు మేము వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం. వికెట్ ఫ్లాట్గా ఉంది. వెస్టిండీస్ స్కోరు అప్పటి బహుశా 500/4 అనుకుంటా. నాలో.. వికెట్ తీయలేకపోతున్నాననే అసహనం పెరిగిపోతోంది. అప్పటికి నా వయసు 21 ఏళ్లు. ఇరవై ఒక్క ఓవర్ల పాటు వికెట్ తీయలేకపోవడం అదే మొదటిసారి. ఆ సమయంలో సచిన్ టెండుల్కర్ మిడాఫ్లో తన ఫీల్డింగ్ పొజిషన్లో నిలబడి ఉన్నాడు. నన్ను చూసి... ‘ఏమైంది అలా ఉన్నావు? ఎందుకంత నిరాశ?’ అని అడిగాడు. అందుకు బదులిస్తూ.. ‘పాజజీ.. నా బౌలింగ్లో ఇప్పటివరకు 21 ఓవర్లు అయినా వికెట్ తీయకపోవడం ఇదే తొలిసారి తెలుసా?.. అలాంటిది అరంగేట్రంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు’ అని వాపోయాను. అప్పుడు వెంటనే.. ఓవర్ మధ్యలోనే.. నన్ను తన దగ్గరికి రమ్మని పిలిచి.. ‘నీకు తెలుసా.. నేను తొలి వరల్డ్కప్ అందుకోవడానికి 22 ఏళ్ల పాటు ఎదురుచూశాను. మరి నువ్వు నీ తొలి వికెట్ కోసం కనీసం 21 ఓవర్లపాటు వెయిట్ చేయలేవా? అంతగా నిరాశపడొద్దు. గతంలో ఏం జరిగిందన్నది అప్రస్తుతం. ఇప్పుడు ఏం చేయగలవో ఆలోచించు’ అన్నాడు. అవును.. కదా పాజీ చెప్పింది నిజమే కదా అనిపించింది. ఆ మరుసటి బంతికే నేను డారెన్ బ్రావో(166)ను అవుట్ చేసి తొలి వికెట్ అందుకున్నా. ఆ తర్వాత కార్ల్టన్, డారెన్ సామీ వికెట్లు తీశాను. నా అరంగేట్రం అలా ప్రత్యేకంగా మారిపోయింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. బీసీసీఐ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకుంటూ.. మన ఆలోచనా విధానాన్ని, అంతకు ముందున్న పరిస్థితులను మార్చడానికి ఒక్క మాట చాలని తనకు ఆరోజు తెలిసిందన్నాడు. సచిన్ టెండుల్కర్ చెప్పిన ఆ స్పూర్తిదాయక మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ బౌలర్ పేరు చెప్పలేదు కదూ! వరుణ్ ఆరోన్.. జంషెడ్పూర్కు చెందిన 34 ఏళ్ల రైటార్మ్ పేసర్. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 9 టెస్టులు, 9 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే.. -
వరల్డ్కప్ జట్టులో ఉంటాడనుకుంటే.. కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా?!
It seemed like he could be in the World Cup team: టీమిండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచకప్-2024 జట్టులో ఉంటాడనుకున్న ఆటగాడిని అకస్మాత్తుగా ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. ఒకప్పుడు ప్రతి సిరీస్కు ఎంపికైన ఆ ప్లేయర్కు ఇప్పుడు కనీసం భారత్-‘ఏ’ జట్టులో కూడా చోటు దక్కకపోవడం ఏమిటని వాపోయాడు. నెట్బౌలర్ నుంచి టీమిండియా స్థాయికి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతుల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ఒకడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్గా మొదలైన అతడి ప్రయాణం.. టీమిండియాకు ఎంపిక అయ్యే స్థాయికి చేరుకుంది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా 2022లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. తన పదునైన, వేగవంతమైన డెలివరీలతో బ్యాటర్లను తిప్పలు పెట్టడంలో ఉమ్రాన్ మాలిక్ దిట్ట. ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక సభ్యుల్లో ఒకడిగా మారాడు ఈ ఫాస్ట్బౌలర్. అయితే, ఐపీఎల్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత ఒక్కసారిగా ఉమ్రాన్ మాలిక్ రాత తలకిందులైంది. వాళ్లిద్దరికి మాత్రం ఛాన్స్లు ఫామ్లేమితో సతమతమవుతున్న అతడికి వెస్టిండీస్ టూర్ రూపంలో టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరేబియన్ దీవుల్లో ఆడిన రెండు వన్డేల్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకుని జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు ఉమ్రాన్. అయితే, ఉమ్రాన్ మాలిక్ మాదిరే అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్లు కూడా వైఫల్యం చెందినా బీసీసీఐ సెలక్టర్లు వారికి అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులోనూ ఉమ్రాన్కు స్థానం దక్కకపోగా.. వీరిద్దరు మాత్రం చోటు దక్కించుకోవడం విశేషం. మొన్నటిదాకా ఎక్కడ చూసినా అతడే ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘కొంతకాలం క్రితం ఎక్కడ చూసినా ఉమ్రాన్ మాలికే కనబడ్డాడు. అతడిని వెస్టిండీస్ పర్యటనకు తీసుకువెళ్లారు. ఒకానొక సందర్భంలో అతడు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. ఇటీవల వరుస సిరీస్లలో అతడికి మొండిచేయే చూపారు. కనీసం ఇండియా-ఏ జట్టుకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. మూడు నెలల కాలంలోనే అంత పెద్ద మార్పులేం జరిగిపోయాయి. టీమిండియాలో అడుగుపెట్టి.. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న తర్వాత.. అకస్మాత్తుగా అతడు కనిపించకుండా పోయాడు. అసలు ఉమ్రాన్ మాలిక్ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అతడి విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది అన్న విషయాలను మనం తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. ఉమ్రాన్ మాలిక్కు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో టీ20లో ఉమ్రాన్ మాలిక్ తన అత్యుత్తమ గణాంకాలు (2/9- 2.1 ఓవర్లలో) నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు ఆడిన 10 వన్డేల్లో 13, 8 టీ20లలో 11 వికెట్లు తీశాడు ఉమ్రాన్ మాలిక్. చదవండి: Ind Vs Afg: అఫ్గన్తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
IPL 2023: నేనొక ఇడియట్.. సెంచరీ తర్వాత అలా మాట్లాడినందుకు: బ్రూక్
IPL 2023- SRH- Harry Brook: భారత క్రికెట్ అభిమానుల గురించి తాను అలా మాట్లాడకపోవాల్సిందంటూ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023లో సెంచరీ చేసిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యల వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఏదేమైనా సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉన్న తర్వాతే తన మానసిక స్థితి మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2022 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 13.25 కోట్ల రూపాయాల భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, 24 ఏళ్ల ఈ మిడిలార్డర్ బ్యాటర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. నోళ్లు మూయించానంటూ ఘాటు వ్యాఖ్యలు వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో శతకం బాదిన తర్వాత.. తనను ట్రోల్ చేసిన వాళ్ల నోళ్లు మూయించాను అంటూ బ్రూక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పశ్చాత్తాపంతో ఈ విషయం గురించి తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్న హ్యారీ బ్రూక్.. ‘‘అప్పుడు నేను ఓ ఇడియట్లా ప్రవర్తించాను. ఇంటర్వ్యూలో అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ తర్వాత దాని గురించి పశ్చాత్తాపపడ్డాను. హోటల్ గదిలో కూర్చుని సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయగానే.. చూడకూడని కామెంట్లు ఎన్నో చూశాను. అప్పటి నుంచి నెట్టింటికి కొంతకాలం పాటు దూరం కావాలని నిర్ణయించుకున్నాను. భారీ మొత్తానికి న్యాయం చేయలేక నెగిటివిటీ గురించి పట్టించుకోకుండా.. కేవలం ఆట మీదే దృష్టిసారించాను. తద్వారా నా మానసిక ఆరోగ్యం మరింత మెరుగైంది’’ అని తెలిపాడు. కాగా ఐపీఎల్-2023 కోసం సన్రైజర్స్ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్ న్యాయం చేయలేకపోయాడు. ఆడిన 11 ఇన్నింగ్స్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్-2024 వేలానికి ముందు బ్రూక్ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అతడు వెస్టిండీస్తో వన్డే సిరీస్లో బిజీగా ఉన్నాడు. విండీస్తో తొలి మ్యాచ్లో అతడు 71 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విండీస్ చేతిలో ఓటమిపాలైంది. చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్లో పాకిస్తాన్..
ICC World Test Championship 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ టాప్-2లోకి దూసుకువచ్చింది. న్యూజిలాండ్తో తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ టీమిండియాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. కాగా బంగ్లాదేశ్ స్వదేశంలో న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం ముగిసిన మొదటి మ్యాచ్లో కివీస్ను చిత్తు చిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్.. న్యూజిలాండ్పై విజయం సాధించడం ఇదే మొదటిసారి. చారిత్మక విజయంతో బంగ్లాదేశ్ ఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్గా నజ్ముల్ షాంటో తొలి ప్రయత్నంలోనే చారిత్రాత్మక విజయం అందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023- 25 సీజన్ నడుస్తోంది. అగ్రస్థానం ఇంకా పాకిస్తాన్దే తాజా సైకిల్లో భాగంగా పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్లలో రెండూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టును ఓడించి 24 పాయింట్లతో టాప్లో ఉంది. మరోవైపు.. జూలైలో వెస్టిండీస్లో పర్యటించిన టీమిండియా రెండింట ఒక మ్యాచ్ గెలిచి.. మరొకటి డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 16 పాయింట్లతో రెండో స్థానం(66.67 శాతం)లో ఉండేది. అయితే, తాజాగా న్యూజిలాండ్పై గెలుపుతో విజయశాతం(100 శాతం) విషయంలో మెరుగ్గా ఉన్న బంగ్లా ఇప్పుడు టీమిండియాను వెనక్కినెట్టింది. PC: ICC మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా ఈక్రమంలో రోహిత్ సేన ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా 18 పాయింట్లు(విజయశాతం 30)తో నాలుగు, వెస్టిండీస్ 4 పాయింట్లు(16.67 శాతం)తో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ కేవలం 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉండగా.. శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తదితర జట్టు ఇంకా తాజా సైకిల్లో పాయింట్ల ఖాతా తెరవనే లేదు. రెండుసార్లు చేదు అనుభవమే కాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ గెలిస్తే 12, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు వస్తాయి. ఇక సీజన్ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ ట్రోఫీని తొలుత న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఈ రెండు పర్యాయాలు ఫైనల్ వరకు చేరిన టీమిండియాకు ఆఖరి పోరులో ఓటమి తప్పలేదు. చదవండి: టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
టీమిండియాతో మ్యాచ్.. వెస్టిండీస్కు షాకిచ్చిన ఐసీసీ!
India tour of West Indies, 2023 Test Series: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాకిచ్చింది. ఇటీవల టీమిండియా- విండీస్ టెస్టు కోసం విండ్సర్ పార్కులో తయారు చేసిన పిచ్కు సగటు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చింది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత జట్ట జూలై- ఆగష్టులో కరేబియన్ దీవిలో పర్యటించిన విషయం తెలిసిందే. స్పిన్నర్ల విజృంభణతో విండీస్ కుదేలు ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జూలై 12న డొమినికాలోని రొసోవ్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆతిథ్య వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ 5, రవీంద్ర జడేజా 3 వికెట్లతో విండీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే వెస్టిండీస్ ఆలౌటైంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 421 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తదుపరి లక్ష్య ఛేదనకు దిగిన కరేబియన్ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఇక రెండో ఇన్నింగ్స్లో అశ్విన్కు ఏడు, జడ్డూకు రెండు వికెట్లు దక్కాయి. చెత్త పిచ్ అంటూ విమర్శలు ఈ నేపథ్యంలో టర్నింగ్ పిచ్పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగియడంతో చెత్త పిచ్ అంటూ కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో ఐసీసీ తాజాగా.. విండ్సర్ పిచ్కు బిలో ఆవరేజ్ రేటింగ్తో విండీస్ బోర్డును పనిష్ చేసింది. దీంతో వెస్టిండీస్ ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ చేరింది. అయితే, ఈ విషయంపై బోర్డు అప్పీలు వెళ్లే అవకాశం ఉంది. ఆ పిచ్కు రేటింగ్ ఇలా ఇదిలా ఉంటే.. టీమిండియా- వెస్టిండీస్ మధ్య రెండో టెస్టుకు వేదికైన.. జమైకాలోని క్వీన్స్ పార్క్ ఓవల్కు ఆవరేజ్ రేటింగ్ ఇచ్చింది. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత జట్టు 1-0తో సిరీస్ను గెలిచిన విషయం తెలిసిందే. కాగా.. వన్డే సిరీస్ను 2-1తో గెలిచిన టీమిండియా.. టీ20 సిరీస్లో మాత్రం 3-2 తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. చదవండి: పాక్ను ఓడించాలంటే అతడిపై వేటు పడాల్సిందే! లేదంటే..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు మేలు
నిప్పుల కుంపటి
నేడు జగిత్యాలకు కేసీఆర్
● జిల్లా అంతటా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ● అత్యధికంగా నేరెళ్ల, బుద్దేశ్పల్లి, గోధూర్లో.. ● ఎంపీ ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం
మహిళలకు చేరువగా ‘సఖి’ సేవలు
810 మంది హోం ఓటింగ్
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
బిజినెస్ పాటిల్ కాదు.. సేవచేసే పాటిల్ను..
మామ కోసం కోడలు ప్రచారం
సిగ్నల్ నీడలో
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- నీకు మొగుడు లేడా..? టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement