నిప్పుల కుంపటి | Sakshi
Sakshi News home page

నిప్పుల కుంపటి

Published Sun, May 5 2024 6:05 AM

నిప్ప

జగిత్యాల:జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఎండకు తట్టుకోలేక ప్రజలు సతమతమవుతున్నారు. వడగాలుల కారణంగా బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. జిల్లా అంతా 40 డిగ్రీలపైనే నమోదవుతోంది. శనివారం అత్యధికంగా ధర్మపురి ప్రాంతంలోని నేరెళ్లలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెడ్‌జోన్‌లో గోధూర్‌, జైన, అల్లీపూర్‌, కొల్వాయి, రాఘవపేట, మల్లాపూర్‌, గుల్లకోట చేరాయి. ఈ ప్రాంతాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగతాచోట్ల 45 డిగ్రీలకు పైగానే ఉన్నాయి. రెండుమూడు రోజులుగా ఈ పరిస్థితి జిల్లావ్యాప్తంగా నెలకొంది.

నిప్పుల కుంపటి
1/1

నిప్పుల కుంపటి

Advertisement
 
Advertisement