మామ కోసం కోడలు ప్రచారం | Sakshi
Sakshi News home page

మామ కోసం కోడలు ప్రచారం

Published Sun, May 5 2024 6:05 AM

మామ క

మద్నూర్‌(జుక్కల్‌) : మామ గెలుపుకోసం కోడలు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. డోంగ్లీ మండలంలోని సిర్‌పూర్‌ గ్రామానికి చెందిన జహీరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ గెలుపు కోసం ఆయన కోడలు వచన పాటిల్‌ శనివారం మద్నూర్‌లో మామకు మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేను మీ మండలానికి చెందిన కోడలినని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఆమె ఓటర్లతో కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

28 నుంచి ఓపెన్‌

యూనివర్సిటీ పరీక్షలు

ఈనెల 6 వరకు ఫీజు గడువు

కామారెడ్డి అర్బన్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఫస్టియర్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కామారెడ్డి అభ్యాసక సహాయం కేంద్రం సమన్వయకర్త ఈ.రాజ్‌కుమార్‌, కార్యాలయ బాధ్యుడు ఎల్‌.బాపురావు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 6వ తేదీలోపు ఫీజు చెల్లించడానికి గడువు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత నెల 31లోగా ప్రవేశాలు పొందిన వారు సైతం ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చని పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాలు కల్పించాలి

కామారెడ్డి క్రైం : అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మండలం టేక్రియాల్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న నీటి ట్యాంక్‌ నిర్మాణం పనులను శనివారం పరిశీలించారు. మరుగుదొడ్ల మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ సాయన్న, ఏఈ సుబ్బారాయుడు, అధికారులు పాల్గొన్నారు.

మామ కోసం  కోడలు ప్రచారం
1/1

మామ కోసం కోడలు ప్రచారం

Advertisement
 
Advertisement