జగిత్యాల: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్షో నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం హోదాలో జగిత్యాలకు వచ్చిన ఆయన మళ్లీ ఇప్పుడు వస్తున్నారు. కొత్తబస్టాండ్ నుంచి అంగడిబజార్, తహసీల్ చౌరస్తా మీదుగా రోడ్షో నిర్వహించి అనంతరం పాతబస్టాండ్ వద్ద ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో కేసీఆర్ రోడ్షోలో పాల్గొంటారని స్థానిక ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, నాయకులు పరిశీలించారు. సభ అనంతరం ఎమ్మెల్సీ రమణ నివాసంలోనే కేసీఆర్ బస చేయనున్నా రు. సోమవారం ఉదయం హైదరాబాద్ వెళ్లనున్నారు.