బిజినెస్‌ పాటిల్‌ కాదు.. సేవచేసే పాటిల్‌ను.. | Sakshi
Sakshi News home page

బిజినెస్‌ పాటిల్‌ కాదు.. సేవచేసే పాటిల్‌ను..

Published Sun, May 5 2024 6:05 AM

బిజినెస్‌ పాటిల్‌ కాదు.. సేవచేసే పాటిల్‌ను..

ఎల్లారెడ్డి/లింగంపేట/ఎల్లారెడ్డి రూరల్‌ : నేను బిజినెస్‌ పాటిల్‌ను కాదని.. ప్రజలకు సేవ చేసే పాటిల్‌నని జహీరాబాద్‌ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ అన్నారు. శనివారం రాత్రి ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీచౌక్‌లో, లింగంపేట మండలంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో, నాగిరెడ్డి పేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లలో బీబీ పాటిల్‌ మాట్లాడుతూ కొంత మంది తనను బిజినెస్‌ పాటిల్‌ అని ఆరోపిస్తున్నారని తాను బిజినెస్‌ పాటిల్‌ను కాదని, ప్రజలకు సేవ చేసే పాటిల్‌నని అ న్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కా ర్పొరేట్‌ ఎమ్మెల్యే అని ఆరోపించారు. తన హయాంలో సంగారెడ్డి– అకోలా నేషనల్‌ హైవే పనులు పూర్తి చేయడంతో పాటు, మద్నూర్‌, రుద్రూర్‌, మెదక్‌– ఎల్లారెడ్డి– రుద్రూర్‌ రోడ్డుకు నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. కరీంనగర్‌–కామారెడ్డి, ఎల్లారెడ్డి రోడ్డు కూడా తాను మంజూరు చేయించానన్నారు. దేశంలో రామరాజ్యం స్థాపన మోదీతోనే సాధ్యమైతుందన్నారు. అబ్‌కీబార్‌ చార్‌ సౌ పార్‌లో భాగంగా తనను కూడా గెలిపించా లన్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గా పరిధిలో కేంద్రీయ విద్యాలయం, రైల్వేలైన్‌, జాతీయ రహదారులు తన హాయంలో చేయించానన్నారు. మూడో సారి మోదీని పీఎంగా చేయాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి నేరేళ్ళ ఆంజనేయులు, జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే గంగారాం, పైల కృష్ణారెడ్డి, పైడి ఎల్లారెడ్డిలు ప్రసంగించారు. మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, బీజేపీ నాయకులు దేవేందర్‌, బాలకిషన్‌, ఎస్‌ఎన్‌రెడ్డి, సతీష్‌, రాజేష్‌, దత్తురాం, రాంచందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement