అమితాబ్, జయబచ్చన్ల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కూతురు శ్వేతా బచ్చన్ నందా ఒక అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే అది వైరల్గా మారింది.
తల్లిదండ్రుల వివాహబంధం గోల్డెన్ జూబ్లీలోకి ప్రవేశించిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేసింది శ్వేత.‘సుదీర్ఘకాల అన్యోన్య దాంపత్యం వెనుక రహస్యం ఏమిటి?’ అని తల్లిని అడిగింది.
జయ బచ్చన్ చెప్పిన జవాబు... ‘లవ్’! ‘ఏ విభేదాన్ని అయినా పక్కన పెట్టే, ఏ కష్టాన్ని అయినా తట్టుకునే శక్తి ప్రేమకు ఉంటుంది’ అని నెటిజనులు కామెంట్ చేశారు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటో నేపథ్యంలో నెల వ్యవధిలోనే విడాకులు తీసుకుంటున్న నవదంపతుల నుంచి భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనురాగాలూ, ఆప్యాయతల వరకు ఎన్నో అంశాలపై నెటిజనులు లోతుగా చర్చించుకుంటున్నారు.
Breadcrumb
ఆ రహస్యం... అందరూ తెలుసుకోవాల్సిందే!
Published Sun, Jun 4 2023 1:56 AM
Related news
-
'కౌన్ బనేగా కరోడ్పతి'లో పాల్గొనాలని ఉందా..?
హిందీలో విజయవంతంగా కొనసాగుతున్న 'కౌన్ బనేగా కరోడ్పతి' ఇప్పటి వరకు 15 సీజన్లు పూర్తి అయ్యాయి. అమితాబ్ బచ్చన్ హోస్ట్గా కొనసాగుతున్న ఈ కార్యక్రమం నుంచి ప్రేక్షకులకు గుడ్న్యూస్ వచ్చింది. కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 16 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కౌన్ బనేగా కరోడ్పతి భారతీయ టెలివిజన్లో ప్రముఖ క్విజ్ రియాలిటీ షో. అమితాబ్ బచ్చన్ హౌస్ట్గా గత 17 ఏళ్లుగా ఈ షో రన్ అవుతుంది. ఇందులో ఎక్కువగా సాధరణ ప్రేక్షకులే పాల్గొంటారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ఈ రియాల్టీ షోలో మీరు కూడా పాల్గొనవచ్చు. ఈ క్విజ్ షోలో పాల్గొనాలనుకునే వారి కోసం అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు. ఈ సీజన్లో పాల్గొనేందుకు ఆయన రెండు ప్రశ్నలు అడిగారు. వాటికి సరైన సమాధానం చెప్పినవారిని ఎంపిక చేస్తారు.మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాలనే ఆసక్తి ఉంటే.. మీరు SonyLIV యాప్ని డౌన్లోడ్ చేయడం ద్వారా లేదా 5667711కు SMS ద్వారా మీ సమాధానాన్ని నేటి (ఏప్రిల్ 29) రాత్రి 9గంటల లోపు పంపి నమోదు చేసుకోవచ్చు. 1: 2024లో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన శ్రీ కర్పూరి ఠాకూర్, ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?A- ఉత్తర ప్రదేశ్, B- రాజస్థాన్, C- పంజాబ్, D- బీహార్2: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్, ఆగ్రా నగరాలు రెండింటిలో వీటిలో ఏస్తువుకు GI ట్యాగ్లు ఉన్నాయి?A - పాన్ B- చెక్క బొమ్మలు, C- బియ్యం, D- డ్యూరీ (ఫ్లాట్ కార్పెట్) View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
లాయర్గా...
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ లాయర్గా తన నటనతో ఆడియన్స్ను కట్టిపడేశారు. మరోసారి కోర్టులో అమితాబ్ బచ్చన్ మాట్లాడే పవర్ఫుల్ డైలాగ్స్ వినే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘వేట్టయాన్’ చిత్రంలో లాయర్ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారట. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అది లాయర్ పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. రజనీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపిస్తారని, అమితాబ్ లాయర్గా కనిపిస్తారనీ భోగట్టా. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలోని ఓ స్టూడియోలో జరుగుతోందట. రజనీ ఇంట్రో సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. -
బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్.. ఆ సినిమాను టచ్ కూడా చేయలేకపోయాయి!
ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం బాక్సాఫీస్ వద్ద అభిమానుల నుంచి ఆదరణ కరువవుతోంది. కానీ సినిమా హిట్ అయిందంటే చాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల ప్రభావంతో ఎంత హిట్ సినిమా అయినా నెల రోజుల్లోపే స్ట్రీమింగ్కు వస్తుండడంతో థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కలెక్షన్ల పరంగా ఓకే అనుకున్నప్పటికీ తొందరగానే థియేటర్ల నుంచి కనుమరుగవుతున్నాయి. కానీ.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, జవాన్, కేజీఎఫ్-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఆ ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ రికార్డ్ను అధిగమించలేకపోయాయి. నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన ఆ రికార్డ్ను ఇప్పటివరకు ఏ చిత్రం దాటలేకపోయింది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం. అప్పట్లోనే అంటే.. నాలుగు దశాబ్దాల క్రితం సినిమా నెలకొల్పిన రికార్డ్ మాత్రం ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు. థియేటర్లలో అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా నిలిచింది ఆ మూవీనే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల టిక్కెట్లు అమ్ముడైన సినిమాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక టికెట్స్ అమ్ముడైన మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. అదే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని నటించిన షోలే మూవీ. రమేశ్ సిప్పీ డైరెక్షన్లో 1975లో వచ్చిన ఈ సినిమా క్రేజీ రికార్డ్ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్స్ విక్రయించిన సినిమాగా రికార్డులకెక్కింది. అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన ఇండియన్ సినిమా షోలే చిత్రాన్ని మిగతా ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ మంది థియేటర్లలో వీక్షించారు. బాక్సాఫీస్ వద్ద అందిన సమాచారం ప్రకారం 1975-80 మధ్య కాలంలో కేవలం భారతదేశంలోనే రికార్డు స్థాయిలో 18 కోట్ల టిక్కెట్లను విక్రయించారు. అంతే కాకుండా ఈ సినిమా 60 థియేటర్లలో స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది. బొంబాయి మినర్వా థియేటర్లో ఏకంగా ఐదేళ్లపాటు ప్రదర్శించారు. ఈ మూవీ ఓవర్సీస్లో దాదాపు 2 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అప్పటోనే ఈ చిత్రం సోవియట్ రష్యాలో విడుదల కాగా..4.8 కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ కలిపితే మొత్తం ఈ చిత్రం 25 కోట్ల టికెట్స్ అమ్ముడయ్యాయి. షోలే ఫ్లాప్ టాక్.. అయితే థియేట్రికల్ రన్ ముగిసే సరికి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల వసూళ్లు సాధించింది. మొఘల్-ఎ-ఆజామ్, మదర్ ఇండియా రికార్డులను అధిగమించింది. మొదట ఈ చిత్రానికి హిట్ టాక్ రాలేదు. మొదటి రెండు వారాల్లో ఫ్లాప్ మూవీగా ముద్ర వేశారు. కానీ చివరికీ అన్నింటిని అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్లు, కేజీఎఫ్ సినిమాలు సైతం షోలేను దాటలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్స్ వచ్చినప్పటికీ టికెట్స్ అమ్మకం విషయంలో అధిగమించలేకపోయాయి. బాహుబలి -2 ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల ప్రేక్షకులు వీక్షించగా.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ -2 చిత్రాలకు పది కోట్ల మంది థియేటర్లకు వచ్చారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం దంగల్ కూడా 10 కోట్ల మంది మాత్రమే థియేటర్లలో వీక్షించారు. గతేడాది రిలీజైన షారూక్ ఖాన్ జవాన్ కేవలం రూ.4 కోట్ల మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రోజుల్లో చాలా సినిమాలు కోటి టిక్కెట్ల అమ్మకాలు కూడా దాటలేకపోతున్నాయి. -
అమితాబ్.. రెహమాన్లకు లతా మంగేష్కర్ అవార్డు
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ 2022న ఫిబ్రవరి 6న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు, సమాజానికి సేవలందిస్తున్న వారికి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తొలుత ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే ఈ పురస్కారం అందుకున్నారు. 2024కి గాను అమితాబ్ బచ్చన్కి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డు ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. అదే విధంగా భారతీయ సంగీతానికి చేసిన కృషికిగానూ ఏఆర్ రెహమాన్ కూడా ఈ పురస్కారం అందుకుంటారు. అలాగే సామాజిక సేవా రంగంలో ‘దీప్స్తంభ్ ఫౌండేషన్’ మనోబల్కు కూడా ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఈ నెల 24న లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి. అదే రోజు ఈ పురస్కారాల పంపిణీ ఉంటుంది. -
శ్రీరాముని సేవలో సెలబ్రిటీలు, శుభాకాంక్షలు (ఫోటోలు)
Related News by category
-
ప్రభాస్ కల్కి.. ఆ పోస్టర్ కూడా కాపీనేనా?
యంగ్ రెబల్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్లో డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకొణె నిలబడి ఉండగా.. ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్న ఈ పోస్టర్ వైరల్గా మారింది.అయితే తాజా పోస్టర్ చూసిన నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. అచ్చం హాలీవుడ్ మూవీ డూన్ను పోలి ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ సినిమా నుంచే కాపీ కొట్టారా? సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా పోస్టర్పై వస్తున్న విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. అలాంటిదేం లేదంటూ ఆయన కొట్టిపారేశారు. ఈ పోస్టర్లో ఇసుక కనిపిస్తున్న కారణంగా అలా పోల్చడం సరైంది కాదని అన్నారు. కేవలం ఇసుక ఉండటం వల్ల సినిమాలు ఒకే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు భావించొద్దని ఆయన సూచించారు.కాగా.. కల్కి 2898 ఏడీ మహాభారతంతో ముడిపడి ఉంటుందని గతంలోనే నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ సినిమా మహాభారతంలో మొదలై 2898 ఏడీలో ముగుస్తుందని తెలిపారు. గతంలోనూ కాన్సెప్ట్, మేకింగ్, క్రాప్ట్ , విజువలైజేషన్ సైతం హాలీవుడ్ సినిమాలను పోలి ఉన్నాయంటూ విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. All the forces come together for a better tomorrow on 𝟐𝟕-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/kItIJXvbto— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 27, 2024 -
యంగ్ ముఫాసా వచ్చేస్తున్నాడు.. ట్రైలర్ చూశారా?
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ముఫాసా ది లయన్ కింగ్ ప్రీక్వెల్కు సంబంధించి ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిన పెంచేస్తున్నాయి. ముఫాసా చిన్నప్పటి కథను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. కాగా.. ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ నటి..!
సీనియర్ నటి కోవై సరళ మీకు గుర్తుందా? ఆమె పేరు వినగానే కామెడీ వెంటనే గుర్తుకొచ్చేస్తోందా? కోవై సరళ- బ్రహ్మానందం జోడీ చేసే కామెడీ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మెదలుతూనే ఉంటాయి. టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తమిళనాడుకి చెందిన కోవై సరళ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో నటించారు.ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాల్లో కనిపిస్తున్నారు. చివరిసారిగా 2022లో వచ్చిన సెంబి చిత్రంలో కోవై సరళ నటించింది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సూపర్ హిట్ సిరీస్ అరణ్మనై పార్ట్-4 త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. బాక్ పేరుతో తెలుగులోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్కు కోవై సరళ కూజా హాజరయ్యారు. సరికొత్త లుక్లో కనిపించి సందడి చేశారు. సినీ ప్రియులు గుర్తు పట్టలేని విధంగా ఆమె మారిపోయారు. కాగా.. ఈ చిత్రం మే3న థియేటర్లలో సందడి చేయనుంది. -
పొలిమేర-2 చిత్రానికి అరుదైన ఘనత.. అదేంటంటే?
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర-2. గతేడాది రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. పొలిమేర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే తాజాగా పొలిమేర-2 చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వెల్లడించారు. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. త్వరలోనే ఈ మూవీ పార్ట్-3 ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. -
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
లేడీ విలన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం 'శబరి'. ఈ చిత్రాన్ని మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ చిత్రం ద్వారా అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కాట్జ్ ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. 'శబరి' ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది?నాలుగైదేళ్ల క్రితమే 'శబరి' ఆలోచన వచ్చింది. ప్రాణానికి మించి మనం దేనిని అయినా ప్రేమిస్తే... అది ప్రాణం తీసేంత ద్వేషంగా మారే అవకాశం ఉంది' ఇదీ నేను చెబుదామనుకున్న పాయింట్! మారుతున్న సమాజంలోనూ ప్రేమకు స్వచ్ఛమైన రూపం మాతృత్వంలో మాత్రమే ఉంది. పిల్లల విషయంలో చెడ్డ తల్లి ఉండదు. తల్లి ప్రేమలో నిజాయతీ ఉంటుంది. ఈ నేపథ్యంలో, తల్లి కుమార్తె ప్రేమ నేపథ్యంలో ఆ పాయింట్ చెబితే బాగుంటుందని కథ రాసుకున్నా.'శబరి' టైటిల్ పెట్టడం వెనుక కారణమేంటి?రామాయణం తీసుకుంటే శబరికి రాముడు సొంత కొడుకు కాదు.. ఆయన వస్తారని ఎన్నో ఏళ్లు ఎదురు చూసింది. రుచిగా ఉన్న ఫలాలు మాత్రమే ఇవ్వాలని.. ఒకవేళ ఆ ఫలాల వల్ల ప్రమాదం ఉందేమోనని ఎంగిలి చేసి ఇస్తుంది. ఆవిడ ప్రేమలో ఓ నిజాయతీ ఉంది. ఏపీలో శబరి పేరుతో నది ఉంది. కేరళలో శబరిమల పుణ్యక్షేత్రం అందరికీ తెలుసు. సంస్కృతంలో శబరి అంటే 'ఆడ పులి' అని అర్థం. నా ప్రధాన పాత్రలో ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందుకే ఆ టైటిల్ పెట్టాను.వరలక్ష్మీ శరత్ కుమార్ను ఎంపిక చేయడానికి గల కారణం?స్త్రీ ప్రధాన పాత్రల్లో చేయగల సత్తా ఉన్న ఆరిస్టులు ఇండియాలో తక్కువ మంది ఉన్నారు. ఆ కొందరిలో 'శబరి' చేయగల, సినిమా లీడ్ రోల్లో వేరియేషన్స్ అన్నిటినీ పండించగల ఆర్టిస్ట్ ఎవరున్నారని చూస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించారు. 'పందెం కోడి 2', 'తార తప్పటై', 'విక్రమ్ వేద', 'సర్కార్'లో మంచి పెర్ఫార్మన్స్ చేశారు. ఆవిడ హీరోయిన్గా కూడా సినిమాలు చేశారు. కానీ వరలక్ష్మి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కూడా చేశారు. ఆవిడ ఇంటర్వ్యూలు చూశాకే ఆఫ్ స్క్రీన్ క్యారెక్టరైజేషన్ నచ్చింది. దర్శకుడిగా ఆ స్వార్థంతో ఆమెను సంప్రదించా. చెన్నైలో కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ చెప్పలేదు. గోపీసుందర్ మ్యూజిక్ గురించి!'ఎంత మంచివాడవురా' చేసినప్పుడు ఆయన పరిచయం ఏర్పడింది. మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆయన ఇతర భాషల్లో చేసే సినిమాల పాటలు కూడా నాకు పంపిస్తారు. మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత మూవీ కంప్లీట్ అయ్యాక రీ రికార్డింగ్ చేశారు. సినిమా బాగుందని మెచ్చుకున్నారు.అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిందనే నిజమేనా?కథ విశాఖ నేపథ్యంలో సాగుతుంది. అంటే కథ రాసేటప్పుడు హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ అనుకున్నా. థ్రిల్లర్ సినిమాల్లో హిల్ స్టేషన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. వరలక్ష్మి మాకు డేట్స్ టైంలో మేం విశాఖ వెళ్లేటప్పటికి అక్కడ వాతావరణం మేం కోరుకున్న విధంగా లేదు. అప్పుడు కొడైకెనాల్ వెళ్లాం. అందువల్ల కొంత బడ్జెట్ ఎక్కువైంది. 'హనుమాన్' వంటి సినిమాలకు బడ్జెట్ ఎక్కువైనా విజయం సాధించిన తర్వాత అందరూ హ్యాపీ. 'శబరి'తో మా సినిమా టీమ్, ప్రొడ్యూసర్ కూడా హ్యాపీ అవుతారని ఆశిస్తున్నా.పాన్ ఇండియా రిలీజ్ చేయాలని ముందే అనుకున్నారా?నేను కథ అనుకున్నప్పుడు తెలుగులో తీయాలని అనుకున్నా. వరలక్ష్మికి తమిళంలో మార్కెట్ ఉంది. తెలుగు, తమిళ భాషల్లో చేస్తే బాగుంటుందని అనుకున్నా. మా నిర్మాత మహేంద్రనాథ్ పాన్ ఇండియా రిలీజ్ చేద్దామన్నారు. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ మొదలైంది. కథలో యూనివర్సల్ అప్పీల్, ఆ పొటెన్షియల్ ఆయన చూశారు. దీంతో ఓకే చెప్పా. 'శబరి' గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నా. మిగతా ప్రపంచాన్ని, మన బాధల్ని మర్చిపోయి చూస్తాం కదా! ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని 'శబరి' తీశా. ఇది థ్రిల్లర్ మాత్రమే కాదు... చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కేవలం భయపెట్టాలని ప్రయత్నిస్తే ప్రేక్షకులు థ్రిల్ అవ్వరు. తెరపై పాత్రలతో కనెక్ట్ అవ్వాలి. అది పాత్రలో ప్రేక్షకుడు తనని తాను ఊహించుకోవాలి.'శబరి' మంచి థ్రిల్ ఇస్తుంది.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement