ఇండిగో, కోల్‌కతా ఎయిర్‌ పోర్ట్‌ నిర్వాకం: మహిళా పారా అథ్లెట్‌ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

ఇండిగో, కోల్‌కతా ఎయిర్‌ పోర్ట్‌ నిర్వాకం: మహిళా పారా అథ్లెట్‌ ఆగ్రహం

Published Sat, Feb 3 2024 4:39 PM

Women On Wheelchair Kolkata Airport Asian Para Games Medallist shares her experience  - Sakshi

బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ ఇండిగోకు సంబంధించి మరో అనుచిత ఘటన వివాదాన్ని రేపింది.  అలాగే కోల్‌కతా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది దివ్యాంగ మహిళ పట్ల అమానుషంగా  వ్యవరించారు. దీనికి సంబంధించిన ఘటనను ఆమె ట్విటర్‌ షేర్‌ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.  

సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో వికలాంగురాలైన (వీల్‌చైర్ యూజర్‌ కూడా) తనను మూడుసార్లు లేచి నిలబడాలంటూ కోరారని న్యాయ విద్యార్థిని ఆరూషి సింగ్ ట్వీట్‌ చేశారు.  మొదట ఆమె నన్ను లేచి కియోస్క్‌లోకి రెండు అడుగులు వేయమని చెప్పింది.  పుట్టుకతోనే తనకు వైక్యల్యంఉందని తన వల్ల కాదని చెప్పినా. వినిపించుకోకుండా రెండు నిమిషాలే అయిపోతుంది అంటూ వేధించారని ఆమె ఆరోపించారు. దీంతో తాను భయంతో వణికి పోయానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా  తనకు 20 నిమిషాలు లేటైందని పేర్కొన్నారు. 

గతంలో ఇలాంటి జరిగినా, ఇండిగోకు ఇంకా బుద్ధి రాలేదంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు వైకల్యం ఉన్న ప్రయాణీకుల పట్ల వ్యవహరించాల్సిన తీరును పునరాలోచించాల్సిన అవసరం ఉందని సింగ్ కోరారు. ఈ ఘటనపై సిఐఎస్‌ఎఫ్‌, కోల్‌కతా విమానాశ్రయం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన  చేయ లేదు.

ఇది ఇలా ఉంటే ఇండిగోకు సంబంధించి తాజా సంఘటన  కలకలం రేపింది.  వీల్‌ చెయిర్‌ విషయంలో ఇండిగో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారంటూ  ఆసియా పారా గేమ్స్ పతక విజేత , పారా అథ్లెట్  సువర్ణ రాజ్‌ ఆరోపణలు గుప్పించారు. దివ్యాంగురాలైన తనకు విమానం డోర్‌ దగ్గర తన వీల్‌ చెయిర్‌ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశారని మండి పడుతూ తన అనుభవాన్ని ఏఎన్‌ఐతో  షేర్‌ చేశారు. 

విమానం డోర్ వద్ద తనకు వ్యక్తిగత వీల్‌చైర్‌  గురించి సిబ్బంది స్పందించలేదని ఆరోపించారు. న్యూఢిల్లీనుంచి చెన్నైకి  వెళ్తుండగా ఇండిగో సిబ్బంది తన పట్ల  దారుణంగా ప్రవర్తించారని సువర్ణ  తెలిపారు. ఇండిగో నిర్ల్యక్షం మూలంగా తన వ్యక్తిగత వీల్‌చైర్ పాడైందని, దాని రిపేర్‌కు రూ. 3 లక్షలు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని ఇండిగోనే భరించాలన్నారు. వికలాంగులకు  వీల్‌చైర్లు ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై  ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సువర్ణ డిమాండ్‌  చేశారు.  

అంతేకాదు సింగ్‌ వ్యవహారంపై కూడా ఆమె స్పందించారు. వికలాంగుల సమస్యను అర్థం చేసుకొని వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలని  రాజ్ కోరారు.
 

Advertisement
Advertisement