టీడీపీ గూండాగిరి | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాగిరి

Published Tue, May 7 2024 1:30 PM

టీడీప

పుట్టపర్తి/గుడిబండ: ఓటమి భయంతో జిల్లాలో టీడీపీ గుండాగిరీ చేస్తోంది. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి ఓట్లు పొందాలని భావిస్తోంది. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులు లక్ష్యంగా దాడులు చేస్తోంది. సోమవారం బుక్కపట్నం, గుడిబండలలో టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు.

ఇంటింటి ప్రచారం చేస్తుండగా దాడి..

వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పసల తిరుపాలమ్మ, నాగభూషణ, వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త రామాంజనేయులు తదితరులు సోమవారం బుక్కపట్నం బైపాస్‌ దిగువనున్న ఎస్సీ కాలనీలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇదే సమయంలో రోడ్‌ షోకు వచ్చిన స్థానిక టీడీపీ కార్యకర్తలు జగదీష్‌ కుమార్‌, సంతోష్‌, గణేష్‌, సాయి పవన్‌, బండగుప్ప వీధి పవన్‌ సాయి, జానకంపల్లి మణికంఠ వైఎస్సార్‌ సీపీ నేతలపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామాంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు రామాంజనేయులు, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ సుధాకర్‌రెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ గోవర్ధన్‌రెడ్డి, పతంజలి, నీలూరి ఈశ్వర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ఆక్రోశంతో దాడులు..

గుడిబండ మండల పరిధిలోని నాగేపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ కార్యకర్తలు నాగేపల్లికి వచ్చారు. ప్రచారానికి ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో వెనుదిరిగారు. అదే సమయంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు నాగభూషణం, జగన్నాథ్‌, దాసేగౌడు, ప్రభాకర్‌ తదితరులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రజలు వారిని ఆదరిస్తుండటంతో ఓర్వలేని టీడీపీ నాయకులు శ్రీధర్‌, గిరేతిమ్మప్ప, గిరీష్‌, లక్ష్మీకాంత్‌, సురేష్‌ తదితరులు వేటకొడవళ్లు, కట్టెలు, సైకిల్‌ చైన్లతో వైఎస్సార్‌ సీపీ నేతలపై దాడులు చేశారు. ఈ ఘటనలో జగన్నాథ్‌, నాగభూషణలకు తీవ్ర గాయాలయ్యాయి. జగన్నాథ్‌ను ప్రైవేట్‌ వాహనంలో మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్‌, మండల కన్వీనర్‌ డీఎల్‌ యంజారేగౌడు, జేసీఎస్‌ మండల కన్వీనర్‌ శివకుమార్‌, సర్పంచ్‌ కరుణాకర్‌గౌడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఓటమి భయంతో వైఎస్సార్‌ సీపీ

నేతలపై దాడులు

సోమవారం బుక్కపట్నం, గుడిబండ మండలాల్లో అలజడి

బుక్కపట్నంలో వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తకు గాయాలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

టీడీపీ గూండాగిరి
1/1

టీడీపీ గూండాగిరి

Advertisement
Advertisement