ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు! | Bees Attack on Voters in Jashpur | Sakshi
Sakshi News home page

ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!

May 7 2024 1:47 PM | Updated on May 7 2024 1:47 PM

Bees Attack on Voters in Jashpur

దేశంలో ఈరోజు(మంగళవారం) లోక్‌సభ ఎన్నికల్లోని మూడో దశ పోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపధ్యంలో కొన్ని చోట్ల అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లోని అరా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలుచున్న ఓటర్లపై  తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిదిమంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని ఆసుపత్రిలో జష్పూర్ ఎమ్మెల్యే  పరామర్శించారు.

ఈరోజు ఉదయం 7 గంటలకు జష్ఫూర్‌ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. తొలుత 85 ఏళ్ల విద్యావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెట్రోలింగ్ బృందాన్ని నియమించారు. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకుని  ఓటర్లకు నీడ కల్పించే ఏర్పాట్లు చేశారు.  జష్పూర్ జిల్లా పరిధిలో 878 పోలింగ్ స్టేషన్లు  ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో నలుగురు ఉద్యోగుల బృందం విధులు  నిర్వహిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement