తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి ప్లస్సా.. మైనస్సా..!, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నది నిజమేనా?, పేరు మారిస్తే అక్రమల ధరణి సక్రమవుతుందా?, కర్నాటక నుంచి పవర్, నోట్ల కట్టలు దిగుమతి నిజమేనా?, రేవంత్ చేస్తోంది టీడీపీ మార్క్ రాజకీయమా!, కరెంట్పై కామెంట్స్ హ్యాండ్కు బ్యాండేనా? రేపు(ఆదివారం) రాత్రి 7 గంటలకు మీసాక్షి టీవీలో..
Breadcrumb
కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ప్లస్సా..! మైనస్సా..!
Published Sat, Nov 18 2023 9:26 PM
Related news
-
హై అలర్ట్.. శంషాబాద్ ఎయిర్పోర్టులోకి చిరుత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత కలకలం రేగింది. గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్పోర్టు లోపలికి వచ్చింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్లో అలారం మోగింది.దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్పై స్వార్థంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారం అంతా అసత్యం, అబద్దమని పేర్కొన్నారు.రిజర్వేషన్లను ఆర్ఎస్స్ పూర్తిగా సమర్తిస్తుందని, ఎవరికోసం అయితే కేటాయించబడ్డాయో వారి అభివృద్ది జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపారు. రిజర్వేషన్లపై వివాదం సృష్టించి లబ్ది పొందాలని అనుకుంటున్నారని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇక... 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్పై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. ఆ రెండు స్థానాలపై స్పెషల్ ఫోకస్!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై అన్ని ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. అన్ని పార్టీలు ప్రచారంలో ఆరాటం,ఆర్భాటం, పోరాటం ప్రదర్శిస్తున్నాయి. గతంలో ఇప్పుడు లేని విధంగా వరంగల్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ప్రచారానికి తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నాయి. కాంగ్రెస్ తరపున ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబాద్, వరంగల్ బహిరంగ సభలో పాల్గొనగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను, మంత్రులను, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన లీడర్లను ప్రచారంలోకి దింపుతున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కాజీపేట వరంగల్ హనుమకొండలో రోడ్ షోలో పాల్గొనున్నారు. దీంతో వరంగల్లో టిఆర్ఎస్లో జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావులు సైతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే వరంగల్లో కేటీఆర్ పర్యటన పూర్తి కాగా, పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందు వరంగల్ లోక్సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సన్నాహాక సమావేశంలో హరీశ్రావు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.వరంగల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పర్యటన వరంగల్, హనుమకొండ పట్టణాల్లో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ రోడోషోకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారు కాగా హన్మకొండ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడు వినయ్భాస్కర్, మాజీమంత్రి దయాకర్రావు ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించారు.మే 1న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రోడ్ షోలో పాల్గొన్న అనంతరం మానుకోట జిల్లా కేంద్రంలోనే బస చేయనున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మానుకోట, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభల్లో పాల్గొని పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు, శ్రేణులకు సందేశమిస్తూనే కాంగ్రెస్ పార్టీ విధానాలను, ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలకు ముఖ్యమంత్రి వివరించారు. ఈనెల 30 భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో నిర్వహించే కాంగ్రెస్ జన జాతర సభకు హాజరుకానున్నారు. వరంగల్ పార్లమెంటరీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతున్న రెండో బహిరంగ సభ కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఒకే లోక్సభ నియోజకవర్గం పరిధిలో రెండో బహిరంగ సభ జరగలేదు. వరంగల్ లోక్సభ పరిధిలోనే నిర్వహిస్తున్న రెండో సభకు సీఎం హాజరవుతుండటం విశేషం. 30వ తేదీన రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ గెలిపించాలని కోరుతూ.. మే 3న హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ శివారులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. నరేంద్ర మోదీతో పాటు జాతీయ స్థాయి నేతలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. వరంగల్ లోక్సభ సీటుపై కన్నేసిన బీజేపీ ఈస్థానంలో గెలుపునకు అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వాసంతో ఉంది.ఆరూరి రమేష్ నామినేషన్కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరుకాగా, నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిశాక బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేషన్లకు ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29న ముగియనుండటంతో బరిలో ఎంతమంది అభ్యర్థులు నిలచేది..? ఎవరెవరు అభ్యర్థులుగా మిగలబోతున్నారు..? అభ్యర్థుల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేది క్లారిటీ రానుంది. మే 1 నుంచి సరిగ్గా పదకొండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం జోరుగా సాగనుంది. -
రేవంత్కి ఓటమి భయం పట్టుకుంది
కరీంనగర్, సిద్దిపేటజోన్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం పదవి నుంచి దింపేస్తారనే భయం రేవంత్రెడ్డికి పట్టుకుందని, అందుకే ఇచ్చిన హామీలు, పరిపాలనపై మాట్లాడాల్సిన ఆయన అసహనంతో తిట్ల దండకాన్ని అందుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. శనివారం కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని, ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే ప్రధాని మోదీని సీఎం బడేబాయి అంటున్నారని, రేవంత్రెడ్డి ఓ ఫైటర్ అని బండి సంజయ్ పొగుడుతున్నారని, రేవంత్రెడ్డి బీజేపీలోకి రావాలని ఎంపీ అర్వింద్ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎవరికి ఎవరు బీ టీమ్నో అర్థం అవుతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దోస్తీకు బోలెడు కారణాలు ఉన్నాయని, కరీంనగర్తోపాటు అనేక సీట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలిపి పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరిస్తోందన్నారు. నన్ను తిట్టినా ఫర్వాలేదు.. హామీలు అమలు చేయండి: హరీశ్ ‘‘నేను కొత్త డిమాండ్లను అమలు చేయమని అనలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అడుగుతున్నా. దానికి మీరు. మీ మంత్రులు నన్ను తిడుతున్నారు. నన్ను ఎంత తిట్టినా, ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నా.. హామీలు అమలయ్యే వరకు అడుగడుగునా నిలదీస్తా’’అని హరీశ్రావు అన్నారు. శనివారం ఆయన సిద్దిపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆరు గ్యారంటీలు అమలయ్యేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నాడు ఓటుకు నోటు అయితే.. నేడు ఓటుకు ఒట్టు అని ఎద్దేవా చేశారు. సీఎం సవాల్ మేరకు అమరవీరుల స్తూపం వద్దకు తాను రాజీనామాతో వస్తే రేవంత్ మొఖం చాటేశారని విమర్శించారు. రాజీనామా ఎలా చేయాలో తనకు తెలుసని, పదవులు ముఖ్యం కాదని, ప్రజా ఆకాంక్షలే ముఖ్యమని పేర్కొన్నారు.గతంలో వచ్చిన తెలంగాణను కేంద్రం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కోరితే రేవంత్రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి మోసం చేసి పారిపోయారని విమర్శించారు. అప్పట్లో కిషన్రెడ్డి రాజీనామా చేయలేదని అలాంటి వారు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు అని మండిపడ్డారు. కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని, లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా సరిపోతుందంటూ అందుకు కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హరీశ్ ఆరోపించారు. -
ఎన్నికల ముందు అభయహస్తం..ఎన్నికలయ్యాక భస్మాసుర హస్తం
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలోనే గెలవలేరని.. పరువు పోతుందనే పాలమూరు ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకొన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు విమర్శించా రు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభయ హస్తం అని కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేసిందని.. ఎన్నికలయ్యాక అది భస్మా సుర హస్తంగా మారిందని మండిపడ్డారు.రేవంత్రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరడం ఖాయమన్నారు. ఈ విషయాన్ని తాను 20 సార్లు చెప్పినా రేవంత్ ఖండించలేదని గుర్తించాలన్నారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక పెరిగిందని.. కరెంటు కోతలు, తాగునీటి కష్టాలు లేని కేసీఆర్ పాలనే తిరిగి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం చెప్పిన పథకాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా లబి్ధదారుల ఖాతాలో చేరలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ పార్టీ జెండాను ఎగురవేశారు. తర్వాత మీడియాతో చిట్చాట్ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రూ.4 వేల పెన్షన్, రైతు కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రైతు భరోసా, స్కూటీలు, నిరుద్యోగ భృతి, క్వింటల్ ధాన్యానికి రూ.500 బోనస్ వంటివేవీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అటకెక్కిస్తారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు 250 రోజులైనా చేయడం లేదు. దీనిపై హరీశ్రావు చేసిన సవాల్కు రేవంత్ సమాధానం చెప్పాలి. మాదిగ సామాజిక వర్గంతోపాటు మంత్రి పదవి దక్కని ముదిరాజ్ సోదరులు, ఎంపీ సీటు దక్కని గౌడ, యాదవ సోదరులు కాంగ్రెస్ను ఓడించాలని భావిస్తున్నారు. హైదరాబాద్ బీఆర్ఎస్కు పూర్తి మద్దతునిచ్చింది గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నగరం పూర్తిగా బీఆర్ఎస్కు మద్దతునిచ్చింది. ఉద్యమకారులు గొప్ప పరిపాలకులు కాలేరని బీజేపీ దివంగత నేత అరుణ్ జైట్లీ అన్నారు. కానీ అది తప్పు అని కేసీఆర్ నిరూపించారు, 14 ఏళ్లు ఉద్యమ పార్టీని నడపడం, తర్వాత పదేళ్లు ప్రభుత్వంలో కొనసాగడం, ఒక పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చిన్న విషయమేమీ కాదు. లోక్సభ ఎన్నికల్లో 10–12 సీట్లలో బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి పనులు చేయిస్తాం. రేవంత్కు మైనారిటీలను గౌరవించే సంస్కారం లేదు. ఒక్క మంత్రిపదవి కూడా ఇవ్వలేదు. రేవంత్ ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు? మోదీ నాయకత్వంలోనా? రాహుల్ గాంధీ నాయకత్వంలోనా? చోటా భాయ్.. బడే భాయ్.. ఇద్దరూ మోసగాళ్లే.. చోటాభాయ్ సీఎం రేవంత్, బడే భాయ్ ప్రధాని మోదీ ఇద్దరూ మోసగాళ్లే. మోదీ తెలంగాణ ఏర్పాటునే తప్పుపడుతూ మాట్లాడారు. మోదీ, రేవంత్రెడ్డిల మోసాలను చూశాక ప్రజలు కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారు. ప్రధాని మోదీని ఉత్తర భారత ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. బీజేపీని అడ్డుకునేవి ప్రాంతీయ పార్టీలే. కాంగ్రెస్ కాదు. తమిళనాడు సహా చాలా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీ లే మోదీని అడ్డుకుంటున్నాయి. ఏపీలోనూ ప్రాంతీయ పార్టీ లే గెలవాలని కోరుకుంటున్నాం. అక్కడ వైఎస్ జగన్ మరోసారి విజయం సాధించబోతున్నారని మాకు సమాచారముంది. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయి. రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరించేందుకే కొన్నిచోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టింది. కొందరు కాంగ్రెస్ అభ్యర్థులకు ఆ నియోజకవర్గాలతో సంబంధమే లేదు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీల కుట్రలను తిప్పికొట్టాలి.ప్రజలను మోసగించే ఎత్తుగడ ‘‘రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేస్తూ.. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానంటూ.. ప్రజలను మరోసారి మోసగించే ఎత్తుగడ వేస్తున్నారు. అసలు రేవంత్రెడ్డికి మాట నిలుపుకొన్న చరిత్ర లేదు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నారు. ఏమైంది? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కలు మొక్కుతున్నారు. దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసపోయిన ప్రజలు లోక్సభ ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దు.’’ – కేటీఆర్ పార్టీ కి పూర్వవైభవం తెస్తాం.. వరంగల్లో రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి ఎవరు ప్రచారం చేసినా కడియం శ్రీహరి, ఆయన కూతురు మూడో స్థానానికి వెళ్లడం గ్యారంటీ. కేసీఆర్కు కడియం చేసిన ద్రోహం మామూలుది కాదు. మల్కాజిగిరిలో ఈటల గెలుస్తారని మాజీ మంత్రి మల్లారెడ్డి చేసినవి వ్యంగ్య వ్యాఖ్యలే. బీఆర్ఎస్ నుంచి కొందరు నాయకులు వెళ్లిపోయినా.. కార్యకర్తలు ఎక్కడికీ వెళ్లలేదు. పార్టీని విస్తరిస్తాం, పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నిస్తాం..’’అని కేటీఆర్ చెప్పారు.ప్రతికూలతలను తట్టుకుని కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం తెలంగాణ భవన్తో పాటు అన్ని జిల్లా కార్యాలయాల్లోనూ పార్టీ జెండాను ఎగురవేసి జరుపుకొన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2001లో శూన్యంలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేసి.. ప్రతికూలతలను తట్టుకుని రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపించి, ప్రజాస్వామ్యయుతంగా అన్ని రాజకీయ పార్టీ లను కలుపుకొని దశాబ్దాల కలను సాకారం చేశారని తెలిపారు. ప్రజలందించిన సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. ఆనాడు సమైక్యవాదులు ఎన్ని రకాల కుట్రలు చేసినా ఛేదించుకుని విజయాన్ని చేరుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. అనంతరం తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి చేసినట్లు తెలిపారు. తెలంగాణ సాధించిన ప్రగతిని దేశవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినట్లు తెలిపారు. దీనికి మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషాల నుంచి అద్భుత స్పందన లభించిందని కేటీఆర్ పేర్కొన్నారు.దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అపజయాలకు కుంగిపోయేది లేదని భవిష్యత్తులోనూ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటామని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, పార్టీ కార్యాలయ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related News by category
-
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికలు పెత్తందారులు, పేదలకు మధ్య పోటీ.. ఆర్థిక నేరగాళ్లతో నిండిన టీడీపీ కూటమికి.. పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జైత్రయాత్ర చేస్తున్న ఈ ప్రభుత్వానికి మధ్య పోటీ.. ఈ ఎన్నికల్లో ఆర్థిక నేరగాళ్లకు చంద్రబాబు టికెట్లు కట్టబెట్టడమే కాకుండా..తన బినామీలను పక్క పార్టీలోకి పంపి అక్కడ కూడా వారిని బరిలో నిలిపారు. వ్యాపార వేత్తల ముసుగులో బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన ఈ వైట్కాలర్ ఆర్థిక నేరగాళ్లు సూచించిన వారికీ చంద్రబాబు టికెట్లిచ్చారు. రుణాల పేరుతో బ్యాంకులకు కన్నం పెట్టిన ఈ కేటుగాళ్లలో భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉండి నుంచి రఘురామకృష్ణరాజు టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా.. 2019 వరకు టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సీఎం రమేశ్, సుజనా చౌదరిలను బీజేపీలోకి పంపిన చంద్రబాబు.. వారికి టికెట్లు దక్కేలా ప్లాన్ చేశారు. అనకాపల్లి పార్లమెంటు నుంచి సీఎం రమేశ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ నలుగురు బ్యాంకుల నుంచి సుమారు రూ.4,563 కోట్ల రుణాలు ఎగ్గొట్టి, సీబీఐ ఈడీ, బ్యాంకు జప్తు కేసులు ఎదుర్కొంటున్నారు. మోసాల్లో దిట్ట రఘురామకృష్ణరాజు రుణాల ఎగవేతలో విజయ్ మాల్యా, నీరవ్మోదీ సరసన నిలిచే కేటుగాడు రఘురామ కృష్ణరాజు. ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో రఘురామకృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్ల రుణాలు తీసుకున్నాడు. వీటిని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కదారి పట్టించాడు. వడ్డీ కూడా చెల్లించలేదు. దీంతో బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి. తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేశాడని, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. 2020 అక్టోబర్లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులు స్వా«దీనం చేసుకున్నాయి. కంపెనీకి చైర్మన్గా ఉన్న రఘురాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేశారు. ఇండ్–భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట విదేశాల్లో తీసుకున్న రుణాల్ని భారత్కు అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 2011లో మారిషస్కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ.202 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ నిధులు అందిన మరుసటి రోజే రూ.200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్(ఉత్కళ్)కు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ మైయింటెనెన్స్ యాక్ట్(ఫెమా) దృష్టిలో పడింది. ఫెమా అధికారులు మారిషస్ కంపెనీ నుంచి రూ.202 కోట్లు ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి అందినట్లు గుర్తించారు. మరుసటి రోజే బదిలీ చేసినట్లు నిర్ధారించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రఘురామ కంపెనీకి రూ.40 కోట్లు పెనాల్టీ విధించింది. సుజనా చౌదరి.. ఎగవేతలో నంబర్ వన్ బ్యాంకుల నుంచి రూ. వేల కోట్ల రుణాలు తీసుకుని మోసగించిన ఘనుడు సుజనా చౌదరి. ఈ కేసులో ఈడీ దర్యాప్తుతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి. రూ.1,289 కోట్ల జీఎస్టీ ఎగవేతతో పాటు రూ.700 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే రూ.1,289 కోట్ల ఇన్వాయిస్లు సుజనా కంపెనీలు తయారుచేశాయి.ఈ మొత్తంపై రూ.224 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నా్చ్ఠరు. దొంగ ఇన్వాయిస్లు చూపి బ్యాంకుల నుంచి రూ.700 కోట్ల రుణాలు తీసుకున్నారు. జీఎస్టీ విభాగం దర్యాప్తులో ఈ మోసం బయటపడటంతో గ్రూపునకు చెందిన డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. బ్యాంకు రుణాలు తీర్చడం లేదని నల్లగొండ జిల్లాలో ఉన్న స్టీల్ ప్లాంటును బ్యాంకులు సీజ్ చేశాయి. విదేశీ బ్యాంకులకు కూడా సుజనా టోపీ పెట్టారు. మారిషస్ బ్యాంక్ నుంచి రూ.100 కోట్ల రుణం తీసుకొని చెల్లించకపోవడంతో ఆ బ్యాంక్ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కోర్టు ఏకంగా అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రుణాలు ఎగ్గొట్టిన వారికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇవ్వడానికి ప్రధాని మోదీ నిరాకరించినా చంద్రబాబు అతనికే ఇవ్వాలని పట్టుబట్టారు.బీజేపీ తీర్థం పుచ్చుకొని విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్నారు. రూ. 500 కోట్లు ఎగవేతకు సంబంధించి ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో ఎస్బీఐ 2021లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన ఎన్సీఎల్టీ ఆ పిటిషన్కు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులిచి్చంది.బినామీ ‘బాబు’..సీఎం రమేశ్చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, బినామీ సీఎం రమే‹శ్.. అతని అక్రమ లావాదేవీలను ఆదాయపన్ను శాఖ వెలికి తీసింది. సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.800 కోట్ల నిధులు సొంత ఖాతాల్లోకి మళ్లించారు. పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు తీసుకుని వాటిని చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి ఆ కంపెనీల నుంచి సీఎం రమే‹శ్ సంస్థ నగదును వెనక్కి తీసుకుంది. అతనికి చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ.800 కోట్ల నిధులను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు ఆధారాలు లభించాయి. గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్కాంట్రాక్టర్కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపారు. రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఆ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. రిత్విక్ ప్రాజెక్టులో అకౌంటెంట్గా పనిచేస్తున్న సాయిబాబా వద్ద ఎడ్కో కంపెనీకి చెందిన స్టాంపులు, సీల్ దొరకడంతో గుట్టు రట్టయ్యింది. దొంగ వ్యాపారాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పార్టీకి ఇచ్చి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సీటు దక్కించుకున్నారనేది అందరికీ తెలిసిందే. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరి.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు.. రూ.390.7 కోట్ల ఎగవేత టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.390.7 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో అతని ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకు సంబంధించిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు వివిధ బ్యాంకులకు వడ్డీతో కలిపి రూ.390.7 కోట్లకుపైగా రుణం తీసుకొని ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. ఆస్తుల స్వాధీనానికి ఇండియన్ బ్యాంకు రంగంలోకి దిగింది. ఈ రుణానికి గంటా హామీ ఉండడంతో ఆయనకు చెందిన ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలు జారీ చేసింది. గత నెలలో ఇండియన్ బ్యాంకు విశాఖలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని గంటా స్థలాన్ని వేలం వేసేందుకు పత్రికా ప్రకటన ఇచ్చింది. -
భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
ఢిల్లీ: ఆప్ పార్టీ తరపున ఏప్రిల్ 27 నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రోజు (ఆదివారం) పశ్చిమ ఢిల్లీ నియోజక వర్గంలో ఆప్ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు మద్దతు కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించారు.ఢిల్లీ రోడ్షోలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. భారతమాత కుమార్తెగా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన భర్త సింహం అని, ఆయన్ను ఎవరూ పడగొట్టలేరని అన్నారు. కారు సన్రూఫ్లోంచి నిల్చుని ఓటర్లకు అభివాదం చేశారు.పాఠశాలలు కట్టడం, ఉచిత విద్యుత్ అందించడం, మొహల్లా క్లినిక్లు ప్రారంభించి ప్రజలకు మంచి పనులు చేసినందుకే జైలుకెళ్లారని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఆయన (కేజ్రీవాల్) భరతమాత పుత్రుడు, నియంతృత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేసి ప్రజాస్వామ్యం కాపాడుకోవడం మీ బాధ్యత. దయచేసి దీని విలువ అర్థం చేసుకోండి అని ఆమె అన్నారు.లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ఆప్' తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టింది.जनता के इस सैलाब के आगे,कोई तानाशाह टिक नहीं सकता 🔥अपने बेटे, अपने भाई केजरीवाल को आशीर्वाद देने सड़कों पर उमड़ी पश्चिमी दिल्ली की जनता 💯#KejriwalKoAshirwad pic.twitter.com/ZTPl8LrsaS— AAP (@AamAadmiParty) April 28, 2024 -
బీజేపీకి వచ్చే సీట్లు అవే: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీజేపీ కి రెండు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంట్లో బీఆర్ఎస్ కీలకం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా హన్మకొండలో ఆదివారం( ఏప్రిల్ 28) జరిగిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు.‘ఓరుగల్లు చైతన్యం ఉన్న జిల్లా. చరిత్ర వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా. ఓరుగల్లు మట్టితో నాది విడదీయరాని బంధం. ఐదు మెడికల్ కాలేజీలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు తెచ్చుకున్నాం. ఈ ముఖ్యమంత్రి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు. ఏరి కోరి మొగుణ్ణి తెచ్చుకుంటే ఎగిరిఎగిరి తన్నట్లుంది తెలంగాణ పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఈ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాలా తీసింది. తెలంగాణ గొంతుకోసి మోదీ గోదావరి జలాలను తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తున్నాడు.మోదీ గోదావరిని ఎత్తుకు పోతా అంటుంటే ఈ ముఖ్యమంత్రి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. . బీజేపీ చాలా ప్రమాద కరమైన పార్టీ. ప్రజల మధ్య పంచాయితీలు పెట్టడం తప్ప మరో ప్రణాళిక లేదు. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది. రూపాయి విలువ పడిపోయింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్కు చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకున్నాడు. మూడు నెలల్లో స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నాడు. రాజయ్య చేతిలో కడియం ఓటమి ఖాయం.గోదావరి, కృష్ణా నదులను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. రేవంత్ రెడ్డి నా గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటాడట.. నా లాగు కూడా ఊడ తీస్తాడట. నన్ను చర్లపల్లి జైలులో వేస్తాడట. నీ జైళ్ళు, తోకమట్ట దెబ్బలకు కేసీఆర్ భయపడడు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వరంగల్లో కట్టిన 24 అంతస్తుల ఆస్పత్రే నిదర్శనం’ అని కేసీఆర్ అన్నారు -
‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
ఒడిశాను ‘పాన్’ (పాండియన్, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్) పరిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బిజూ జనతాదళ్ ఒకరినొకరు పెళ్లి చేసుకున్నాయి అని అన్నారు. ఒడిశాలోని కేంద్రపరా ప్రాంతంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒడిశాలో బీజేపీ-బీజేడీలు పెళ్లి చేసుకున్నాయి. వారు అందరికీ పాన్ ఇచ్చారు. పీఎం మోదీ 22-25 మంది కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అదే పద్ధతిలో నవీన్ పట్నాయక్ కూడా కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులకే అధికారం దక్కుతుంది. ఈ వ్యక్తులు మీ సంపదను దోచుకున్నారు. రైతుల భూములు లాక్కున్నారని ఆరోపించారు. మీరు (ప్రజలు) తగినంత పాన్ తిన్నారు. ఇప్పుడు ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి నాలుగు దశల్లో జరగనున్నాయి. మే 13న మొదటి దశ, మే 20న రెండో దశ, మే 25న మూడో దశ, జూన్ 1న చివరి దశ. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో, బిజూ జనతాదళ్ (బీజేడీ)కి అత్యధిక స్థానాలు (12), ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ (8), కాంగ్రెస్కు ఒక్కటే సీటుతో సరిపెట్టుకుంది. -
పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో వైఎస్ భారతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వన్స్మోర్ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు.వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైఎస్ భారతి అన్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు ఆమె వివరిస్తున్నారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement