-
సీఎం నవీన్ విశ్రాంతి తీసుకోవాలి
● రాష్ట్ర ప్రజలు అదే కోరుకుంటున్నారు ● బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ● భువనేశ్వర్లో రోడ్డు షో భువనేశ్వర్: రాష్ట్రానికి ఆరోగ్యవంతమైన, చురుకై న ముఖ్యమంత్రి అవసరమని, అందువలన సీఎం నవీన్ పట్నాయక్ విశ్రాంతి తీసుకోవాలని ఒడిశా ప్రజలు కోరుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భువనేశ్వర్లో గురువారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు మార్పు తీసుకురావాలని, బీజేపీని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 3వ సారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 21 లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో మూడు రోజుల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్న్లకు ముఖ్యమంత్రి అభ్యర్థులను పార్టీ ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమృద్ధి ఒడిశాగా మార్చడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేయడం బీజేపీ లక్ష్యంగా పేర్కొన్నారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక మౌసి మా ఆలయం నుంచి లింగరాజ్ ఆలయం వరకు జరిగిన రోడ్ షోలో భువనేశ్వర్ లోక్సభ అభ్యర్థి అపరాజిత షడంగి, భువనేశ్వర్ ఏకామ్రా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాబు సింగ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ నిధులు అడ్డదారి
బరంపురం: కేంద్ర ప్రభుత్వం ఒడిశా రాష్ట్రానికి అందిస్తున్న నిధులు అడ్డదారిలో మళ్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గంజాం జిల్లా సురడాలో బహిరంగ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులతో పాటు జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వివిధ రకాల పథకాలను, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. బీజేడీ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలో రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని దుయ్యబట్టారు. నష్టపోయిన ఖరీఫ్ రైతుల రుణాలు మాఫీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వలన ఇప్పటివరకు సుమారు 12 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఒడిశా ప్రజలు బీజేడీ నవీన్ ప్రభుత్వంపై పూర్తిగా విసుగు చెందారని, రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం విజయం తథ్యమని చెప్పారు. బహిరంగ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, అస్కా బీజేపీ లోక్సభ అభ్యర్థి అనిత ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఒడిశాలో బీజేపీ విజయం తథ్యం కేంద్ర హోం మంత్రి అమిత్ షా -
అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: నగరంలోని బుధవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక మంచేశ్వర్ పోలీస్ ఠాణా పరిధి పండరా వీధిలో అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం స్థానికులను బెంబేలెత్తించింది. ఈ ఘటనకు కారణాలు స్పష్టం కావాల్సి ఉంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణహాని సంభవించనట్లు సమాచారం. అగ్ని ప్రమాదంలో ఇరుగు పొరుగున ఉన్న 3 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని ప్రాథమిక అంచనా. అగ్నికీలలు విస్తరించి పరిసరాల్లో విద్యుత్ తీగలకు తాకడంతో తెగిపోయాయి. దీంతో పరిసరాల్లో జీజీపీ కాలనీ, జగన్నాథ నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా అంతరాయంతో ఇండ్లలో ప్రజలకు వీధికి ఎక్కారు. విషయం స్థానిక పోలీసులకు తెలియజేయడంతో అగ్నిమాపక దళంతో వీరు ఘటన స్థలం సందర్శించారు. ప్రమాదానికి గురైన దుకాణాల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి. దీనికి ఇరువైపుల కిరాణా దుకాణం, పెద్ద పండ్ల దుకాణం ఉన్నాయి. ఫాస్ట్ఫుడ్ దుకాణంలో నిల్వ ఉన్న వంట నూనెతో మంటలు తీవ్రంగా రగలడంతో వంట గ్యాసు సిలిండర్ పేలి ఉంటుందని భావిస్తున్నారు. ఈ పేలుడు శబ్ధం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మొత్తం మీద 3 దుకాణాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎమ్మెల్యే తారాప్రసాద్ను చంపుతామని హెచ్చరిక జయపురం: జయపురం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తారాప్రసాద్ బాహిణీపతిని హత్య చేస్తామని కొంతమంది యువకులు తుపాకీ చూపుతూ హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో వారు ఆయనను దుర్భాషలాడారు. అంతేకాకుండా రబినారాయణ నందో జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే ఈ విషయంపై కొరాపుట్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడేవాడిని కాదన్నారు. కాగా గత ఎన్నికల సమయంలోనూ ఎమ్మెల్యే బాహిణీపతిపై దాడి జరిగిందని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఆనాడు స్థానిక మధుమతి లాడ్జిలో ఉంటున్న బాహిణీపతి, అతడి కుటుంబ సభ్యులపై కత్తులతో దాడి జరిగింది. అయితే ఆ సమయంలో తారాప్రసాద్ బాహిణీపతి అక్కడ లేకపోవడంతో అతడి సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేసులో ఒక సీనియర్ బీజేడీ నాయకుడితో పాటు కొందరు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా మరలా ఇప్పుడు అలాంటి హెచ్చరికలు రావడంతో పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగతనం కేసులో నిందితుడి అరెస్టు రాయగడ: ఒక దొంగతనం కేసుకు సంబంధించి సదరు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అరైస్టెన వ్యక్తి స్థానిక రెల్లివీధికి చెందిన సుండి బులుగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఎస్డీపీవో రస్మీరంజన్ సేనాపతి, ఐఐసీ కమలాకాంత్ కుహోరొలు గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. స్థానిక గోదారీస్ నగర్లో నివాసముంటున్న సంతోష్ గౌడ అనే వ్యక్తి వాతావరణం వేడిగా ఉండడంతో గురువారం తెల్లవారుజామున ఇంటి తలుపులు తెరిచి పడుకున్నాడు. ఇదే అదునుగా భావించిన దొంగ ఇంటిలోకి చొరబడి ఇంటిలోని ఒక బంగారు గొలుసు, ఒక జత ఇయర్ రింగ్స్తో పాటు మరో రెండు సెల్ఫోన్లు దొంగలించాడు. దీంతో బాధితుడు సదరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేసి పన్నెండు గంటల్లోనే నిందితుడిని పట్టుకొని అతని నుంచి ఒక బంగారు గొలుసు, ఒక జత ఇయర్ రింగ్స్, మూడు వెండి గిన్నెలు, మరో 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల్లో హింస సరికాదు
భువనేశ్వర్: గంజాం జిల్లా ఖల్లికోట్ పోలీసు ఠాణా పరిధిలోని కృష్ణశరణ్ పూర్ గ్రామంలో బుధవారం బిజూ జనతా దళ్ (బీజేడీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీ కార్యకర్త ఒకరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అధికార బీజేడీ, బీజేపీ మద్దతుదారులు ఎన్నికల పోస్టర్లు అంటించే వైనంతో రగిలిన వివాదం ఘోరమైన ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణ ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. మృతుడు దిలీప్ పహాన్ (43)గా గుర్తించారు. పహాన్ మృతితో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో సీఎం నవీన్ పట్నాయక్ ఖల్లికోట్ ఎన్నికల హింసాత్మక ఘటనను ఖండించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎక్స్ హ్యాండిల్లో ఖల్లికోట్ ప్రాంతంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, విషాదకరమైన హింసాత్మక సంఘటనగా వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర కలత మరియు విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు మన ప్రజాస్వామ్యంలో చోటు లేదన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలియజేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన వారిపై పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఓటమి భయంతోనే దాడులు మరోవైపు ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే అధికార పార్టీ హింసకు పాల్పడుతోందని బీజేపీ నేత, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై బీజేడీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కార్యకర్తల త్యాగాలు వృథా కావు అని, ఒడిశా ప్రజలు బ్యాలెట్ ద్వారా తగిన సమాధానం ఇస్తారని ధ్వజమెత్తారు. ఘటనపై ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. హింస నివారణకు చర్యలు తీసుకోవాలి: సీఈవో రాష్ట్రంలో రెండో దశ ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొలొ తీవ్రంగా స్పందించారు. ఈ ఘర్షణ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల హింసను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని గంజాం జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి హింసాత్మక ఘటనలను సహించబోమని స్పష్టం చేశారు. పరారీలో ప్రధాన నిందితుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొలొ ఆదేశాల మేరకు ఖల్లికోట్ ఠాణా పోలీసులు కృష్ణశరణ్ పూర్ గ్రామంలో బుధవారం రాత్రి బీజేపీ, బీజేడీల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి ప్రాణాలను బలిగొన్న సంఘటనలో ఎనిమిది మంది నిందితులను గురువారం అరెస్టు చేశారు. ఒకరు మృతి చెందిన ఈ ఘర్షణలో ప్రధాన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. సీఎం నవీన్ పట్నాయక్ ఖండన బీజేడీ హస్తంపై బీజేపీ ఆరోపణ -
గుండెకోత
శుక్రవారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2024గోపాల్పూర్ బరంపురం: సిల్క్ సిటీగా పేరుగాంచిన బరంపురం నగరం అందాన్ని ఇనుమడింపచేసే గోపాల్పూర్ సముద్ర తీరం ఏళ్ల తరబడి నిశ్శబ్ధంగా కోతకు గురవుతోంది. ఈ కోతకు కారణమేమిటనే తీరవాసుల ప్రశ్నలకు నిపుణులు చెప్పే సమాధానాలు వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అంతర్జాతీయ పర్యాటక స్థలంగా గుర్తింపు పొందిన గోపాల్పూర్ తీరానికి శోభను తెచ్చే గోపాల్పూర్ పోర్టు, బహుళ అంతస్తుల అక్రమ కట్టడాలు తీరం కోతకు ప్రధాన కారణమని స్పష్టం చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు కారణంగా సముద్రం పోటెత్తి అలలు ఎగసిపడి తీరాన్ని తాకుతాయి. దీని ఫలితంగా గంజాం జిల్లా 37 కిలోమీటర్ల పొడువు ఉన్నా తీరం పూర్తిగా కోతకి గురవుతోంది. సూన్పూర్ నుంచి గోపాల్పూర్ మీదుగా అర్జిపల్లి తీరం పొడువునా కోతకి గురవుతుండడంతో అధికారులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. నిబంధనలకు నీళ్లు దేశంలో తీరప్రాంతాల రక్షణకు కేంద్రం 1992లో కోస్తా నియంత్రణ మండలి (సీఆర్జెడ్) చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం సముద్ర తీరం నుంచి ఐదు వందల మీటర్ల వరకూ ఎలాంటి నిర్మాణాలు చేయరాదన్న నిబంధన ఉంది. స్థానిక సంస్థలను సమన్వయం చేసుకుంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ చట్టం అమలయ్యేలా చూడాల్సి ఉంటుంది. అయితే ఆంధ్ర సరిహద్దు ఇచ్ఛాపురం అనుకొని ఉన్న సూన్పూర్ (ఒడిశా) నుంచి గోపాల్పూర్, ఛత్రపూర్, అర్జిపల్లి వరకు 28 కిలోమీటర్లు పొడవైన బీచ్ వెంబడి అనేక కట్టడాలు వెలిశాయి. కోస్తా నియంత్రణ మండలి చట్టానికి వ్యతిరేకంగా గోపాల్పూర్ బీచ్కి దగ్గరలో బహుళ అంతస్తులతో హోటల్స్ నిర్మించారు. కోస్తా నియంత్రణ మండలి (సీఆర్జెడ్) చట్టం ఉల్లంఘనను మొదట్లో తీవ్రంగా పరిగణించిన పాలకులు తర్వాత అనేక ఒత్తిళ్ల కారణంగా పట్టించుకోవడం మానేశారు. దీని ఫలితంగా నిబంధనలకు విరుద్ధంగా జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయి. విపత్తులను ఎదుర్కొనేందుకు తీరంలో మడ అడవులు, చిత్తడి నేలలు, సరుగుడు తోటలను తొలగించి నిర్మాణాలు చేపట్టడంతో కోస్తా రెగ్యూలేషన్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీకి పలు ప్రజా సంఘాల ద్వారా ఫిర్యాదులు అందాయి. దీంతో వెంటనే వాటిని తొలగించాలని కొద్దికాలం క్రితం కలెక్టర్ను హైకోర్టు అదేశించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. తుఫాన్ జోన్గా గోపాల్పూర్ గత 15 ఏళ్లలో సూపర్సైక్లోన్, ఫైలిన్ తుఫాన్, హుద్హుద్ తుఫాన్లతో గోపాల్పూర్ తుఫాన్ జోన్గా కేంద్ర వాతావరణ అధ్యయన కేంద్ర బృందం నిర్ధారించింది. ప్రస్తుతం వారం రోజులుగా అకాల వర్షంతో సముద్రం పోటేత్తి గోపాల్పూర్ తీరం అలల తాకిడికి తీరం కోతకు గురైంది. ముఖ్యంగా గంజాం జిల్లాలో కోస్తా నియంత్రణ మండలి (సీఆర్జెడ్) చట్టాలను అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం తప్ప, ప్రత్యేకించి విభాగం లేకపోవడం ఇందుకు పెద్ద లోపంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. గోపాల్పూర్ తీరంలో నిర్మించిన బహుళ అంతస్తుల హోటల్స్ తీరంపై ప్రభావం చూపుతున్నాయి. సముద్రం మీదుగా వచ్చే గాలులకు బహుళ అంతస్తులు అడ్డుగా ఉండడంతో, గాలులు తిరిగి వెనక్కి వెళ్తుంటాయి. ఈ ప్రభావం వలన తీరం కోతకు గురవుతోందని వాతావరణ అధ్యయన కేంద్రం సంచారకులు సరత్ చంద్ర సాహు తెలియజేస్తున్నారు. ఇదేవిధంగా గోపాల్పూర్ ఫోర్టులో కొత్తగా రెండు బెర్త్ల నిర్మాణం చేపట్టంతో సముద్రం లోపలకి సుమారు 3 కిలోమీటర్ల పొడువున పెద్ద పెద్ద బండరాళ్లు వేశారు. నిర్మాణం చేపడుతుండడంతో సముద్రం నుంచి వచ్చిన అలలకు కొత్తగా నిర్మాణం జరుగుతున్న రెండు బెర్తులు అడ్డుకావడంతో జిల్లా తీరప్రాంతం కోతకి గురవుతోంది. అందువలన ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి తీరం కోతకు గురవ్వకుండా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. న్యూస్రీల్ కోతకు గురవుతున్న సముద్ర తీరం అమలు కానీ సీఆర్జెడ్ చట్టం తీరం వెంబడి బహుళ అంతస్తుల నిర్మాణాలు -
నారాయణపూర్ గ్రామస్తుల ఆందోళన
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ్ సమితి నారాయణపూర్ గ్రామస్తులు గ్రామంలో గురువారం ఆందోళన చేపట్టారు. దీంతో పర్లాకిమిడి – ఆర్.ఉదయగిరి – మోహనా రోడ్డు, బరంపురానికి వెళ్లాల్సిన బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. గ్రామంలో తాగునీటికి అనేక నెలలుగా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన ఉన్న బొమ్మిక గ్రామం మహేంద్రతనయ నుంచి వేసిన పైపులు తక్కువ సమయంలోనే పనిచేయడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. నారాయణపూర్ గ్రామంలో ఉన్న చెరువులు ఎండిపోయాయి. ఎన్నికల ముందు అధికారులు, ఎమ్మెల్యే దాశరథి గొమాంగో ఎన్ని హామీలు ఇచ్చినా అవి బుట్టదాఖలయ్యాయన్నారు. తాగునీటి సమస్య కోసం చేపడుతున్న రాస్తారోకో కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం సంఘటన స్థలానికి బీడీవో సుధీర్ కుమార్ సింగ్ విచ్చేసి, ఆందోళనకారులతో మాట్లాడి తాగునీటి సమస్యను ఎన్నికల పోలింగ్ తర్వాత పరిష్కరిస్తామన్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
రెచ్చిపోతున్న బైక్ల దొంగలు
జయపురం: బొరిగుమ్మ సమితిలో బైక్ల దొంగలు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దొంగలను పట్టుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు. గురువారం ఒక మందిరం వద్ద బైక్ ఉంచి పూజలు చేసి వచ్చేసరికి బైక్ దొంగిలించబడింది. వివరాల్లోకి వెళ్తే.. బొరిగుమ్మ సమీప నువాగాం గ్రామానికి చెందిన రవీంద్ర మహాపాత్రో దైవ దర్శనం చేసుకునేందుకు బైక్పై బొరిగుమ్మ వెళ్లాడు. ఆలయం ముందు బైక్ పెట్టి ఆలయంలోకి వెళ్లి పూజచేసి, తిరిగి వచ్చి బైక్ పెట్టిన ప్రాంతానికి వెళ్లి చూడగా అక్కడ బైక్ కనిపించలేదు. దీంతో ఖంగుతిన్న మహాపాత్రో ఆ ప్రాంతంలో ఉన్నవారిని వాకబు చేశాడు. అయితే తామెవరీ చూడలేదని తెలపడంతో తన మిత్రులతో కలిసి బొరిగుమ్మ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎలుగు దాడిలో తండ్రీ, కొడుకుకు గాయాలు
జయపురం: సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి రణస్పూర్ పంచాయతీ రాణిగుణ గ్రామంలో బాసు ముదులి, అతడి కుమారుడు నకుల్ ముదులిలు ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. తమ ఇంటి కప్పు నేతకు గడ్డి వెదురులు, తాళ్లు సంగ్రహించేందుకు బాసు, నకుల్లు మంగళవారం అడవికి వెళ్లారు. అక్కడ వారిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఆ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారి ఆర్తనాదాలు విని ఆ ప్రాంతంలో ఉన్నవారు వెళ్లగా వారిని చూసి ఎలుగుబంటి అడవిలోనికి పారిపోయింది. గాయపడిన ఇరువురిని బిసింగపూర్ ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండడంతో బొరిగుమ్మ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం డాక్టర్లు వారిని కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి పంపించారు. కానీ అచ్చట కూడా వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం తీసుకెళ్లమని డాక్టర్లు వారి బంధువులకు సూచించారు. అయితే మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి బరంపురం వెళ్లి అచ్చట పరిస్థితులు తెలియక, డబ్బు లేకపోవడంతో బరంపురం వెళ్లేందుకు భయపడ్డారు. ప్రస్తుతం కొరాపుట్లోనే చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. -
నాటుసారా, మద్యం సీసాలు ధ్వంసం
సోంపేట: సోంపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో గడిచిన ఆరు నెలల్లో వివిధ కేసుల్లో పట్టుబడిన 4817 లీటర్ల నాటు సారా, 43 లీటర్ల మద్యం నిల్వలను గురువా రం స్టేషన్ సమీపంలో ధ్వంసం చేశారు. విశాఖ ఎస్ఈబీ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వుల మేరకు పలాస డివిజన్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఇస్మాత్ ఆరా బేగం ఆధ్వర్యంలో మద్యం నిల్వలు ధ్వంసం చేసినట్లు సోంపేట ఇన్స్పెక్టర్ ఆర్.జైభీమ్ తెలిపారు. ఆరో ర్యాంకు సాధించిన విద్యార్థికి అభినందనలు కొత్తూరు: కొత్తూరు మండలం కర్లెమ్మ పంచాయతీ పరిధి నేతాజి నగర్ కాలనీకి చెందిన పెనుపర్తి జగదీష్ రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను కనబరిచాడు. కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన జగదీష్ ఏపీఆర్డీసీలో వందకు 96 సాధించి రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు తెచ్చుకున్నాడు. దీనిపై కాలేజి ప్రిన్సిపాల్ రవికుమార్తో పాటు అధ్యాపకులు అభినందనలు తెలిపారు. జగదీష్ తల్లిదండ్రులు బుల్లేశ్వరరావు కృష్ణవేణిలు కార్పెంటరీ పనులు చేస్తూ కుమారుడిని చదివించారు. నవధాన్యాల సాగుతో భూసారం పెంపు ఎల్.ఎన్.పేట: ఖరీఫ్ వరి సాగుకు ముందు తొలకరి వర్షాల్లో నవధాన్యాలను సాగు చేసుకోవటం వల్ల భూసారం పెంచుకోవచ్చని ప్రకృతి వ్యవసాయ విభాగం అడిషనల్ డీపీఎం ధనుంజయరావు అన్నారు. మండల కేంద్రంలోని వైకేపీ కార్యాలయంలో మహిళా సంఘాలతో పాటు కొత్తూరు డివిజన్ స్థాయి ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నవధాన్యాల విత్తనాలను వేసుకున్న తర్వాత మొలకలు వచ్చిన 30 నుంచి 50 రోజుల మధ్యలో ఆయా మొక్కలను పొలంలో కలియదున్నటం వల్ల భూసారం పెరుగుతుందన్నారు. ఎరువులు, పురుగుల మందులు విచక్షణరహితంగా వినియోగించటం వల్ల భూసారం క్షీణిస్తుందన్నారు. భూసారం పెంచేందుకు రైతులు తన వంతు ప్రయత్నం చేయాలన్నారు. ఇందుకు రైతులకు అవగాహన కలిగించాల్సిన అవసరం మనపైన ఉందన్నారు. కార్యక్రమంలో రీజనల్ అధికారి హేమసుందరరావు, డివిజన్ ఇన్చార్జ్ ఎన్ఎఫ్ఎ గోవిందరెడ్డి, ఐటీడీఏ ఎన్ఎఫ్ఎ ముసలయ్య, ఎంటీ సూర్యనారాయణ, మార్కెటింగ్ ఎంటీ చిన్నమ్మడు, ఐసీఆర్పీ, యూనిట్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. జెమ్స్లో అవయవదానం ● కిడ్నీ, లివర్ విశాఖపట్నంకు తరలింపు ● మరో కిడ్నీ జెమ్స్లోనే రోగికి మార్పు ● చిరంజీవిగా నిలిచిన శ్రీనివాసరావు శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గురువారం అవయవదానం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను జెమ్స్ వైద్యులు తెలిపారు. శ్రీకాకుళం పరిధిలోని చినమండల వీధికి చెందిన తోట శ్రీనివాసరావు (46) ఈ నెల 14న పెయింట్ంగ్ పనికి వెళ్తూ సూర్యమహల్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదే రోజు జెమ్స్లో చేరారు. 15వ తేదీ తర్వాత ఆయన బ్రెయిన్ పూర్తిగా పనిచేయడం లేదని వైద్యులు ధ్రువీకరించారు. వెంటిలేటర్పై చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఆయన కుమారుడు జ్యోతి ప్రకాశ్, చెల్లి సరితాలు కలిసి అవయవదాన సంస్థ గల జీవనదాన్కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో శ్రీనివాసరావు కిడ్ని, లివర్ను విశాఖపట్నంకు తరలించగా, మరో కిడ్నీని ఇదే ఆస్పత్రిలో వేరే బాధితునికి అమర్చారు. అనంతరం అమరహే శ్రీనివాస్ అంటూ విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది దారి పొడవునా నివాళులర్పించారు. -
గృహహింస కేసులో మహంతికి ఊరట
భువనేశ్వర్: రాజకీయ నాయకుడుగా మారిన చలన చిత్ర నటుడు, ఎంపీ అనుభవ్ మహంతికి రాష్ట్ర హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. అతనిపై 4 ఏళ్ల కిందట నమోదైన గృహ హింస కేసుకు సంబంధించి ఒరిస్సా హైకోర్టు గురువారం అతని అరెస్టుకు సంబంధించి జారీ అయిన బెయిలు రహిత అరెస్ట్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)పై స్టే విధించింది. ప్రస్తుతం భార్యాభర్తలు (అనుభవ్ మహంతి – వర్షా ప్రియదర్శిని) చట్టపరంగా విడాకులు పొందారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను విచారిస్తున్న కటక్లోని ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (జేఎంఎఫ్సీ) దీపంకర్ బాల్ కోర్టు విచారణకు పార్లమెంట్ సభ్యుడు గైర్హాజరైన నేపథ్యంలో ఎన్బీడబ్ల్యూ మే 23 నాటికి అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన మూడు రోజుల తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దశలో మినీ ట్రయల్పై ప్రాసిక్యూషన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, దర్యాప్తు అధికారి తగిన సాక్ష్యాధారాలు, సాక్షులతో ప్రాథమిక కేసును రూపొందించారని సమర్పించిన తర్వాత అనుభవ్ మొహంతి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషనన్ను ప్రత్యేక కోర్టు గతంలో తోసిపుచ్చింది. ఇదీ విషయం... 2020 డిసెంబర్లో కటక్లోని నందిసాహి వద్దనున్న తన ఇంట్లో అనుభవ్ మహంతి మరియు అతని ఇద్దరు స్నేహితులు ఈడ్చుకుని వెళ్లి తాళం వేసి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వర్ష ప్రియదర్శిని పూరీఘాట్ ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ తర్వాత 2023 డిసెంబర్ 18న సెక్షన్లు 509 (మహిళను అవమానించడం), 498–ఏ (క్రూరత్వం), 341 (తప్పుడు సంయమనం), 294 (అసభ్య పదజాలం ఉపయోగించడం), 506 (క్రిమినల్) కింద అనుభవ్ మహంతీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అనుభవ్, వర్ష ప్రియదర్శిని వైవాహిక బంధం రద్దు చేసి విడాకులు మంజూరు చేసేందుకు కటక్ ఫ్యామిలీ కోర్టు నిరాకరించిన ఉత్తర్వులను తోసిపుచ్చి రాష్ట్ర హైకోర్టు 2023 డిసెంబర్లో విడాకులు మంజూరు చేసి భార్యాభర్తల వివాదానికి చుక్క బెట్టింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో న్యాయ స్థానం విడాకుల డిక్రీని మంజూరు చేసింది. అరెస్టుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు -
మరోసారి పరస్పర దాడులు
బరంపురం: గంజాం జిల్లాలో రాజకీయ దాడులు కొనసాగుతున్నాయి. ఈనెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ రోజున బరంపురం లోక్సభ బీజేపీ అభ్యర్థి డా.ప్రదీప్ పాణిగ్రాహిపై, బరంపురం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మేయర్ శిభశంకర్ దాస్ అలియాస్ పింకు దాస్ దాడిచేసి గాయపరిచిన విషయం తెలిసిందే. దీంతో గోపాల్పూర్ నియోజకవర్గం, చికిటి నియోజకవర్గంలో బీజేపీ, బీజేడీ నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ హింసాత్మక ఘటనలు మరువకముందే మంగళవారం రాత్రి మరోసారి హింస చెలరేగింది. జిల్లాలోని కళ్లికోట్లో బీజేపీ, బీజేడీ పార్టీ నాయకులు మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 8 మందికి తీవ్రగాయలయ్యాయి. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు కళ్లికోట్ పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకి దిగారు. మరోవైపు జిల్లాలోని దిగపండి పోలీసుస్టేషన్ పరిధి కుకుడాఖండి గ్రామంలో కాంగ్రెస్ నాయకులపై బీజేడీ నాయకులు కర్రలతో దాడిచేసి గాయపరిచిన ఘటన స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ఈ హింసాత్మక ఘటనలో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. ఈ ఘటనపై బీజేడీ నాయకులపై డీసీసీ అధ్యక్షుడు దీపక్ కుమార్ పట్నాయక్ సదర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కళ్లికోట్లో బీజేపీ, బీజేడీ పార్టీ నాయకులపై మారణాయుధాలతో పరస్పర దాడులకు సంబంధించి 8 మందిని అరెస్టు చేసినట్లు గంజాం ఎస్పీ జగ్మోహన్ మీన తెలియజేస్తున్నారు. -
19 నుంచి దాడితల్లి, సరే పోలమ్మ పండగలు
● ఏర్పాట్లలో గొల్లపల్లి, పాతబొబ్బిలి ఉత్సవ కమిటీలుబొబ్బిలి: ఉత్తరాంధ్రుల ఇలవేల్పులు, కోరిన కోరికలు తీర్చే గొల్లపల్లి దాడితల్లి, పాత బొబ్బిలి సరేపోలమ్మ అమ్మవార్ల సిరిమానోత్సవ సంబరాలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. ఈనెల 19,20,21 తేదీల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా అమ్మవార్ల పండగలు నిర్వహించేందుకు రెండు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 19న దేశతల్లి అమ్మవారి ఉత్సవంతో ప్రారంభమయ్యే పండగలో భాగంగా 20న సిరిమానోత్సవం జరుగుతుంది. 21న అనుపోత్సవం నిర్వహిస్తారు. ఈ జంట సంబరాలకు రెండు ప్రాంతాల్లో భక్తులు సన్నద్ధమయ్యారు. గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి పండగను చుట్టుపక్కల 12 గ్రామాల వారు ఘనంగా జరుపుకుంటారు. అలాగే పాత బొబ్బిలిలో సరేపోలమ్మ ఉత్సవాలు కూడా ఈనెల 19నే ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రభల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గొల్లపల్లి, పాత బొబ్బిలి అమ్మవార్ల సిరిమానోత్సవాలు సోమవారం ఘనంగా జరుగుతాయి. పాత బొబ్బిలి నుంచి పట్టణంలోకి సిరిమాను ప్రవేశించి పురవీధులన్నీ కలియదిరిగి భక్తులను పరవశింప చేస్తుంది. అలాగే గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి సిరిమాను కూడా సోమవారం సాయంత్రం గొల్లపల్లి నుంచి ఊరేగింపుగా ప్రారంభమై పట్టణంలోకి ప్రవేశించి పట్టణంలోని అన్ని వీధుల్లోనూ కలియదిరుగుతుంది. ఉత్సవాలలో భాగంగా పాత బొబ్బిలి, గొల్లపల్లిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాము గరిడీలు, బిందెల డ్యాన్సులు, తప్పెట గుళ్లు, కోలాటం, భారీ లైటింగ్, బళ్ల వేషాలు, కాంతార హంస డ్యాన్స్, బాహుబలి ప్రదర్శన, తీన్మార్, డీజే, మందుగుండుసామగ్రి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పటికే పట్టణంలో అమ్మవార్ల ఘటాలు తిరుగుతూ భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తున్నాయి. -
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
● పిల్లలను బావులు, చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపించకండి. అవసరమైతే మీరే స్వయంగా వారికి తోడుగా వెళ్లండి. ● ద్విచక్రవాహనాలు నడపమని వారి చేతికి తాళాలు ఇవ్వవద్దు. వారికి తాళాలు కనిపించకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు వారి చేతికి ఇవ్వకపోవడం ఉత్తమం. ● స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకండి. ● మధ్యాహ్న సమయంలో ఆరుబయట ఆడుకోవడానికి అనుమతించకండి. ఉదయం , సాయంత్రం వేళల్లో మాత్రమే ఆడుకోవడానికి పంపించడం మేలు. ● ఇంట్లో పెద్దలతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూడండి. వీలైనంత వరకు మన సంప్రదాయాలను నేర్పించాలి. ● రామాయణం, మహాభారతం, ఇతిహాస కథలు చెప్పే వారి వద్దకు పిల్లల్ని పంపించండి. ● పిల్లలు ఆడుకోవడానికి సమయం నిర్ణయించండి. వేసవికాలంలో పిల్లలు ఆడుకునేందుకు నిర్దిష్టమైన టైం టేబుల్ ను రూపొందించండి. అప్పుడు పిల్లలు టైం టేబుల్ ప్రకారం ఆడుకునే వీలుంది. అదే పనిగా ఎండల్లో ఆడుకోకుండా నీడ పట్టునే ఉంటారు. ముఖ్యంగా పిల్లలు టీవీ ఎక్కువ సమయం చూడకుండా వారిని ఫిజికల్ గేమ్స్ వైపు మోటివేట్ చేస్తే మంచిది. ● పిల్లలకు ఉదయం యోగా, సాయంత్రం కరాటే, డ్రాయింగ్, నృత్యం, స్విమ్మింగ్, క్రికెట్, చెస్, వంటి వాటిలో శిక్షణ ఇప్పించడం వల్ల వారు బోర్ ఫీల్ అవ్వరు. ● వేసవికాలంలో పిల్లలు అల్లరి చేస్తున్నారని వారికి మీ స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఆరోగ్యాన్ని పాడు చేయకండి. ● మొబైల్ ఫోన్ బదులు మంచి కథల పుస్తకాలు, డ్రాయింగ్ పుస్తకాలు కొనివ్వండి. వారిలో సృజనాత్మకతను వెలికి తీసేలాబొమ్మలు వేయించండి. లేదా ఇతర కళలను నేర్పించండి. -
పరిహారం చెల్లించాలని డిమాండ్
మల్కన్గిరి: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఉపాధ్యాయుడు, ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి ఇంద్రజిత్ కిర్సనీ కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి వద్ద మంగళవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇంద్రజిత్ కిర్సనీ ప్రాణాలు కోల్పోయారు. ఈయన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సచిన్ పవార్కు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు తారక్ మండాల్, సంఘ ప్రతినిధులు రంజిన్ నాయిక్, ప్రదిప్ కుమార్ దోలాయి తదితరులు పాల్గొన్నారు. -
గుడ్డు బిల్లుల్లోఇదేం తీరు?
శ్రీకాకుళం: జిల్లా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేందుకు సర్వశిక్షా అభయాన్లో కొందరు ఉద్యోగులు స్కెచ్ వేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిత్యావసర సరకులు, మాంసం, గుడ్లు సరఫరా చేసేందుకు ముందుగా టెండర్లు నిర్వహిస్తారు. టెండర్ రోజున ఖరారు చేసిన ధరలకే సంవత్సరం పొడవునా సరఫరా చేయాల్సి ఉంటుంది. రేటు పెరిగినా, తగ్గినా ఇందులో మార్పు ఉండదు. దీనిలో భాగంగా గుడ్డు ధర పేపరు ధరకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా కొన్ని నెలల నుంచి గుడ్డు ధర రూ.6.30 పైసలకు బిల్లు దాఖలు చేస్తున్నారు. బిల్లులు దాఖలు చేసే నాటికి గుడ్డు ధర రూ. 5.50పైసలు ఉండగా అదనంగా 80పైసలు చెల్లిస్తూ వస్తున్నారు. కేజీబీవీల నుంచి రూ.6.30పైసలకు బిల్లులు వస్తుండగా ఆ మేరకు చెల్లింపులు కూడా జరిగిపోయాయి. ఎస్ఎస్ఏలోని అధికారుల సూచ నల మేరకే బిల్లులు దాఖలు చేస్తున్నట్లు ఎస్వోలు చెబుతున్నారు. కాగా అదనపు చెల్లింపుల విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆయన వివరణ కోరడంతో రెండు రోజులుగా ఎస్వోలపై ఎస్ఎస్ఏలోని కొందరు ఉద్యోగులు ఒత్తిడి తెస్తూ పేపరు ధరకే బిల్లులు దాఖలు చేస్తున్నట్లు లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఎస్వోలు ‘సాక్షి’కి తెలిపారు. బిల్లులు దాఖలు చేసినదానికి విరుద్ధంగా లేఖలు ఇస్తే తాము తప్పు చేసినట్లు అవుతుందనిర, తమను హెచ్చరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారని, వాయిస్ మెసేజ్లు కూడా పెడుతున్నారని వాపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లేఖలు ఇవ్వకూడదని బుధవారం జరిగిన ఎస్వోల రహ స్య సమావేశంలో నిర్ణయించుకున్నట్లు భోగట్టా. ఇదిలా ఉంటే నిత్యావసర సరకుల సరఫరా కాంట్రాక్ట్ కూడా కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి కాకుండా వేరొకరు సరఫరా చేస్తున్నట్లు, అవి నాశిరకంగా ఉంటున్నట్లు ఎస్వోలు చెబుతున్నారు. అయితే బిల్లులు మాత్రం కాంట్రాక్ట్ పొందిన సంస్థ నుంచే దాఖలు అవుతుండడంతో వారికి బిల్లులు చెల్లిస్తున్నారు. రికవరీ చేస్తాం.. ఈ విషయాన్ని అకౌంట్ సెక్షన్ సూపరింటెండెంట్ పద్మావతి వద్ద ప్రస్తావించగా గుడ్డు ధర అదనంగా చెల్లించడం వాస్తవమేనన్నారు. వారి నుంచి రికవరీ చేస్తామన్నారు. బిల్లుకు విరుద్ధంగా ఎస్వోలను లేఖలు అడగడం నిజమేనని, ఎఫ్ఏవో సూచనల మేరకే ఎస్వోలకు వాయిస్ మెసేజ్ పెట్టామన్నారు. నిత్యావసర సరకుల కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారో, ఎవరు సరఫరా చేస్తున్నారో తనకు తెలియదని పేర్కొన్నారు. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ఎస్ఎస్ఏ ఉద్యోగుల స్కెచ్ డైట్ బిల్లులకు భిన్నంగా లేఖలు ఇవ్వాలని కేజీబీవీ ఎస్వోలపై ఒత్తిడి -
మో బూత్ యాప్ ఆవిష్కరణ
భువనేశ్వర్: ఓటింగ్ ప్రక్రియ క్రమబద్ధీకరణ నేపథ్యంలో ఖుర్దా జిల్లా ప్రజలకు సులభతరం చేయడానికి మో బూత్ మొబైల్ యాప్ను రూపొందించారు. ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) నికుంజ బిహారి ధొలొ బుధవారం ఈ యాప్ని ప్రారంభించారు. ఓటర్లు తమ నిర్దేశిత పోలింగ్ స్టేషన్ గుర్తించడంలో మో బూత్ యాప్ సహాయపడుతుంది. ఓటరుకు సంబంధించిన పోలింగు బూత్లో బారులు తీరిన ఓటర్ల రద్దీ స్థితిగతుల్ని తెలియజేస్తుంది. తదనుగుణంగా ఓటరు పోలింగు కేంద్రానికి వెళ్లే సమయం నిర్ధారించుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఖుర్దా జిల్లా అధికార యంత్రాంగం ఈ యాప్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్న్లో మో బూత్ యాప్ అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ మాడ్యూల్లో కూడా అందుబాటులోకి రానుంది. మండల స్థాయి అధికారులు (బీఎల్ఓ), సెక్టార్ ఆఫీసర్లతో సహా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైన వివిధ సిబ్బందికి ఈ యాప్ బహు విధాలుగా ప్రయోజనకరం అవుతుందని సీఈఓ తెలిపారు. ప్రధానంగా ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్ల రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు దోహదపడుతుందని చెప్పారు. సెక్టార్ అధికారులు పోలింగ్ పార్టీ ఆగమన స్థితి, మాక్ పోల్, వాస్తవ పోల్ పురోగతి, పోలింగ్ పూర్తి స్థితి వంటి కీలకమైన డేటాను పర్యవేక్షించగలుగుతారని పేర్కొన్నారు. పారదర్శకత, సమర్ధవంతమైన క్యూ నిర్వహణను మెరుగుపరుస్తుందన్నారు. ఈవీఎంలో లోపాలు, శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించడంలో సెక్టార్ అధికారులకు చేయూతగా పని చేస్తుందని చెప్పారు. దీనిలో సెంట్రల్ డ్యాష్బోర్డ్ జిల్లా అధికారులు, సెక్టార్ ఆఫీసర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. -
అంగన్వాడీ వర్కర్ను హత్య చేస్తానని బెదిరింపు
జయపురం: బాల్య వివాహాన్ని అడ్డుకున్న తనను హత్య చేస్తామని ఒక యువకుడు బెదిరించాడని అంగన్వాడీ వర్కర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక నుంచి అంగన్వాడీ వర్కర్లు బాల్య వివాహాలను అడ్డుకోవడం, అవగాహన కల్పించడం జరగదని స్పష్టం చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. ఏప్రిల్ 24వ తేదీన బొయిపరిగుడ సమితి మహుళి గ్రామ పంచాయతీలోని ఒక గ్రామంలో బాల్య వివాహం జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిన బపాణిగుడ అంగన్వాడీ వర్కర్ సంధ్యారాణి పండకు సమాచారం అందింది. దీంతో ఆమె బొయిపరిగుడ సీడీపీవో, అంగన్వాడీ సూపర్వైజర్, స్థానిక సర్పంచ్, స్థానిక పోలీసులు, ఏఎన్ఎం తదితరులకు సమాచారం అందించింది. వారందరూ కలిసి ఆ గ్రామానికి చేరుకున్నారు. వివాహం జరుపుతున్న యువతికి 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు అని నిర్ధారించుకున్నారు. అధికారులు, గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి బాల్య వివాహం నేరమని తెలియజేశారు. అందుకు అందరూ అంగీకరించి వివాహాన్ని ఆపివేసి మైనర్ బాలికను ఆమె తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసేందుకు ఉభయవర్గాలు అంగీకరించారు. అయితే ఈనెల 13వ తేదీన అంగన్వాడీ వర్కర్ పాఢీ ఎలక్షన్ డ్యూటీలో భాగంగా బొయిపరిగుడ వచ్చింది. ఎన్నికల విధిలో ఉన్న సమయంలో ఒక యువకుడు ఆమె వద్దకు వచ్చి నీవు నా వివాహం ఆపుతావా, అని నిన్ను చంపుతానని హెచ్చరించాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్కు తెలిపింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చేసరికి ఆ యువకుడు పరారయ్యాడు. మంగళవారం ఆమె తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, జరిగిన విషయాన్ని అంగన్వాడీ వర్కర్ల సంఘానికి తెలియజేసింది. అందుకు స్పందించిన బొయిపరిగుడ అంగన్వాడీ వర్కర్ల సంఘం నేతలతో బొయిపరిగుడ పోలీసుస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. -
బీభత్సం
జయపురం పట్టణాన్ని ఈదురుగాలులు వణికించాయి. కాలవైశాఖి నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. హోర్డింగులు, ఇళ్ల పైకప్పులు గాలుల ధాటికి ఎగిరిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెహ్రూనగర్లో మోకాలిలోతు నీరు ప్రవహించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సరఫరా లేక అంధకారంలో మగ్గిపోయారు. బుధవారం ఉదయం మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి సిద్దార్ధ పట్నాయక్ సిబ్బందితో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై పడిన హోర్డింగ్లు, చెట్ల కొమ్మలు తొలగించారు. – జయపురం రహదారిపై కూలిన చెట్టు -
మాజీ మంత్రి డొంబురుధర్ ఉలక కన్నుమూత
రాయగడ: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డొంబురుధర్ ఉలక (87) మంగళవారం రాత్రి భువనేశ్వర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జిల్లాలోని బిసంకట్క్ శాసనసభ నియోజకవర్గం నుంచి 1974, 1977, 1995, 2004, 2009లో వరుసగా విజయం సాధించారు. ఒకసారి రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఈయనకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మూడో కొడుకు నీలమాధవ ఉలక బిసంకటక్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేశారు. డొంబురు మృతిపై పలువురు తమ సంతాపాన్ని ప్రకటించారు. డొంబురుధర్ ఉలక మృతికి సంతాపం పర్లాకిమిడి: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డొంబురుధర్ ఉలక మృతికి గజపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, బిజయ పట్నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసంత పండా సంతాపం తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు రాయగడ: జిల్లాలోని కొలనార సమితి కర్లకొన గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జనార్ధన్ పట్నాయక్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులను నిర్వహించేందుకు గుణుపూర్ వెళ్లిన ఆయన, విధుల అనంతరం తిరిగి తన స్వగ్రామైన రామనగుడకు మంగళవారం బైక్పై బయల్దేరాడు. ఈ క్రమంలో కర్లకొన గ్రామ సమీపంలో బైకు అదుపుతప్పడంతో కిందపడిపోయాడు. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడిని అక్కడివారు కొలనార ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి కొరాపుట్/మల్కన్గిరి: అనుమానాస్పద స్థితిలో నవ వధువు అగ్నికి ఆహుతైన విషాదకర ఘటన కొరాపుట్ జిల్లాలో జరిగింది. మల్కన్గిరి జిల్లా బెంగాలి క్యాంప్ ఎంపీ–10కి చెందిన గగన్ మండల్ కుమార్తె శివాని సింగ్(21)ని పుజారిపుట్ గ్రామానికి చెందిన చెందిన ప్రభాస్సింగ్తో ఈ ఏడాది మార్చి 12న వివాహం జరిగింది. కొద్దిరోజులయ్యాక అత్తారింట్లో వరకట్న వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి బెంగాలి క్యాంపులోని తన నివాసంలో శివాని అనుమానాస్పద స్థితిలో మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆశా కిరణ్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందింది. వరకట్నం వేధింపులు వల్లే తమ కుమార్తె చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రభాస్సింగ్ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు రాయగడ: జిల్లాలోని కోమట్లపేట సమీపంలో బుధవారం బైక్, మినీ ట్రక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కస్తూరీనగర్ రెండో లైన్లో నివాసముంటున్న సహజాద్ అలాం వెల్డింగ్ పనులు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాడు. బుధవారం ఉదయం జేకేపూర్లోని ఒక ఇంట్లో వెల్డింగ్ పనులు చేసేందుకు బయలుదేరాడు. కోమట్లపేట వచ్చే సరికి ఆవు అడ్డంగా రావడంతో తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మినీ ట్రక్ను బలంగా ఢీకొన్నాడు. తీవ్ర గాయాల పాలైన అలాంను చందిలి పొలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూతపడిన పేపరుమిల్లు!
ముడిసరుకు కొరత● కార్మికుల ఆందోళన జయపురం: జయపురం సమీపంలోని గగణాపూర్ సేవా పేపరుమిల్లులో పేపరు ఉత్పాదన మరోసారి నిలిచి పోయింది. ముడిసరుకు కొరత కారణంగా ఉత్పాదన ఆగిపోయినట్లు తెలిసింది. మిల్లులో ఉత్పాదన నిలిచి పోవటంతో శ్రామికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిల్లులో ఇటువంటి పరిస్థితిలు తరచూ జరుగుతూనే ఉన్నాయని.. అందుకు అనేక కారణాలను యాజమాన్యం చూపుతోందని శ్రామికులు ఆరోపిస్తున్నారు. పేపరుమిల్లులో ఉత్పత్తి కోసం రెండు మిషన్లు ఉన్నాయి. ఒక్కో మిషన్ సామర్ధ్యం 100 మెట్రిక్ టన్నులు. కాగా ఒక మిషన్ మాత్రమే పనిచేస్తుందని.. అందువలన నెలకు మూడు వేల టన్నుల పేపరు ఉత్పత్తి అవుతున్నదని వారు వెల్లడించారు. ముడిసరుకు లేక పోవటంతో ఉత్పత్తి నిలిచి పోవటంతో తమకు జీతాలు కూడా యాజమాన్యం చెల్లించలేదని, ఇప్పటికే తమకు ఐదు నెలల జీతాలు యాజమాన్యం బకాయి ఉన్నట్టు కార్మికులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో మిల్లులో ఉత్పత్తి ప్రారంభించాలని, బకాయి జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. -
దోపిడీ దొంగల హల్చల్
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా బీజేడి నాయకుడు సునీల్ సాహు లక్ష్యంగా దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. బుధవారం వేకువజామున అతని స్వగ్రామం డొంగ్రుబజలో ఉన్న ఇంటిపై తుపాకీలతో దాడులకు తెగబడ్డారు. ఇంటి తలుపులు విరగ్గొడుతూ చొరబడ్డారు. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో బీరువాలు పగలుగొట్టి ఫైల్స్ చిందరవందరగా పడివేశారు. అదే ఇంటిలో వేరే పోర్సన్లో అద్దెకు ఉంటున్న రోహిత్ బెహరా ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంట్లో పిల్లల తలపై తుపాకులు గురిపెట్టి సునీల్ కోసం వాకబు చేశారు. అయితే సునీల్ నబరంగ్పూర్ పట్టణంలో ఉన్నారని, తాము అద్దెకు ఉంటున్నామని ఆ కుటుంబీకులు తెలియజేశారు. అనంతరం వారి ఇంట్లో బీరువాలు తనిఖీ చేసి సుమారు రూ.7 లక్షలు విలువ చేసే నగలు అపహరించుకుపోయారు. ఉదయం వరకు భయంతో రోహిత్ కుటుంబీకులు ఇంట్లోనే ఉండిపోయారు. అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. నబరంగ్పూర్ ఐఐసీ సంబిత్ బెహరా నేతృత్వంలో బలగాలు సంఘటన స్ధలానికి చేరుకున్నాయి. సునీల్ సాహు సైతం స్వగ్రామానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభం ఏడుగురు దొంగల దాడిలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. పోలీసు జాగిలాలను తెప్పించి దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ సాహుకి పట్టణంలో రాకీ సాన్ పేరుతో హోటల్, ఫంక్షన్ హాల్, అనేక వ్యాపారాలు ఉన్నాయి. గతంలో ఒకసారి దోపిడి దొంగలు సునీల్ని అపహరించుకుపోయారు. సుమారు నెల రోజులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. అతని కుటుంబ సభ్యులు దొంగలతో చర్చలు జరిపి విడిపించుకున్నారు. అనంతరం ప్రభుత్వం సునీల్కి గన్మెన్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సునీల్ సాహు అధికార పార్టీకి ఆర్థికంగా కీలకంగా వ్యవహరించారు. 13వ తేదీ రాత్రి వరకు సునీల్ స్వగ్రామంలోనే ఉంటూ ఎన్నికలు పర్యవేక్షించారు. అతనిపై దాడిచేస్తే పెద్ద ఎత్తున లబ్ధి పొందవచ్చుననే ఉద్దేశంతో ఈ దాడి జరిగిందనే ఊహాగానాలు జరుగుతున్నాయి. కానీ సునీల్ తన మకాం నబరంగ్పూర్కి మార్చడంతో దొంగల అంచనా తప్పింది. -
ఎన్నికలు మాకొద్దు..!
● అవిభక్త కొరాపుట్ జిల్లాలో పలు గ్రామస్తుల నిర్ణయం జయపురం: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచాయి. అయినా నేటికి అవిభక్త కొరాపుట్ జిల్లాలోని అనేక గ్రామాలు కనీస మౌలిక సౌకర్యాలకు నోచుకోలేదు. ఇప్పటివరకూ పట్టించుకోని ప్రజలు ఇప్పుడు కఠిన నిర్ణయానికి వచ్చారు. తాము వేసిన ఓట్లతో అందలమెక్కే పాలకులు తమ హక్కులను కాలరాస్తున్నారని, కనీస సౌకర్యాలు కల్పించటంలేదని వారు గ్రహించారు. అందుకే ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించి. ఏఏ గ్రామస్తులు బహిష్కరించారంటే.. తమ గ్రామానికి రోడ్లు వేయాలని, మంచినీటిని సమకూర్చాలని డిమాండ్ చేస్తూ దసమంతపూర్ సమితి లుల్లా పంచాయతీ పదుగుడ గ్రామ ప్రజలు ఎంతో కాలంగా అధికారులకు విన్నవించుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు. ఆ గ్రామంలో 90 ఆదివాసీ కుటుంబాలకు చెందిన 450 మంది నివసిస్తున్నారు. వారిలో 176 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం ఒక పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దసమంతపూర్ బీడీవో మిలన్ కుమార్ ఝంకార్ గ్రామానికి వెళ్లి ప్రజలకు నచ్చ చెప్పినా వారు వినలేదు. తమ గ్రామానికి రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించినప్పుడే ఓటు హక్కును వినియోగించుకుంటామని భీస్మించడంతో అదికారులు వెనుదిరిగారు. నందపూర్ సమితిలో.. నందపూర్ సమితి రయిసింగ్ పంచాయతీ దేవసొండిగుడ గ్రామస్తులు కూడా ఎన్నికలు బహిష్కరించారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని, బాసికీ నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఎన్నికలు బహిష్కరించారు. అంతేకాకుండా గ్రామ మార్గానికి అడ్డంగా వెదురులతో దడికట్టి తమ డిమాండ్లతో కూడిన బ్యానర్ కట్టారు. నారాయణపట్న సమితిలో.. నారాయణపట్న సమితిలో నాలుగు గ్రామాల ప్రజలు తమకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేదంటూ ఎన్నికలు బహిష్కరించారు. అయితే విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో గ్రామాలకు వెళ్లి.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించినట్లు సమాచారం. అలాగే నవర్డపూర్ జిల్లాలో కూడా పలుగ్రామాల ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు. తెంతులికుంటీ, లమతాగుడ, ఖుండియగుడ గ్రామస్తులు సైతం ఎన్నికలు బహిష్కరించారు. తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయా గ్రామస్తులు వాపోయారు. ఈ గ్రామాల్లో 609 మంది ఓటర్లు ఓటు వేయలేదు. అలాగే రాయిఘర్ సమితిలోని ఖుడుకో పంచాయతీ పరిధిలోని 17 గ్రామాల్లో ఉన్న 2,100 మంది ఓటర్లు సమస్యలు పరిష్కరించనందుకు నిరసనగా ఎన్నికలు బహిష్కరించారు. -
స్ట్రాంగ్ రూమ్ భద్రత పరిశీలన
పార్వతీపురం: ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్లకు కల్పించిన మూడంచెల భద్రత, బందోబస్తును పరిశీలించారు. మొదటి స్థాయిలో స్థాని క పోలీసులు, రెండవ స్థాయిలో రాష్ట్ర సాయుధ బలగాలు, మూడవ స్థాయిలో కేంద్ర సాయుధ బలగాల పహారా ఏర్పాటు చేశారు. రేయింబవళ్లు పహారాతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలని భద్రతా అధికారులకు ఎస్పీ సూచించారు. భద్రతా ఏర్పాట్ల తనిఖీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్.ఎస్.శోబిక, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సాలూరు శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి సి.విష్ణుచరణ్, అదనపు ఎస్పీ డా.ఓ.దిలీప్ కిరణ్, అధికారులు పాల్గొన్నారు. -
వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ
విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణంలో వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించా రు. బెంగళూరుకు చెందిన ప్రముఖ రచయితలు శ్రీరామ చక్రధర్, శారద దీప్తి శిక్షణ కార్యక్రమానికి హాజరైన చిన్నారులు, పెద్దలకు వ్యక్తిత్వ వికాస సూత్రాలను వివరించారు. మనిషి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమయ్యే వ్యక్తిత్వం, గుణగణాలను వివరించారు. శిక్షణ శిబిరానికి 200 మంది హాజరు కాగా ఆలయ అర్చకులు చాణక్య, హర్షలు శాంతి మంత్రాలు, ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో ఎన్సీఎస్ ట్రస్టీలు నారాయణం శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు, చీఫ్ ఆడిటర్ బాలాజీ, ఉమాదేవి దంపతులు, జాహ్నవి, తదితరులు పాల్గొన్నారు. ఆర్బీకేలో చోరీమక్కువ: మండలంలోని కాశీపట్నం పంచాయతీలో గల రైతుభరోసా కేంద్రంలో జరిగిన చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఎస్సై పి.నరసింహమూర్తి బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాశీపట్నం గ్రామంలో ఆర్అండ్బీ రహదారి సమీపంలోని ఆర్బీకేలో విధులు నిర్వహిస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గొట్టాపు సతీష్కుమార్ ఈనెల 10వతేదీన విధులు నిర్వహించి, రైతుభరోసాకేంద్రం తలుపులకు తాళాలు వేసి వెళ్లిపోయా రు. మళ్లీ ఈనెల 14వతేదీన ఆర్బీకేలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఆయన తలుపులు తీ సి, చూడగా టీవీ, కంప్యూటర్ మానిటర్, ప్రింటర్ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. దీంతో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సతీ ష్కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత తప్పనిసరి
పాలకొండ రూరల్: ప్రస్తుత వేసవి చివరలో కురిసే అడపా దడపా వర్షాల కారణంగా గొర్రెల్లో వచ్చిన సీజనల్, సాధారణ వ్యాధులు వాటి నివారణ చర్యలపై పాడిరైతు లు, పెంపకందారులు అవగాహన పెంచుకోవాలని పశు సంవర్థకశాఖ సహాయ సంచాలకుడు (ఎ.డి) ప్రభా మాణిక్యరావు అన్నారు. లేనిపక్షంలో జీవాలు మృత్యువాత పడే అవకాశం ఉందన్నారు. వివిధ రకాల క్రిమి, కీటకాల వల్ల వ్యాధులు సంక్రమిస్తా యని తెలిపారు. గొర్రెల పెంపకందారులు సరైన సమయంలో సమస్యలు గుర్తించి, వైద్యుల సూచన లు పాటించాలన్నారు. ఈ మేరకు సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సూక్ష్మజీవుల ద్వారా... సూక్ష్మజీవుల వల్ల చిటుకు వ్యాధి(ఈటీ), అంత్రాక్స్ లేదా నల్లజాడ్యం, ఊపరితిత్తుల్లో నెమ్ము లేదా నెమోనియో, పొగాళ్లు లేదా బురద పుండ్లు, మితు వకాళ్లు, గొంతువాపు వ్యాధుల సంభవిస్తాయి. గాలి కుంటు, నీలి నాలిక, బొబ్బరోగం, అమ్మతల్లి, నోటి పుండ్లు వంటివి వైరస్ ద్వారా ఒకదాని నుంచి ఇంకొకదానికి చేరి మందకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. తేలికపాటి వర్షాలు కురిసేటప్పుడు క్లాస్ట్రీడియం జాతి సూక్ష్మజీవుల వల్ల ఎక్కువ ప్రమాదం చోటు చేసుకుంటుంది. బలిష్టంగా, ఆరోగ్యంగా ఉండే గొర్రెలు ఒక్కసారిగా ఎగిరిపడి కొట్టుకుని మర ణించడం.. కడుపును కాళ్లతో తన్నడం.. కడుపు ఉబ్బడం.. నల్లగా దుర్వాసన వచ్చే పారుడు.. నోటి నుంచి నురగ రావడం.. ఫిట్స్ వంటి లక్షణాల ద్వా రా ఈ రోగాలను గుర్తించవచ్చు. ఈ సమస్యలకు చికిత్స అందించే క్రమంలో వైద్యుల సలహా మేరకు రోగ పరిస్థితిని బట్టి ఆక్సిట్రెట్ సైక్లిన్ మందును 5 నుంచి 10 మిల్లీగ్రాములు ఒక కిలో బరువుకు లెక్కకట్టి గొర్రెలకు అందించాలి. 50 మిల్లీగ్రాముల పొటాషియం పర్మాంగనేట్ 100 ఎం.ఎల్ నీటిలో కలిపి తాగించాలి. రోగనివారణకు అవసరమగు టీకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రభు త్వ పశువైద్య కేంద్రాల్లో ఈ టీకాలను ఉచితంగా అందిస్తారు. మూడు మాసాల వయస్సు నిండిన గొర్రెపిల్లలకు తప్పనిసరిగా నట్టల నివారణ మందు ఇవ్వాలని, మొదటి టీకా ఇచ్చిన 15 రోజుల తర్వాత బూస్టర్డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఏటా మే నెల మొదటి వారంలో క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement