-
‘1/70 చట్టం పకడ్బందీగా అమలు చేయాలి’
నార్నూర్: ఏజెన్సీలో 1/70 చట్టం పకడ్బందీగా అమలు చేయాలని తుడుందెబ్బ డివిజన్ అధ్యక్షుడు కనక ప్రభాకర్ అన్నారు.గురువారం మండల కేంద్రంలోని కుమురంభీం భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13న కుమురంభీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ యువకుడిపై మైనార్టీల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మె స్రం మానిక్రావు, ఽశ్రీరామ్, పెందూర్ దీపక్, తదితరులు పాల్గొన్నారు. -
పౌరసరఫరాల అధికారుల విస్తృత తనిఖీలు
కై లాస్నగర్: జిల్లాలోని పలు మండలాల్లోని రేషన్ షాపుల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, యూడీఆర్ఐ రవీందర్ ఆదిలాబాద్ పట్టణంలోని పలు షాపులను, బజార్హత్నూర్, ఉట్నూర్, మావల మండలాల్లోని షాపులను డిప్యూటీ తహసీల్దార్లు శ్యాంసుందర్, త్రియంబక్రావు, ప్రేంనివాస్ తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. డీలర్లు సమయపాలన పాటిస్తూ కార్డుదారులకు సకాలంలో బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. అక్రమంగా రేషన్ బియ్యం అమ్మకున్నట్లు తెలిస్తే మాత్రం డీలర్లపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్డుదారులు బియ్యం వండుకుని తినేలా అవగాహన కల్పించాలని సూచించారు. -
ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీ
● పలువురికి గాయాలుభైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్ గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలు వురికి గాయాలయ్యాయి. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వి వరాల ప్రకారం.. భైంసా నుంచి మద్యం లోడుతో ఐచర్వాహనం, నిర్మల్ వైపు నుంచి మామిడి కా యల లోడ్తో భైంసా వైపు వస్తున్న మరో ఐచర్ వా హనం తిమ్మాపూర్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో మామిడి కాయల లోడ్తో వెళ్తున్న వాహన డ్రైవర్ అమ్జద్ఖాన్, మధ్యంలోడ్తో వెళ్తున్న వాహన డ్రైవర్ శంకర్తోపాటు దీక్షిత్, సందీప్, వంశీకి గాయాలయ్యాయి. స్థానికులు వీరిని భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. బాధితుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వానల్పాడ్ గ్రామంలో ముగ్గురికి..భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ గ్రామ సమీపంలో గురువారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వానల్పాడ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, రుక్మా ద్విచక్రవాహనం వెళ్తూ యూటర్న్ తీసుకుని గ్రామంలోకి వెళ్తుండగా కుంటాల మండలం కల్లూరు గ్రామం నుంచి భైంసాకు ద్విచక్రవాహనంపై వస్తున్న వంశీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను భైంసా ఆస్పత్రికి తరలించారు. -
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు
ఆదిలాబాద్రూరల్: 2024–25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి సునీత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో 1వ తరగతి (డే స్కాలర్), 5వ తరగతి (రెసిడెన్షియల్)లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. 1వ తరగతిలో 45 సీట్లు, ఐదో తరగతిలో 47 సీట్లు ఉన్నట్లు తెలి పారు. వార్షిక ఆదాయం గ్రామీణ స్థాయిలో రూ.లక్షా 50వేలు, పట్టణ స్థాయిలో రూ.2 లక్షల ఉండాలన్నారు. అన్ని ధ్రువీకరణ పత్రాలను గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేసి జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని, ఇతర వివరాల కోసం 9440628538 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
డెంగీ నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి
కై లాస్నగర్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వడం ద్వారానే డెంగీ వ్యాధి ప్రబలకుండా నియంత్రించవచ్చని, ఆదిశగా సంబంధిత అధికారులు స మన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మంగళ, శుక్రవారాల్లో గ్రామీణ ప్రాంతాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. హైరిస్క్ ఏరియాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ స్ప్రే మిషిన్లు అందుబాటులో ఉంచాలన్నా రు. మున్సిపాలిటీలోని 49 వార్డుల్లో ఫాగింగ్ మిషన్ తిరగాలన్నారు. అనంతరం డెంగీ నియంత్రణకు ఉ త్తమ సేవలు అందించిన వివిధ శాఖల ఉద్యోగుల కు సర్టిఫికెట్స్ అందించి అభినందించారు. అనంత రం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ అభిఘ్యాని మాల్వియా, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, మలేరియా అధికారి శ్రీధర్, మున్సిపల్ కమిషర్ ఖమర్ అహ్మద్, డీఎల్పీవో ఫణీందర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధికోసం వచ్చి తిరిగిరాని లోకాలకు..
● ద్విచక్రవాహనంతో తాటిచెట్టును ఢీకొని బావ మృతి ● గాయాలపాలైన బావమరిది సారంగపూర్: ఉపాధి కోసం అత్తగారి గ్రామానికి వచ్చి జీవనోపాధి పొందుతున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మండలంలోని కౌట్ల(బీ) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. కుభీర్ మండలం హాల్ద గ్రామానికి చెందిన శంకర్ (35)కు మండలంలోని కౌట్ల(బీ) గ్రామానికి చెందిన గజ్జవ్వతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కుమారుడున్నారు. స్వగ్రామంలో ఉపాధి కరువై శంకర్ తన అత్తగారి గ్రామమైన కౌట్ల(బీ)కి కుటుంబంతో ఐదేళ్ల క్రితం వచ్చాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం కూలీ పనులు ముగించుకుని పని నిమిత్తం సారంగపూర్కు తన బావమరిది కుంటాల నరేశ్ (24)తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరిగి వస్తుండగా కరుణాకర్రెడ్డి ఫంక్షన్హాల్ సమీపంలో తాటిచెట్టుకు ద్విచక్రవాహనంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాగా, శంకర్ మృతితో అతడి కుటుంబం వీధినపడింది. నరేశ్ది పేద కుటుంబం కావడంతో మెరుగైన వైద్యం చేయించే స్తోమత వారికి లేదు. శంకర్ మృతదేహాన్ని అతడి స్వగ్రామం కుభీర్ మండలం హాల్దాకు తరలించారు. శంకర్ మృతితో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
క్రీడా శిబిరాలు విజయవంతంగా నిర్వహించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉట్నూర్రూరల్: వేసవి క్రీడా శిబిరాలు విజయవంతంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పీవో మాట్లాడుతూ శిబిరాల ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. గిరిజన విద్యార్థుల్లో సహజసిద్ధంగా నైపుణ్యాలుంటాయని, వాటిని గుర్తించి ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీడీ దిలీప్కుమార్, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, ఏటీడీఓ క్రాంతికుమార్, ఏఎస్ఓ హేమంత్, తదితరులు పాల్గొన్నారు. -
పేరు రైతుది.. పంట దళారిది
● జొన్న కొనుగోళ్లలో దళారుల దందా ● మహారాష్ట్రలో జొన్నలు కొనుగోలు ● తెలంగాణలో రైతుల పేరిట మార్క్ఫెడ్కు విక్రయంబోథ్: జిల్లాలోని రైతులు ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో జొన్నపంట సాగు చేశారు. జిల్లాలోని తొమ్మిది కొనుగోలు కేంద్రాల్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న పంట కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది రూ.3,180తో మద్దతు ధర నిర్ణయించారు. ఇదే అదనుగా భావించిన దళారులు మార్కెట్లోకి రంగప్రవేశం చేశారు. మహారాష్ట్ర నుంచి జొన్నలు కొనుగోలు చేసి తెలంగాణలో రైతుల పేరిట మార్క్ఫెడ్కు విక్రయిస్తున్నారు. దీంతో అసలు రైతులు నష్టపోతున్నారు. ఆన్లైన్లో ఉంటేనే కొనుగోలు.. వ్యవసాయ శాఖ సిబ్బంది రైతుల పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగానే పంట కొనుగోలు చేస్తున్నారు. మార్క్ఫెడ్ సంస్థ స్థానిక ప్రాఽథమిక సహాకారం సంఘం సిబ్బంది ద్వారా కొనుగోలు చేయిస్తోంది. ఆన్లైన్లో పంట వివరాలు లేకపోతే కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. అయితే చాలాచోట్ల వ్యవసాయ శాఖ సిబ్బంది పంట క్షేత్రాలకు వెళ్లకుండానే రైతులు చెప్పిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దళారులు, వ్యాపారులు తమకు అనుకూలంగా ఉన్న రైతుల చేత పంట వివరాలు నమోదు చేయిస్తున్నారు. రైతుల పేరిట విక్రయాలు.. వ్యాపారులు, దళారులు జొన్నపంటను మార్క్ఫెడ్కు యధేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీనికోసం రైతుల పట్టా పాస్బుక్లను వాడుకుంటున్నారు. రైతుల పంట క్షేత్రాలకు వెళ్లకుండానే అధికారులు ఆన్లైన్లో పంట వివరాలు నమోదు చేస్తుండడంతో వ్యాపారులు, దళారులు తమకు అనుకూలంగా ఉన్న కొంతమంది రైతుల పేరిట జొన్న, మొక్కజొన్న, శనగ పంటలను సాగు చేస్తున్నట్లు ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. పంటను ప్రభ్వుత్వం కొనుగోలు చేసే సమయంలో సదరు రైతుల పేరు మీద మార్క్ఫెడ్కు విక్రయిస్తున్నారు. గ్రామాల్లో కొంతమంది రైతుల వద్ద దళారులు తక్కువ ధరకు పంట కొనుగోలు చేసి అప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు తమ అవసరాల కోసం పంటను వారికి విక్రయిస్తున్నారు. మరి కొంతమంది దళారులు మహారాష్ట్రలో తక్కువధరకు జొన్నలు కొనుగోలు చేసి తెలంగాణలో రైతుల పేరుమీద విక్రయాలు జరుపుతున్నారు. మార్కెట్కు రాకుండానే గోదాంలకు.. వ్యాపారులు, అధికారుల మధ్య ఒప్పందంతో జొన్నలు అసలు మార్కెట్కు రాకుండానే లారీల్లో మార్క్ఫెడ్ గోదాంలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులు కొనుగోలు చేసిన జొన్నలను గోదాంలలో నిల్వ ఉంచుతున్నారు. వ్యాపారులు నిల్వ ఉంచిన జొన్న పంటకు అధికారులు లాట్ నంబర్ కేటాయించి నేరుగా కాంటా చేసిన తరువాత మార్క్ఫెడ్ గోదాంకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తరలించిన వాటికి వ్యాపారస్తులు తమకు అనుకూలంగా ఉన్న రైతుల పేరుతో విక్రయిస్తున్నట్లు సమాచారం. పంట కొనుగోళ్లు మార్కెట్కు చెందిన దడ్వాయిల ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా వారు లేకుండానే కొనుగోళ్లు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బోథ్ మార్కెట్ యార్డులో దళారుల ప్రవేశం.. బోథ్ మార్కెట్ పరిధిలో దళారులు జొన్న పంటను మార్క్ఫెడ్కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ దళారి తన వాహనంలో జొన్నపంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు. అనుమానం వచ్చిన పలువురు వాహనాన్ని ఆపి ఈ పంట ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రైతుల పట్టా పాస్బుక్కులు, ఆన్లైన్లో సాగు వివరాలు తీసుకురావాలని అధికారులు సూచించారు. పంటను కొనుగోలు చేయకుండా మార్కెట్ యార్డులోనే ఉంచారు. ఈ విషయమై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు. అయితే చాలా మంది దళారులు రైతుల పేరిట జొన్నపంటను విక్రయిస్తున్నారు. విక్రయించే క్రమంలో దళారులు మార్కెట్ యార్డులోనే ఉంటున్నా సంబంధిత రైతులు మాత్రం ఉండటం లేదు. -
బోనస్ చెల్లించే వరకూ పోరాడుతాం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న కై లాస్నగర్: మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించిన సీఎం రేవంత్రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. రైతులకు బోనస్ చె ల్లించాలనే డిమాండ్తో ఆ పార్టీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. కై లాస్నగర్లోని పార్టీ కార్యాలయం నుంచి బాబూ జగ్జీవన్రాం చౌక్ వ రకు ర్యాలీ నిర్వహించారు. రహదారిపై వరిధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని ఎన్నికలకు ముందు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమేనని మాట మా ర్చడం సరికాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 శా తం రైతులు దొడ్డురకం వడ్లనే పండిస్తున్నారని, 20 శాతం పండిస్తున్న సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామనడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, నాయకులు అజయ్, నారాయణ, రమేశ్, సలీం, దాసరి రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
ఉట్నూర్రూరల్: సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్వో విజయ్కుమార్ అన్నారు. గురువారం డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉట్నూర్ మండలంలోని తాండ్రలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యటించాలన్నారు. అనారోగ్యం బారిన పడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చూడాలన్నారు. దోమల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. -
వానాకాలం సాగుకు సన్నద్ధం కావాలి
కై లాస్నగర్: వానాకాలం సాగుకు విత్తన, ఎరువుల డీలర్లు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని, ఈ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. వానాకాలం సాగు సన్నద్ధతలో భాగంగా గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని విత్తన, ఎరువుల డీలర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18లోగా విత్తనాల యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని, జిల్లాకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. మండలాల పరిధిలో ప్రతీ మంగళ, శుక్రవారం సమావేశాలు జరపాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలనే సరఫరా చేయాలని ఆదేశించారు. డీలర్లు దుకాణానికి సంబంధించిన లైసెన్స్లు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. షాపులో ఉన్న స్టాక్ వివరాలను రోజు వారీగా నమోదు చేసి వీటికి సంబంధించిన బిల్ బుక్, రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించవద్దని, అలా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గడువు ముగిసిన విత్తనాలు, ఎరువులు అమ్మరాదని, అధికారులు వీటిపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడా కూడా విత్తనాలు, ఎరువుల కొరత ఉండకూడదని, జిల్లాకు సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ట్రెయినీ కలెక్టర్ అభిఘ్యాన్ మాల్వియా, వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య, ఏడీఏ రమేశ్, వ్యవసాయాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ రాజర్షి షా -
క్లుప్తంగా
కుమారుడిపై తండ్రి ఫిర్యాదు ఎదులాపురం: కుమారుడిపై తండ్రి ఫిర్యాదు చేసిన సంఘటన పట్టణంలోని టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై లాల్సింగ్ కథనం ప్రకారం పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన పవన్ అనుమానంతో భార్యపై చేయి చేసుకున్నాడు. కోడలిని ఎందుకు కొడుతున్నావ్ అని అడ్డుకోబోయిన తల్లిదండ్రులపై సైతం చేయి చేసుకున్నాడు. దీంతో అతని తండ్రి నాగోరావు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. భార్యను వేధించిన కేసులో 18 నెలల జైలు కై లాస్నగర్: భార్యను వేధించిన కేసులో భర్తకు 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2500 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె.ప్రభాకర్రావు గురువారం తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి ఎం. గంగాసింగ్ తెలిపారు. జైనథ్ మండలంలోని నిరాల గ్రామానికి చెందిన మహిళ, మహారాష్ట్రలోని సరత్ తాలూకా ఘటంజి గ్రామానికి చెందిన సావాపురే దీక్షిత్ భార్యాభర్తలు. నిత్యం భార్యను వేధిస్తుండడంతో దీక్షిత్పై జైనథ్ పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పీసీఆర్ కోర్టులో విచారణ జరుపగా నిందితుడికి 18నెలల జైలు, రూ.2500 జరిమానా విఽధిస్తూ పీసీఆర్ కోర్టు తీర్పునిచ్చింది. -
సాకెరలో చోరీ
బోథ్: మండలంలోని సాకెర గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రాథోడ్ రాయల్ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం..రాథోడ్ రాయల్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 14న సారంగపూర్ మండలంలోని లింగాపూర్ వెళ్లాడు. గురువారం ఉదయం తాళం తీసి ఉండడాన్ని గమనించిన గ్రామానికి చెందిన రాథోడ్ రంజిత్ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. గ్రామానికి చేరుకున్న రాయల్ ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు బీరువాల తలుపులు తెరిచి ఉన్నాయి. అందులో ఉన్న 8 గ్రాముల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.15 వేల నగదు కనిపించలేదు. వెంటనే ఎస్సై రాముకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
భార్య కాపురానికి రావడంలేదని ఆత్మహత్య
గుడిహత్నూర్: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మన్నూరులో చోటు చేసుకుంది. ఎస్సై ఇ మ్రాన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మన్నూర్కు చెందిన బస్వంతె బ్రహ్మానంద్(38), అనిత దంపతులు బీసీ కాలనీలోని అద్దె ఇంట్లో ఉంటున్నా రు. వివాహామై పదహారేళ్లు కావస్తున్నా సంతానం కలుగలేదు. వారం రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అనిత పుట్టింటికి వెళ్లింది. భార్యను తీసుకొద్దామని బ్రహ్మానంద్ బుధవారం ఇంద్రవెల్లి మండలం సట్వాజీగూడలోని అత్తారింటికి వెళ్లాడు. రావడానికి నిరాకరించడంతో సా యంత్రం మన్నూర్కు వచ్చి మద్యం సేవించాడు. మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. స్థానికులు రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్యభైంసారూరల్: మండలంలోని దేగాం గ్రామానికి చెందిన పోతన్న(30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. పోతన్న గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని భైంసా ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోతన్నకు భార్య సావిత్ర, ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతికౌటాల/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి గు ర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. అటవీ ప్రాంతం నుంచి కాగజ్నగర్– సిర్పూర్(టి) ప్రధాన రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక అక్కడిక్కడే మృతి చెందింది. వాహనాదారులు అందించిన సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దేశీదారు పట్టివేతకౌటాల/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ పట్టణంలోని సుభాష్ కాలనీలో గురువారం దేశీదారు మద్యం పట్టుకున్నామని కాగజ్నగర్ ఎకై ్సజ్ సీఐ వి.రవి తెలిపారు. సుభాస్ కాలనీలో కె.అరుణ్కుమార్ దేశీదారు మద్యం అమ్ముతుండడంతో 56 దేశీదారు 90 మి.లీ. బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అరుణ్కుమార్పై కేసు నమోదు చేశామన్నారు. నలుగురు పాత నేరస్తులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామని వెల్లడించారు. పేకాట రాయుళ్ల అరెస్ట్ తానూరు: మండలంలోని హంగిర్గా గ్రామ శివారులో గురువారం పేకాడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. వారి నుంచి రూ.11,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
తాంసి: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భీంపూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రదీప్కుమార్ తెలిపిన వివరాల మేరకు భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి గ్రామానికి చెందిన గుగ్గిల పొచ్చన్న (58) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఊరిబయట ఉన్న వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం గమనించిన గ్రామస్తులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని ఎస్సై ప్రదీప్కుమార్ పరిశీలించి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య రమణాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
గ్రామస్తుల చేతిలో కొండ చిలువ హతం
భైంసారూరల్: మండలంలోని దేగాం గ్రామంలో బుధవారం గ్రామస్తులు కొండ చిలువను హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మోహన్పాటిల్ పంటచేనులో 12 అడుగుల కొండ చిలువ కనిపించడంతో అటుగా వెళ్తున్న కొందరు రైతులు దానిని హతమార్చారు.దాడి చేసిన పలువురిపై కేసు ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టల్వాడకు చెందిన జాదవ్ గోపాల్పై దాడి చేసిన పలువురిపై కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై విష్ణు వర్ధన్ తెలిపారు. పిట్టల్వాడకు చెందిన జాదవ్ గోపాల్ బుధవారం దుర్గనగర్ కాలనీ నుంచి ద్విచక్ర వాహనంపై పిట్టల్వాడకు వస్తుండగా 170 కాలనీకి చెందిన అజయ్ మహకాల్తో పాటు పలువురు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అజయ్తో పాటు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదు
ఆదిలాబాద్టౌన్: తనపై కొంతమంది హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన బీజేపీ యువ మోర్చా నాయకుడు గటిక క్రాంతికుమార్ బుధవారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు తమ ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడడమే కాకుండా హత్యాయత్నం చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తనను టార్గెట్ చేస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందన్నారు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. తనపై హత్యాయత్నానికి ఉసిగొల్పిన కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా పలువురు బీజేపీ నాయకులు టూటౌన్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. -
గురుకులాన్ని సందర్శించిన కేంద్ర బృందం
బోథ్: మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను బుధవారం హైదరాబాద్ నుంచి వచ్చిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన అధికారుల బృందం పరిశీలించింది. కొంత కాలంగా కేంద్రం జలశక్తి మంత్రిత్వ శాఖ నీటి పొదుపుపై పలు పాఠశాలలు, కళాశాలలకు అవార్డులు అందజేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో రెండు గురుకుల పాఠశాలలు ప్రొవిజనల్ జాబితాలో ఉండగా అందులో బోథ్లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల ఒకటి. ఈ క్రమంలో పాఠశాలలో నీటి పొదుపు అంశంపై పరిశీలించారు. నీటి సంరక్షణ నీటి పొదుపు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. నీటి పునర్వినియోగం పద్ధతులు, నిర్మాణాలను పరిశీలించారు. వారి వెంట పరిశీలనా బృందం శాస్త్రవేత్త ఉపేందర్, ఇంజనీర్ కృతిక, బోథ్ ఎంపీడీవో రమేశ్, ఏపీవో జగ్దేరావ్, ఏపీడీ కృష్ణారావు, సూర్యప్రకాష్, ఉపాధ్యాయులు సంతోష్, అమాన్, శ్రీనివాస్ ఉన్నారు. -
పూర్తయ్యేనా?
‘కడెం’ మరమ్మతులుకడెం: రెండేళ్లుగా వానాకాలంలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో వరద గేట్లు పనిచేయకపోవడంతో ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్లింది. 2022లో భారీగా వరదనీరు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2023లో కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదనీటితో ప్రాజెక్ట్ అతలాకుతలం అయ్యింది. వరదలకు దెబ్బతిన్న ప్రాజెక్ట్కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిధులు కేటాయించడంతో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వానాకాలం సమీపిస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. సీజన్ ప్రారంభం నాటికి పనులు పూర్తి అవుతాయో లేదోనని ఆయకట్టు రైతాంగం అయోమయంలో ఉంది. ప్రాజెక్ట్ మరమ్మతు పనులను పరిశీలించేందుకు బుధవారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్కుమార్తో పాటు అధికారుల బృందం ప్రాజెక్ట్ను సందర్శించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వారి పర్యటన వాయిదా పడింది. పనులు పూర్తయ్యేనా.. రెండేళ్లుగా వచ్చిన భారీ వరదలకు దెబ్బతిన్న ప్రాజెక్ట్ మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.46 కోట్ల నిధులు విడుదల చేయడంతో పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 9 ఇండియన్ గేట్లలో ఏడు గేట్లకు రూలర్స్ అమర్చారు. మరో రెండు గేట్లకు అమర్చాల్సి ఉంది. 11 వరద గేట్లకు రబ్బర్ సీల్స్ అమర్చారు. 9 జర్మనీ గేట్లలో 7 గేట్లకు గేర్ బాక్స్లు అమర్చారు. మరో రెండింటికి అమర్చాలి. రెండు వరద గేట్లకు కౌంటర్ వెయిట్లు, వైర్ రోప్స్ అమర్చాలి. 9 జర్మనీ గేట్లకుగానూ 7 గేట్లకు బ్రేక్ లైనర్స్ అమర్చారు. మరో రెండు గేట్లకు అమర్చాలి. నాలుగు వరద గేట్లకు కొత్త మోటార్లు బిగించాల్సి ఉంది. ప్రాజెక్ట్ ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం ఇటీవలే నిధులు విడుదలయ్యాయి. టెండర్ పూర్తి కాక పనులు ప్రారంభం కాలేదు. దీంతో వైరింగ్, ప్యానెల్ బోర్డ్స్, స్టార్టర్స్, తదితర ఎలక్ట్రికల్ పనులు పూర్తి కాలేదు. సివిల్ వర్క్లో భాగంగా స్పిల్వే పనులు కొనసాగుతుండగా అఫ్రాన్, వాల్స్ పనులు పూర్తయ్యాయి. కడెం ప్రాజెక్ట్ సమీపిస్తున్న వానాకాలం ఇప్పటికీ పూర్తికాని పనులు అయోమయంలో ఆయకట్టు రైతాంగం -
ఆలయాలే టార్గెట్..!
సారంగపూర్: ఆలయాలనే టార్గెట్గా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. పది రోజుల వ్యవధిలో మండలంలోని రెండు దేవాలయాల్లో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. ఇటీవల మండలంలోని ఆలూరు గ్రామ సమీపంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ జరగగా తాజాగా మంగళవారం రాత్రి జామ్ గ్రామ సమీపంలోని మహాలక్ష్మీ దేవాలయంలో దొంగలు పడ్డారు. ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి అమ్మవారి రెండు గ్రాముల బంగారు ముక్కుపుడుకలు, పుస్తెలతో పాటు హుండీని ధ్వంసంచేసి అందులోని నగదును అపహరించారు. బుధవారం తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన భక్తులు చోరీ జరిగిన విషయం గమనించి గ్రామస్తుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయ పరిసరాల్లో గాలించగా కొంతదూరంలో హుండీ ధ్వంసం చేసి ఉంది. మరో డబ్బాలో దాచిన వెండికళ్లు, ఇతర సామగ్రి అలాగే వదిలేసినట్లు గుర్తించారు. అమ్మవారి విగ్రహానికి అంటించి ఉన్న వెండి కళ్లు కూడా అలాగే వదిలేసి కేవలం బంగారం, నగదును మాత్రమే అపహరించారు. రెండు ఆలయాల్లోనూ అదే తీరు.. ఇటీవల సారంగపూర్ మండలం ఆలూరు గ్రామ సమీపంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగలు దేవాలయంలోని హుండీని పగులగొట్టి అందులోంచి నగదును అపహరించారు. అలాగే అమ్మవారికి అలంకరించిన మూడు జతల బంగారు పుస్తెలు (రెండు గ్రాములు), బంగారు బొట్టుబిళ్ల, రెండు గ్రాముల వెండి మెట్టెలు దొంగిలించారు. తాజాగా జరిగిన జామ్ మహాలక్ష్మీ దేవాలయంలోనూ ఇదేరీతిలో చోరీ జరిగింది. చిన్న ఆలయాలే టార్గెట్ గ్రామాలకు దూరంగా ఉన్న చిన్న చిన్న ఆలయాలనే దొంగలు టార్గెట్గా ఎంచుకున్నట్లు ఈ రెండు ఘటనల ద్వారా తెలుస్తోంది. చీకటి పడితే ఆలయాలకు తాళం వేసి పూజారులు ఇళ్లకు వెళ్లిపోతారు. ఆలయ సమీపంలో జనసంచారం ఉండదు. కనుక ఇలాంటి ఆలయాలనే దొంగలు ఎంచుకుని వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిందితులను త్వరలోనేపట్టుకుంటాం గ్రామాలకు దూరంగా ఉన్న చిన్న ఆలయాలనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల పెద్దమ్మతల్లి ఆలయంలోనూ ఇదేవిధంగా చోరీ జరిగింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. గ్రామస్తులు సైతం ఆలయాల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశాం. – చంద్రమోహన్, ఎస్సై, సారంగపూర్ పది రోజుల వ్యవధిలో రెండు దేవాలయాల్లో చోరీ తాజాగా జామ్ మహాలక్ష్మీ ఆలయంలో.. భయాందోళనలో ప్రజలుపనిచేయని నిఘా నేత్రాలు మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన జామ్ గ్రామంలో రెండు వీడీసీలున్నాయి. వీటి ఆధ్వర్యంలో ఐదేళ్ల క్రితం దాదాపు 15 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో అవికాస్తా మూలనపడి అలంకారప్రాయంగా మారాయి. ఒకవేళ సీసీకెమెరాలు పనిచేసి ఉంటే దొంగలు పట్టుబడేవారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఏదేమైనా పది రోజుల వ్యవధిలోనే రెండు ఆలయాల్లో చోరీ జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆలయాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. -
అటు, ఇటైనా.. అదే శ్రేణిలో
సాక్షి,ఆదిలాబాద్: గత పార్లమెంట్ ఎన్నికల్లో విజ యం సాధించిన బీజేపీ.. ఆదిలాబాద్, బోథ్, నిర్మ ల్, ముథోల్ నియోజకవర్గాల్లో ఆధిక్యత సాధించింది. రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. సిర్పూర్, ఆసిఫాబాద్లో, మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ కేవలం ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఆధిక్యత ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం బూత్ ల వారీగా ఎలా ఉంది అనే దానిపై నేతలు అంచనాలు వేస్తున్నారు. ఏజెంట్లు, కార్యకర్తలను పిలిపించి సమీక్షిస్తున్నారు. మార్పు తర్వాత పరిస్థితులు కలిసొచ్చేనా.. నియోజకవర్గాల్లో ముఖ్యనేతల పార్టీ మార్పు తర్వా త ప్రస్తుత పరిస్థితిలో ఆ ఆధిక్యత లభిస్తుందా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి ఆధిక్య త వచ్చిన నియోజకవర్గాల పరంగాగమనిస్తే.. పలు చోట్ల రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్ర ధానంగా నిర్మల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడంతో ఆ ప్రభా వం ఎలా ఉంటుంది.. అలాగే ఇదే నియోజకవర్గంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ శోభా సత్యనారాయణ గౌడ్ దంపతులు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడంతో ఎలా ఉంటుందనేది కూడా చూడాల్సిదే. ఇక ముధోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డిలు కాంగ్రెస్లో చేరారు. ఇక్కడ ఓట్లు ఎలా పడ్డాయనేది కూడా గమనించాల్సిందే. ఇక బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో ఆధిక్యం ఇచ్చిన సిర్పూర్లో మళ్లీ ఆ పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా పరి శీలించాల్సిందే. అక్కడ మాజీ ఎమ్మెల్యే కోనేరు కో నప్ప బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు మారారు. గులా బీ పార్టీకి గత ఎన్నికల్లో ఆధిక్యం ఇచ్చిన మరో ని యోజకవర్గం ఆసిఫాబాద్లో పరిస్థితుల్లో పెద్దగా మార్పులేకపోవడం, మరోపక్క ఆపార్టీ అభ్యర్థి అదే నియోజకవర్గానికి చెందిన వారు కావడం, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ గెలుపొందడం అన్ని అంశాలు కలిసొచ్చేలా ఉన్నా ఆధిక్యాన్ని నిలుపుకుంటుందా లేదా అనేది చూడాల్సిందే. ఇక కాంగ్రెస్కు వస్తే గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం ఖానాపూర్లో ఆధిక్యత చూపించింది. అయితే అప్పుడు పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేశ్ అదే నియోజకవర్గం కావడం గమనార్హం. ప్రస్తుతం ఆ యన బీజేపీలో ఉన్నారు. ఇక ఖానాపూర్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో శాసన సభ ఎన్నికల నాటి పరిస్థితుల మాదిరే ఇప్పుడు కూడా ఉంటాయా లేదా అనేది చూడాల్సిందే.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. మొదట బోథ్, ఆ తర్వాత క్రమంలో ముధోల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, సిర్పూర్ వరుస స్థానాల్లో నిలిచాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. కొంత అటు, ఇటైనప్పటికీ దాదాపు అదే శ్రేణిలో నిలిచాయి. మొదట బోథ్, ఆతర్వాత ఆసిఫాబాద్, ముథోల్, ఖానాపూర్, ఆదిలాబాద్, సిర్పూర్, నిర్మల్ వరుస స్థానాల్లో నిలిచాయి. -
కాంగ్రెస్ శ్రేణుల నిరసన
కై లాస్నగర్: కాంగ్రెస్ మాజీ నాయకులు సుజాత, సంజీవ్రెడ్డిలు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కుమ్మకై ్క పార్టీకి ద్రోహం చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వారి వైఖరిని తప్పుబడుతూ పట్టణంలోని ప్రజాసేవభవన్ వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే శంకర్, గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవరెడ్డి ఫొటోలతో కూడిన దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు సంతోష్రావు మాట్లాడుతూ.. సుజాత, సంజీవ్రెడ్డిలు గత అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ నుంచి బయటకు వెళ్లి రెబెల్గా బరిలోకి దిగారని గుర్తు చేశారు. మరోసారి బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని డబ్బులకు అమ్ముడుపోయి పార్లమెంట్ ఎన్నికల్లోనూ తీరని నష్టం చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని కంది శ్రీనివాసరెడ్డి ప్రస్తావిస్తూ సుజాత తప్పిదాన్ని ఎత్తిచూపారే తప్ప మున్నూరు కాపులను ఎక్కడా దూషించలేదన్నారు. అన్ని కుల సంఘాలపై కంది గౌరవంగా ప్రవర్తిస్తారని, ఈ విషయాన్ని సంఘ సోదరులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ జహీర్ రంజాని, నాయకులు వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు సాయిప్రణయ్, వెంకన్న, పట్టణ అధ్యక్షుడు నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదు’
ఎదులాపురం: రిమ్స్లో పనిచేస్తున్న కార్మికులు, పేషెంట్ కేర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులతో కలిసి బుధవారం రిమ్స్లోని యూని యన్ భవనంలో ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గణపతి లక్ష్మిని మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు డొంగ్రే చందు, రిమ్స్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి ఎండీ ఖాసీం, అధ్యక్షురాలు సంగీత, యూనియన్ నాయకులు సంతోశ్, రాజేందర్ సింగ్, సైఫ్ఖాన్, రాథోడ్ రవీందర్, నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
పేషెంట్కేర్ ఆత్మహత్యాయత్నం
● సూపర్వైజర్ వేధింపులే కారణం ● రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితురాలు ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో పేషెంట్ కేర్గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మి అనే మహిళా కార్మికురాలు బుధవారం తెల ్లవారుజామున గైనిక్వార్డులో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆస్పత్రి అధికారులు అక్కడకు చేరుకుని ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా రిమ్స్లో మహిళా ఉద్యోగులపై వేధింపులు పరిపాటిగా మారాయి. నెల రోజుల క్రితం ఓ స్టాఫ్నర్సును పేషేంట్ కేర్గా పనిచేసే పురుష ఉద్యోగి వేధించిన విషయం తెలిసిందే. అసలేం జరిగిందంటే ... ఆదిలాబాద్ పట్టణం దస్నాపూర్కు చెందిన లక్ష్మి 16 ఏళ్లుగా రిమ్స్లో పారిశుధ్య కార్మికురాలిగా, రెండేళ్లుగా పేషేంట్కేర్గా పనిచేస్తోంది. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి గైనిక్వార్డులో విధుల నిర్వహణకు హాజరైంది. పది గంటల సమయంలో ఛీప్ సూపర్వైజర్గా పనిచేస్తున్న వ్యక్తి విధుల నుంచి వెళ్లిపోవాలని, రేపటి నుంచి డ్యూటికి రావాల్సిన అవసరం లేదని బెదిరింపులకు పాల్పడ్డట్లు బాధితురాలు వాపోయింది. మరో సూపర్వైజర్ గైనిక్వార్డులో పనిచేసే దాయమ్మ అనే మహిళ కూడా కొన్ని రోజులుగా మానసిక వేధింపులకు పాల్పడుతుందని కన్నీరుమున్నీరైంది. తనకు ముగ్గురు పిల్ల లున్నారని, అకారణంగా ఉద్యోగం నుంచి తీసివేస్తే తమ కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అర్దరాత్రి వేళ తాను ఇంటికి ఏ విధంగా వెళ్లాలని తన కుటుంబ సభ్యులు ఏమనుకుంటారనోనని వేదనకు గురై మరుగుదొడ్డిలో ఉన్న ఫినాయిలు తాగింది. నోటి నుంచి నురగ రావడంతో స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం అక్కడి నుంచి తరలించారు. విచారణ కమిటీ నియామకం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ స్పందించి సూపర్వైజర్ రవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర విచారణ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లుగా వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎదులాపురం: రిమ్స్లో పేషెంట్ కేర్గా పనిచేస్తున్న గణపతి లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి కారకులపై చ ర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జి ల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శులు నవీన్ కుమార్, అగ్గిమల్ల స్వామి, రిమ్స్ నాయకులు పెర్క దేవిదాస్, అక్రమ్ ఖాన్, సుభాష్, దశాంత్ రమేశ్, శేఖర్, ఖలీల్, సుమన్ తాయి, రాణి, అనసూయ, రిమ్స్ కార్మికులు పాల్గొన్నారు. -
No Headline
అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితిపై పార్టీల అంచనాలు పోలింగ్ సరళిపై బూత్ల వారీగా ఆరా అంచనాల్లో నేతలు బిజీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రస్తుతం, గతంలో నమోదైన పోలింగ్ శాతం వివరాలు నియోజకవర్గం 2024 2019 సిర్పూర్ 71.56 69.55 ఆసిఫాబాద్ 75.49 73.96 ఖానాపూర్ 72.20 71.20 ఆదిలాబాద్ 73.89 70.31 బోథ్ 78.16 76.09 నిర్మల్ 71.68 66.76 ముధోల్ 75.63 72.99
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement