-
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు.. ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ. సెల్ : 95055 14424 ఫీజు : రూ.3 వేలు -
మరో 22 డివిజన్లు!
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల సంఖ్య పెరుగనుంది. 66 నుంచి 88కు చేరనుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా బల్దియా అధికారులు డివిజన్ల పునర్విభజనకు ప్రతిపాదనలపై సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత గ్రేటర్ వరంగల్ పాలకవర్గానికి సుమారు రెండేళ్ల గడువు ఉంది. ఎన్నికలకు 6 నెలల ముందు అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి డివిజన్ల మధ్య జనాభా సంఖ్యలో వ్యత్యాసం 10 శాతం మాత్రమే ఉండాలి. కానీ, 2021 మార్చిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో అధికారులు తలొగ్గారనే అప్పట్లో విమర్శలు వచ్చాయి. కొన్ని డివిజన్లలో జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోవడం, మరికొన్ని డివిజన్లలో భారీస్థాయిలో జనాభా వృద్ధి పెరిగింది. ఈ పరిస్థితిని వివరిస్తూ అప్పట్లోనే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రముఖులు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేరాయి. దీంతో పునర్విభజన అనివార్యమైంది. కానీ, 2021 ఏప్రిల్లో ఎన్నికల తంతు ముగించేశారు. జనాభా వ్యత్యాసాన్ని సమీక్షిస్తూ కొత్త డివిజన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 66 నుంచి 88 డివిజన్ల పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని అధికారులు తెలిపారు. 1951లో మేజర్ మున్సిపాలిటీ.. ఫసిలి హైదరాబాద్ లోకల్ సెస్ 1309 చట్టం ప్రకారం 1899 సంవత్సరంలో వరంగల్ పట్టణంగా రూపుదిద్దుకుని 1929 నుంచి స్వతంత్రంగా పనిచేయడం ఆరంభించింది. 1959లో మేజర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 1951 హైదరాబాద్ మున్సిపాలిటీల చట్టం ప్రకారం మొదటిసారి వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. 1959 జూలైలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా, 1960 జూలైలో తిరిగి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ శ్రేణికి చేరింది. హైదరాబాద్ మున్సిపాలిటీ చట్టం ప్రకారం 1961లో నగర విస్తీర్ణం 61.69 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. 1965 ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం నగరంలో అమలులో ఉండేది. 1979లో మున్సిపాలిటీల పరిధిని 110 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. జీఓ ఎంఎస్ నంబర్ 450 ఎంఏ ప్రకారం 18–08–1994లో వరంగల్ సెలక్షన్ గ్రేడ్ శ్రేణి నుంచి నగర పాలక సంస్థగా ఏర్పాటైంది. అప్పడు డివిజన్ల సంఖ్య 50కి పెరిగింది. 2001 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటూ అప్పటి ప్రభుత్వం 2005 ఏప్రిల్ 28న డివిజన్ల పునర్విభజన చేసింది. పెరిగిన జనాభా ప్రకారం 50 నుంచి 53 డివిజన్లకు పెరిగాయి. 2013 మార్చి 16న ట్రైసిటీలోకి శివారులోని 42 గ్రామాలను విలీనం చేశారు. 110 చదరపు కిలోమీటర్లు ఉన్న నగరం కాస్త 407.7 కిలోమీటర్లకు విస్తరించింది. జనాభా కూడా 8,19,441కి చేరింది. 2015 జనవరిలో గ్రేటర్ వరంగల్ హోదా కల్పించారు. అదేసంవత్సరం జూన్ 16న అప్పటి ప్రభుత్వం 53 డివిజన్ల నుంచి 58కి పెంచింది. 2021 మార్చి 7న 58 డివిజన్ల నుంచి 66 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6కు చేరనున్న సర్కిళ్ల సంఖ్య.. మహా నగరపాలక సంస్థ పాలన స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు గ్రేటర్ వరంగల్ తాజాగా డివిజన్ల పునర్విభజనపై దృష్టిసారించింది. సర్కిళ్ల సంఖ్య ప్రస్తుతం రెండుగా ఉంది. గతంలో ప్రభుత్వం 4 సర్కిళ్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. తాజా డివిజన్ల పునర్విభజనతో సర్కిళ్ల సంఖ్య 6కు చేరే అవకాశాలు ఉంటాయని సీనియర్ అధికారులు భావిస్తున్నారు. డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన వెంటనే అధికారులు రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. పెరిగిన జనాభా.. బల్దియా పరిధిలో 66 డివిజన్ల జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ట్రైసిటీతోపాటు 42 విలీన గ్రామాల్లో జనాభా వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. గ్రామాల నుంచి నగరానికి వలసల సంఖ్య ఎక్కువైంది. ప్రస్తుతం జనాభా 12.40 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి డివిజన్లో 14 వేలకు పైచిలుకు జనాభా ఉంటుందని, అందువల్ల డివిజన్ల సంఖ్య 88కి పెంపు అనివార్యమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.గ్రేటర్ పరిధిలో 66 నుంచి 88కి పెరగనున్న సంఖ్య ప్రతిపాదనలకు సన్నాహాలు చేస్తున్న అధికారులు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన తర్వాతే పునర్విభజన 2011 సంవత్సరం జనాభా లెక్కలే ప్రామాణికం -
హామీల అమలుపై నోరువిప్పని ఎమ్మెల్యే ‘దొంతి’
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఖానాపురం: దొంగ హామీలతో గెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎందుకు నోరు విప్పడంలేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా దొడ్డు రకంతో పాటు ఇతర పంటలకు రూ.500 బోనస్ చెల్లించా లని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో గురువా రం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్మార్కెట్ యార్డు వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడారు. ఎన్నికల తర్వాత మాటమారుస్తున్న కాంగ్రెస్కు బుద్దిచెప్పాలన్నారు. ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే మాధవరెడ్డి ఎన్నికలు ముగిసాక నోరువిప్పకపోవడం దుర్మార్గమన్నారు. బోనస్ ఇవ్వకుంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిరసనలు తప్పవన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ ప్రకాశ్రావు, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, వెంకటనర్సయ్య, శ్రీనివాస్గౌడ్, అశోక్, ప్రసాద్, అశోక్, వెంకన్న, శ్రీనివాస్గుప్త, యువరాజు పాల్గొన్నారు. -
భూగర్భ జలాలు పెంపొందించుకోవాలి
వర్ధన్నపేట: భూగర్భజలాల పెంపొందించుకోవడానికి ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకుని నీటిని పొదుపు చేసుకోవాలని సెంట్రల్ వాటర్ బోర్డు సైంటిస్ట్ ఎంఎస్ గౌతమ్ అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో ఉపాధి హామీ పనులు, భూగర్భ జలాల పెంపుకోసం చేపట్టిన ఫాం పాండ్స్ తదితర పనులను గురువారం సెంట్రల్ వాటర్ బోర్డు సభ్యుల బృందం మండలంలోని పరిశీలించింది. ఈ సందర్భంగా బృందం ప్రతినిధి ఎంఎస్ గౌతమ్ గ్రామైక్య సంఘాల మహిళతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. భూగర్భ జలాలు పెంపొందించుకుని నీటిని పొదు పు చేయడం ద్వారా భూగర్భ జలాలు అడుగంట కుండా ఉంటాయన్నారు. దక్షిణ భారతదేశంలో 7 గ్రామాలు జాతీయ స్థాయి వాటర్ అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులను సందర్శించి నీటి సంరక్షణ, వినియోగం ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఉపాధి హామీ పనులపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ప్రతినిధి గౌతమ్తోపాటు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ బృందం వెంట డీఆర్డీఓ కౌసల్యదేవి, ఎంపీడీఓ వెంకటరమణ, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీఓ ధనలక్శ్మి, ఈజీ ఎస్ విభాగం అధికారులు రమేశ్, సురేశ్, నాగరాజు , సుధాకర్, సెర్ప సిబ్బంది వేణు, గోలి కొమురయ్య, ఎఫ్ఏ రేణుక, వీఓల ప్రతినిధులు అనూష, భాను, శ్రావణి, రజిత, స్వప్న, వీఓఎలు శోభ, స్రవంతి, పద్మావతి, రమ పాల్గొన్నారు. సెంట్రల్ వాటర్ బోర్డు సైంటిస్ట్ గౌతమ్ -
ఎస్డీఎల్సీఈ ఏడీగా గోపీనాఽథ్
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలోని ఎస్డీఎల్సీఈ సైన్స్కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా యూనివర్సిటీలోని మైక్రోబయాలజీ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.వెంకటగోపీనాఽథ్ను నియమిస్తూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు గురువారం కేయూ వీసీ రమేశ్ ఉత్తర్వులు అందజేశారు. ఇప్పటివరకు సైన్స్కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న బాటనీ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.కరుణాకర్ నుంచి ఈనెల 17న గోపీనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
మండల సర్వసభ్య సమావేశం బహిష్కరణ
నల్లబెల్లి: ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హమీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మండల పరిషత్ సర్వసభ్య స మావేశాన్ని సభ్యులు బహిష్కరించారు. ఎంపీపీ ఊ డుగుల సునిత అధ్యక్షతన సమావేశం నిర్వహించేందుకు ఎంపీడీఓ నర్సింహమూర్తి ప్రయత్నిస్తుండగా ఎంపీటీసీ సభ్యులతోపాటు జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అడ్డుకున్నారు. గత మండల సభ తీర్మానాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సమావేశం నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కాగా, సమావేశానికి హాజరైనట్లు సంతకాలు చేయాలని ఎంపీడీఓ కోరినప్పటికీ నిరాకరించి, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరస న వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సునిత, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతును మోసం చేస్తుందని మండిపడ్డారు. వైస్ ఎంపీపీ గందె శ్రీలత, ఎంపీటీసీలు బోళ్ల శ్రీలత , జయరావు, రవీందర్రావు, దేవునాయక్, విజయ , అజ్మీర లక్ష్మి, నజీమా బేగం ఉన్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ. సెల్ : 9505514424 ఫీజు : రూ.3 వేలు -
అమ్మవారికి గంధోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వరంగల్లోని శ్రీభద్రకాళి దేవాలయంలో బుధవారం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని గజమాలలతో అలంకరించిన అనంత రం ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారి స్వపనమూర్తికి గంధం పట్టించి ప్రత్యేకపూజలు చేశారు. ఉత్సవమూర్తిని సాలభంజికవాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి జిల్లా కుమ్మరి సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవునూరి రాంమూర్తి ప్రజాపతి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రుద్రారపు కుమారస్వామిప్రజాపతి, కడారి ఓంప్రకాశ్, తౌటి దేవేందర్, వడ్లూరి విష్ణు, ఆకారపు రాజగోపాల్, ఉర్సు కుల సంఘం నాయకులు నాగరాజు, శ్రీనివా స్. సత్యం, కుమారస్వామి పాల్గొన్నారు. -
గేట్ పడితే అంతే సంగతి!
కమలాపూర్: అది హుజూరాబాద్–పరకాల ప్రధాన రహదారి. నిత్యం వాహనాల రాకపోకలతో ఈ మార్గం రద్దీగా ఉంటుంది. రైల్వే గేట్ పడితే చాలు అది ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు. ఒకసారి అరగంటలో తెరుచుకుంటే మరోసారి గంట, గంటన్నర సమయం పట్టవచ్చు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. 2018లో ఇక్కడి రైల్వే గేట్పై అధికారులు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు. ఆరేళ్లుగా పనులు నత్తనడకన కొనసా..గుతూనే ఉన్నాయి. అదే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే గేట్. ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే రైలు మార్గం.. ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే రైలు మార్గంలో ఉప్పల్ రైల్వే స్టేషన్ ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే ప్రధాన రైలు మార్గం కావడంతో నిత్యం అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడి రైల్వే స్టేషన్ నుంచి హనుమకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పలు గ్రామాలకు నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఇటు రైలు మార్గం, అటు రోడ్డు మార్గం ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. రైల్వే శాఖకు ఇక్కడి నుంచి ఆదాయం కూడా బాగానే సమకూరుతోంది. అయినా ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరేళ్లయినా అంతే.. ఉప్పల్లో రైల్వే గేట్ కారణంగా హుజూరాబాద్–పరకాల మార్గంలో ప్రయాణికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులు తొలగించడానికి 2018లో రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేశారు. ఆరేళ్లుగా అసంపూర్తిగా దర్శనమిస్తున్న ఆర్వోబీ వెక్కిరిస్తోంది. సంబంధిత కాంట్రాక్టర్ పనులు నత్తనడకన చేస్తుండడంతో ఇప్పటివరకూ నిర్మాణం పూర్తికాలేదు. రైల్వే ట్రాక్కు ఇరువైపులా బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. ట్రాక్పై నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 15, 20 నిమిషాలకు ఒకసారి పడుతున్న రైల్వే గేట్.. రైళ్ల రాకపోకలు పెరిగిన కారణంగా ప్రతి 15, 20 నిమిషాలకు ఒకసారి గేట్ పడుతోంది. మళ్లీ తెరుచుకోవడానికి సుమారు అరగంట, గంట, గంటన్నర సమయం పడుతుంది. ఒక్కోసారి రెండు, మూడు, నాలుగు, ఐదు రైళ్లు వెళ్లేదాకా గేట్ తీయకపోవడంతో ప్రయాణికులు గంటన్నర దాక అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు సమయం వృథా అయి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రైల్వే శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్వోబీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి తమకు రైల్వే గేట్ కష్టాలు తొలగించాలని వారు కోరుతున్నారు.ప్రయాణికులకు గంటల తరబడి తప్పని నిరీక్షణ ఉప్పల్లో ఆరేళ్లుగా కొనసా..గుతున్న ఆర్వోబీ నిర్మాణం పనులు త్వరగా పూర్తిచేయాలని వాహనదారుల విజ్ఞప్తి -
ఫిర్యాదు చేస్తే మిల్లర్లపై చర్యలు
● అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ఖానాపురం: ధాన్యం కొనుగోళ్లలో 1010 రకాన్ని కామన్ గ్రేడ్ కింద తీసుకునే మిల్లర్లపై రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. ఈ మేరకు మండలంలోని బుధరావుపేట, ఖానాపురం, ఐనపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్, డీసీఓ, డీసీఎస్ఓ, సివిల్ సప్లయీస్ డీఎంలు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, వివరాలు సేకరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. 1010 గ్రేడ్ ఏ రకంపై మిల్లర్లు, వ్యవసాయ అధికారులతో సమీక్షిస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే మిల్లర్లకు సూచనలు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్ల సమయంలో తరుగు తీయొద్దని హెచ్చరించారు. ధాన్యం గ్రేడింగ్ విషయంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ప్యాడి క్లీనర్లో శుభ్రం చేసి తాలు లేకుండా పంపాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీల సమస్య లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో డీసీఓ సంజీవరెడ్డి, డీసీఎస్ఓ శివప్రసాద్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి, సివిల్ సప్లయీస్ టెక్నికల్ మేనేజర్ రాజయ్య, సీఈఓ ఆంజనేయులు, సివిల్ సప్లయీస్ డీటీ స్వప్న, మేరుగు రాజు, వినయ్, తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట రైల్వే ఆస్పత్రి తనిఖీ
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ఆస్పత్రిని సికింద్రాబాద్ రైల్వే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణస్వామి బుధవారం తనిఖీ చేశా రు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను కలియ తిరిగి పరిశీలించారు. స్థానిక రైల్వే సీనియర్ డీఎంఓ డాక్టర్ నిరంజన్రావు, ఇతర డాక్టర్లతో మాట్లాడారు. అంతకు ముందు రైల్వే డాక్టర్లు, రైల్వే నాయకులకు సీఎంఎస్ నారాయణస్వామికి స్వాగతం పలికి సన్మానించారు. రైల్వే జేఏసీ, రైల్వే మజ్దూర్ యూని యన్ నాయకులు ఆస్పత్రి సమస్యలపై సీఎంఎస్కు వినతి పత్రం అందజేశారు. -
జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలి
వర్ధన్నపేట: మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల ప్రగతిలో మండలానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని డీఆర్డీఓ కౌసల్యదేవి అన్నారు. బుధవారం మండలంలోని ఇల్లంద గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈజీఎస్ సెర్ప్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నేడు(గురువారం) కేంద్ర బృందం సందర్శనను పురస్కరించుకుని సరైన ప్రణాళికలు రూపొందించి ఎలాంటి సందేహాలకు తావు లేకుండా పూర్తి స్థాయి నివేదికలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. సెర్ప్ ఉద్యోగుల సమన్వయంతోపాటు వారి సహకారంతో ఉపాధి హామీ పనుల ప్రగతిని జాతీయ స్థాయిలో చాటి చెప్పి తగిన గుర్తింపు పొందేందుకు కృషి చేయాలన్నారు. ఇల్లంద సిబ్బంది సేవలను మెచ్చుకున్నారు. ఈసందర్భంగా సెర్ఫ్ సిబ్బంది కౌసల్యదేవిని శాలువాతో సన్మానించారు. సమావేశంలో ఎంపీడీఓ వెంకటరమణ, ఎంపీఓ ధనలక్ష్మి, ఏపీఓ నాగేశ్వర్రావు, ఏపీఎం వేణు, సీసీలు గోలి కొమురయ్య, రమేష్, సురేష్, వీఓ ప్రతినిధులు తూల్ల శ్రావణి, స్వప్న, రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ రేణుక, వీఓఏలు కత్తి స్రవంతి, తక్కళ్లపెల్లి పద్మావతి, ఆకుల స్రవంతి, కారోబార్ రాజు, చోటేమియా పాల్గొన్నారు.డీఆర్డీఓ కౌసల్యదేవి -
అమ్మవారికి గంధోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళీభద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వరంగల్లోని శ్రీభద్రకాళి దేవాలయంలో బుధవారం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని గజపూమాలలతో అలంకరించిన అనంత రం ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారి స్వపనమూర్తికి గంధం పట్టించి ప్రత్యేకపూజలు చేశారు. ఉత్సవమూర్తిని సాలభంజికవాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి జిల్లా కుమ్మరి సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవునూరి రాంమూర్తి ప్రజాపతి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రుద్రారపు కుమారస్వామిప్రజాపతి, కడారి ఓంప్రకాష్, తౌటి దేవేందర్, వడ్లూరి విష్ణు, ఆకారపు రాజగోపాల్, ఉర్సు కుల సంఘం నాయకులు నాగరాజు, శ్రీనివా స్. సత్యం, కుమారస్వామి పాల్గొన్నారు. -
No Headline
కాళోజీ సెంటర్: సర్కారు బడిలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్కు దీటుగా వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన, గుణాత్మక విద్య అందించేందకు చర్యలు చేపట్టింది. పాఠశాల పునఃప్రాంభం రోజున విద్యార్థుల చేతుల్లో పాఠ్యపుస్తకాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు జిల్లాలో ఉన్న 757పాఠశాలల్లో 43,865మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. అయితే జిల్లాలోని విద్యార్థులకు 3,50,163 పాఠ్యపుస్తకాలు అవసరం ఉందని జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కాగా, బుధవారం నాటికి జిల్లాకు 1,04,120 పుస్తకాలు చేరుకున్నాయి. మొత్తం టైటిల్స్లో జిల్లాకు 187టైటిల్స్ కేటాయించగా.. ఇప్పటి వరకు 65టైటిల్స్ చేరుకోగా 122 టైటిల్స్ ఇంకా రావాల్సి ఉంది. రోజు వారీగా పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. -
కాజీపేట రైల్వే ఆస్పత్రి తనిఖీ
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ఆస్పత్రిని సికింద్రాబాద్ రైల్వే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణస్వామి బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను కలియ తిరిగి పరిశీలించారు. స్థానిక రైల్వే సీనియర్ డీఎంఓ డాక్టర్ నిరంజన్రావు, ఇతర డాక్టర్లతో మాట్లాడారు. అంతకు ముందు రైల్వే డాక్టర్లు, రైల్వే నాయకులకు సీఎంఎస్ నారాయణస్వామికి స్వాగతం పలికి సన్మానించారు. రైల్వే జేఏసీ, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు ఆస్పత్రి సమస్యలపై సీఎంఎస్కు వినతి తప్రం అందజేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు
కాళోజీ సెంటర్/హన్మకొండ అర్బన్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవా రం రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈఓ లోకేష్కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు, నిర్వహణపై ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లా ల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జిల్లాలో అమసరమైన పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్న ట్లు పేర్కొన్నారు. జంబో బాక్సులు, పెద్ద బాక్సులు రెడీగా ఉన్నాయని వివరించారు. -
పుస్తకాలు వచ్చేశాయ్
జిల్లాలో పాఠశాలల వివరాలు..ప్రాథమిక పాఠశాలలు 489ప్రాథమికోన్నత పాఠశాలలు 87హైస్కూల్స్ 181విద్యార్థుల వివరాలు.. 1వ తరగతి 3,282 2వ తరగతి 3,067 3వ తరగతి 3,358 4వ తరగతి 2,076 5వ తరగతి 4,314 6వ తరగతి 5,179 7వ తరగతి 5,429 8వ తరగతి 5,674 9వ తరగతి 5,364 10వ తరగతి 5,422 కేజీబీవీ, మోడల్, గురుకులం 700 మొత్తం 43,865 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ ● జిల్లాకు కావాల్సిన పుస్తకాలు 3,50,163 ● ప్రస్తుతం వచ్చినవి 1,04,120 -
గొర్రెల పథకం లేనట్టేనా..?
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు మర్రి వంశీ. గీసుకొండ మండలం మచ్చాపురం నివాసి. ఇతడు సబ్సిడీ గొర్రెల యూనిట్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో తన వాటా సొమ్ము కింద బ్యాంకు ద్వారా కలెక్టర్ ఖాతాకు రూ.43,750 చెల్లించాడు. ఇటీవల అతడిని పశువైద్యాధికారులు వాటా సొమ్ము వాపస్ తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వాటా సొమ్ము చెల్లించిన లబ్ధిదారులందరి పరిస్థితి ఇదే.. గీసుకొండ: గొల్లకురుమల అభివృద్ధే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమానికి గ్రహణం పట్టింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిధుల లేమి కారణంగా పథకానికి పూర్తిగా మంగళం పాడినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2017లో లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఏ, బీ లిస్టులుగా ఎంపిక చేశారు. తొలి జాబితా (ఏ)లో ఉన్న వారికి సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీ జాబితా యూనిట్ల పంపిణీ విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. దీని కోసం లబ్ధిదారులు ఏళ్లుగా ఎదురు చూశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఆయా నియోజకవర్గాల్లో యూనిట్ల పంపిణీ మినహా మిగతా ప్రాంతాల్లో పంపిణీ జరగలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ సర్కారు బీ జాబితాలోని వారిలో కొందరికి యూనిట్ల పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు హడావిడి చేసింది. ఆ తర్వాత యూనిట్ ధర పెరగటంతో తమకు భారంగా ఉందని కొందరు లబ్ధిదారులు తమ వాటా చెల్లించడానికి ముందుకు రాలేదు. కొందరు వాటా సొమ్ము చెల్లించినా యూనిట్లు పంపిణీ కాలేదు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ ప్రక్రియను పూర్తిగా నిలిపివేశారు. ఎన్నికల తర్వాత యూనిట్ల పంపిణీ చేపట్టకపోగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారులకు వారు చెల్లించిన వాటా సొమ్ము తిరిగి ఇచ్చేందుకు మండలాల్లో పశువైద్యాధికారులు చర్యలు చేపట్టారు. లబ్ధిదారుల నుంచి వారి బ్యాంకు అకౌంట్లు, చెల్లించిన వాటా సొమ్ము రశీదుల వివరాలు తీసుకుని కలెక్టర్కు సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో గొర్రెల పంపిణీ ఇలా.. జిల్లాలో మొదటి విడతలో 13,235 మంది లబ్ధిదా రులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి దాదాపు అందరికీ పంపిణీ చేశారు. రెండో విడత(బీ జాబితా) కింద 13,171 మందికి పంపిణీ చేయాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరిగింది. ఒక్కో యూనిట్ కింద 20గొర్రెలు, పొట్టేలును లబ్ధిదారులకు అందిస్తారు. ఒక్కో యూనిట్ ధర రూ.1.75లక్షలు కాగా లబ్ధిదా రుడి వాటా రూ.43,750 చెల్లించాల్సి ఉంటుంది. కాగా గొర్రెలకు బదులుగా నగదు పంపిణీ చేయాలంటూ కొన్ని రోజుల పాటు గొర్రెల పెంపందార్ల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. లబ్ధిదారులకు వాటాసొమ్ము తిరిగి ఇచ్చేందుకు చర్యలు వాటాధనం పొందేందుకు గొల్లకురుమల దరఖాస్తుదరఖాస్తు చేసుకోవాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అప్పటికే బీ జాబితాలోని సుమారు 510 మంది తమ వాటా సొమ్ము ప్రభుత్వానికి జమ చేశారు. వాటా సొమ్ము తిరిగి పొందటానికి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని పశువైద్యాధికారులు మండలాల వారీగా కోరుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 110మంది దరఖాస్తు చేసుకోగా వారికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ నంబర్, కలెక్టర్ అకౌంటుకు చెల్లించిన వాటా సొమ్ము రశీదు వివరాలను మండలాల్లోని పశువైద్యాధికారులు సేకరించి కలెక్టర్కు సమర్పించారు. ప్రతీ లబ్ధిదారుడికి వారు చెల్లించిన రూ.43,750వాటా సొమ్మును తిరిగి బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు కలెక్టర్ ద్వారా పశువెద్యాధికారులు చర్యలు చేపడుతున్నారు. వాటా సొమ్మును తిరిగి చెల్లించే ఏర్పాట్లు జరుగుతుండటంతో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం ఇక ఉండదని అనధికారికంగా అధికారులే చెబుతున్నారనే చర్చ జరుగుతోంది. -
బుధవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2024
– 8లోuవరంగల్ ఎంపీ స్థానంలో.. లోక్సభ పరిధిలో ఏడు సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతం చూస్తే పట్టణ ప్రాంతాలున్న నియోజకవర్గాల్లో తగ్గింది. గ్రామీణ ప్రాంతాలున్న సెగ్మెంట్లలో ఓటింగ్ పెరిగింది. స్టేషన్ఘన్పూర్ (ఎస్సీ) నియోజకవర్గంలో అత్యధికంగా 78.77శాతం పోలవగా, అత్యల్పంగా వరంగల్ పశ్చిమలో 52.68శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పరకాల సెగ్మెంట్లో 76.86 శాతం, వర్ధన్నపేట (ఎస్సీ)లో 72.24శాతం, పాలకుర్తిలో 71.43 శాతం, భూపాలపల్లిలో 67.71శాతం, వరంగల్ తూర్పు సెగ్మెంట్లో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి జరిగిన పోలింగ్ను పరిశీలిస్తే పట్టణాల్లో ఉండే వారికంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లే తమ ఓటుహక్కును ఎక్కువగా వినియోగిం చుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తం ఓట్లు 18,24,466 పోలైన ఓట్లు 12,56,301సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ లోక్సభ ఎన్నికల పోలింగ్పై పోస్టుమార్టం జరుగుతోంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్శాతం పెంచేందుకు విస్తృతంగా చర్యలు చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులు కూడా సమీక్ష చేస్తున్నారు. మరోవైపు పోలింగ్శాతం ఎక్కడ పెరిగింది? ఎక్కడ తగ్గింది? ఎవరికి లాభం, ఎవరి నష్టం? అన్న లెక్కల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నిమగ్నమయ్యాయి. వరంగల్ పార్లమెట్ పరిధి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సమయం దాటినా క్యూ లైన్లలో ఉన్నవారిని అనుమతించి రాత్రి వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 18,24,466 ఓటర్లకు 12,56,301 (68.86శాతం) మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు వరంగల్ లోక్సభ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పేరిట మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈసారి మహిళలదే ఆధిక్యం.. ఆసక్తి చూపని థర్డ్జెండర్స్.. 2009 నుంచి 2019 వరకు వరుసగా మూడు పర్యాయాలు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా ఓటుహక్కును వినియోగించుకున్న మహిళలు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారే ముందంజలో ఉన్నారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపును ‘ఆమె’నే శాసించింది. వరంగల్ పార్లమెంట్ పరిధి ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో 6,91,902 మంది పురుషులు, 7,01,862 మంది మహిళలు ఓటేయగా.. పురుషుల కంటే 9,960 మంది మహిళలు ఎక్కువగా ఓటెత్తారు. సోమవారం జరిగిన వరంగల్ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 12,56,301 మంది ఓటేయగా... అందులో 6,26,704 మంది పురుషులు, 6,29,512 మంది మహిళలు ఉన్నారు. పురుషులకన్నా 2,808 మంది మహిళలు అధికంగా ఓటేశారు. ఇదిలా ఉంటే వరంగల్ లోక్సభ పరిధిలో థర్డ్జెండర్ల ఓట్లు 397 ఉండగా 85 మంది ఓటేశారు. దీంతో లోక్సభ ఓటింగ్పై ఆసక్తి చూపినట్లుగా కనిపించలేదు. పోలింగ్శాతంపై పోస్టుమార్టం... గెలుపుపై మూడు పార్టీల ధీమా... వరంగల్ లోక్సభ ఎన్నికలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు.. పోలింగ్ ముగిసే వరకు అనేక పరిణామాలు చోటుచేసుకోగా.. మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్ పార్లమెంట్కు పోటీ చేసిన అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ (బీజేపీ), డాక్టర్ కడియం కావ్య (కాంగ్రెస్), డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ (బీఆర్ఎస్) ఎంపీగా మొదటిసారి పోటీ చేశారు. ఆయా పార్టీల అగ్రనేతలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో కలిసి అభ్యర్థులు విస్తృతంగా ప్రచా రం చేశారు. సోమవారం పోలింగ్ ముగియగా.. మంగళవారం వెలువడిన పోలింగ్ శాతం, పోలైన ఓట్లపై పోస్టుమార్టం మొదలెట్టారు. లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ఎక్కడ పెరిగింది.. ఎక్కడ తగ్గింది అన్న కోణంలో నియోజకవర్గాల ఇన్చార్జ్లు, ముఖ్య నేతలతో కలిసి మూడు పార్టీల అభ్యర్థులు, ముఖ్య నేతలు లెక్కల్లో పడ్డారు. అభ్యర్థులు ఎవరికి వారుగా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడితేనే ఈ సస్పెన్స్కు తెరపడుతుంది. న్యూస్రీల్అర్బన్లో తగ్గిన పోలింగ్... రూరల్ సెగ్మెంట్లలో ఫరవాలేదు..పోలింగ్ శాతం 68.86 -
No Headline
(మొత్తం ఓటర్లు) (పోలైన ఓట్లు) అసెంబ్లీ సెగ్మెంట్ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం శాతం స్టేషన్ఘన్పూర్ 1,25,210 1,28,898 02 2,54,110 1,00,819 99,337 02 2,00,158 78.77 పాలకుర్తి 1,26,411 1,29,090 13 2,55,514 91,683 90824 08 182515 71.43 పరకాల 108076 114305 02 2,22,383 84,528 86,387 01 1,70,916 76.86 వరంగల్ పశ్చిమ 1,39,322 1,44,108 16 2,83,446 74,819 74,498 03 1,49,320 52.68 వరంగల్ తూర్పు 1,25,638 1,32,518 339 2,58,495 83,105 85,066 63 1,68,234 65.08 వర్ధన్నపేట 1,34,257 1,39,491 18 2,73,766 98,653 99,108 02 1,97,763 72.24 భూపాలపల్లి 1,36,507 1,40,238 07 2,76,752 93,097 94,292 06 1,87,395 67.71 మొత్తం 8,95,421 9,38,648 397 18,24466 6,26,704 6,29,512 85 12,56,301 68.86 -
అకాల వర్షం.. అపార నష్టం
నల్లబెల్లి/నర్సంపేట రూరల్: జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు ఇళ్ల రేకులు కొట్టుకు పోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నల్లబెల్లి మండలంలోని మేడపల్లి, రాంపూర్, ఆసరవెల్లి, గొల్లపల్లి, గోవిందాపూర్, గుండ్లపహాడ్, నల్లబెల్లి తదితర గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. ఆయా గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. మామిడికాయలు రాలిపోయాయి. వరి పంటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో భూషబోయిన తిరుపతి ఇంటి రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆసమయంలో ఇంట్లో ఉన్న తిరుపతిపై పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే గ్రామ పంచాయతీ శివారులోని బుచ్చినాయక్తండాకు చెందిన అజ్మీరా రవి ఇంటి పైకప్పు గాలివానకు కొట్టుకుపోయింది. అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని పలు గ్రామాల బాధితులు కోరుతున్నారు. -
కొనుగోళ్లలో కొర్రీలు పెడితే చర్యలు
ఖానాపురం: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు కొర్రీలు పెడితే బ్లాక్లిస్ట్లో పెట్టాల్సి వస్తుందని డీసీఓ సంజీవరెడ్డి, డీసీఎస్ఓ శివప్రసాద్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి హెచ్చరించారు. బుధరావుపేటలో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని మంగళవారం వారు పరిశీలించారు. పద్మావతి ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో చేపడుతున్న కొనుగోళ్లను అడిగి తెలుసుకున్నారు. 1010– ఏ గ్రేడ్లో కొనుగోలు చేసి మిల్లుకు పంపిన తర్వాత మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు, సెంటర్ నిర్వాహకులు అధితకారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే ధాన్యాన్ని పరిశీలించి ఏ–గ్రేడ్ వర్తిస్తుందని రైతులకు తెలిపారు. అనంతరం ఖానాపురం శివారులోని శ్రీనివాస రైస్మిల్లులో దిగుమతులను తనిఖీ చేసి 1010 రకం ధాన్యాన్ని పరిశీలించారు. ఏ గ్రేడ్ వర్తిస్తుందా కామన్ కిందకు వస్తుందా అనే విషయాన్ని మిషన్ ద్వారా గుర్తించారు. బియ్యం శాతం బాగా రావడంతో ఏ–గ్రేడ్ కింద కొనుగోలు చేయాలని మిల్లు యజమానులకు సూచించారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో 188 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 30,489 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన రూ.67 కోట్లకు ఇప్పటి వరకు 47 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ అయ్యాయని, మరో రూ.10 కోట్లు ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కీరునాయక్, సివిల్ సప్లయీస్ టెక్నికల్ మేనేజర్ రాజయ్య, డీటీ స్వప్న, పీఏసీఎస్ సీఈఓ ఆంజనేయులు, సిబ్బంది రాజు, కొంరయ్య, వినయ్, సెంటర్ నిర్వహకులు చెడిపాక ఉపేందర్, గిరగాని నర్సయ్య, అధికారులు, రైతులు, కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. డీసీఓ సంజీవరెడ్డి, డీసీఎస్ఓ శివప్రసాద్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి బుధరావుపేటలో ఆరబెట్టిన ధాన్యం పరిశీలన -
ఖానాపురంలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం
జిల్లాలో అత్యధికంగా ఖానాపురం మండలం మంగళవారిపేటలో 104 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా రాయపర్తిలో 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుగ్గొండిలో 50.3 మిల్లీ మీటర్లు, వరంగల్ ఉర్సులో 61.3, పర్వతగిరి మండలం కల్లెడలో 25.3, గీసుకొండ మండలం గొర్రెకుంటలో 87, ఖానాపురం మండలం మంగళవారిపేటలో 104, రాయపర్తిలో 11, పర్వతగిరి మండలం ఏనుగల్లులో 11, నల్లబెల్లిలో 31.8, చెన్నారావుపేటలో 75, సంగెంలో 18.5, సంగెం కాపులకనపర్తిలో 68.3, గీసుకొండలో 59.3, నల్లబెల్లి మండలం మేడపల్లిలో 10.5, నెక్కొండలో 32, వరంగల్ కాశిబుగ్గలో 62.3, వరంగల్ పైడిపల్లి (ఎఆర్ఎస్)లో 83.5, నెక్కొండ మండలం రెడ్లవాడలలో 30, వర్ధన్నపేటలో 14.8, నర్సంపేట లక్నేపల్లిలో 22.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
వర్షంతో ఎన్పీడీసీఎల్కు నష్టం
● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: ఈదురు గాలులు, భారీ వర్షం టీఎస్ ఎన్పీడీసీఎల్కు భారీ నష్టాన్ని చేకూర్చింది. ఆదివారం రాత్రి హనుమకొండ, వరంగల్ జిల్లాలో ఈదురుగాలులు వీచడంతో పాటు భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు వృక్షాలు కూలడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ లైన్లు తెగిపడి సరఫరాలో ఆటంకం ఏర్పడింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు టీఎస్ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి అర్ధరాత్రి క్షేత్రస్థాయిలో పర్యటించారు. సిబ్బందికి సూచనలిచ్చారు. తెల్లవారితే పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో పోలింగ్కు అంతరాయం కలగకుండా, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది అర్ధరాత్రి దాటే వరకు శ్రమించారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఎప్పటికప్పుడు ఎస్ఈ, డీఈలతో మాట్లాడుతూ.. సలహాలు, సూచనలిస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటించారు. రాయపర్తి, వర్ధన్నపేట 33/11 కేవీ సబ్ స్టేషన్లు, పెద్ద నాగరాం, ఘన్పూర్ 132/33 కేవీ సబ్స్టేషన్లను పరిశీలించారు. ఇంజనీర్లకు సూచనలిచ్చారు. అర్ధరాత్రి విద్యుత్ను పునరుద్ధరించిన ఉద్యోగులను అభినందించారు. విద్యుత్ సంబంధిత సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ 18004250028, లేదా 1912కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. -
పరకాలలో ఉద్రిక్తత
● బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి పరకాల: మండలంలోని నాగారంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడితో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు చూస్తుండగానే కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పరకాల పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం సాయంత్రం గంటపాటు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పరకాల సీఐ రవిరాజ్, ఎస్ఐ రమేశ్ పోలీసు బందోబస్తుతో చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ.. పోలీస్ స్టేషన్ లోపలికి దూసుకెళ్లా రు. దాడిలో బీఆర్ఎస్ నాయకులు చిట్టిరెడ్డి రత్నాకర్రెడ్డితో పాటు పి.శ్రీనివాస్, నాగయ్య, శ్రీనివాస్, చింతిరెడ్డి సాంబయ్య గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదుతో పరకాల పోలీసులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్రెడ్డితో సహా 9 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన విరమించారు. కాగా.. పరకాల పోలీస్ స్టేషన్ ఎదుట ౖబైఠాయించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించినందుకు బ్లూ కోల్ట్స్ పోలీస్ కానిస్టేబుల్ ఐలయ్య ఫిర్యాదు మేరకు పరకాల పోలీసులు 10 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. దాడి చేస్తే చూస్తూ ఊరుకోం: మాజీ ఎమ్మెల్యే చల్లా నాగారంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడ్డ నిందితులను శిక్షంచాలంటూ సీఐ రవిరాజ్ను కోరారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
జగన్ మాటలతో కూటమిలో వణుకు..చంద్రబాబును ప్రజలు నమ్మలేదు
జూన్ 09..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను..
ఏకశిలపై సీతారామలక్ష్మణులు.. సినిమా టెంపుల్.. అమ్మపల్లి గుడిని చూశారా? (ఫొటోలు)
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్
ధ్రువపత్రాల కోసం తహసీల్ చుట్టూ చక్కర్లు
షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్ల్లు దగ్ధం
మగ్గం వర్క్తో మంచి ఆదాయం
రేపటి నుంచి సీపీగెట్కు దరఖాస్తుల స్వీకరణ
ఎన్నికల వేళ జోరుగా ‘ఉపాధి’ చెల్లింపులు
ఐటీఐలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement