మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ప్రలోభాలకు గురికావొద్దు.. మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్‌

Published Sat, May 11 2024 3:00 PM

AP Elections 2024: CM YS Jagan Speech At Kaikaluru

ఏలూరు, సాక్షి: చంద్రబాబు ప్రలోభాలకు గురి కావొద్దని.. మళ్లీ మోసపోవద్దని కైకలూరు ఓటర్లకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పథకాలు కొనసాగాలన్నా.. ఇంటింటా అభివృద్ధి జరగాలన్నా మీ బిడ్డ జగన్‌ను మళ్లీ ఆశీర్వాదించాలని కోరారాయన. కైకలూరులో జరిగిన ఎన్నికల ప్రచార భేరిలో ఆయన మాట్లాడుతూ..

కైకలూరు సిద్ధమా?.. ఇంతటి ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు.  ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా అందరి ముఖంలో చిక్కటి చిరునవ్వు కనిపిస్తోంది. మీ అందరి ప్రేమానురాగాలు, మీ అందరి ఆప్యాయతల నడుమ.. ఇక్కడకు వచ్చిన నా ప్రతీ అక్కకూ, నా చెల్లెమ్మకి, నా ప్రతీ అవ్వకు, నా ప్రతి తాతకు, నా  ప్రతీ సోదరుడికి, నా ప్రతీ స్నేహితునికీ ..మీ అందరికి మీ బిడ్డ జగన్‌ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.

మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం.  పొరపాటున చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.

దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. అక్కచెల్లెమ్మల కోసం మీ బిడ్డ జగన్‌ వివిధ పథకాల కోసం 130 సార్లు బటన్‌ నొక్కాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఏదేళ్లు  ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.

మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ కావడం అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా?.

గతంలో ఎప్పుడూ చూడని విధంగా  2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను ప్రతీ అక్కచెల్లెమ్మల ప్రతీ  ఇంటికి పంపించాడు. మీరే టిక్కు పెట్టండి అంటూ విశ్వసనీయత పరిస్థితి ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.

ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు చెబుతా.  గవర్నమెంట్‌ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లు.. ఐబీ దాకా ప్రయాణం. గవర్నరమెంట్‌ బడుల్లో చదివే పిల్లల కోసం బైలింగువల్‌ టెక్స్ట్‌ బుక్‌లు. బడులు తెరిచేసరికే విద్యాకానుక. బడుల్ పిల్లలకు గోరుముద్ద. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. పెద్ద చదవుల కోసం  ఏ తల్లీ తండ్రీ అప్పులపాలు అవ్వకూడదని.. మెడిసిన్‌, డిగ్రీలు చదువుతున్న పిల్లల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి లేకుండా 93 శాతం పూర్తి ఫీజులు కడుతూ..  జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన.

మొట్టమొదటిసారిగా డిగ్రీలో ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ సర్టిఫైడ్‌ కోర్సులు.. మాండేటరీ ఇంటర్న్‌షిప్‌.. ఈ చదువుల విప్లవాలు గతంలో ఏనాడైనా జరిగాయా?

అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా.. వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని.. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. ఇంతగా అక్కచెల్లెమ్మల కోసం తాపత్రయపడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా?

గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. అవ్వాతాతలకు నేరుగా ఇంటి వద్దకే పెన్షన్‌. ఇంటి వద్దకే రేషన్‌, ఇంటి వద్దకే పౌర సేవలు. ఇంటి వద్దకే పథకాలు.. గతంలో మీ ఇంటి వద్దకే ఎప్పుడైనా వచ్చాయా?. ఇంటికే పెన్షన్‌ వచ్చిందా?. ఇంటికే రేషన్‌ వచ్చిందా.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు జరిగింది. మొట్టమొదటిసారిగా.. రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ.. పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా. రైతన్నలకు ఉచిత పంటలబీమా. సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ. రైతన్నలకు పగటి పూటే 9 గం.ల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నల చేయి పట్టుకుని నడిపించే గ్రామంలో ఒక ఆర్బీకే వ్యవస్థ.. గతంలో ఇన్నిన్ని మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.

మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో  సీఎం జగన్‌

స్వయం ఉపాధికి తోడుగా.. అండగా.. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవర్‌ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర,  నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా.. ఫుట్‌పాత్‌ల  ఉన్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలు, కూరగాయలు అమ్ముకునేవాళ్లు, ఫుట్‌పాత​ పక్కన ఇడ్లీలువేసుకునేవాళ్లు.. వారి కోసం ఈరోజు జగనన్న తోడు. రజకులకు, బ్రహ్మణులకు ఓ చేదోడు, లాయర్లకు ఒక లా నేస్తం. గతంలో ఇన్ని పథకాలు ఏనాడైనా ఉన్నాయా?.

గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని.. మొట్టమొదటిసారిగా ఆరోగ్యరక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఉచితంగా రూ.25 లక్షల దాకా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఆపరేషన్‌ అయ్యాక  రెస్ట్‌ పీరియడ్‌లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. ఆ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. పేదవాడి కోసం  ఇంటి వద్దకే టెస్టులు చేస్తూ.. మందులిస్తున్న ఆరోగ్య సురక్ష. ఇంతగా పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకున్న పరిస్థితులు ఉన్నాయా?.

గ్రామంలో అయినా 600 సేవలు అందిస్తూ కనిపిస్తున్న సచివాలయం. అదే గ్రామంలో వలంటీర్‌ వ్యవస్థ. నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ ఓ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరరీ. మొట్టమొదటిసారి నా అక్కచెల్లెమ్మల కోసం.. వాళ్ల రక్షణ కోసం గ్రామంలోనే మహిళా పోలీస్. మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల కోసం ఫోన్‌లోనే దిశ యాప్. దిశ యాప్‌ ద్వారా అక్కచెల్లెమ్మలు ఏ ఆపదలో ఉన్నా.. ఫోన్‌ ఐదుసార్లు షేక్‌ చేసినా పోలీసులు వచ్చి ‘‘చెల్లెమ్మా ఏం జరిగింది?’’ అని అడుగుతున్న పరిస్థితి. గతంలో ఇలాంటి పరిస్థితులు చూశారా? ఆలోచన చేయండి.

పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి.. మూడుసార్లు సీఎం చేశానంటాడు. మరి పేదవాళ్లకు ఒక్కటంటే ఒక్కటైనా మంచి గుర్తుకొస్తుందా?.(లేదు.. అనే సమాధానం వచ్చింది). చంద్రబాబు పేరు చెబితే ఏ పథకం కూడా గుర్తుకు రాదు. ఏ మంచి గుర్తుకు రాలేదు. ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు.. మోసాలు.

ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. సంతకం పెట్టిన ఈ ఫాంప్లెట్‌ను మీ ప్రతి ఇంటికీ పంపించాడు. 2014 ప్రజలు నమ్మి చంద్రబాబుకి ఓటేశారు. ముఖ్యమైన హామీలంటూ ప్రతీ ఇంటికి పంపించిన వాటిల్లో ఒక్కటైనా చేశారా?.

రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు ఈ పెద్దమనిషి చంద్రబాబు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు.. మాఫీ అయ్యాయా?. రెండో హామీ.. పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు ఒక్క రూపాయైనా మాఫీ అయ్యాయా?. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ వేస్తామన్నారు చంద్రబాబు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? ఒక్కరి అకౌంట్‌లో అయినా కనీసం ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా? అని అడుగుతున్నా.

అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?. ఇంటింటికీ ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?

రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నారు? చేశారా?. విమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు? చేశారా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నారు.. చేశారా? కైకలూరులో ఏమైనా జరిగిందా? పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చారా? దాన్నీ అమ్మేశారు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా?..

మళ్లీ ఇదే ముగ్గురూ.. ఇదే కూటమి.. ఇదే చంద్రబాబు.. సూపర్‌ సిక్స్‌ అంట.. నమ్ముతారా?, సూపర్‌ సెవెన్‌ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు అంట.. నమ్ముతారా? ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.

ఇలాంటి అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు ప్రలోభాలను నమ్మొద్దు. ఐదేళ్లు మీ అందరికి క్యాలెండర్‌ఇచ్చి.. ఏ నెలలో ఏం చేస్తాం అనేది.. ఏ నెలలో చేయూత, అమ్మ ఒడి అని ప్రతీ నెలా.. క్రమం తప్పకుండా చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి. చంద్రబాబు ప్రలోభాలతో మోసపోకండి. జరుగుతున్న మంచిని పొగొట్టుకోకండి.

వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్‌ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్‌ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్‌ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.

కొల్లూరు సమస్య పరిష్కారం కావాలన్నా.. మీ బిడ్డ సీఎం కావాలి. చెప్పిన మాట ప్రకారం సర్వే జరుగుతోంది. సర్వేకు సంబంధించిన రిపోర్టు పూర్తికాగానే.. అదనపు భూమిని పంచుతాం. అదీ బిడ్డ జగన్‌ చేతుల మీదుగానే జరుగుతుంది.

ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ.. మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్,  అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్.. చెల్లి మన గుర్తు ఫ్యాన్‌. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. బీజేపీ ఎక్కడ ఉండాలి.. సింక్‌లోనే ఉండాలి. కాదు.. చెరువులో ఉండాలి.

వైఎస్సార్‌సీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీఎన్‌ఆర్‌(దూలం నాగేశ్వరరావు) , కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెలమలశెట్టి సునీల్‌ గెలిపించాలని సీఎం జగన్‌ ప్రజలను కోరుతూ ప్రసంగం ముగించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement