-
తెరుచుకున్న గంగవరం పోర్టు గేట్లు
● చర్చలు ఫలించడంతో కార్మికుల సమ్మె విరమణ ● స్టీల్ప్లాంట్కు యథావిధిగా బొగ్గు సరఫరాపెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టు గేట్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. పోర్టులో పని చేస్తున్న ఉద్యోగులు గురువారం రాత్రి నుంచి విధులకు హాజరయ్యారు. బొగ్గు రవాణా జోరుగా సాగడంతో విశాఖ స్టీల్ప్లాంట్ ఊపిరి పీల్చుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం గంగవరం పోర్టులో పని చేస్తున్న నిర్వాసిత కార్మికులు గత నెల 10వ తేదీ నుంచి పోర్టు ప్రధాన గేటు వద్ద ఆందోళన చేయడం తెలిసిందే. కార్మికులకు ప్రతి నెలా కనీస వేతనం కింద రూ.36 వేలు చెల్లించాలని, విధి నిర్వహణలో ఉన్న కార్మికులు మృతి చెందితే రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నష్టపరిహారం కింద రూ.50 లక్షలు ఇచ్చి వన్టైమ్ సెటిల్మెంట్ చేయాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఆదేశం మేరకు నగర సీపీ రవిశంకర్ పోర్టు యాజమాన్య ప్రతినిధులు, నిర్వాసిత కార్మిక సంఘ నాయకులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఎట్టకేలకు గురువారం రాత్రి చర్చలు ఫలించాయి. ఒక్కో కార్మికునికి రూ.27 లక్షలు ఇచ్చి వన్ టైమ్ సెటిల్మెంట్ చేయడానికి పోర్టు యాజమాన్యం అంగీకరించడంతో కార్మికులు సమ్మె విరమించారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి పోర్టులో కార్యకలాపాలు యథావిధిగా సాగాయి. స్టీల్ప్లాంట్కు ఇక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా బొగ్గు సరఫరా చేశారు. -
ఐటీఐలో దివ్యాంగుల ప్రవేశాలకు ఆహ్వానం
మధురవాడ: బక్కన్నపాలెంలోని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సహాయ సంస్థ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సిహెచ్.భాస్కరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోనే ఏకై క శిక్షణ సంస్థ ఇదేనని, రాష్ట్రంలోని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్పెంటర్ కోర్సుకు 24 సీట్లు, షీట్మెల్ వర్క్ కోర్సుకు 20, వెల్డర్ 20, పెయింటర్ 20 సీట్లు చొప్పున ఉన్నాయని, ఏడాది కాలం పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిలైన పురుష దివ్యాంగ విద్యార్థులు అర్హులని, వచ్చే నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరాఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాల కోసం ప్రాజెక్ట్ అధికారి పి.వి.రమణమూర్తి (ఫోన్ 78933 83633) ప్రిన్సిపాల్ సిహెచ్.భాస్కరరావు(73964 24319)ను సంప్రదించాలన్నారు. https://iti.ap.gov.in/ వెబ్సైట్లో కూడా వివరాలు పొందవచ్చునన్నారు. -
జూన్ 4న చరిత్ర సృష్టించబోతున్నాం
● రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వెంటే ● అందుకే భారీగా ఓటింగ్ ● కూటమికి ఓటమి తప్పదు ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణిబీచ్రోడ్డు : జూన్ 4 వెలువడే ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ మరోసారి చరిత్ర సృష్టించబోతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు మేలు చేసిన సీఎం జగన్కు అండగా నిలవాలని భారీ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. చంద్రబాబు కూటమికి ఓటమి తప్పదని స్పష్టంచేశారు. ఆమె శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళలంతా జగన్ను సోదరుడిలా భావిస్తున్నారని, మరో ముప్పై ఏళ్లు ఈ రాష్ట్రం జగన్ నాయకత్వంలో నడవాలని కోరుకుంటున్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు వదిన పురందేశ్వరితో కలిసి అబద్ధాల హామీలు, కుట్రలతో అధికారులను మార్చి రాష్ట్రంలో అశాంతిని రగిల్చారన్నారు. టీడీపీ అంటే తెలుగు డెకాయిట్స్ పార్టీ, తెలుగు దండుపాళ్యం పార్టీ, తెలుగు దొంగల పార్టీలా తయారైందన్నారు. నర్సీపట్నంలో, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో మహిళలపైన, వైఎస్సార్సీపీకి మద్దతు పలికిన ప్రజలపైనా దాడులు చేశారన్నారు. ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు కుటుంబంలోని మహిళల పైనా ఇదే తరహా దాడులు చేయాలనే సంకేతాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. బాబు హయాంలో మహిళల హత్య, దాడులు, విజయవాడలో కాల్మనీ రాకెట్లో మహిళలను చిత్రహింసలకు గురి చేసిన ఘటనలు ప్రజలందరికీ తెలుసన్నారు. ఆడపిల్ల పుట్టుకను అవహేళన చేసిన హీనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన నేతలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుని మహిళలను రక్షించాలని, ప్రజాస్వామ్యంపై విశ్వాసం పెంచాలని కల్యాణి కోరారు. -
కౌంటింగ్ ప్రక్రియకు పక్కా ఏర్పాట్లు
మహారాణిపేట: జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ కోసం జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులతో చర్చించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు టేబుల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. టేబుల్స్ వివరాలు : ప్రతి అసెంబ్లీకి 14 టేబుల్స్, పార్లమెంటుకు 14 టేబుల్స్ చొప్పన ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ తూర్పు, విశాఖ ఉత్తర, దక్షిణ, పశ్చి మ, గాజువాక, భీమిలి, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఏయూ ఆవరణలో నిర్వహించనున్నారు. ఏడు అసెంబ్లీలకు కలిపి మొత్తం 98 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పార్లమెంటుకు కూడా 98 టేబుల్స్ వేర్వేరు హాళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క టేబుల్కు ముగ్గుర్ని నియమిస్తున్నారు. సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంటు, మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నారు. అలాగే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపునకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. 20 వేల ఓట్లు కోసం సుమారుగా 40 టేబుల్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ టేబుల్స్ పార్లమెంటుకు, అసెంబ్లీకి వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సర్వీసెమెన్ కోసం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ అన్ని పోస్టు ద్వారా వస్తున్నాయి. జిల్లాలో నాలుగు వేల వరకు పోస్టల్ బ్యాలెట్ వచ్చే అవకాశం ఉంది. వీటి కోసం 15 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం మీద 291 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క టేబుల్కు ముగ్గురు చొప్పన 873 మంది సిబ్బంది అవసరం ఉంటుంది. -
నేవీ ఉద్యోగి బలవన్మరణం
గోపాలపట్నం: 104 ఏరియాలో నివాసముంటున్న నేవీ ఉద్యోగి జి.శ్రీహరి (23) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలివీ.. 104 ఏరియాలోని వైజాగ్ డిఫెన్స్ అకాడమీ కళాశాల ఎదురుగా అద్దె ఇంట్లో కుటుంబంతో శ్రీహరి నివాసముంటున్నాడు. గురువారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్టు పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. మృతుడు సూసైడ్ లెటర్ రాసినట్లు తెలిసింది. అందులో వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. అతని వివరాలు, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
పటిష్ట నిఘాలో స్ట్రాంగ్ రూమ్లు
మహారాణిపేట: సాధారణ ఎన్నికలు–2024లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షిత నిల్వ, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, సీపీలు, ఎస్పీలతో శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ పటిష్ట భద్రత, నిఘా మధ్య స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయన్నారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో సీపీ ఎ.రవిశంకర్, జాయింట్ పోలీస్ కమిషనర్ పకీరప్ప, డీసీపీ సత్తిబాబు, జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్కుమార్, తదితరులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూముల తనిఖీ రోజువారీ తనిఖీలో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున శుక్రవారం తనిఖీ చేశారు. అక్కడ భద్రతాపరమైన చర్యలను పరిశీలించారు. అక్కడ పరిస్థితులను గమనించారు. విధుల నిమిత్తం కేటాయించి అన్ని విభాగాల అధికారులు, పోలీస్ సిబ్బంది విధి నిర్వహణపై ఆరా తీశారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల తలుపులకు వేసిన సీళ్లను నిశితంగా పరిశీలించారు. అధికారులు, పోలీస్ సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. వివిధ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములను పరిశీలించిన అనంతరం జిల్లా ఎన్నికల అధికారి ఆయా లాగ్ బుక్స్ సంతకాలు చేశారు. ఆయన వెంట వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, ఇతర అధికారులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ ఆర్.రవిశంకర్,జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, పలువురు ఆర్వోలు భాస్కరరెడ్డి, అఖిల, సీతారామ్ముర్తి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి నివేదించిన కలెక్టర్ -
జూకు రానున్నకొత్త నేస్తాలు
ఆరిలోవ : విశాఖ ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్దిరోజుల్లో మరికొన్ని కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని తీసుకురావడానికి సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా (సీజెడ్ఏ) అనుమతులు లభించాయి. మరికొన్నింటిని తీసుకురావడానికి అనుమతులు రావాల్సి ఉంది. కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జులాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి కొత్త జంతువులు, అరుదైన పక్షులను అధికారులు తరచూ తీసుకొస్తున్నారు. గత నెల 27న కోల్కతాలోని అలీపూర్ జూ పార్కు నుంచి జంతుమార్పిడి విధానం ద్వారా జత జిరాఫీలు, రెండుజతల ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, జత స్కార్లెట్ మకావ్ (రంగురంగుల పక్షి)లను ఇక్కడకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. మరికొన్ని వన్యప్రాణులను కొద్ది రోజుల్లో తీసుకురానున్నారు. బెంగళూరు జూ నుంచి మిలటరీ మెకావ్, రెడ్నెక్డ్ వాలిబీ, స్వైరల్ మంకీస్, మార్మోసెట్ మంకీస్, గ్రీన్ వింగ్ మెకావ్లను నెలరోజుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటి కోసం జూలో ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశారు. జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టార్టాయిస్లు జర్మనీ నుంచి 12 అలైబ్రొ జాయింట్ టార్ట్టాయిస్లను విశాఖ జూకు తీసుకురానున్నారు. ఈ జాతి తాబేళ్ల జీవితకాలం వందేళ్లు. మనదేశంలో ఇవి అరుదుగా కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు. వాటిని ఇక్కడకు తీసుకురావడానికి సీజెడ్ఏ అధికారుల అనుమతి లభించింది. వీటిని ఇక్కడకు తీసుకొస్తే వందేళ్ల వాటి జీవితకాలంలో ఆ జాతి సంతతి వృద్ధి చెందుతుంది. ఇతర జూ పార్కుల నుంచి జంతుమార్పిడి ద్వారా కొత్త వన్యప్రాణులను ఇక్కడకు తీసుకురావడానికి ఎక్కువగా అవకాశాలు కలుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు. వీటితోపాటు అహ్మదాబాద్ జూ పార్కు నుంచి వివిధ రకాల అరుదైన పక్షులను తీసుకొచ్చేందుకు సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించారు. అవికూడా వస్తే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది. సీజెడ్ఏ అనుమతులు త్వరలోనే సందడి చేయనున్న వన్యప్రాణులు -
ఒకట్రెండు నెలల్లో తీసుకువస్తాం
విశాఖ జూకి ఒకటి, రెండునెలల్లో కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరు జూ నుంచి మీర్కాట్, రెడ్నెక్డ్ వాలబీ, స్వైరల్ మంకీస్, మర్మోసెట్స్, గ్రీన్ వింగ్డ్ మకావ్ తదితర జాతులతో పాటు జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టోర్టోయిస్లను ఇక్కడికి తీసుకురావడానికి సీజెడ్ఏ అనుమతులు లభించాయి. అహ్మదాబాద్ జూ నుంచి మరికొన్ని అరుదైన పక్షులను తీసుకురావడానికి సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించాం. సీజెడ్ఏ అనుమతులు వచ్చిన వెంటనే వాటిని తీసుకొస్తాం. గతనెలలో లీపూర్ జూ నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన జిరాఫీలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. జూలో అరుదైన వన్యప్రాణులను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. – డాక్టర్ నందనీ సలారియా, జూ క్యూరేటర్, ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
అదానీ పోర్టు నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం
ఉక్కునగరం: 35 రోజులుగా స్టీల్ప్లాంట్కు అదానీ పోర్టు నుంచి నిలిచిపోయిన బొగ్గు సరఫరా శుక్రవారం వేకువజాము నుంచి ప్రారంభమైంది. దీంతో స్టీల్ప్లాంట్కు బొగ్గు కష్టాలు తీరనున్నాయి. బొగ్గు సరఫరా ప్రారంభం కావడంపై ఉక్కు ఉద్యోగులు హర్షం ప్రకటించారు. అదానీ గంగవరం పోర్టులో ఏర్పడిన కార్మిక వివాదం వల్ల సుమారు రూ. 500 కోట్ల విలువైన 3 లక్షల టన్ను బొగ్గు, లైమ్స్టోన్ సరఫరా గత నెల 12 నుంచి నిలిచిపోయింది. దీంతో స్టీల్ప్లాంట్ ఉత్పత్తి సంక్షోభంలోకి పడింది. జిల్లా యంత్రాంగానికి యాజమాన్యం విన్నవించినా స్పందన కానరాలేదు. ఈ పరిస్థితుల్లో ఉక్కు అధికారుల సంఘం (సీ) ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకోవాలని అటు గంగవరం పోర్టుకు, ఇటు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయినప్పటికి పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో కోర్టు దిక్కారణ పిటిషన్ను కేవీడీ ప్రసాద్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి తక్షణం బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన చర్చల్లో గంగవరం పోర్టు యాజమాన్యం, అక్కడి కార్మికుల మధ్య ఒప్పందం జరిగింది. ఒప్పందం నేపథ్యంలో వెంటనే కార్మికులు విధుల్లో చేరగా ఉదయం నుంచి ప్లాంట్కు బొగ్గు సరఫరా ప్రారంభమైంది. బొగ్గు సరఫరా ప్రారంభం కావడంపై స్టేక్ హోల్డర్లకు స్టీల్ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ కృతజ్ఞతలు తెలిపారు. -
స్టీల్ప్లాంట్లో కార్మికుడికి తీవ్ర గాయాలు
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ కోక్ ఓవెన్స్ విభాగంలో శుక్రవారం జరిగిన సంఘటనలో కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. పెదగంట్యాడ మండలం నడుపూరుకు చెందిన జె. సాంబయ్య (55) కోక్ ఓవెన్స్ విభాగంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. యథావిధిగా విధులకు హాజరైన సాంబయ్య సహ కార్మికుడితో భూమికి 30 అడుగుల దిగువన ఉండే ఆరడుగుల పిట్ వద్దకు దిగారు. అక్కడ 60 డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడిన నీటి లోతును పరిశీలిస్తుండగా.. అదుపు తప్పి పిట్లో పడి పోయారు. ఈ ప్రమాదంలో అతని ముఖం భాగం మినహా మిగతా శరీరం అంతా కాలిపోయింది. సహ కార్మికులు వెంటనే అతన్ని ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతను శరీరం 80 శాతం పైగా కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. స్టీల్ప్లాంట్ సీఐ వి.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. -
ఇంటర్లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం
విశాఖ విద్య: ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖ జైల్ రోడ్లో నిర్వహించే బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థునులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జే. విజయ ఒక ప్రకటనలో తెలిపారు. బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీతో పాటు ఒకేషనల్ కోర్సులను ఇంగ్లిషు, తెలుగు మీడియంలో బోధన సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. పదో తరగతి పాసైన విద్యార్థినులు వెంటనే కాలేజీలో సంప్రదించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడి వారైనా కాలేజీలో చేరవచ్చన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. -
ఆ కథనాలపై వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఖండన
విశాఖ సిటీ: రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత తగాదాలతో జరిగిన దాడికి వైఎస్సార్సీపీ నాయకులు కారణమని కథనాలు రాయడం దారుణమని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు బాజీ నాయుడు, జోనల్ ఇంచార్జ్ జి.ఎం.రెడ్డి పేర్కొన్నారు. పాత గొడవలు కారణంగానే తనపై దాడి చేశారని నిందితులపై బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. దాన్ని పట్టించుకోకుండా వైసీపీకి ఓటు వేసినందుకే కొట్టించారని పత్రికల్లో ప్రచురించిన తప్పుడు కథనాన్ని ఖండించారు. కుటుంబాల మధ్య కక్షలు కారణంగానే దాడి జరిగిందని పోలీసులు కూడా మీడియా సమావేశంలో చెప్పినప్పటికీ.. రాజకీయ దురుద్దేశంతో కథనాలు రాయడం సమంజసం కాదన్నారు. -
పీఎంపాలెంలో ఐఐసీఎఫ్ ఎక్స్పో ప్రారంభం
మధురవాడ: పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ హాలులో శుక్రవారం ఇండియన్ ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఫెయిర్(ఐఐసీఎఫ్) ప్రారంభమైంది. ఈ ఎక్స్పోలో ఇంటీరియల్స్, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఫర్నిచర్, ఆటోమొబైల్స్, రడీమేడ్ దుస్తు లు, హస్త కళలు, గిఫ్ట్ ఉత్పత్తులు, ఆభరణాలు తదితర అన్ని రకాల వస్తువులను అందుబాటులో ఉంచారు. అన్ని వర్గాల విని యోగదారులను దృష్టిలో పెట్టుకుని పలు రకాల ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. దేశంలో 20 చోట్ల తమ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు ఉమేష్ తెలిపారు. ఈ నెల 20తో ఎక్స్పో ముగుస్తుందని, ప్రవేశం ఉచితమన్నారు. -
సమన్వయలోపంతో ‘షాక్’!
● బలవుతున్న విద్యుత్ ఉద్యోగులు ● మరమ్మతుల సమయంలో సమాచార లోపం ● సరఫరా నిలిపివేయడంలో జాప్యం కారణంగా ప్రమాదాలు ● రెండు నెలల్లో ఇద్దరు ఈపీడీసీఎల్ ఉద్యోగుల మృతి ● విశాఖ సర్కిల్లో ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యంసాక్షి, విశాఖపట్నం : ● ఏప్రిల్ 25న మునగపాక మండలం చూచుకొండలో విద్యుత్ సమస్యని పరిష్కరిస్తుండగా షాక్కు గురై ఈపీడీసీఎల్ హెల్పర్ పీతల శివన్నారాయణ మృతి చెందారు. ● ఈ నెల 16న సబ్బవరం మండలం గాలి భీమవరంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ హెల్పర్ గొంప వెంకటరమణ షాక్కు గురై మృత్యువాత పడ్డారు. పై రెండు మరణాలకు విద్యుత్ అధికారుల మధ్య సమన్వయలోపమే ప్రధాన కారణమన్నది స్పష్టమవుతోంది. మరమ్మతుల సమయంలో సమాచార జాప్యం కారణంగా నిండు ప్రాణాలు బలవుతున్నాయి. విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించాల్సిన ఇంజినీరింగ్ సిబ్బంది.. వసూళ్లపైన మాత్రమే దృష్టి సారిస్తుండటంతో తరచుగా ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి. వరుసగా రెండు నెలల్లో ఇద్దరు ఈపీడీసీఎల్ సిబ్బంది మృత్యువాత పడటానికి కారణం.. విశాఖ సర్కిల్ అధికారులు నిర్లక్ష్యమేనన్నది స్పష్టమవుతోంది. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే.. సంబంధిత లైన్మెన్ హెల్పర్ సహాయంతో మరమ్మతులు చేస్తారు. ఈ సమయంలో సబ్స్టేషన్కు ఫోన్ చేసి.. ఫలానా ఏరియాకు సంబంధించిన విద్యుత్ సరఫరా నిలిపివెయ్యాలని చెబుతుంటారు. వీధుల్లో సమస్య తలెత్తితే.. సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి సరఫరా నిలిపేస్తారు. ఇక్కడే సిబ్బంది వహిస్తున్న నిర్లక్ష్యం వారి పాలిట యమపాశంలా మారిపోతోంది. లోపం తలెత్తిన లైన్ మరమ్మతులు పూర్తయ్యాయా లేదా.? అనే అంశంపై స్పష్టత రాకుండానే విద్యుత్ సరఫరా ఇచ్చేస్తుండటం వల్ల ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ప్రతి నెలా ప్రమాదమే.. కేవలం ఈపీడీసీఎల్ సిబ్బంది మాత్రమే కాకుండా.. తరచూ ఏదో ఒక చోట విద్యుదాఘాతాలు సంభవిస్తున్నాయి. ఏప్రిల్ 14న అచ్యుతాపురం మండలం కొండకర్లలో విద్యుదాఘాతానికి గురై ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందగా.. మార్చిలో గాజువాకలో విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. పీఎం పాలెంలో ఓ భవనంలో ప్లంబింగ్ చేస్తుండగా.. ప్రమాదానికి గురై వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఇలా ప్రతి చోటా ప్రమాదాలు జరుగుతున్నా విద్యుత్ అధికారులు మాత్రం చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో విద్యుత్ ప్రమాదాలపై కనీస అవగాహన చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్కిల్ అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాల నివారణకు సంబంధించి విశాఖపట్నం ఈపీడీసీఎల్ సర్కిల్ అప్రమత్తంగా వ్యవహరించడంలో నిర్లక్ష్యంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సబ్బవరం ప్రాంతంలో ఈపీడీసీఎల్ ఇంజినీరింగ్ అధికారులు రైతుల వద్ద నుంచి విద్యుత్ కనెక్షన్ల కోసం రూ.లక్షల్లో వసూళ్లపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు తప్ప.. లైన్ల పరిశీలన, ట్రాన్స్ఫార్మర్ల భద్రత.. తదితర అంశాల్ని మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నారు. ఎవరైనా.. విద్యుత్ కనెక్షన్ కావాలంటే.. కచ్చితంగా జేబులు నింపాల్సిందేనన్నట్లుగా అడ్డగోలుగా వ్యవహిస్తున్నారు. ఉన్నతాధికారులకు సైతం డబ్బులు ముట్టజెప్పాలంటూ రైతులు, వినియోగదారుల్ని ముప్పతిప్పలు పెడుతున్నారే తప్ప.. విద్యుత్ వ్యవస్థని సరిదిద్దే ఆలోచన మాత్రం.. ఈపీడీసీఎల్ విశాఖసర్కిల్ ఇంజినీరింగ్ అధికారుల్లో మాత్రం కనబడటం లేదన్నది ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రమాదాల ద్వారా స్పష్టమవుతోంది. -
● జూలో జిరాఫీల సందడి
ఇందిరాగాంధీ జూ పార్కులో జిరాఫీలు సందర్శకులను అలరిస్తున్నాయి. జూ అధికారులు గత నెల 27న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అలీపూర్ జూ పార్కు నుంచి ఒక జత జిరాఫీలను ఇక్కడకు తీసుకువచ్చిన విషయంతెలిసిందే. జూ పార్కుకు వెళ్లినసందర్శకులను ఆ జిరాఫీలు అలరిస్తున్నాయి. యానిమల్ కీపర్ వేసిన ఆహారం తింటూ వాటి ఎన్క్లోజర్లో హుషారుగా తిరుగుతూ కనువిందు చేస్తున్నాయి. రెండూ తక్కువ వయసులో ఉన్నవి కావడంతో ఎన్క్లోజర్లో పరుగులు తీస్తున్నాయి. దీంతో సందర్శకులు వీటితో సెల్ఫీలు తీసుకోవడం, మరికొందరు గ్రూపుగా ఫొటోలు తీసుకొంటున్నారు. ఇక్కడ గతంలో ఉండే జత జిరాఫీలు అనారోగ్యంతో మృతి చెందడంతో సుమారు ఆరు నెలలకు పైగా ఈ ఎన్క్లోజర్ ఖాళీ అయిపోయింది. ఇటీవల అలీపూర్ జూ పార్కు నుంచి తీసుకువచ్చిన ఈ జిరాఫీలతో ఈ ఎన్క్లోజర్కు పూర్వవైభవం వచ్చినట్లయింది. – ఆరిలోవ -
మరికొంత కాలం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న పలు సమ్మర్ స్పెషల్ రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ● బెంగళూరు–ఖరగ్పూర్(06507) సమ్మర్ స్పెషల్ ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 12.02 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు 2.45 గంటలకు ఖరగ్పూర్ వెళ్తుంది. ఈ స్పెషల్ను జూన్ 14 వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో ఖరగ్పూర్–బెంగళూరు (06508) సమ్మర్ స్పెషల్ ప్రతీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఖరగ్పూర్లో బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు 2.38 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 2.40 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 7.50 గంటలకు బెంగళూరు వెళ్తుంది. ఈ స్పెషల్ను జూన్ 17 వరకు పొడిగించారు. ● ఎస్ఎంవీ బెంగళూరు–హౌరా(06585) సమ్మర్ స్పెషల్ ప్రతీ శుక్రవారం మధ్య రాత్రి 12.30 గంటలకు బెంగళూరులో బయలుదేరి అదే రోజు రాత్రి 7.25 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.27 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు హౌరా వెళ్తుంది. ఈ స్పెషల్ జూన్ 14 వరకు నడుస్తుంది. హౌరా–ఎస్ఎంవీ బెంగళూరు(06586) సమ్మర్ స్పెషల్ ప్రతీ శనివారం మధ్యాహ్నం 1.05 గంటలకు హౌరాలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు 3.03 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.05 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8.10 గంలకు ఎస్ఎంవీ బెంగళూరు వెళ్తుంది. ఈ స్పెషల్ను జూన్ 15వ తేదీ వరకు పొడిగించారు. ● ఎస్ఎంవీ బెంగళూరు–గౌహతి (06569) సమ్మర్ స్పెషల్ ఎస్ఎంవీ బెంగళూరులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.55 గంటలకు బయలుదేరి మంగళవారం తెల్లవారు 5.30 గంటలకు గౌహతి వెళ్తుంది. ఈ స్పెషల్ జూన్ 9వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో గౌహతి–ఎస్ఎంవీ బెంగళూరు(06570) సమ్మర్ స్పెషల్ గౌహతిలో ప్రతీ బుధవారం ఉదయం 6 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.10 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు వెళ్తుంది. ఈ స్పెషల్ను జూన్ 12వ తేదీ వరకు పొడిగించారు. ● ఎస్ఎంవీ బెంగళూరు– మాల్డా టౌన్(06563) స్పెషల్ రైలు ఎస్ఎంవీ బెంగళూరులో జూన్ 9 రాత్రి 11.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 6.13 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.15 గంటలకు బయలుదేరి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మాల్డా టౌన్ వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో మాల్డా టౌన్– ఎస్ఎంవీ బెంగళూరు(06564) స్పెషల్ జూన్ 12 సాయంత్రం 4 గంటలకు మాల్డా టౌన్లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు వెళ్తుంది. ● మైసూరు–ముజఫర్పూర్(06221) స్పెషల్ జూన్ 10వ తేదీ సోమవారం మైసూరులో ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.18 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముజఫర్పూర్ వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ముజఫర్పూర్–మైసూరు (06222) స్పెషల్ జూన్ 13వ తేదీ గురువారం ముజఫర్పూర్లో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.18 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.40 గంటలకు మైసూరు వెళ్తుంది. -
భువనేశ్వర్– సోలాపూర్ వన్వే సమ్మర్ స్పెషల్
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని వన్వే సమ్మర్ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. భువనేశ్వర్–సోలాపూర్(01452) వన్ వే సమ్మర్ స్పెషల్ ఈ నెల 20 సోమవారం ఉదయం 4.30 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం 11.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 11.45 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 7 గంటలకు సోలా పూర్ వెళ్తుంది. భువనేశ్వర్–ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబయి (01056) వన్వే సమ్మర్ స్పెషల్ ఈ నెల 20 సోమవారం రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.53 గంటలకు బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబయి వెళ్తుంది. -
ఆలస్యంగా రైళ్ల రాకపోకలు
తాటిచెట్లపాలెం: పెయిరింగ్ రైళ్లు ఆలస్యం కారణంగా ఆయా స్టేషన్ల నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. విశ్వేశ్వర్య టెర్మినల్ బెంగళూరులో శుక్రవారం ఉదయం 10.15 గంటలకు బయలుదేరాల్సిన విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు–అగర్తలా(12503) హమ్సఫర్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరింది. ● సంత్రగచ్చిలో శుక్రవారం రాత్రి 7 గంటలకు బయలుదేరాల్సిన సంత్రగచ్చి–ఎస్ఎంవీ బెంగళూరు (08845) సమ్మర్ స్పెషల్ మధ్య రాత్రి 12.30 గంటలకు బయలుదేరింది. ● శుక్రవారం ఉదయం 5.45గంటలకు విశాఖపట్నంలో బయలుదేరాల్సిన విశాఖపట్నం– సికింద్రాబాద్(20833) వందేభారత్ సుమారు 3 గంటలు ఆలస్యంగా 8.45 గంటలకు బయలుదేరింది. సికింద్రాబాద్లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాల్సిన సికింద్రాబాద్–విశాఖపట్నం(20834) వందేభారత్ 2.15 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరింది. ● సంత్రగచ్చిలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన సంత్రగచ్చి– ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (22807)ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సుమారు ఆరు గంటలు ఆలస్యంగా రాత్రి 11.55 గంటలకు బయలుదేరింది. ● సంత్రగచ్చిలో శుక్రవారం రాత్రి 11.40 గంటలకు బయలుదేరాల్సిన సంత్రగచ్చి–తాంబరం (06090) సమ్మర్ స్పెషల్ సుమారు నాలుగున్నర గంటలు ఆలస్యంగా శనివారం తెల్లవారు 4 గంటలకు బయలుదేరింది. ● ఎంజీఆర్ చైన్నె సెంట్రల్లో శుక్రవారం రాత్రి 7 గంటలకు బయలుదేరాల్సిన ఎంజీఆర్ చైన్నె సెంట్రల్– హౌరా (12840) సూపర్ఫాస్ట్ మెయిల్ ఎక్స్ప్రెస్ సుమారు గంటన్నర ఆలస్యంగా రాత్రి 8.30 గంటలకు బయలుదేరింది. ఈ రైళ్లు అంతే ఆలస్యంగా ఆయా స్టేషన్లకు రాకపోకలు సాగించనున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు. -
అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
● ఏయూ సైన్స్, ఆర్ట్స్ కళాశాలల పరిధిలో మ్యూజియంలు ● విద్యార్థులకు ప్రత్యక్ష జ్ఞానాన్ని అందించే కేంద్రాలు ● నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఏయూక్యాంపస్: కళా ఖండాలు.. చారిత్రక వస్తువులు.. శాసీ్త్రయ నమూనాల వంటి వస్తువులను సేకరించి ప్రదర్శించే ప్రదేశం మ్యూజియం. ప్రజలు తిలకించడానికి, అధ్యయనం చేయడానికి ఇక్కడ కళాఖండాలు అందుబాటులో ఉంటాయి. నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం. మ్యూజియంలు సమాజానికి ఎలా దోహదపడతాయనే దాని గురించి అవగాహన కల్పించడం, సాంస్కృతిక మార్పిడి, వైవిధ్యం, సమగ్రతను ప్రోత్సహించడం ఈ డే ఉద్దేశం. ఈ సందర్భంగా ఏయూ సైన్స్, ఆర్ట్స్ కళాశాలల పరిధిలోని పలు మ్యూజియం విశేషాలు తెలుసుకుందాం. ● ఆంధ్ర విశ్వ విద్యాలయంలోని ప్రధానమైన విభాగాల్లోని వృక్షశాస్త్రం ఒకటి. ఈ విభాగానికి సంబంధించి మ్యూజియం, హెర్బేరియం ఉన్నాయి. సహజంగా ఉండే మొక్కలు, విత్తనాలు ఫార్మా డీహైల్డ్లో భద్రపరిచి ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఇక్కడ 500లకు పైగా సముద్ర తీరం, సముద్ర అడుగు భాగంలో లభించే మొక్కలు, నేలపై లభించే మొక్కలు, విత్తనాలు వంటివి విద్యార్థుల కోసం భద్రపరిచారు. వీటితో పాటు వివిధ జాతుల అరుదైన చెక్కలు, వృక్ష శిలాజాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే హెర్బేరియంలో 25 వేలకు పైగా నమూనాలు ఉన్నాయి. ● ఏయూలోని జీవశాస్త్ర విభాగంలోని మ్యూజియంలో సుమారు 1,500లకు పైగా జీవులకు సంబంధించిన నమూనాలు ఉన్నాయి. చిరుత, జింక, తాబేలు, పక్షులు, పాములు ఇలా అనేక జీవుల కళేబరాలను టాక్సీ డమ్మీ విధానంలో ప్రత్యేక రసాయనాలు ఉపయోగించి ఇక్కడ భద్రపరిచారు. నేలపై, నీటిలో, గాలిలో సంచరించే అన్ని జీవుల కళేబరాలు మనకు ఇక్కడ దర్శనమిస్తాయి. అరుదైన, అంతరించే జీవులను కూడా ఇక్కడ మనం చూసే అవకాశం ఉంది. ● ఆర్ట్స్ కళాశాల పరిధిలోని ఆంత్రోపాలజీ విభాగంలో ప్రత్యేకంగా మ్యూజియం ఉంది. మానవ పరిణామ క్రమాన్ని వివరించడం, ప్రజల జీవనం తెలిపే విధంగా ఈ మ్యూజియంను తీర్చిదిద్దారు. ప్రాచీన కాలంలో ఉపయోగించిన పనిముట్లు, వారి సంస్కృతి, కళలు, జీవన విధానం, అలంకరణ వస్తువులు వంటివి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇటీవల ఏయూను సందర్శించిన నాక్ నిపుణుల బృందం సైతం వీటిని పరిశీలించి ప్రశంసించింది. ● గత చరిత్రను మన ముందుంచే విధంగా చరిత్ర విభాగంలో మ్యూజియం ఉంది. ఇక్కడ చారిత్రక నాణేలు, ఇనుప రేకులపై రాసిన శాసనాలు, చారిత్రక శిలలు, శిల్పాలు, చారిత్రక ఆనవాళ్లుగా నిలిచే అనేక వస్తువులను ఇక్కడ భద్రపరిచారు. భారతీయ ఆలయాలు, శిల్ప సంస్కృతులను తెలిపే చిత్రాలు ఇక్కడ మనకు కనిపిస్తా యి. కాగా.. చారిత్రక సంపదను చెక్కు చెదరకుండా భద్రపరచడం ఎంతో క్లిష్ణమైన అంశం. ఈ విషయంలో ఏయూ అధికారులు ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. శతాబ్దానికి చేరువవుతున్న ఏయూకు ఈ మ్యూజియంలు అదనపు ఆభరణాలు. -
కొనసాగుతున్న ద్రోణి, ఆవర్తనం!
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడుపై సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే దక్షిణ చత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా రానున్న మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి.శని, ఆదివారాల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడ పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆదివారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వివరించింది. -
విశాఖ జూకు కొత్త అతిథులు
ఆరిలోవ (విశాఖజిల్లా): విశాఖలో ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్దిరోజుల్లో మరికొన్ని కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని తీసుకురావడానికి సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా (సీజెడ్ఏ) అనుమతులు లభించాయి. మరికొన్నింటిని తీసుకురావడానికి అనుమతులు రావాల్సి ఉంది.కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి కొత్త జంతువులు, అరుదైన పక్షులను అధికారులు తరచు తీసుకొస్తున్నారు. గత నెల 27న కోల్కతాలోని అలీపూర్ జూ పార్కు నుంచి జంతుమారి్పడి విధానం ద్వారా జత జిరాఫీలు, రెండుజతల ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, జత స్కార్లెట్ మకావ్ (రంగురంగుల పక్షి)లను ఇక్కడకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని వన్యప్రాణులను కొద్ది రోజుల్లో తీసుకురానున్నారు. బెంగళూరు జూ నుంచి మిలటరీ మెకావ్, రెడ్నెక్డ్ వాలిబీ, స్వైరల్ మంకీస్, మార్మోసెట్ మంకీస్, గ్రీన్ వింగ్ మెకావ్లను నెలరోజుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటి కోసం జూలో ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశారు. జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టార్టోయిస్లు జర్మనీ నుంచి 12 అలైబ్రొ జాయింట్ టార్టోయిస్లను విశాఖ జూకు తీసుకురానున్నారు. ఈ జాతి తాబేళ్ల జీవితకాలం వంద సంవత్సరాలు. ఇవి అరుదైనవి. మనదేశంలో ఇవి అరుదుగా కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు. వాటిని ఇక్కడకు తీసుకురావడానికి సీజెడ్ఏ అధికారుల అనుమతి లభించింది. వీటిని ఇక్కడకు తీసుకొస్తే వందేళ్ల వాటి జీవితకాలంలో ఆ జాతి సంతతి వృద్ధి చెందుతుంది. ఇతర జూ పార్కుల నుంచి జంతుమారి్పడి ద్వారా కొత్త వన్యప్రాణులను ఇక్కడకు తీసుకురావడానికి ఎక్కువగా అవకాశాలు కలుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు. వీటితోపాటు అహ్మదాబాద్ జూ పార్కు నుంచి వివిధ రకాల అరుదైన పక్షులను తీసుకొచ్చేందుకు సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించారు. అవికూడా వస్తే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది.త్వరలోనే కొత్త వన్యప్రాణులు విశాఖ జూకి ఒకటి, రెండునెలల్లో కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరు జూ నుంచి మీర్కాట్, రెడ్నెక్డ్ వాలబీ, స్వైరల్ మంకీస్, మర్మోసెట్స్, గ్రీన్ వింగ్డ్ మకావ్ తదితర జాతులతో పాటు జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టోర్టోయిస్లను ఇక్కడికి తీసుకురావడానికి సీజెడ్ఏ అనుమతులు లభించాయి. అహ్మదాబాద్ జూ నుంచి మరికొన్ని అరుదైన పక్షులను తీసుకురావడానికి సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించాం. సీజెడ్ఏ అనుమతులు వచ్చిన వెంటనే వాటిని తీసుకొస్తాం. గతనెలలో లీపూర్ జూ నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన జిరాఫీలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. జూలో అరుదైన వన్యప్రాణులను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. – డాక్టర్ నందనీ సలారియా, జూ క్యూరేటర్, ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతంగా ఉండే విశాఖలో ఎప్పుడు ఏదో ఒక అలజడి రేపాలని ఎల్లో బ్యాచ్ కుట్రలు చేస్తూనే ఉంటుంది. తాజాగా కంచర్లపాలెం పరిధిలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎల్లో బ్యాచ్ రంగంలోకి దిగింది.కుటుంబ కలహాలను పోలింగ్ ఘర్షణలకు లింకు పెట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలు డ్రామాలకు తెరతీశారు. పరామర్శ ప్రక్రియ పూర్తయ్యాక.. మభ్య పెట్టే మాటలు చెప్పి.. ఎల్లో మీడియాలో గొడవకు సంబంధించి కట్టుకథను వండివర్చారు. దీనికి మసాలా యాడ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. టీడీపీకి ఓటు వేసినందుకు హింసిస్తున్నారంటూ.. తన నక్క తెలివి తేటలతో మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. కల్పిత కథనాలను పదేపదే ప్రచారం చేస్తూ విశాఖలో ఏదో జరిగిపోయిందంటూ గగ్గొలు పెట్టింది ఎల్లో మీడియా. వారికి సోషల్ మీడియాలో పచ్చబ్యాచ్ కూడా తోడైంది. టీడీపీ నీచ రాజకీయాలను గుర్తించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి అసలు నిజాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో మరోసారి ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా పడింది.అసలు జరిగింది ఇదే..కంచరపాలెం పరిధిలో బుధవారం రాత్రి ఓ కుటుంబంపై జరిగిన దాడి వ్యక్తిగత గొడవల వల్లే తప్ప.. రాజకీయ ప్రమేయం లేదని డీసీపీ మేక సత్తిబాబు తెలిపారు. ఓట్ల కోసం జరిగిన దాడిగా తప్పుడు ప్రచారం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం కంచరపాలెం పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్థానిక బర్మా క్యాంప్, నూకాలమ్మ ఆలయం సమీపంలో సుంకర నూకరత్నం(నిరీష) కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటికి సమీపంలో ఆశ కుటుంబంతో ఉంటున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి చిన్నపాటి వివాదానికి ముందుగా నూకరత్నం, ఆమె కుటుంబ సభ్యులు ఆశ ఇంటిపై గొడవకు దిగి, వారి ఇంటిపై బీరు సీసాలు విసిరారు. ఇంటికి సమీపంలో ఉన్న ఆశ బంధువైన లోకేష్కు విషయం తెలిసి అక్కడికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న నూకరత్నం, ఆమె తల్లి ధనలక్ష్మి, కుమారుడు మణికంఠపై కర్రతో దాడి చేశాడు. గాయాలపాలైన వారంతా కేజీహెచ్ వెళ్లి అత్యవసర విభాగంలో చేరారు. అక్కడ బాధితులిచ్చిన ఎమ్మెల్సీ రిపోర్టు ప్రకారం పోలీసులు దాడికి పాల్పడిన లోకేష్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. లోకేష్ను రిమాండ్కి తరలించారు.టీడీపీ నేతలు తప్పుడు ప్రచారంరెండు కుటుంబాల మధ్య వివాదానికి టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమి దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్ సీపీకి ఓటేయలేదని ఆ నేతలే దాడి చేశారని పరామర్శ పేరుతో బాధితుల ఇంటికి వెళ్లి డ్రామాలు చేశారు. బాధితులతో ఆ విషయం చెప్పించారు. వాస్తవంగా పాత గొడవలు నేపథ్యంలోనే తమపై దాడి చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ దాడి అంటూ టీడీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. -
45 రోజుల్లో 10 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు ఎగుమతి
సాక్షి, విశాఖపట్నం: సరుకు హ్యాండ్లింగ్లో మేజర్ పోర్టులతో పోటీ పడుతూ నంబర్ వన్ దిశగా అడుగులు వేస్తున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) మరో మైలురాయిని అధిగమించింది. కేవలం 45 రోజుల్లోనే 10 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు ఎగుమతి, దిగుమతులు నిర్వహించి రికార్డు సృష్టించింది. 2024–25లో శరవేగంగా సరుకు హ్యాండ్లింగ్ నిర్వహణ కొనసాగుతోందని పోర్టు చైర్మన్ డా.అంగముత్తు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 90 ఎంఎంటీ లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు. 2023–24లో 10 ఎంఎంటీకి 47 రోజులు పట్టగా.. ఈసారి రెండు రోజుల ముందుగానే లక్ష్యాన్ని చేరుకున్నట్లు చైర్మన్ వివరించారు. విశాఖ పోర్టు రికార్డు -
గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
సబ్బవరం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని బాలుర గురుకుల కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్థానిక సబ్బవరం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని సబ్బవరం, దేవరాపల్లి, గొలుగొండ, శ్రీకృష్ణాపురం గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం ఇప్పటికే ప్రవేశ పరీక్ష నిర్వహించి, ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆన్లైన్ విధానం ద్వారా సీట్లు భర్తీ చేశారు. మిగులు సీట్ల కోసం మెరిట్ అధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరించి సీట్లు భర్తీ చేసేందుకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్కు సుమారు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆయా కళాశాలల్లో 188 సీట్లు ఖాళీగా ఉండగా, కౌన్సెలింగ్ ద్వారా 81 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అడ్మిషన్ కౌన్సెలింగ్ చైర్మన్గా ఉమ్మడి జిల్లా గురుకులాల సమన్వయకర్త ఎస్.రూపావతి, సభ్యులుగా ఆయా గురుకులాల ప్రిన్సిపాల్స్ సీహెచ్.వి.వి.సత్యారావు, ఆర్.రామకృష్ణ, సీహెచ్ రవీంద్రనాథ్, వి.రత్నవల్లి వ్యవహరించారు. -
22న నృసింహ హోమం
సింహాచలం: సింహగిరిపై ఈ నెల 22న పెద్ద ఎత్తున శ్రీ నృసింహ హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ నెల 22న నృసింహ జయంతి, శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి జన్మ నక్షత్రమై స్వాతి నక్షత్రం కలిసి వచ్చాయని వివరించారు. ఆలయ ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న విశాల ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులను భాగస్వాములను చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నృసింహ హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,500 టికెట్ను www. aptemples.ap.gov.inలో తీసుకుని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పాల్గొనవచ్చని తెలిపారు. అలాగే సింహగిరిపై ఉన్న పీఆర్వో కార్యాలయంలో కూడా టికెట్లు లభిస్తామని వివరించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement