జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
Published
Wed, May 1 2024 3:53 PM
విశాఖపట్నం, సాక్షి: భీమిలి నియోజకవర్గంలో జనసేన నాయకులకు ఘోర అవమానం జరిగింది. టీడీపీ ప్రచార రథంపై నుంచి జనసేన నేతలను బలవంతంగా గెంటేశారు. టీడీపీ ప్రచార రథంపై జనసేన జెండాలు లేకుండా చేశారు. టీడీపీ నేతలు చేసిన అవమానాన్ని తలుచుకొని జనసేన నేతలు రగిలిపోతున్నారు.
ప్రచారానికి పిలిచి అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా టీడీపీ నాయకులు తమను అవమానిస్తున్నారని మండిపడుతున్నారు. జరిగిన అవమానాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు జనసేన నేతలు సిద్ధమవుతున్నారు.