హోరాహోరీగా ‘ఏసీఎల్‌ –2’ | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా ‘ఏసీఎల్‌ –2’

Published Thu, May 16 2024 12:35 PM

-

అనంతపురం: జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనంతపురం క్రికెట్‌ లీగ్‌ –2 హోరాహోరీగా సాగుతోంది. బుధవారం దినేష్‌ గ్రానైట్స్‌, యునైటెడ్‌ చాంపియన్‌ క్రికెట్‌ క్లబ్‌ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి దినేష్‌ జట్టు బ్యాటింగ్‌ చేసింది. 18.5 ఓవర్లలో 144 పరుగులు వద్ద ఆలౌట్‌ అయింది. జట్టులోని బ్యాటర్‌ ఆష్రఫ్‌ 47 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. యునైటెడ్‌ జట్టు బౌలర్‌ రాజకుల్లాయప్ప నాలుగు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన యునైటెడ్‌ జట్టు 17.5 ఓవర్లలో 118 పరుగుల వద్ద చతికిలబడింది. జట్టులో అర్జున్‌టెండూల్కర్‌ 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు సాధించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును ఆష్రఫ్‌కు ప్రకటించారు. అలాగే అనంత రైజింగ్‌ స్టార్‌, ఇండియన్‌ సిక్సర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రైజింగ్‌ స్టార్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దినేష్‌ వర్మ 33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 పరుగులు, బి. ప్రశాంత్‌ 46 బంతుల్లో 52 పరుగులు, ఎంకే దత్తారెడ్డి 23 బంతుల్లో 33 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇండియన్‌ సిక్సర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించి ఓటమి పాలైంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement