-
ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్పై జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై విచక్షణరహితంగా దాడి చేసినట్లు తాజాగా స్వాతి మలీవాల్ ఆరోపించారు. సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూమ్లో ఉన్న కుమార్ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, చెంపదెబ్బ కొట్టాడని, ఛాతిపై తన్నాడని, లాగి పడేసినట్లు ఆమె ఆరోపించారు. ఆసమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు.కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి ఆరోపించిన ఉదంతం తెలిసిందే. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఈ విషయంలో స్వాతి మలీవాల్ పోలీసులకు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బిభవ్ కుమార్ను నిందితుడిగా పేర్కొంటూ గురువారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలాన్ని కూడా రికార్డుచేశారు.పోలీసులు ఎఫ్ఐఆర్లో ఆమె వాంగ్మూలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం.. సివిల్ లైన్స్లోని మలివాల్ సోమవారం సాయంత్ర ఆరు గంటలకు సీఎం నివాసానికి చేరుకుంది. ముఖ్యమంత్రి సహాయకుడిని సంప్రదించడానికి ప్రయత్నించగా. ఎలాంటి స్పందన రాలేదు. అనంతరం డ్రాయింగ్ రూమ్లో వేచి ఉన్న సమయంలో బిభవ్ కుమార్ గదిలోకి చొరబడి తనను దూషించడం ప్రారంభించాడని ఆమె ఆరోపించారు.‘కుమార్ నా ముఖంపై ఏడు,ఎనిమిది సార్లు కొట్టాడు. ‘నన్ను వెళ్లనివ్వండి’ అని చెప్పినప్పటికీ ఆయన వదలకుండా ఛాతీ, పొట్ట, సున్నితమైన భాగాలపై పలుమార్లు కొట్టాడు. హిందీలో దుర్భాషలాడాడు. 'నీ సంగతి చూస్తాం’ అంటూ బెదిరించాడు. కడుపులో నొప్పి వస్తుందని, నన్ను వదిలేయాలని వేడుకున్నాను.బిభవ్ చర్యలతో పూర్తిగా షాక్కు గురయ్యాను. సహయం కోసం గట్టిగా అరిచాను. నన్ను నేను రక్షించుకోవడానికి అతన్ని కాలితో తన్ని దూరంగా నెట్టేశాను. నేను బయటక పరుగెడుతుంటే నాపైకి దూసుకొచ్చాడు. నా చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు. ఛాతీ, కడుపు వంటి సున్నితమైన శరీరభాగాలపై పలుమార్లు దాడి చేశాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశా’’ అని స్వాతి మలీవాల్వె ల్లడించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.ఈ ఘటనపై మలీవాల్ గురువారం తొలిసారి స్పందిస్తూ.. ఈ దాడితో తాను తీవ్ర దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురయ్యాను పేర్కొన్నారు. 112 నంబర్కు కాల్ చేసి సంఘటనను నివేదించానని చెప్పారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. -
పాట్నాలో హైటెన్షన్.. అసలేం జరిగిందంటే..
బీహార్ రాజధాని పాట్నా నిరసనలతో అట్టుడికిపోతోంది. కోపంతో ఊగిపోతున్న కొందరు నడివీధుల వెంట చేరి చేతికి దొరికిన వస్తువుల్ని కాలుస్తున్నారు. ఆ ఆగ్రహావేశాలకు కారణం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారి అనుమానాస్పద రీతిలో చనిపోవడం. పాట్నాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పదరీతిలో చనిపోవడం, ఆ విషయాన్ని దాచేందుకు స్కూల్ సిబ్బంది యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి అండగా తోడైన ఓ కులం.. పాట్నాలో నిరసనలకు దిగింది. రోడ్లపై మంటలు పెట్టి.. సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. టినీ టాట్ అకాడమీ స్కూల్లో చదివే చిన్నారి.. గురువారం స్కూల్ ట్యూషన్ అయ్యాక కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో స్కూల్కు వచ్చారు. అయితే పాఠశాల సిబ్బంది పొంతన లేని సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బలవంతంగా స్కూల్లోకి అర్ధరాత్రి దాకా వెతికారు.చివరకు.. ఈ వేకువ ఝామున 3గం. ప్రాంతంలో స్కూల్ ఆవరణలోని డ్రైనేజీలో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కుటుంబ సభ్యులు స్కూల్కు నిప్పటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్కూల్కు చేరుకుని ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. ఎస్పీ చంద్రప్రకాష్ స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.#WATCH | Patna, Bihar: An angry crowd sets a school on fire after the body of a student was allegedly found on school premises. More details awaited. pic.twitter.com/6OwmDe8mjY— ANI (@ANI) May 17, 2024 స్కూల్లోకి వెళ్లిన చిన్నారి.. తిరిగి బయటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యింది. దీంతో ఆ అవరణాలోనే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాం. అయితే చిన్నారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్పీ అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, సిబ్బంది మృతదేహాన్ని దాచే యత్నం ఎందుకు చేసిందో తేలాల్సి ఉందన్నారు. మరోవైపు ఉద్రిక్తతలు విస్తరించకుండా పోలీస్ బలగాలను మోహరించినట్లు తెలిపారాయన. -
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
జహీరాబాద్: అమెరికాలోని చోర్లెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్ కారులో ఉండిపోయిన సెల్ఫోన్ కోసం వెళుతూ.. మళ్లీ రోడ్డు దాటుతున్న క్రమంలో అదే సమయంలో వేగంగా వచి్చన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పృథ్వీ మృతదేహం శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు. -
వంద మందికి పైగా పచ్చ గూండాలపై కేసులు
చంద్రగిరి/తిరుపతి లీగల్: ఎన్నికల నేపథ్యంలో సోమవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచువారిపల్లిల్లో టీడీపీ నాయకుల విధ్వంసకాండపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీ బాధితుల ఫిర్యాదు మేరకు రెండు వర్గాలకు చెందిన పలువురిపై కేసులు పోలీసులు నమోదు చేసినట్లు సమాచారం.ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి గన్మెన్ ఈశ్వర్రెడ్డి, పీఏ వేణుగోపాల్రెడ్డిపై దాడి చేసి గాయపరచడంతో పాటు వారిని నిర్బంధించిన ఘటనపైనా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే దుర్ఘటనలో సర్పంచ్ కొటాల చంద్రశేఖర్రెడ్డితో పాటు అయన అనుచరుల్ని తీవ్రంగా గాయపర్చడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడి, సర్పంచ్ ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలను దోచుకెళ్లి, ఇంటిని పూర్తిగా కాల్చి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుమారు 100 మందికి పైగా పచ్చగూండాలపై కేసులు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. విధ్వంసకాండపై కేసుల నమోదు రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లిల్లో చోటు చేసుకున్న విధ్వంసకాండపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కర్రలు, రాడ్లు, రాళ్లు, కత్తులతో దాడులు చేసి తీవ్రంగా గాయపరచడం, వాహనాలకు నిప్పంటించడం, ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి దాడులకు పాల్పడటం, ఇంట్లోని విలువైన బంగారం, వెండి, నగదుతో పాటు ఇతర వస్తువులను దోచుకెళ్లడం, ఇళ్లను ధ్వంసం చేసి, దగ్ధం చేయడం వంటి ఘటనలపై సెక్షన్ 143, 147, 452, 427, 323, 324, 380, 435, 436, ఐపిసీ రెడ్విత్ 149 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హింసాకాండ ఘటనలో 13 మందికి రిమాండ్ శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య జరిగిన ఘటన కేసులో ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఈనెల 29 వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాణిశ్రీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. -
నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్ :నరసరావుపేటలో రాజకీయాలను ‘పచ్చ’ దండు వ్యక్తిగత కక్షగా మార్చి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఓటమి భయంతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. చివరకు ఓటు వేసిన వారి ఇళ్లపై విధ్వంసానికి పూనుకుంది. పల్నాడు ప్రాంతంలో ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీల మధ్య గొడవలు ఎన్నో ఏళ్లుగా రగులుతూనే ఉంటాయి. ఎన్నికల అనంతరం ఆ పగలు చల్లారి, అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరికొత్త ప్రతీకారానికి తెర తీసింది.గత ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుని మరోసారి పోటీకి దిగిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు మళ్లీ ఓటమి ఖాయమని పోలింగ్కు ముందే అన్ని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్థిని అడ్డు తొలగించుకుంటే తన గెలుపు ఖాయమని భావించి, నరసరావుపేటలో విధ్వంసానికి ప్రణాళిక రచించారని సమాచారం. ఇందులో భాగంగా పోలింగ్ రోజున నరసరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి సుమారు 200 మంది టీడీపీ రౌడీలు మారణాయుధాలతో పట్టపగలు దాడికి వెళ్లారు. ఆ సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన మామ కంజుల రామకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనపై అరవింద్బాబుతో పాటు మరో 30 మందిపై నరసరావుపేట టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మట్టుబెట్టాలనే పథకంతోనే ఆయన ఇంటిపైకి దాడికి వచ్చినట్లు తెలిసింది. ఈ దాడికి ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లు, కిరాయి రౌడీలను అరవింద్ బాబు పోలింగ్ ముందు రోజు రాత్రికే రప్పించినట్టు సమాచారం.అరవింద బాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు గొడవల నేపథ్యంలో పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సయమంలో ఆయన ఇంట్లో (ఇల్లు, ఆస్పత్రి ఒకచోటే) సోదాలు నిర్వహించగా.. పెట్రోల్ బాంబులు, ఇనుప రాడ్లు, వేట కొడÐ] ళ్లు, కంకర రాళ్లు, ఇతర మారణాయుధాలు దొరికాయి. పోలింగ్కు ముందుగానే వీటిని తీసుకొచ్చి ఉంచినట్లు సమాచారం.ఈ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమని తేలడంతో గోపిరెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే మారణాయుధాలు తెప్పించినట్లు తెలిసింది. మారణాయుధాలకు సంబంధించిన వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయినా పోలీసులు ఇందుకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనర్హం. పోలీసు పెద్దల అనుమతి రాకపోవడం వల్లే అరవింద్బాబుపై కేసు నమోదు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నరసరావుపేటలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాగైతే తామెలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తాడిపత్రి ఘటనలో 91 మందికి రిమాండ్
విడపనకల్లు: పోలింగ్ అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ, వైఎస్సార్సీపీలకు చెందిన 91 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేసి ఉరవకొండ సివిల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజి్రస్టేట్ దుర్గా కళ్యాణి ఎదుట హాజరు పరిచారు. జడ్జి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని రెడ్డిపల్లిలోని అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే అక్కడ సౌకర్యాలు సరిగా లేవని, శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ జడ్జికి తెలిపారు. అందువల్ల నిందితులను కడప కేంద్ర కారాగానికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు జడ్జి నిరాకరించారు. జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. కోర్టు వద్ద భారీ భద్రత అల్లర్ల ఘటనలో నిందితులను ఉరవకొండకు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఉదయం నుంచి కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నిందితుల బంధువులు భారీగా కోర్టు వద్దకు తరలివచ్చారు. పోలీసులు ఉదయమే ఉరవకొండ కోర్టు ఆవరణను ఆ«దీనంలోకి తీసుకున్నారు. గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్సీపీకి చెందిన 37 మందిని, టీడీపీకి చెందిన 54 మందిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఐపీసీ 143, 147, 324, 307, 363 ఆర్డబ్యూ149 కింద కేసులు నమోదు చేశారు. -
భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
యశవంతపుర: గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్యకు వీడియో కాల్ చేసి తిరిగి రావాలని అర్థించాడు ఓ భర్త. దీనికి ఆమె నిరాకరించడంతో బెదిరించాలని ఉరేసుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు బాగలగుంటెలో చోటుచేసుకుంది. బీహార్కు చెందిన అమిత్కుమార్ సాహ (28) దాసరహళ్లిలో జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం హసన్కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదువు నిమిత్తం భార్యను నర్సింగ్ కోర్సులో చేర్చాడు. ఆమె నిరంతరం ఫోన్లో స్నేహితులతో మాట్లాడుతూ తనను పట్టించుకోకపోవడంతో భార్యతో గొడపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో గురువారం అమిత్ భార్యకు వీడియో కాల్ చేసి ఇంటికి రావాలని బతిమాలాడు. రాకపోతే ఉరి వేసుకొని చనిపోతానని బెదిరించాడు. ఇంతలో చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడటంతో పాటు గొంతుకు ఉరి బిగిసి మృత్యువాత పడ్డాడు. -
కవిత బెయిల్ పిటిషన్పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు.కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలోవున్న పిటిషనర్ను సీబీఐ కూడా అరెస్టు చేసిందన్నారు. కవిత అరెస్టుకు అనుమతిస్తూ.. సీబీఐకి ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అనంతరం కవిత బెయిల్ పిటిషన్పై వైఖరి తెలపాలంటూ సీబీఐకి న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. -
ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి
సాక్షి, హైదరాబాద్: శంకర్పల్లి ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం చేసుకుంది. బీటెక్ విద్యార్థిని లేఖపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో యాసిడ్ దాడి జరిగింది. విద్యార్థిని లేఖ్యపై తోటి విద్యార్థులు యాసిడ్ దాడి చేశారు. రంగు నీళ్లకు బదులు బకెట్లో యాసిడ్ను విద్యార్థులు నింపారు. రంగు నీళ్లు అనుకొని యాసిడ్ని తోటి విద్యార్థులు విద్యార్థినిపై పోశారు. విద్యార్థిని లేఖకు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. -
జిమ్ చేస్తూ కుప్పకూలి 17 ఏళ్ల మైనర్ కన్నుమూత
జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం తరువాత ఆరోగ్యం ఉన్నవారు వ్యాయామం చేస్తూ పలు ఆకస్మిక మరణాలు ఆందోళన రేపుతున్నాయి. జిమ్లో వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల బాలుడు మరణించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోఈ విషాదం చోటు చేసుకుంది. భాన్పురిలోని స్పేస్ జిమ్లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రోజు మాదిరిగానే ట్రెడ్మిల్పై పరిగెత్తుతూ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల సమాచారం ప్రకారం సత్యం (17) రహంగ్డేల్ భన్పురిలోని ధనలక్ష్మి నగర్లో నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం జిమ్లోని ట్రెడ్మిల్పై పరిగెత్తుతున్న అతడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపో యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. అయితే అతని మరణానికి గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడిరచలేదు. పోస్టుమార్టం నివేదిక తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.సత్యం తండ్రి సుభాష్ రహంగ్డేల్ చిరు వ్యాపారం చేసుకునేవాడు. ఇద్దరు కుమారుల్లో సత్యం పెద్దవాడు. ఇటీవల ధనలక్ష్మి నగర్లోని కృష్ణ ఇంగ్లీషు మీడియం స్కూల్లో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఈ సంతోషం వారికి ఎంతోకాలం నిలవలేదు. ఎదిగిన కొడుకు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
యశవంతపుర: కోనసంద్రలో ఈ నెల 10న జరిగిన దివ్య అనే మహిళ హత్య కేసును కెంగేరి పోలీసులు ఛేదించారు. ఇంటిలో అద్దెకు ఉన్న యువతి దివ్యను గొంతు పిసికి చంపేసినట్లు నిర్ధారించారు నిందితురాలిని అరెస్ట్ చేశారు. వివరాలు.. గురుమూర్తి, దివ్య దంపతులకు చెందిన ఇంటిలోని ఒక పోర్షన్లో కోలారు జిల్లాకు చెందిన మోనిక (24) అనే యువతి అద్దెకు ఉండేది. ప్రియుడినే భర్తగా చూపి ఇల్లు అద్దెకు తీసుకుంది. ప్రైవేట్ సంస్థలో డేటా ఎంట్రీ అపరేటర్గా పని చేస్తుంది. ప్రియుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. విలాసాలకు అలవాటు పడిన మోనిక తన ప్రియుడికి క్యాంటర్ వాహనం కొనివ్వాలని డబ్బు కోసం ప్రయత్నించింది. ఇంటి యజమాని దివ్య మెడలో ఉన్న బంగారంపై మోనికాకు కన్నుపడింది.దివ్య భర్త గురుమూర్తి కెంగేరి శివనపాళ్యంలో సెలూన్ నడుపుతుండగా, అత్తమామలు ఉదయం పనులకెళ్లి రాత్రికి వచ్చేవారు. దివ్య తన రెండేళ్ల చిన్నారితో ఇంటిలో ఉండేది. గమనించిన మోనిక.. ఈ నెల 10న ప్రియునితో కలసి దివ్యను గొంతుపిసికి హత్య చేసి ఆమె మెడలోని 36 గ్రాముల బంగారం చైన్ తీసుకొని ఉడాయించారు. పోలీసులు అనుమానంతో మోనికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది. ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
ప్రేమించి పెళ్లాడి.. ఆత్మహత్య
సాక్షి బళ్లారి/ హుబ్లీ: ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్న నవ దంపతులు ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ విధి మరోలా తలచింది. అంతు తెలియని సమస్యలతో ఆ జంట ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విజయపురలో చోటు చేసుకుంది. వివరాలు.. విజయపుర నగరంలోని సిద్దేశ్వర బడావణెలో నివాసం ఉంటున్న మనోజ్కుమార్ పోలా (30), రాఖీ (23) అనే యువతీ యువకులు ప్రేమలో పడ్డారు. నాలుగు నెలల క్రితం పెద్దలను కాదని గుడిలో పెళ్లి చేసుకొన్నారు. మనోజ్ తల్లి ఇంట్లోనే ఇద్దరూ కాపురం పెట్టారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని మంగళవారం రాత్రి ఇద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మనోజ్కుమార్ తల్లి ఊరికి వెళ్లి బుధవారం ఉదయమే తిరిగి రాగా ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటనపై జలనగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలే కారణం కావచ్చని స్థానికులు తెలిపారు. -
బిల్ కలెక్టర్ రాసలీలలు
కేజీఎఫ్: కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలోని రామసాగర గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్ కామాంధునిగా అవతారమెత్తాడు. పనుల కోసం వచ్చే మహిళలను బెదిరించి లోబర్చుకుని కామలీలలకు పాల్పడుతున్నాడు. తోటి మహిళా ఉద్యోగుల మీద కూడా కన్నేశాడు. ఓ కాంట్రాక్టు ఉద్యోగినితో అతగాడు రాసలీలలు చేసిన వీడియోలు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాలు.. బిల్ కలెక్టర్ అర్జున్ హరికృష్ణ (36) లీలలు ఇవి. బాధితురాలు మాట్లాడుతూ పంచాయతీలో ఉద్యోగం పర్మినెంట్ చేయడంతో పాటు, భర్తకు కూడా ఉద్యోగం కల్పిస్తానని తనకు ప్రలోభాలు పెట్టేవాడని తెలిపింది. ఒప్పుకోకుంటే తీవ్రచర్యలుంటాయని భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. పంచాయతీ కార్యాలయంలోనే ఈ అకృత్యం చోటుచేసుకుంది. హరికృష్ణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ సభ్యులు పిడిఓకు విన్నవించారు. బాధితురాలిని ఒప్పించి ఆమె చేత బేత మంగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. బాధితురాలి ఫిర్యాదుతో బిల్ కలెక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్కు బిగ్ షాక్..
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జ్షీట్ నమోదు చేసింది. బీఎస్-IV వాహనాల మనీలాండరింగ్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్షీట్ను ఫైల్ చేసింది.ఈడీ ఛార్జ్షీట్లో భాగంగా.. హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. బీఎస్-4 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను ఏప్రిల్ 1, 2017 నుంచి భారతదేశంలో విక్రయించరాదని, రిజిస్ట్రేషన్ చేయకూడదని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ. గోపాల్ రెడ్డితో పాటుగా పలువురు అశోక్ లేల్యాండ్ లిమిటెడ్ నుంచి బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేశారు.ఈ క్రమంలో జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సీ.గోపాల్ రెడ్డి అండ్ కో పేరుతో భారీ తగ్గింపుతో బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేసి, మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ పత్రాల ఆధారంగా బీఎస్-4 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ కొనుగోళ్లు నాగాలాండ్లో జరుగగా.. కొన్ని కర్ణాటక, ఏపీలో కూడా జరిగాయని ఈడీ తెలిపింది.జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి పేరిట 104 వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ వాహనాల్లో చాలా వరకు వాటిని బీఎస్-4 వాహనాలుగా ఉపయోగించడం ద్వారా వారి రవాణా వ్యాపారంలో వారు మరింత ఉపయోగించుకున్నారు. అలాంటి కొన్ని వాహనాలను బీఎస్-4 వాహనాలుగా చూపి విక్రయించారు. ఈ వాహనాలను సొంతం చేసుకోవడం, నడపడం, విక్రయించడం ద్వారా 38 కోట్ల రూపాయలు ఆర్జించినట్టు ఈడీ పేర్కొంది. అంతకుముందు, జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ గోపాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు చెందిన 68 కోట్ల చరాస్తులు.. 28.6 కోట్ల రూపాయల స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధదంపతులు దుర్మరణం
బోనకల్(ఖమ్మం): కుమారుడికి వద్దకు వెళ్తున్న వృద్ధ దంపతులకు అదే ఆఖరి ప్రయాణమైంది. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్ట డంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ(92) డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య రుక్మిణి(85)తో మధిరలోనే స్థిరపడ్డారు. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.వృద్ధాప్యం కారణంగా వారి సంరక్షణ కోసం ఒకే కేర్టేకర్గా నియమించడంతో కుమారుల వద్ద కొన్నేసి రోజుల చొప్పున ఉంటున్నారు. బుధవారం మధిరలోని ఇంటి నుంచి ఖమ్మంలో ఉంటున్న పెద్దకుమారుడు వద్దకు మనవడు కొత్తూరు అనిల్, కేర్టేకర్ నాగరాజుతో కలిసి వెళ్తున్నాడు. కారును అనిల్ నడుపుతున్నాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు.ఈ ఘటనలో సూర్యనారాయణ, రుక్మిణి తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. మనుమడు అనిల్, కేర్టేకర్ నాగరాజు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారుకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు లాక్ పడి ఉండడంతో తలుపులు పగులగొట్టి మృతదేహాలు, క్షతగాత్రులను బయటకు తీశారు. కారు తలుపులను పగలగొట్టడంలో ఏమాత్రం ఆలస్యమైనా లోపల ఉన్న వారంతా మంటల్లో కాలిపోయే వారని తెలిసింది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం మహీంద్రా ఎస్యూవీను ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.ఈ ఘటనపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ జిల్లాలోని ఇండోర్-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నట్టు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. #NewsWithR #MadhyaPradesh: Eight people killed and one injured in road accident.According to Additional Superintendent of Police (ASP) Rupesh Kumar Dwivedi, a jeep collided with an unidentified vehicle near Ghatabillod on the Indore-Ahmedabad National Highway.@MPPoliceDeptt pic.twitter.com/x994AFzsiq— Ravi Rana (@RaviRRana) May 16, 2024 ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే, ప్రమాదం జరిగిన అనంతరం గుర్తు తెలియని వాహనం డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడని చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుండగా.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, సదరు వాహనం గునా అనే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. -
పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
వెంగళరావునగర్: పెంపుడు కుక్క అరచిందని పెద్ద గొడవే జరిగింది. ఓ కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చి చితకబాదారు కొందరు. తన తమ్ముడితో పాటు మరదలును, కుక్కను హత్య చేయబోయారంటూ ఓ వ్యక్తి మధురానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రహమత్ నగర్ లో నివాసం ఉండే ఎన్. శ్రీనాధ్, అతని భార్య స్వప్నలు ఈ నెల 8వ తేదీనాడు ఉదయం పోస్టల్ బ్యాలెట్ వేయడానికి తన పెంపుడు కుక్కతో పాటు ఇంటి నుంచి బయలుదేరాడు. అదే సమయంలో ఇంటి పక్కన ఉన్న వ్యక్తి వారి కుక్క రోడ్డుపై ఉన్నారు. ఆ సమయంలో వీరి కుక్క వారిని చూసి మొరిగింది. దాంతో ధనుంజయ్ అనే వ్యక్తి భార్య భర్తలను దుర్భాషలాడాడు. ఈ విషయంపై నాడు మధురానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఈ నెల 14వ తేదీ సాయంత్రం శ్రీనాధ్ కుక్కతో బయటకు రాగా ధనుంజయ్ అనే వ్యక్తితో పాటు నలుగురు వ్యక్తులు వచ్చి శ్రీనాధ్ ను, అతని భార్య స్వప్నతో పాటుగా మేనల్లుడు, కోడలును, కుక్కను సైతం చంపుతామని బెదిరిస్తూ తీవ్రంగా కర్రలతో, రాడ్లతో కొట్టారు. దాంతో శ్రీనాథ్ అపస్మారకస్థితికి వెళ్లాడు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో శ్రీనాథ్ సోదరుడు ఎన్.మధు మధురానగర్ పీఎస్ లో ఎల్. మధుతో పాటు మరో నలుగురిపై హత్యయత్నం కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టీవీ సీరియల్ మేకప్మెన్ దారుణ హత్య
రహమత్నగర్: రహమత్నగర్ డివిజన్ పరిధిలోని నిమ్స్మే మైదానంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల సమాచారం మేరకు... కార్మిక నగర్ చిల్లా వద్ద పక్కన ఉన్న నిమ్స్మే మైదానం లోపల గోడ వద్ద పడివున్న యువకుడి మృతదేహాన్ని గుర్తించిన నిమ్స్మే సెక్యూరిటీ సిబ్బంది బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఆర్నగర్ ఏసీపీ వెంకటరమణ, బోరబండ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వీరశేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు టీవీ సీరియల్స్ మేకప్మెన్గా పనిచేసే మహబూబ్నగర్ వనపర్తి ప్రాంతానికి చెందిన చుక్కా చెన్నయ్య అలియాస్ తరుణ్తేజ్(28)గా గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు.మారణాయుధాలతో దాడి జరుగున్న క్రమంలో మృతుడు గాయాలతో పరిగెత్తి గోడ వద్ద కుప్పకూలి పోయి ఉంటాడని పోలీసులు అంచనాకు వచ్చారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి మృతుడు చెన్నయ్యతో పాటు ఎంత మంది నిమ్స్ మే మైదానంలోని వచ్చారు? ఎలా వచ్చారు? అనే వివరాలను పోలీసులు అరా తీస్తున్నారు. కార్మిక నగర్, బస్ స్టాప్, కారి్మకనగర్ శ్రీరాంనగర్ ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటు వేసేందుకు వచ్చి మృత్యువాత
‘అర్ధరాత్రి.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్క సారిగా దఢేల్ మని పే..ద్ద శబ్ధం.. కళ్లు తెరిచి చూసేలోగా మంటలు.. నిప్పు రవ్వలు మీద పడి అంటుకుంటున్న దుస్తులు.. కేకలు, అరుపులు.. కాపాడండని ఆర్తనాదాలు.. కిటికీ అద్దాలు పగులగొట్టి కొందరు.. డోర్ తెరుచుకుని మరికొందరు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగా.. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు అక్కడికక్కడే క్షణాల్లో కాలి బూడిదయ్యారు.. అంతా కలలోలాగా జరిగింది. నిజంగా కల అయితే బాగుండు’ అని ఆ ప్రమాదం నుంచి బయట పడిన వారుఅంటున్నారు. వారింకా షాక్ నుంచి తేరుకోలేదు.చినగంజాం/చిలకలూరిపేట : ప్రైవేట్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఓటు వేసేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న చినగంజాం, చీరాల వాసులు నలుగురు, రెండు వాహనాల డ్రైవర్లు మృత్యువాత పడ్డారు. మరో మహిళ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇంకో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓటేసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో ఉంటున్న చాలా మందికి పర్చూరు నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయి. దీంతో పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి, ఆదివారం రాత్రి వారిని పర్చూరుకు తరలించారు. ఇందులో భాగంగా చినగంజాంకు చెందిన ఓటర్లు సైతం హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరంతా సోమవారం ఓట్లు వేసి, మంగళవారం రాత్రి ఏలూరు సాంబశివరావు ఏర్పాటు చేసిన బస్సుల్లో హైదరాబాద్కు తిరిగి పయనమయ్యారు. చినగంజాంకు చెందిన 42 మంది చీరాలకు చెందిన ట్రావెల్స్ బస్సు (ఏపీ 27 టీటీ 6577)లో రాత్రి 11 గంటలకు బయలు దేరారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ బస్సు.. పల్నాడు జిల్లా ఈవూరుపాలెం వద్ద ఎదురుగా కంకర మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ (ఆర్జే 23 జీసీ 2452)ను ఆయిల్ ట్యాంక్ వద్ద బలంగా ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు టిప్పర్, ఇటు బస్సుకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బస్సులో బ్యాటరీ ఫెయిల్ అవడంతో చీకటి అలముకొంది. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు తప్పించుకొని వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో బస్సు డోర్ వద్ద ఉన్న చినగంజాంకు చెందిన యువకుడు సింగోతు సాయి కేకలు వేస్తూ ప్రయాణికులను నిద్ర లేపాడు. చాలా మంది ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ డోర్ ద్వారా బయటకు రాగా, మరికొంత మంది కిటికీ అద్దాలను పగులగొట్టి, అత్యవసర ద్వారాన్ని తెరచుకొని బయటకు దూకేశారు. అప్పటికే మంటలు అంటుకొని కొందరు ప్రయాణికులు హృదయ విదారకంగా కేకలు పెట్టారు. ఈ లోగా మంటలు భారీగా చెలరేగి బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికులు నలుగురు బస్సులోనే కాలి బూడిదయ్యారు. ఒకే కుటుంబంలో ముగ్గురు..ఉప్పుగుండూరి కాశీ బ్రహ్మేశ్వరరావు, అతని భార్య లక్ష్మీ బస్సు వెనుక భాగంలో కూర్చొన్నారు. వీరు వృద్ధులు కావడంతో త్వరగా బయట పడలేకపోయారు. పైగా మనవరాలు ఖ్యాతి సాయి నిద్రలో ఉండటంతో ఆ పాపను లేపి.. బయటకు రాలేకపోయారు. అంతలోనే మంటలు చుట్టు ముట్టడంతో తప్పించుకోలేని స్థితిలో ఆహుతై ప్రాణాలు విడిచారు. వృద్ధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి భావన హైదరాబాద్లో, చిన్నమ్మాయి పూజ ఒంగోలులో ఉంటున్నారు. ఓటు వేసేందుకని పెద్ద కుమార్తెతో కలిసి నీలాయపాలెం వచ్చారు. అనంతరం ఒంగోలుకు వెళ్లి చిన్న కుమార్తె కూతురు ఖ్యాతి సాయిని వెంట తీసుకుని చినగంజాం నుంచి టీడీపీ వారు ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ బయలు దేరారు. పిల్లల చదువుల నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్న దావులూరి శ్రీను కూడా ఓటు వేసేందుకే వచ్చారు. 20 మంది క్షతగాత్రులు చినగంజాం వాసులేదుర్ఘటనలో గాయపడిన 30 మందిని చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాలకు చెందిన 108 వాహనాల ద్వారా చిలకలూరిపేట ఏరియా ఆçస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఎన్.కీర్తి, కె.వెంకటరావు, సీహెచ్.శంకర్రావు, ఎన్.రాజ్యలక్ష్మి, ఎస్.కళావతి, డి.భువన, సీహెచ్.ఆదిలక్ష్మి, పి.లక్ష్మి, కె.లిప్సికను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మరో 20 మందికి ప్రా«థమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. క్షతగాత్రుల్లో 20 మందికి పైగా చినగంజాం మండల వాసులే. మృతి చెందిన పాప పెద్దమ్మ భావన తన వారిని రక్షించుకునే క్రమంలో తీవ్ర గాయాలపాలైంది. శరీరం బాగా కాలిపోవడంతో గుంటూరులో చికిత్స పొందుతోంది. కడవకుదురుకు చెందిన తాటి రాజీ (సాఫ్ట్వేర్), గొల్లపూడి ఉదయభాను(సాఫ్ట్వేర్), చినగంజాంకు చెందిన తాటి సాయిలక్ష్మి (సాఫ్ట్వేర్), మమత (కోచింగ్), అడివీధిపాలెంకు చెందిన రాయని బాలాజీ (ఫొటోగ్రాఫర్), పెదసింగు నాగరాజు, పెదసింగు తిరుపతమ్మ, పెదసింగు నాగరాజు కుమారుడు ఈశ్వరసాయి, కుమార్తె జస్వంతి, బొమ్మిడి మాలతి, గొనసపూడికి చెందిన కందిమళ్ల తేజీ, యలమల ఆకాష్, నీలాయపాలెంకు చెందిన దంపతులు అంజిబాబు, సామినేని సింధూజ, చినగంజాం అంబేడ్కర్ నగర్కు చెందిన బొలిమెర సుధాకర్, మేడికొండ చినఅంకయ్య, అతని భార్య సౌజన్య, కుమార్తె అక్షయ, బడుగు సంజన తదితరులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుల వివరాలివీ..ఈ దుర్ఘటనలో చీరాలలోని పేరాలకు చెందిన బస్సు డ్రైవర్ షేక్ మస్తాన్ షరీఫ్ (47), టిప్పర్ డ్రైవర్ మధ్యప్రదేశ్కు చెందిన హరిసింగ్ (39), బస్సులో ప్రయాణిస్తున్న చినగంజాం మండలం నీలాయపాలెం గ్రామానికి చెందిన దంపతులు ఉప్పుగుండూరు కాశీబ్రహ్మేశ్వరరావు (65), ఉప్పుగుండూరు లక్ష్మీ(55), వీరి మనవరాలు ఒంగోలు పట్టణానికి చెందిన బొప్పిరాజు ఖ్యాతి సాయి (9), చినగంజాం మండలం గోనెపూడి గ్రామానికి చెందిన దావులూరి శ్రీనివాసరావు (54) సజీవ దహనమయ్యారు. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రమాదం జరిగిందిలా..చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం డొంక సమీపానికి బస్సు రాగానే, అదే సమయంలో పసుమర్రు వైపు నుంచి గ్రావెల్తో కూడిన టిప్పర్ ( చీరాల వైపు వెళుతూ) ఎదురుగా వస్తోంది. ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో రోడ్డు మార్జిన్ కనిపించక వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పి టిప్పర్ను ఢీకొంది. టిప్పర్ డ్రైవర్ రోడ్డు మార్జిన్ దిగినప్పటికీ, బస్సు వేగంగా వెళ్లి టిప్పర్ లారీకి ఉన్న డీజిల్ ట్యాంకును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో రూరల్ సీఐ పి.శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ జి.రవికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా∙స్థలం వద్దే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి : పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం జగన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి రజినిరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పోలీస్ ఏడీజీ శంఖబ్రత బాగ్చి, గుంటూరు ఎస్పీ తుషార్ డూడి, నరసరావుపేట డీఎస్పీ వర్మ, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబీకులను పరామర్శించి ప్రభుత్వం నుంచి తగు సహాయం అందేలా చూస్తామని మంత్రి రజిని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై నరసరావుపేట డీఎస్పీ వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ.. బస్సు అతివేగమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ ద్వారా శాంపిల్స్ సేకరిస్తున్నామని, డ్రైవర్లు మద్యం సేవించారా లేదా అనే విషయం ల్యాబ్ రిపోర్టుల తర్వాత తెలుస్తుందని చెప్పారు. చిట్టితల్లికి అప్పుడే నూరేళ్లు నిండాయిఒంగోలు టౌన్: ఒంగోలులోని సత్యనారాయణపురంలో ఉంటున్న సుబ్బారావు, పూజ దంపతుల గారాల పట్టి, ఏకైక పుత్రిక ఖ్యాతి సాయి. పెద్దయ్యాక పెద్ద డాక్టరై మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఆ పాపకు ఖ్యాతి అని పేరు పెట్టుకున్నారు. ప్రాణంగా పెంచుకున్నారు. చిట్టి తల్లిని చూసి మురిసిపోయారు. స్కూలులో మీ పాపే ఫస్ట్ అని టీచర్లు చెప్పిన మాటలు విని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పాపకు మంచి చదువులు చదివించుకోవచ్చని దర్శి మండలం వీరాయపాలెం నుంచి ఒంగోలుకు వచ్చి ఉంటున్నారు. నగరంలోని లంబాడిడొంకలో ఒక స్కానింగ్ సెంటర్లో సుబ్బారావు పీఆర్ఓగా, పూజ రిసెప్షనిస్టుగా పని చేస్తున్నారు. ఇద్దరి సంపాదనతో ఖ్యాతిని బాగా చదివించుకోవాలని కలలు కన్నారు. అయితే విధి వక్రీకరించింది. కన్నకూతురు కాలి బూడిదైందన్న వార్త విన్న ఆ దంపతుల గుండె పగిలిపోయింది. గుండెలవిసేలా రోధించారు. స్కూలుకు సెలవులు కావడంతో అవ్వా తాతల వెంట హైదరాబాద్కు పంపారు. ఖ్యాతి ఇక లేదన్న వార్త విని చుట్టుపక్కల వారంతా కంట నీరు పెట్టుకున్నారు. పాప తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. -
రెచ్చిపోతున్న పచ్చమూక పల్నాడులో ఆగని విధ్వంసం
సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడు జిల్లాలో టీడీపీ మూకల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ మూకలు బుధవారం దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ దాడుల నుంచి తప్పించుకొని గ్రామాలు వదిలివెళ్లిపోయిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా ఇళ్లకు పూర్తిగా చేరుకోలేదు. తెలిసిన వారి ఇళ్లల్లో దూరప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కుటుంబంలోని మహిళలు, పిల్లల బాగోగుల గురించి వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీసులు రక్షణ కల్పిస్తే గ్రామాలకు తిరిగిరావాలని చూస్తున్నారు. మరోవైపు మాచర్ల, గురజాల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీడీపీ మూక స్వైరవిహారం.. మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో గ్రామం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా గ్రామాలకు చేరలేదు. పోలీస్ పికెటింగ్ ఉన్నా మళ్లీ టీడీపీ మూకలు దాడులు చేస్తాయనే అభద్రతాభావంతో గ్రామానికి దూరంగా ఉంటున్నారు. పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో టీడీపీ మూకలు విధ్వంసకాండ కొనసాగిస్తుండటంతో పోలీసులు జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ విధించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో దుకాణాలను మూసివేయించారు. చివరకు కొన్నిచోట్ల మెడికల్, కూరగాయలు, పాల దుకాణాలు, టీస్టాల్స్ను కూడా తెరవలేదు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి మించి గుమిగూడకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ టీడీపీ నేతల దాడులు ఆగడం లేదు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటు వేయని వారిపై దాడులు కొనసాగిస్తున్నారు. గ్రామానికి తిరిగిరాగానే పచ్చ మూకల దాడి.. గురజాల నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. పల్లెల్లో టీడీపీ ఫ్యాక్షన్ చిచ్చురేపుతోంది. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలింగ్ రోజునే ఆదిరెడ్డితో టీడీపీ నాయకులు వాగి్వవాదానికి దిగారు. పోలింగ్ ముగిశాక గ్రామంలో పరిస్థితి బాగోలేకపోవటంతో రెండు రోజులపాటు వేరే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటిలో ఆయన తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం మాదినపాడు చేరుకున్న వెంటనే 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు కర్రలు, ఇనుపరాడ్లతో ఆదిరెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయాలు కావడంతో సొమ్మసిల్లిపడిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని ఆదిరెడ్డిని పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. ఆదిరెడ్డి తలలో నరాలు తెగి రక్తప్రసరణ నిలిచిపోయిందని.. రెండు మేజర్ సర్జరీలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం.. నాదెండ్ల మండలం అప్పాపురంలో వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షుడు కోవెలమూడి సాంబశివరావుపై కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. పోలింగ్ రోజు పన్నెండో బూత్లో ఎస్సీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో బారులు తీరి రాత్రి 7 గంటల వరకు ఓట్లేశారు. వీరికి సాంబశివరావు అండగా ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకున్న టీడీపీ నేతలు ఆయనపై దాడికి దిగారు. మరికొంతమందిపై కూడా దాడి చేసేందుకు కారులో వెంటపడ్డారు. అలాగే పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణç³ల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెంకయ్య, విజయేంద్రబాబుల ఇళ్లపై దాడి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో గురజాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్.. పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేసి వారిని ఇంటికే పరిమితం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను హౌస్ అరెస్ట్లో ఉంచారు. మరోవైపు అల్లర్లకు కారణమైన టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జిల్లావ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా నేరస్వభావం ఉన్న వారిని బైండోవర్ చేశారు. దీంతో వందలాది మంది గ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు మకాం మార్చారు. -
బడుగులపై బరితెగింపు
అయ్యన్న గ్యాంగ్ అరాచకంఎన్నికల్లో చురుగ్గా పని చేసిందనే క్షక్షతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో ఓ ఒంటరి మహిళ పట్ల అయ్యన్నపాత్రుడి అనుచరులు దుశ్శాసనుల్లా వ్యవహరించారు. మంగళవారం అర్థరాత్రి బాధితురాలి ఇంట్లోకి చొరబడి జుత్తు పట్టుకొని ఈడ్చుకొచ్చి కాళ్లతో తన్నుతూ.. తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దుశ్చర్యను అడ్డుకోడానికి ప్రయత్నించిన స్థానికులపై పచ్చముఠాలు విరుచుకుపడ్డాయి. బాధితురాలు పొలమూరి రాజకుమారి 13 ఏళ్ల తన కుమారుడితో కలసి జీవిస్తోంది. కొన్నాళ్లు వలంటీరుగా పని చేసింది. పోలింగ్ రోజు ఓటర్లకు స్లిప్లు రాసిచ్చి వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేయడం అయ్యన్న పాత్రుడి అనుచరులకు మింగుడు పడలేదు. పోలింగ్ మర్నాడు బాధితురాలు అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో టీడీపీకి చెందిన రెడ్డి రాజేష్, రెడ్డి సత్యసాయి, కామిరెడ్డి శివ, సుకల రాజేష్, పెట్ట గంగాధర్, అల్లు రాజు, వానపల్లి రాజేష్, సొర్ల రఘు, నందిపల్లి బోయిల నాయుడు ఆమె ఇంటిని చుట్టుముట్టి తలుపులు బాదటంతో బయటకు వచ్చింది.రౌడీ మూకలు ఆమె మొబైల్ను లాక్కుని భౌతిక దాడికి పాల్పడ్డాయి. మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. దీన్ని ప్రతిఘటించిన వృద్ధురాలు సీతమ్మ చెంపపై కొట్టి చెవి దుద్దులు లాక్కున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడి అనుచరురాలు, జెడ్పీటీసీ సుకల రమణమ్మ తన అనుచరులను దాడికి పురిగొల్పినట్లు బాధితురాలు పేర్కొంది.సాక్షి, అమరావతి/విశాఖ సిటీ/ఉంగుటూరు, నెట్వర్క్: ‘ఈసీ’ ఉదాసీనతతో పేట్రేగుతున్న పచ్చ ముఠాలు రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై పాశవికంగా దాడులకు తెగబడుతున్నాయి. గ్రామాల్లో హింసను ప్రేరేపిస్తూ దమనకాండకు తెర తీశాయి. అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి అనుచరులు ఒంటరి మహిళపై కీచక పర్వానికి తెగబడగా కృష్ణా జిల్లా ఉంగుటూరులో ఫ్యాన్కు ఓటేసిందనే కక్షతో ఓ మహిళను ట్రాక్టర్తో తొక్కించి హత్యాయత్నానికి తెగబడ్డాయి. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా పని చేయడమే ఈ అక్కచెల్లెమ్మలు చేసిన నేరం! తాజాగా పల్నాడులోనూ టీడీపీ మూకల దాష్టీకాలకు బడుగు, బలహీన వర్గాలు ఓ రాత్రంతా దేవాలయంలో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఓట్ల లెక్కింపు వరకు విధ్వంసకాండ కొనసాగించే ప్రణాళికను టీడీపీ మూకలు అమలు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు చేపట్టే జూన్ 4వరకు రాష్ట్రం రావణకాష్టంగా రగులుతూ ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనికనుగుణంగానే టీడీపీ గూండాలు, రౌడీ మూకలు స్వైర విహారం చేస్తుండటంతో ఏపీలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల కమిషన్ ఈ దాడుల పట్ల నిర్లిప్తంగా వ్యవహరించడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. సమస్యాత్మక జిల్లాల్లో బదిలీలపై వచ్చిన పోలీసు అధికారులు పచ్చమూకల దౌర్జన్యకాండకు కొమ్ము కాస్తున్నారు.బెదిరించి.. భయపెట్టిప్రజాబలంతో టీడీపీ నెగ్గలేదని స్పష్టం కావడంతో పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, మహిళలను బెదిరిస్తూ దాడులతో హడలెత్తించే కుట్రలను చంద్రబాబు అమలు చేశారు. పోలింగ్ రోజు మొదలైన ఈ విధ్వంస కాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు పథకాలను రచిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు కొనసాగిస్తూ గ్రామాల్లో లేకుండా చేయాలని, జూన్ 4న కౌంటింగ్ కేంద్రాల వద్దకు సైతం రాకుండా భయోత్పాతం సృష్టించాలని చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారు.పల్నాడులో చల్లారని ఉద్రిక్తతలుఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడులో ఉద్రిక్తతలు చల్లబడలేదు. టీడీపీ మూక దాడులతో ఎస్టీ, బీసీ వర్గాలు గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్నాయి. పోలింగ్ రోజు రాత్రి అరాచక ముఠాల దాడులతో మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో గ్రామం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంతవరకు స్వగ్రామాలకు చేరుకోలేదు. పల్నాడులో 144 సెక్షన్తో దుకాణాలు మూతబడ్డాయి. మాచర్ల, గురజాల, నరసరావుపేట ఎమ్మెల్యేలు హౌస్ అరెస్ట్లో ఉన్నారు. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేయడంతో గాయపడ్డాడు. తాడిపత్రిలో పట్టణాన్ని వీడి వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసంలో చొరబడ్డ పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. కంప్యూటర్లను పగులగొట్టారు.ఫ్యాన్కు ఓటేసిందని.. మహిళను ట్రాక్టర్తో తొక్కించబోయాడు!వైఎస్సార్సీపీకి ఓటు వేసిందని కక్షగట్టి ఓ మహిళను టీడీపీ నాయకుడు ట్రాక్టర్తో తొక్కించబోగా తృటిలో తప్పించుకుంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వేముల సంధ్యారాణి వైఎస్సార్ సీపీకి ఓటు వేసిందని టీడీపీ నాయకుడు ఏడుకొండలు కక్ష పెంచుకున్నాడు. బుధవారం ఉద్దేశపూర్వకంగా ఆమెతో ఘర్షణ పడి తన ట్రాక్టర్తో ఢీకొట్టాడు. పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గన్నవరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీమోహన్ పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దన్ను... ఈసీ ఉదాసీనత టీడీపీ మూకలు బరితెగించి దాడులు, విద్వంసానికి పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో డీఐజీ నుంచి ఎస్సై వరకూ పోలీసు అధికారులను పోలింగ్కు ముందు ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. వారి స్థానంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఏమాత్రం అవగాహనలేని అధికారులను నియమించింది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను కూడా ఈసీ బదిలీ చేసింది. చంద్రబాబు ఆదేశాలతో పురందేశ్వరి అందచేసిన జాబితాలో సూచించిన వారినే నియమించింది. అదే దన్నుగా టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారు. ఈసీ టీడీపీకి అనుకూలంగా ఉందనే సంకేతాలు వెలువడటంతో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న ఈసీ ఈ దాడుల పట్ల బుధవారం వరకూ స్పందించలేదు. ఎస్పీలు, డీఐజీలకు ఆదేశాలు ఇవ్వలేదు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లతో చర్చించలేదు. ఈసీ, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గట్టిగా నిలదీయడంతో ఇక తప్పదన్నట్లుగా సమీక్షకు ఉపక్రమించింది. -
వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ మూకల హత్యాయత్నం
మైదుకూరు: పోలింగ్ రోజు ఏజెంట్గా కూర్చున్నాడనే అక్కసుతో వైఎస్సార్ జిల్లా మైదుకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డిపై బుధవారం సాయంత్రం టీడీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారు. బాధితుడి కథనం ప్రకారం... చాపాడు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి సమగ్ర శిక్ష అభియాన్లో ఏఈగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన మైదుకూరులోని బద్వేలు రోడ్డులో నివాసముంటున్నారు. ఈ ఎన్నికల్లో స్వగ్రామం విశ్వనాథపురంలో పోలింగ్ సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ తరపున ఏజెంట్గా కూర్చున్నారు.అంతకుముందు రోజు టీడీపీ వర్గీయులు ఏజెంట్గా కూర్చోవద్దని బెదిరించారు. వారి బెదిరింపులకు తలొగ్గక ఆయన వైఎస్సార్సీపీ ఏజెంట్గా కూర్చున్నారు. ఆ కడుపుమంటతో టీడీపీ వర్గీయులు చంద్ర ఓబుళరెడ్డి ప్రొద్దుటూరు రోడ్డులోని బైపాస్ వద్దకు రోజూ వాకింగ్కు వస్తుంటారని తెలుసుకుని.. బుధవారం సాయంత్రం అదే రోడ్డులోని ఏవీఆర్ స్కూల్ వద్ద కాపు కాశారు. వాకింగ్ ముగించుకుని వస్తున్న చంద్ర ఓబుళరెడ్డిపై విశ్వనాథపురం గ్రామానికి చెందిన కార్తీక్ రెడ్డి, ఇల్లూరు సుబ్బారెడ్డి, బొచ్చు సుబ్బారెడ్డి, మరో ముగ్గురు దాడి చేసి బీర్ బాటిళ్లతో తలపై కొట్టారు.‘చెప్పినా వినకుండా ఏజెంట్గా కూర్చుంటావా...ఇప్పుడే నిన్ను చంపుతాం..’ అంటూ కేకలు వేశారు. వారి దెబ్బలకు తీవ్రంగా గాయపడిన చంద్ర ఓబుళరెడ్డి స్పృహ తప్పి కింద పడిపోయాడు. అయినా విడిచి పెట్టకుండా నిందితుల్లో కొందరు బండరాయిని ఎత్తి తలపై మోదేందుకు ప్రయత్నించారు. సమీపంలో ఉన్న కొందరు మహిళలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అతన్ని వదిలేసి తమ వెంట తెచ్చుకున్న బైకులపై పరారయ్యారు. తలపై తీవ్ర గాయాలైన చంద్ర ఓబుళరెడ్డిని మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు.సంఘటన గురించి తెలియగానే ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్కు ముందు రోజే టీడీపీ వారు బెదిరించారని బాధితుని భార్య, కుమారుడు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేకు తెలిపారు. పథకం ప్రకారమే దాడి చేసి హత్యాప్రయత్నం చేశారని వారు చెప్పారు. దాడి సమాచారం తెలియగానే చాపాడు ఎంపీపీ తెలిదేల లక్ష్మయ్య, మండల నాయకులు, మైదుకూరు సింగిల్ విండో చైర్మన్ మూలె సుధాకర్రెడ్డి, ఖాజీపేట వైఎస్సార్సీపీ నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, మైదుకూరు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎంఆర్ఎఫ్ సుబ్బయ్య తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మైదుకూరు డీఎస్పీ వెంకటేశులు, రూరల్, అర్బన్ సీఐలు శ్రీనాథరెడ్డి, ఏపీ మస్తాన్ ఆస్పత్రికి వచ్చి చంద్ర ఓబుళరెడ్డితో మాట్లాడారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. -
పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
రాయగడ: రైలులో ప్రయాణించిన ఒక మహిళ పక్కనే తనతో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికురాలితో మాటామాటా కలిపి పరిచయం పెంచుకొని, చివరకు గమ్యం స్థానం చేరేసరికి పాపను విడిచి పరారైంది. మునిగుడలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చంద్రపూర్ ప్రాంతానికి చెందిన అనంత్ క్రొటింగ్ అనే మహిళ మంగవారం ఏదో పనిమీద రాయగడ వచ్చారు. పనులు ముగించుకున్న అనంతరం తిరిగి తన స్వగ్రామానికి వెళ్లేందుకు రాయగడలో ట్రైన్ ఎక్కింది. జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చుంది. పక్కనే మరో మహిళ చంటి పాపతో ప్రయాణం చేస్తోంది. కొద్దిదూరం ప్రయాణం చేసిన తర్వాత వారి మధ్య మాటామాటా కలిసి పరిచయం పెరిగింది. అనంతరం మునిగడు రైల్వేస్టేషన్లో ఇద్దరు మహిళలు దిగారు. ఇంతలో పాపను కాసేపు ఎత్తుకోండి టాయ్లెట్స్కు వెళ్లి వస్తానని చెప్పి పాపను క్రొటింగ్ అనే మహిళకు అప్పగించింది. పాపను ఎత్తుకున్న క్రొటింగ్ గంటలు తరబడినా ఎదురుచూసిన వాళ్ల అమ్మ రాలేదు. దీంతో కావాలనే పాపను విడిచిపెట్టాలని నిర్ణయించకున్నారని అర్థం చేసుకొని మునిగుడ పోలీసుస్టేషన్ను ఆశ్రయించింది. వెంటనే ఐఐసీ సౌదామిని బెహర వెంటనే స్పందించి జిల్లా శిశుసంరక్షణ కేంద్రం వారికి సమాచారం అందించారు. ప్రస్తుతం పాప శిశు సంరక్షణ కేంద్రంలో సురక్షితంగా ఉంది. అయితే పాపను ఎత్తుకుని ప్రయాణించిన మహిళ ఎవరు, ఎక్కడి నుంచి ప్రయాణించింది, పాపను విడిచిపెట్టి వెళ్లడంపై సమగ్ర దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లో ఉన్న సీసీ కెమేరాల ఆధారంగా ఆ మహిళను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. -
ఇంటికి చేరే వేళ మృత్యు గంట
ఇంటికి చేరే వేళ మృత్యు గంట ’’ తెల్లారిన కూలీల బతుకులు ట్రాక్టర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీల మృతి ధాన్యం బస్తాలు లోడ్ చేస్తుండగా దుర్ఘటన మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదన పి.గన్నవరం/అంబాజీపేట: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన కూలీలు. జీవనాధారంలో భాగంగా ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ బస్ రూపంలో మృత్యువు వారిని కాటేసింది. ప్రధాన రహదారి నెత్తురోడింది. మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కూలి పనులకు వెళ్లిన వారు తిరిగి మరో 30 నిమిషాల్లో ఇంటికి చేరతారనుకున్న సమయంలో విగత జీవులు అయారనే వార్త తెలియడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామం వద్ద ఆర్.పి.రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊడిమూడి గ్రామం వద్ద చింతావారిపేట సమీపంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలను పది మంది కూలీలు లోడ్ చేసి పగ్గం కడుతున్నారు. అదే సమయంలో రాజోలు నుంచి రావులపాలెం వెళుతున్న ఆర్టీసీ బస్ ట్రాక్టర్ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్, ట్రాక్టర్ల కింద పడి కూలీలు మృత్యువాత పడ్డారు. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ (35), వాసంశెట్టి సూర్యనారాయణ (45), ఈరి కట్లయ్య (50), ఊడిమూడి శివారు ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిమూలవారిపాలెంకు చెందిన చిలకలపూడి సురే‹Ùకు తీవ్ర గాయాలు కాగా అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. జి.పెదపూడికి చెందిన బొరుసు నానికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. బొరుసు రాంబాబు, బుజ్జి, వాసంశెట్టి సాయికిరణ్, గూనపాటి పెద్దిరాజులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆర్టీసీ బస్లో 20 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలు అయ్యాయి. బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు... మరో 30 నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవల్సిన వారు విగత జీవులుగా మారడంతో జి.పెదపూడి, ఆదిమూలంవారిపాలెం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ కొబ్బరి వలుపు కారి్మకుడిగా, కూలీగా పని చేసేవాడు. మృతునికి భార్య బేబి కుమారి, సుశాంత్, జస్వంత్ అనే చిన్న పిల్లలు ఉన్నారు. భర్త శివ మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యిందని బంధువులు, కుటుంబ సభ్యులు రోదించారు. అదే గ్రామానికి చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ మృతి చెందడంతో భార్య దుర్గ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సూర్యనారాయణ కుమార్తె నాగేశ్వరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఇంటిలో శుభకార్యం జరిగి ఏడాది తిరగ కుండానే అందరిని వదలి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరి కట్లయ్యకు భార్య సుబ్బలక్షి్మ, కుమారులు నాగరాజు, సురే‹Ù, కుమార్తెలు వైష్ణవి, హారికలు ఉన్నారు. అతని మృతితో పెద్ద దిక్కును కోల్పోవడమే కాకుండా జీవనాధారం కోల్పోయామని కుటుంబీకులు విలపిస్తున్నారు. ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు మృతి చెందడం, అతని అన్న సురేష్ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వారి తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణమ్మ రోదనలు గ్రామస్తులకు కంటతడి పెట్టించాయి. అందరితో కలివిడిగా ఉండే మణిబాబు మృతి చెందడం, సురేష్ తీవ్ర గాయాలు పాలవ్వడంతో బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఆందోళన చేపట్టిన గ్రామస్తులు నిర్లక్ష్యంగా, మితి మీరిన వేగంతో బస్సును నడిపి నలుగురు మృతికి కారణమైన బస్ డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జి.పెదపూడి, ఊడిమూడికి చెందిన నాయకులు, గ్రామస్తులు ఆర్పీ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ, ఆరీ్టవోలు రావాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావారణం నెలకొనడంతో పి.గన్నవరం సీఐ డి.ప్రశాంత్కుమార్, ఎస్సై బి.శివకృష్ణ ఆందోళన కారులతో చర్చించారు. ఆర్డీఓ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మొత్తం పెంచాలని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
నంద్యాల, సాక్షి: పోలింగ్ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి
'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య న్యూ లుక్.. క్యూట్ ఫొటోలు
రూ.12000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన మహీంద్రా: ఎందుకో తెలుసా?
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎటాక్...పారిపోయిన నాగబాబు
టీడీపీ నాయకుల హౌస్ అరెస్ట్ మూలపేట పోర్టుకు గట్టి భద్రత
పాలసీదారులను మోసం చేస్తున్న బీమా ప్లాట్ఫామ్లు
కిల్లింగ్ లుక్స్లో 'సత్యభామ' హంగామా ఫొటోలు
తప్పక చదవండి
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్పోర్టుకు..
- నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- ‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
- అమెరికాలో గంజాయి బ్యాచ్లకు ఊరట!
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్
Advertisement