-
ధ్రువపత్రాల కోసం తహసీల్ చుట్టూ చక్కర్లు
● ఆఫీస్లో 250 దరఖాస్తుల పెండింగ్ బిచ్కుంద(జుక్కల్): మండల ప్రజలు, రైతులు ఆయా ధ్రువపత్రాలు, పహాణీ రికార్డుల కోసం నెలల తరబడి తహసీల్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అధికారులు పరిశీలన, విచారణ పేరుతో నెలల తరబడి కాలయాపన చేస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వందల దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక పెండింగ్లో ఉన్నాయి. అధికారులు సమయ పాలన పాటించడం లేదు. ఓ అధికారి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయానికి వచ్చారు. ఆ అధికారి చిక్కడు దొరకడు అన్న రీతిలో ఉంటారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పహాణీ రికార్డులు, కులం, ఆదాయం, బర్త్ సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకోగా వాటి పరిష్కారానికి నోచుకోక తహసీల్ కార్యాలయంలో సుమారు 250 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ విద్యార్థులు, ప్రజలు చక్కర్లు కొడుతున్నా కనికరించే వారు కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి దారితప్పిన రెవెన్యూ పాలనను సరైన మార్గం తీసుకొచ్చి అన్ని వేళలో అధికారులు స్థానికంగా ఉండే విధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
రేపటి నుంచి సీపీగెట్కు దరఖాస్తుల స్వీకరణ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ –సీపీగెట్ – 2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల పరిధిలో 294 పీజీ కళాశాలల్లో దేంట్లోనైనా పీజీ కోర్సులతో పాటు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీకి సంబంధించిన కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. ఈ నెల 18 నుంచి సీపీగెట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూలై 5 నుంచి కంప్యూటర్ బేస్డ్ మోడ్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్ ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూ(హెచ్), తెలంగాణ మహిళా వర్సిటీల్లో పీజీ కోర్సుల్లోని సీట్లను భర్తీ చేస్తారు. తెయూ పరిధిలో.. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో వర్సిటీ డిచ్పల్లి మెయిన్ క్యాంపస్, భిక్కనూర్ సౌత్ క్యాంపస్ కళాశాలలతో పాటు 16 అనుబంధ ప్రభుత్వ, ప్రైవేటు పీజీ కళాశాలలున్నాయి. వర్సిటీ క్యాంపస్లో 26 కోర్సులుండగా, అనుబంధ పీజీ కళాశాలల్లో కలిపి మొత్తం 35 వరకు కోర్సులున్నాయి. వీటిలో సుమారు 4 వేల మంది వరకు విద్యార్థులు ప్రవేశాలు పొందుతారు. వీరిలో బాలికలు సుమారు 65 శాతం, బాలురు సుమారు 35 శాతం మంది మాత్రమే పీజీ కోర్సుల్లో చేరుతున్నారు. ఈ సారి 10 శాతం సీట్లు నిండని కాలేజీలను బ్లాక్ చేసే ఆలోచనలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులున్నారు. దరఖాస్తులు సహా పూర్తి వివరాల కోసం www.osmania.ac.in,www.ouadimissions.com, www.cpget.tsche.ac.in వెబ్సైట్లను సందర్శించాలని వర్సిటీ అధికారులు సూచించారు. జూలై 5న ఎంట్రన్స్ టెస్ట్ తెయూ పరిధిలో 18 పీజీ కళాశాలలు సీపీగెట్ షెడ్యూల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 18–05–2024 రిజిస్ట్రేషన్కు తుది గడువు 17–06–2024 రూ.500 ఆలస్య రుసుముతో గడువు 25–06–2024 రూ.2 వేల ఆలస్య రుసుముతో గడువు 30–06–2024 ప్రవేశ పరీక్షలు 05–07–2024 -
మగ్గం వర్క్తో మంచి ఆదాయం
ముగిసిన మగ్గం వర్క్ శిక్షణ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ప్రస్తుతం మార్కెట్లో మగ్గం వర్క్కు బాగా డిమాండ్ ఉందని, మగ్గం వర్క్ ద్వారా మంచి ఆదాయం సంపాదించుకుని జీవితంలో స్ధిరపడే అవకాశం ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ(ఆర్ఎస్ఈటీఐ) డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ అన్నారు. ఆర్ఎస్ఈటీఐ ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని గ్రామీణ మహిళలు, యువతులకు నెలరోజులుగా ఇస్తున్న మగ్గం వర్క్ శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు, టూల్స్ కిట్స్ అందజేశారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఈటీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు పలు ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నట్లు తెలిపారు. సొంతంగా షాప్ పెట్టుకోవాలనుకునే వారికి బ్యాంక్ ద్వారా రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. మీ గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువతకు ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ సంస్థ గురించి చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది భాగ్యలక్ష్మి, రామకృష్ణ, ఫ్యాకల్టీ నవీన్, రంజిత్, ఫరీదా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్ల్లు దగ్ధం
రూ.15 లక్షల ఆస్తి నష్టం లింగంపేట(ఎల్లారెడ్డి): విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఛత్రపతి వీరమణి, లక్ష్మణ్ గౌడ్, రామకృష్ణగౌడ్లకు చెందిన ఇళ్లు కాలిబూడిదయ్యాయి. చుట్టు భవంతిలో మూడు కుటుంబాల సభ్యులు నివాసం ఉంటున్నారు. మూడు కుటుంబాల సభ్యులు పనుల నిమిత్తం తాళం వేసి బయటకు వెళ్లారు. సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పెద్ద భవంతి ఇంటి నుంచి పొగలు రావడంతో చుట్టు ప్రక్కలవారు, యువకులు గమనించారు. యువకులు వెంటనే ఇంటిపైకి ఎక్కి బిందెలు, బకెట్లతో నీళ్లు చల్లారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో మోటార్లు ఏర్పాటు చేసి పైపులతో నీళ్లు పట్టి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఎల్లారెడ్డి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన 10 తులాల బంగారం, వెండి, సర్టిఫికెట్లు, ఫైల్స్, ఫర్నిచర్, నిత్యావసర సరుకులు, బట్టలు పూర్తిగా దగ్ధమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు కుటుంబాలకు సంబంధించి సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. -
పని చేశాం.. పైసలు ఇవ్వండి
● రెండున్నర ఏళ్లుగా బిల్లుల కోసం ఎదురు చూపులు ● కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినవి రూ.8 కోట్లు బోధన్టౌన్(బోధన్): రెండో విడత పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన డబ్బులు చెల్లించండి అంటూ బోధన్ బల్దియా కాంట్రాక్టర్లు రెండున్నర యేళ్లుగా ఎదురు చూస్తున్నారు. చేసిన పనులకు పైసలు రాకపోవడంతో ఇబ్బందుల్లో కొట్టు మిట్టాడుతున్నారు. ఉన్నత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకునే వారు కరువయ్యారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులు ఉన్నాయి. వార్డులతో పాటు బల్దియా పరిధిలో ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి పనులు చేయడానికి 25 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. యేళ్లుగా కాంట్రాక్టర్లు బల్దియా పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నారు. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో పట్టణ ప్రగతితో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులతో బల్దియా అధికారులు చేయమన్న వైకుంఠధామాల అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, ప్రహరీ నిర్మాణ పనులను టెండర్లలో దక్కించుకుని పూర్తి చేశారు. ఎంబీ రికార్డులు సైతం పూర్తి.. చేసిన అభివృద్ధి పనులకు ఎంబీ రికార్డులు సైతం పూర్తి చేసి అకౌంట్ సెక్షన్లో అప్పగించారు. అధికారులు అప్పజెప్పిన పనులను పూర్తి చేసి రెండున్నరేళ్లు గడుస్తున్నా, బిల్లులో చిల్లి గవ్వ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తమకు బిల్లులు చెల్లించాలని బల్దియా కమిషనర్తో పాటు, చైర్పర్సన్లతో పాటు జిల్లా కలెక్టర్కు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ధర్నాలు చేసి అధికారులకు వినతి పత్రాలను సైతం అందించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని లేకుంటే శాఖా పరమైన ఇబ్బందులు తప్పవని చిన్న స్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారులు బెదిరించి మరీ పనులను ఆగమేఘాలమీద పూర్తి చేయించిన దాఖలాలు ఉన్నాయి. భయపెట్టి పనులు చేయించుకున్న అధికారులు బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియడం లేదు. బోధన్ మున్సిపాలిటీ కార్యాలయం ప్రభుత్వం స్పందించాలి బోధన్ బల్దియా పరిధిలోని పలు వార్డుల్లో పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేశాము. పనులు పూర్తి చేసి రెండున్నర యేళ్లుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నాము. ప్రభుత్వం స్పందించి బిల్లులు మంజూరు చేసి కాంట్రాక్టర్లను ఆదుకోవాలి. –ఉదయ్ భాస్కర్, బోధన్ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంజూరు కాగానే చెల్లిస్తాం పట్టణ ప్రగతిలో భాగంగా కాంట్రాక్టర్లు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు కాగానే చెల్లిస్తాం. బిల్లుల మంజూరు అంశం సంబంధిత శాఖ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. – వెంకట నారాయణ, మున్సిపల్ కమిషనర్, బోధన్ -
ఎన్నికల వేళ జోరుగా ‘ఉపాధి’ చెల్లింపులు
● కూలీలకు గతంలో కంటే ఇప్పుడు రెగ్యులర్గా కూలి ఇస్తున్న వైనం ● పార్లమెంట్ ఎన్నికల వేళ కూలీల ఖాతాల్లో సొమ్ము జమ ● వారం రోజులకోసారి చెల్లించాలనే నిబంధన పాటించని ప్రభుత్వం ● ఇప్పటి వరకు జిల్లాలోని కూలీలకు రూ.36.06 కోట్లు జమ మోర్తాడ్(బాల్కొండ): ఉపాధి కూలీలకు పార్లమెంట్ ఎన్నికలు కలిసి వచ్చాయి. ఉపాధి హామీ పథకం కింద పనులకు వచ్చే కూలీలకు వారం రోజులకు ఒకసారి కూలి సొమ్ము చెల్లించాలనే నిబంధనను కేంద్రం తుంగలో తొక్కింది. ఎన్నికలకు ముందు రెండు, మూడు నెలలకు ఒకసారి కూలి సొమ్మును చెల్లించగా ఇప్పుడు మాత్రం క్రమం తప్పకుండా చెల్లింపులను జరపడం విశేషం. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల పరిధిలో సగటున రోజుకు 50 వేల నుంచి 60 వేల మంది వరకు ఉపాధి పనులకు కూలీలు హాజరవుతున్నారు. వీరికి ఈ రోజు వరకు రూ.36.06 కోట్ల కూలి సొమ్మును కేంద్రం జమ చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ ఒకటో తేది నుంచి ఈ నెల మొదటి వారం వరకు కూలీలు చేసిన పనులకు సంబంధించిన కూలి సొమ్మును జమ చేశారు. ఇంకా రూ.1.02 కోట్ల కూలి సొమ్మును చెల్లించాల్సి ఉండగా మస్టర్ల నమోదు పూర్తి కావచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 15 నుంచి మార్చి నెలాఖరు వరకు రూ.3.18 కోట్ల బకాయిలు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించడం గమనర్హం. ఏ వారం రోజుల పనికి సంబంధించిన కూలి సొమ్మును ఆ వారంలో జమ చేయకపోతే కూలీలకు ప్రభుత్వమే జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. అయినప్పటికి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించలేదు. ఉపాధి పనులకు వచ్చే కూలీలకు కూలి సక్రమంగా చెల్లించకపోవడంతో గతంలో పనులు నెమ్మదించాయి. ఏప్రిల్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో కూలీలకు కూలి సొమ్ము చెల్లింపులో వేగం పెరిగింది. మస్టర్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంతో పాటు ఒక వారం రోజుల కూలి సొమ్ము మరుసటి వారంలో జమ చేయడం కొనసాగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూలీల ఓట్లు ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతోనే కూలి సొమ్ము జమ చేయడంపై దృష్టి సారించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా కూలీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని క్రమం తప్పకుండా కూలి సొమ్ము జమ చేయాలని పలువురు సూచిస్తున్నారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
● విద్యుత్ జేఏవోపై బదిలీ వేటు నిజామాబాద్నాగారం: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జేఏవో(జూనియర్ అకౌంట్ ఆఫీసర్) పూదరి గంగాధర్పై బదిలీ వేటు పడింది. విద్యుత్ శాఖ సీఎండీ వరుణ్ రెడ్డి సీరియస్గా స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ నాయకులను కలవకూడదని నిబంధన ఉంది. కోడ్ అమలులో ఉండగా జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ ఐటీఐ కళాశాల ఆవరణలో ఉదయం వాకింగ్ సమయంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డికి పుష్పగుచ్ఛం అందించారు. దీనిపై సీ విజిల్ యాప్లో ఏప్రిల్ 3న ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు విచారణ చేసి నివేదిక అందజేయాలని ఎస్ఈ రవీందర్ను ఆదేశించారు. విద్యుత్శాఖ సీఎండీ కార్యాలయం నుంచి సైతం ఏపీటీఎస్ సీఐ గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేయాలని ఆదేశాలు వచ్చాయి. అధికారులు వేర్వేరుగా విచారణ చేపట్టారు. ఈ నెల 9న విచారణ చేసి, 12న నివేదికలను కలెక్టర్కు అందజేశారు. పూర్తి విచారణ చేసి నివేదికను సీఎండీకి అందజేశారు. గురువారం సీఎండీ వరుణ్ రెడ్డి ఆ జేఏవోపై బదిలీ వేటు వేశారు. కామారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. -
ఐటీఐలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల
నిజామాబాద్ అర్బన్: ఐటీఐలో అడ్మిషన్ల కోసం గురువారం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కోటిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలోని ఐదు ప్రభుత్వ ఐటీఐలలో 1,028 సీట్లు, మూడు ప్రైవేటు ఐటీఐలలో 488 సీట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. 14 సంవత్సరాలు పైబడిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నా రు. జూన్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలన్నా రు. వివిధ కోర్సులు, విద్యార్హతలకు సంబంధించి https:// iti. telangana. gov. in/ వె బ్సైట్ను సందర్శించాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే 9948195654, 94900 57403లను సంప్రదించాలన్నారు. నేడు పెన్షన్ అదాలత్ నిజామాబాద్ అర్బన్: ఉద్యోగుల పెన్షన్ స్కీంకు సంబంధించి పెన్షన్ అదాలత్ను నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నట్లు పీఎఫ్ కమిషనర్ గణేశ్ కుమార్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 11:40 గంటల వరకు ఫిర్యాదుతో కూడిన అప్లికేషన్తో కాన్ఫరెన్స్లో పాల్గొనాలన్నారు. రీజినల్ పీఎఫ్ కమిషనర్ సమస్యలను స్వీకరిస్తారన్నారు. ఫిర్యాదుదారులు వెబ్స్సైట్లో మీటింగ్ నెంబర్ 2643583284, పాస్వర్డ్ పీడీఎస్1234 ఎంటర్ చేసి కాన్ఫరెన్స్లో పాల్గొనాలని సూచించారు. నేటి నుంచి సినిమా థియేటర్లు బంద్ నిజామాబాద్అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల నిర్వాహకుల నిర్ణయం మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి నుంచి రెండువారాల పాటు సినిమా థియేటర్ల బంద్ పాటిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సుమారు 35కి పైగా ఉన్న సింగిల్ థియేటర్లు మూసివేయనున్నారు. మల్టీఫ్లెకు్ుస్ల మాత్రం కొన్ని రోజుల పాటు కొనసాగుతాయన్నారు. మారుతున్న సాంకేతిక ప్రభావంతో ఓటీటీల్లో కోరుకున్న సినిమా అనుకూలమైన సమయంలో ఇంట్లోనే తిలకించే అవకాశం రావడమే ముఖ్య కారణంగా చెబుతున్నారు. మరోవైపు ఐపీఎల్ కొనసాగుతుండటంతో సింగిల్ థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడంతో నష్టాలు వస్తున్నాయని, అందుకే సినిమా ప్రదర్శనలు రద్దు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. అర్చకులతో సమావేశంనిజామాబాద్అర్బన్: దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ గురువారం జిల్లాలోని పలు మండలాల్లోని అర్చకులతో సమావేశం నిర్వహించారు. నీలకంఠేశ్వర దేవాలయంలో ఈ సమావేశం జరిగింది. దూపదీపనైవేద్యం ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో డిచ్పల్లి, మోపాల్, సిరికొండ, ఆర్మూర్, జక్రాన్పల్లి, ఎడపల్లి, నవీపేట, రెంజ ల్, బాల్కొండ, మెండోరా, ముప్కాల్, వేల్పూ ర్, భీమ్గల్, ఏర్గట్ల, మోర్తాడ్, , కమ్మర్పల్లి మండలాలకు చెందిన అర్చకులు పాల్గొన్నారు. హరితహారం చెట్ల నరికివేత నవీపేట : విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్నాయని మట్టయ్యఫారంలో గురువారం హరితహారం చెట్లను నరికివేశారు. 2019లో హరితహారం పథకం కింద అర కిలోమీటర్ పరిధిలో రోడ్డు కు ఇరువైపులా మొక్కలు నాటారు. ఏపుగా పె రిగిన చెట్లు పైన ఉన్న విద్యుత్ తీగలకు తాకు తున్నాయని ట్రాన్స్కో లైన్మాన్ నవీన్ కొమ్మలను నరికేందుకు సిద్ధమయ్యాడు. ప్రైవేట్ వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించడంతో ఆయన కొమ్మలను కాకుండా చెట్లను నరికేశాడు. కామారెడ్డి రక్తదాతల గ్రూప్నకు అరుౖదైన గుర్తింపు కామారెడ్డి అర్బన్ : దేశంలోనే అత్యుత్తమ రక్తదాతల సేవా సమూహంగా కామారెడ్డి బ్లడ్ డోనర్స్ గ్రూప్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కామారెడ్డిశాఖకు ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్(ఐబీఆర్) అరుదైన గుర్తింపు లభించింది. తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం ఒక ఏడాది కాలంలో అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించి 2,306 యూనిట్ల రక్తం సేకరించినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గుర్తింపు లభించడం ఎంతో సంతోషంగా ఉందని రక్తదాతల సమూహం వ్యవస్థాపకులు డాక్టర్ బాలు అన్నారు. 2007 నుంచి కామారెడ్డి రక్తదాతల సమూహం సేవలు అందిస్తుమన్నామని తెలిపారు. -
యువకుడి మృతి
● అనుమానాస్పద కేసుగా నమోదు రెంజల్(బోధన్): కందకుర్తి గ్రామానికి చెందిన బొల్లెల అనిల్(28) అనే యువకుడు గురువారం రాత్రి ఇంట్లో మృతి చెందగా.. అనిల్ అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. అనిల్తో పాటు ఆయన ఇంటి పక్కనే ఉండే చెల్లెలు, బావలు అనీల్కు చెందిన భూమిని కౌలు చేస్తున్నారని , పట్టా పాస్ పుస్తకంతో పాటు కౌలు డబ్బులు అడిగితే చెల్లి, బావతో పాటు సంతోష్ అనే వ్యక్తి కలిసి అనీల్ను కొడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. అనిల్ మృతి చెందినట్లు శుక్రవారం గుర్తించిన స్థానికులు, బంధువులకు సమాచారం అందించారు. అమ్మమ్మ నాగుబాయి అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అనిల్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నారు. -
సెల్ఫోన్ కోసం రైలు నుంచి దూకి గాయాలపాలు
డిచ్పల్లి: డిచ్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం రన్నింగ్ రైలు నుంచి దూకడంతో ఒకరు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్లో రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ రహమాన్ (కూలీ) నిజామాబాద్కు వస్తున్నారు. రైలు డిచ్పల్లి రైల్వేస్టేషన్కు కొద్ది దూరంలో ఉండగా, డోర్ వద్ద నిలుచున్న రహమాన్ చేతిలోని మొబైల్ ఫోన్ జారి కింద పడిపోయింది. ఎక్స్ప్రెస్ రైలు డిచ్పల్లిలో ఆగదు గానీ తక్కువ వేగంతో వెళుతోంది. పడిపోయిన మొబైల్ ఫోన్ కోసం కదిలే రైలులో నుంచి రహమాన్ కిందకు దూకాడు. ఆ సమయంలో కాలు రైలు బోగి మెట్లలో చిక్కుకుంది. ఎడమ కాలు కింది భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. తీవ్రగాయాలతో పట్టాల పక్కన పడిపోయిన రహమాన్ను స్థానికులు కొందరు ఫ్లాట్ఫామ్ వద్దకు చేర్చారు. 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో బాధితుడికి ప్రథమ చికిత్స అందించి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అధ్యాపకుల పల్లెబాట
మోర్తాడ్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచుకోవడానికి అధ్యాపకులు పల్లెబాట పట్టారు. ‘‘మా కళాశాలలో చేరండి.. నాణ్యమైన విద్య అందిస్తాం’’ అంటూ జూనియర్ కళాశాలల అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. జిల్లాలో 17 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో అన్ని గ్రూపులకు కలిపి 240 సీట్లు ఉండగా ఒక్కో సంవత్సరంలో వంద సీట్లు కూడా సరిగా భర్తీ కావడం లేదు. సీట్లు భర్తీ కాకపోతే గ్రూపులను ఎత్తివేయడం, క్రమ క్రమంగా కళాశాలల ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి కళాశాలలో కనీసం 150 వరకు అడ్మిషన్లు జరిగేలా అధ్యాపకులు గ్రామాల బాట పట్టారు. కస్తూ ర్బా, మోడ ల్ స్కూళ్లు, బీసీ గురుకులాల్లో ఇంటర్ అమలు చేయడంతో ప్రభుత్వ కళాశాలల అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సెలవులు ఉన్నా అధ్యాపకులు ఖాళీగా కూర్చోకుండా తమ కళాశాల పరిధిలో ఉన్న గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత చెందిన విద్యార్థులను స్వయంగా కలుసుకుని కళాశాలల్లో అందించే సౌకర్యాల గురించి వివరిస్తున్నారు.● ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలని ప్రచారం -
బాలుడి అదృశ్యం
బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని గోశాలకు చెందిన సిద్ధార్థ(14) అనే బాలుడు అదృశ్యమైనట్లు పట్టణ సీఐ వీరయ్య తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు.. సిద్ధార్థ ఈ నెల 14న ఉదయం ఆడుకుంటానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడని, సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కాలనీ అంతా తల్లి బెంగి పద్మ వెతికినా కనపడలేదన్నారు. బంధువులు, తెలిసిన వారి వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
1.40 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
కమ్మర్పల్లి: భీమ్గల్ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో ఈ ఖరీఫ్లో 1.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈమేరకు పంటల ప్రణాళికను విడుదల చేశారు. అధికారుల ప్రణాళిక ప్రకారం రైతులకు విత్తనాలు, ఎరువుల అందుబాటులో ఉంచనున్నారు.ఈ సీజన్లో అత్యధికంగా 84,581 ఎకరాల్లో వరి, 25,939 ఎకరాల్లో మొక్క జొన్న, 12,160.29 ఎకరాల్లో పసుపు, 15,688 ఎకరాల్లో సోయాబీన్, 1,348 ఎకరాల్లో పత్తి, 15 ఎకరాల్లో పెసర, 187.2 ఎకరాల్లో కంది సాగవుతుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది వానాకాలం సీజన్లో 1.32 లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఈ యేడు 8 వేల ఎకరాల్లో అధికంగా పంటల సాగవుతుందని అంచనా వేశారు. 31,219 క్వింటాళ్ల విత్తనాలు.. ఖరీఫ్ పంట సాగుకు అనుగుణంగా వ్యవసాయాధికారులు ఎన్ని విత్తనాలు అవసరమో అంచనా వేశారు. 31,219 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించారు. అత్యధికంగా 25,374 క్వింటాళ్ల వరి విత్తనాలే అవసరమని అంచనా వేశారు. 1,037 క్వింటాళ్ల మొక్కజొన్న, 4,706 క్వింటాళ్ల సోయాబీన్, 1,800 బస్తాల పత్తి, 1 క్వింటా పెసర, 8 క్వింటాళ్ల కంది విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. 30.71 మెట్రిక్ టన్నుల ఎరువులు.. వానాకాలం పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులను కూడా వ్యవసాయ శాఖ సిద్ధం చేయనుంది. డివిజన్లోని 8 మండలాల్లో కలిపి 30,717 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేసి ప్రణాళిక రూపొందించారు. 18,300 మెట్రిక్ టన్నుల యూరియా, 4,229 మెట్రిక్ టన్నుల డీఏపీ, 8,038 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 150 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. పంటల సాగు అంచనా మండలాల వారీగా(ఎకరాల్లో).. మండలం వరి మొక్కజొన్న పసుపు సోయాబీన్ పత్తి పెసర కంది భీమ్గల్ 29084 1090 171.29 405 1073 10 23.2 మోర్తాడ్ 9700 4090 1820 3288 0 04 02 ఏర్గట్ల 5363 3225 2030 1875 0 0 14 కమ్మర్పల్లి 11043 2465 1670 3735 275 0 75 బాల్కొండ 5111 3359 1238 287 0 01 04 ముప్కాల్ 4235 2051 1319 1262 0 0 18 మెండోర 5604 3311 2322 2401 0 0 26 వేల్పూర్ 14441 6348 1590 2435 0 0 25 మొత్తం 84581 25939 12160.29 15688 1348 15 187.2 భీమ్గల్ డివిజన్ పరిధిలో.. 84.58 వేల ఎకరాల్లో వరి సాగు 25.93 వేల ఎకరాల్లో మొక్కజొన్న డీలర్ వద్దనే కొనుగోలు చేయాలి ఖరీఫ్ సాగు ప్రారంభంలో రైతులు అవసరమైన విత్తనాలను సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. ఈ సమయంలో బిల్లు లేదా రసీదు తప్పనిసరిగా తీసుకొని భద్రపరుచుకోవాలి. విత్తనాలు నాటే ముందు వాటి మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. నాలుగైదు భారీ వర్షాల తర్వాతే విత్తనాలు నాటుకోవాలి. స్థానిక వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి నాణ్యమైన దిగుబడులు సాధించాలి. – మల్లయ్య, ఏడీఏ, భీమ్గల్ -
దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి
నిజామాబాద్ నాగారం: అసెంబ్లీ ఎన్నికల సమ యంలో వడ్లు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామ న్న కాంగ్రెస్ ఇప్పుడు మాటా మార్చి సన్న వడ్లకే ఇ స్తామనడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు అన్నా రు. గురువారం నగరంలోని ధర్నా చౌక్లో బీఆర్ఎస్ నాయకులు దొడ్డు రకం ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధ ర్నా చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతూకిరణ్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చిందన్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే సన్న వడ్లకే బోనస్ అని రేవంత్రెడ్డి రైతులను మోసం చేస్తున్నా రని విమర్శించారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని పేర్కొన్నారు. బోనస్ ఇచ్చే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, బీఆర్ఎస్ నగర అధక్షుడు సిర్ప రాజు, ప్రభాకర్రెడ్డి, గాండ్ల లింగం, రాజు పాల్గొన్నారు. -
డెంగీని నియంత్రిద్దాం
నిజామాబాద్ నాగారం: డెంగీ నియంత్రణకు అందరం కృషి చేయాలని డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినం సందర్భంగా గురువారం జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కేంద్రం ఆధ్వర్యంలో అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. దోమలతో డెంగీ వ్యాపిస్తుందన్నారు. దీని నిర్మూలనకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలను వివరించారు. వ్యాధి సోకిన వారు ఆందోళన చెందకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. ద్రవపదార్థాలను తీసుకోవాలన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సామ్రాట్ యాదవ్, అసిస్టెంట్ మలేరియా అధికారి షేక్ సలీం, జిల్లా ఆరోగ్య విద్య బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, హెచ్ఈవో శంకర్ తదితరులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షుడు కమ్మర్పల్లి/ఖలీల్వాడి: సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ కమ్మర్పల్లి మండలాధ్యక్షుడు సుంకెట రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. పారితోషికం జమ చేసిన ఇంటర్ బోర్డు పెర్కిట్(ఆర్మూర్): ఇంటర్ పరీక్ష పత్రాలు మూ ల్యాంకనం చేసిన అధ్యా పకులకు ఇంటర్మీడియట్ బోర్డు గురువారం పారితోషకాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ‘స్పాట్ పారితోషకం చెల్లించేదెన్నడు’ శీర్శికన ‘సాక్షి’ పత్రికలో గురువారం ప్రచురితమైన కథనానికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించారు. అయితే పారితోషకంలో 20 శాతం కోత విధించారని అధ్యాపకులు తెలిపారు. గతేడాది సైతం ఇలాగే 20 శాతం కోత విధిస్తే అధ్యాపకులు నిరసన వ్య క్తం చేశారు. దీంతో అప్పటి డీఐఈవో చొర వతో మిగతా మొత్తం చెల్లించారు. ఇప్పుడు కూడా కోత విధించిన 20 శాతాన్ని త్వరగా చెల్లించాలని అధ్యాపకులు కోరుతున్నారు. క్రికెట్ టోర్నీకి ఎంపిక జక్రాన్పల్లి: జక్రాన్పల్లికి చెందిన అఖిల్ అంతర్జాతీయ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్కు ఎంపికయ్యాడు. శ్రీలంకలో ని కొలంబోలో గురువారం నుంచి ఈ నెల 20 వరకు ఈ టోర్నీ జరగనుంది. అఖిల్ను గ్రామస్తులు అభినందించారు. -
No Headline
తెయూ వీసీ పోస్టు కోసం 133 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రొఫెసర్గా పదేళ్లు బోధన అనుభవం ఉన్న వారు వీసీ పోస్టుకు అర్హులు. ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరితో పాటు, ప్రొఫెసర్ నసీం (ఇటీవలే పదవీ విరమణ పొందారు), ప్రొఫెసర్ విద్యావర్ధిని, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ అరుణ, ప్రొఫెసర్ ఖైసర్ మహమ్మద్ తో పాటు ఇతర వర్సిటీల్లో పని చేస్తున్న ప్రొఫెసర్లు తెయూ వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. సెర్చ్ కమిటీ ఏర్పాటుతో ఆశావహులు కొందరు అప్పుడే తమ పైరవీలు ప్రారంభించారు. అధికార పార్టీ నాయకుల వద్దకు వెళ్లి వీసీ పోస్టు ఇప్పించాలని పైరవీ చేస్తున్నట్లు సమాచారం. తెయూ వీసీ పదవి ఎవరికి దక్కుతుందనే విషయం వారం రోజుల్లో తేలనుంది. -
వారంలో కొత్త వీసీ!
నిజామాబాద్మగ్గం వర్క్తో ఆదాయం మగ్గం వర్క్తో ఆదాయం సంపాదించి జీవితంలో స్థిర పడవచ్చని ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2024– 8లో uతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటికీ వారం రోజుల్లోగా నూతన వైస్–చాన్స్లర్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పది ప్రభుత్వ యూనివర్సిటీలకు కొత్త వైస్–చాన్స్లర్లను నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వీసీల నియామకానికి ఎలక్షన్ కమిషన్ (ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం పది వర్సిటీలకు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ నెల 21 వరకు రాష్ట్రంలోని పది యూనివర్సిటీల వీసీ పోస్టులు ఖాళీ కానున్నాయి. అంతకన్నా ముందుగానే కొత్త వీసీలను నియమించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. రాష్ట్రంలో 12 యూనివర్సిటీలకు గానూ ఆర్జీయూ కేటీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీలు మినహా 10 వర్సిటీల్లో వీసీల నియామకానికి జనవరిలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో వీసీల నియామకానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. పోలింగ్ ముగియడంతో ఈసీ అనుమతి ఇచ్చింది. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేసి కొత్త వీసీలను నియమించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. సెర్చ్ కమిటీల ఏర్పాటు.. వీసీల నియామకాన్ని చేపట్టే అత్యంత కీలకమైన సెర్చ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ బుధవారం వేర్వేరు జీవోలను జారీ చేసింది. యూనివర్సిటీ పాలకమండలి, ప్రభుత్వ నామినీ, యూజీసీ నామినీలతో సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ సెర్చ్ కమిటీ లో ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ (వర్సిటీ పాలకమండలి నామినీ), ప్రొఫెసర్ రాజేశ్వర్ సింగ్ ఛండేల్ (యూజీసీ నామినీ), శాంతికుమారి (ప్రభుత్వ నామినీ) ఉన్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే ఈ సెర్చ్ కమిటీ సమావేశం కానుంది. వర్సిటీ వీసీ పోస్టుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ముగ్గురి పేర్లను ఈ కమిటీ గవర్నర్కు పంపిస్తుంది. అనంతరం ప్రభుత్వం సూచన మేరకు గవర్నర్ ముగ్గురిలో ఒకరిని వీసీగా ఎంపిక చేస్తారు. వీరు అనర్హులు.. రెండు పర్యాయాలు వీసీలుగా పని చేసిన వారిని, 70 ఏళ్లు నిండిన వారిని వీసీలుగా నియమించొద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారి నేపథ్యంపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగంతో విచారణ చేయించారు. అర్హత, ఆసక్తి గల ఒక్కో ప్రొఫెసర్ మూడు, నాలుగు వర్సిటీలకు వీసీ పదవులకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.తెయూ వీసీగా ఎవరో..?దరఖాస్తు చేసుకున్న రిజిస్ట్రార్ యాదగిరిన్యూస్రీల్ తెయూ వీసీ కోసం 133 మంది దరఖాస్తు ఈసీ గ్రీన్ సిగ్నల్తో సెర్చ్ కమిటీలు ఈ నెల 21 లోగా కొత్త వీసీల నియామకం అధికార పార్టీ నాయకుల చుట్టూ ఆశావహుల చక్కర్లు.. -
జీలుగ పంపిణీ ఎప్పుడో?
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులకు సబ్సిడీ జీలుగ విత్త నాలు సకాలంలో అందించే విషయంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మే నెల పూర్తి కావొస్తున్నా ఇంత వరకు జిల్లాలో జీలుగ విత్త నాలు పంపిణీ చేయలేదు. కొంత వరకు స్టాకు వచ్చిందని అధికారులు చెప్తున్నప్పటికీ ఒక్క బస్తా కూడా సొసైటీలకు రాలేదు. దీంతో వానాకాలం సీజన్ పనులు ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నేలకు, పంటకు మేలు చేసే పచ్చిరొట్ట ఎరువు కోసం రైతులు మే మొదటి వారంలోనే జీలుగ విత్తనాలను కొనుగోలు చేసి పొలాల్లో చల్లేవారు. తొలకరి వర్షాలకు పెరిగిన చెట్లను 40 రోజులకు ట్రాక్టర్తో కలియదున్ని నాట్లు వేస్తారు. కానీ జీలుగ విత్తనాలు ఇప్పటి వరకు సొసైటీలకు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. విత్తనాలు ఎప్పుడు వస్తాయని స్థానిక వ్యవసాయాధికారులకు, సొసైటీ సిబ్బందికి రైతులు ఫోన్లు చేస్తున్నారు. 16 వేల మెట్రిక్ టన్నులు అవసరం జిల్లాకు 16వేల మెట్రిక్ టన్నుల జీలుగ విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ రాష్ట్ర శాఖకు ఇండెంట్ పంపింది. ఇందులో పావుశాతం కూడా జిల్లాకు రాలేదు. దీంతో రైతులు బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరను వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. రుద్రూర్లోని కృషి విజ్ఞాన్ కేంద్రానికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. అధికారులు ఇంకా ఆలస్యం చేస్తే సొసైటీలకు విత్తనాలు సరఫరా చేసి కూడా ప్రయోజనం ఉండదని రైతులు పేర్కొంటున్నారు. ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 4లక్షల ఎకరాలకు పైగా వరి సాగవనుంది. కనీసం రెండు లక్షల ఎకరాలకై నా జీలుగ అవసరం ఉంటుంది. నెలాఖరు నాటికై నా రైతుల చేతికి సబ్సిడీ విత్తనాలు అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు రైతులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా ప్రతీ వానాకాలం సీజన్కు ముందు రైతులకు అందజేసే జీలుగ విత్తనాల సబ్సిడీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. గత రెండేళ్లుగా 60–65 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇచ్చారు. కిలో ధర ఖరారైతే కానీ సబ్సిడీ ఎంత అనేది తమకు సమాచారం ఉండదని సంబంధిత వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాకు 8,500 క్వింటా ళ్ల స్టాకు అలాట్మెంట్ అయిందని, వచ్చిన దానిని త్వరలోనే సీడ్స్ కార్పొరేషన్ ద్వారా సొసైటీ గోదాములకు సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్ ‘సాక్షి’తో తెలిపారు. సొసైటీలకు చేరని సబ్సిడీ విత్తనాలు అదును దాటిపోతుందని ఆందోళన చెందుతున్న రైతులుఎదురు చూస్తున్నాం నాట్లు వేసే ముందు పొలంలో జీలుగ వేస్తే నేలకు, పంటకు బలం ఉంటుంది. ప్రతీ ఏడాది మే మొదటి వారంలోనే జీలుగ విత్తనాలను సబ్సిడీపై కొనుగోలు చేసి పొలంలో చల్లేవాళ్లం. మే నెల పూర్తవుతున్నా ఇంత వరకు విత్తనాలు సొసైటీలకు రాలేదు. రైతులంతా వాటి కోసమే ఎదురుచూస్తున్నారు. అధికారులు త్వరగా విత్తనాలను అందించాలి. – జైడి తిరుపతిరెడ్డి, రైతు, నికాల్పూర్ -
మాల్ సీజ్ కలకలం
ఆర్మూర్: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సతీమణి రజితరెడ్డి పేరిట ఆర్మూర్ పట్టణంలో నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను టీఎస్ ఆర్టీసీ అధికారులు గురువారం సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బకాయి చెల్లించడానికి నెల రోజుల పాటు సమయం ఇచ్చి నా.. మాల్ నిర్వాహకులు పూర్తి స్థాయిలో బకాయి లు చెల్లించకపోవడంతో మాల్ను స్వాధీనం చేసు కుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. రూ.3.15 కోట్ల బకాయిలు చెల్లించని పక్షంలో మాల్ను సీజ్ చేస్తామంటూ ఈ నెల 9న ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేస్తూ మాల్లో మైక్లో ప్రకటించారు. దీంతో మాల్ నిర్వాహకులు రూ.63 లక్షలు చెల్లించినట్లు సమాచారం. మిగిలిన రూ.2.51 కోట్ల బకాయిలను సైతం రాబట్టుకోవడానికి ఆర్టీసీ అధికారులు పూనుకున్నారు. మాల్లో అద్దెకు ఉన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాలను కొనసాగించాలంటే టీఎస్ ఆర్టీసీతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కరీంనగర్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబురావు, డిప్యూటీ ఆర్ఎం శంకర్ నాయక్, నిజామాబాద్ డిపో వన్, ఆర్మూర్ డిపో మేనేజర్లు ఆనంద్, ఆంజనేయులు పోలీసు బలగాల సహాయంతో జీవన్రెడ్డి మాల్కు వచ్చి వ్యాపారస్తులను హెచ్చరించారు. అనంతరం మాల్ను స్వాధీనం చేసుకొని గేట్లకు తాళం వేశారు. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో..ఆర్మూర్లోని టీఎస్ ఆర్టీసీ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సతీమణి రజితరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న విష్ణుజిత్ ఇన్ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్కు తీసుకున్నారు. ఆ స్థలంలో రజితరెడ్డి పలు బ్యాంకుల్లో లోన్లు తీసుకొని విశాలమైన కాంప్లెక్స్ నిర్మించారు. 2022 దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్లో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, ఫుట్వేర్, కేఎఫ్సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దె కు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులు బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. గతేడాది డిసెంబర్ 7న ఆర్టీసీ సిబ్బంది, ట్రాన్స్కో అధికారులు మొ దటి సారి బకాయిలను వసూలు చేయడానికి ప్రయత్నించారు. దీంతో కోర్టును ఆశ్రయించిన మాల్ నిర్వాహకులు విడతల వారి గా బకాయిలు చెల్లిస్తూ వస్తున్నారు. కోర్టు ఇచ్చిన గడువు ముగిసినా పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ అధికారులు మాల్ను సీజ్ చేశారు. పోలీసుల సహకారంతో జీవన్రెడ్డి మాల్కు తాళం వేసిన ఆర్టీసీ అధికారులు వ్యాపారస్తులు ఆర్టీసీతో ఒప్పందం చేసుకోవాలని సూచన రూ.2.51కోట్ల బకాయి పడిన నిర్వాహకులు -
వేధింపుల కేసులో డీఎంహెచ్వో అరెస్ట్
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్: లైంగిక వేధింపు ల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ను పోలీసులు గురువారం అరె స్టు చేశారు. ఆయనపై ఏడు కేసులు నమోదయ్యా యి. డీఎంహెచ్వోను గురువారం సాయంత్రం కోర్టులో హాజరు పరిచామని కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్రావు తెలిపారు. న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారన్నారు. డీఎంహెచ్వో కార్యాల య సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్పైనా కేసు నమోదయ్యింది. అయితే ఆయనను ఇంకా అరెస్టు చేయలేదు. హైదరాబాద్కు బాధితులు.. డీఎంహెచ్వో వికృత చేష్టలకు పాల్పడుతున్నారంటూ జిల్లాలోని పీహెచ్సీలలో పనిచేస్తున్న మహిళా వైద్యులు ఇటీవల కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శితోపాటు ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ బుధవారం కామారెడ్డికి వచ్చి విచారణ జరిపారు. విచారణ జరిగిన మరుసటి రోజే వైద్యులు ఉన్నతాధికారులను కలిసేందుకు హైదరాబాద్కు తరలివెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్తూతో పాటు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్ రవీందర్నాయక్లను కలిసి సమస్యను వివరించడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు అందుబాటులో లేరని తెలిసింది. డీఎంహెచ్వో లైంగిక వేధింపుల వ్యవహారంపై రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్కు ఫి ర్యాదు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ కేసు ను నీరు గార్చడానికి రాజకీయ నాయకులు ప్రయ త్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన వైద్యులతోపాటు వారి భర్తలకు ఫోన్ చేసి రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో వైద్యాధికారిపై చర్యల విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్గత ఫిర్యాదుల కమిటీతో విచారణ డీఎంహెచ్వో లైంగిక వేధింపుల వ్యవహారంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీతో విచారణ జరిపించాలని ఉన్నతాధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలో మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురైతే ఈ కమిటీ విచారణ జరుపుతుంది. జిల్లా సంక్షేమశాఖ అధికారి, ఐసీడీఎస్ పీడీతో పాటు మరో ఇద్దరు మహిళా అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్ర లేదా శనివారాల్లో బాధిత మహిళా వైద్యులతో పాటు, డీఎంహెచ్వో, సూపరింటెండెంట్లను వేరువేరుగా విచారించనుంది. అనంతరం విచారణ నివేదికను కలెక్టర్కు అందిస్తారు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధిత వైద్యులు -
No Headline
వీసీల నియామక ప్రక్రియ జోరందుకోవడంతో తెలంగాణ యూనివర్సిటీ వైస్–చాన్స్లర్ (వీసీ) గా ఎవరు వస్తారోననే చర్చ సాగుతోంది. తెయూ వీసీ గా పని చేసిన ప్రొఫెసర్ డి రవీందర్గుప్తా తీవ్రమైన అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. గత ఏడాది జూన్ 17న వర్సిటీ పరిధిలోని ఒక ప్రైవేటు కళాశాల యజమాని వద్ద లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీకి పట్టుబడి జైలుకు వెళ్లారు. పదవిలో ఉన్న వీసీ రవీందర్గుప్తా జైలుకు వెళ్లడంతో రాష్ట్రంలో తెయూ పరువు, ప్రతిష్ట మంటగలిసింది. దీంతో అప్పటి నుంచి ఐఏఎస్ అధికారులే తెయూ ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కొత్త వీసీల నియామక ప్రక్రియ ఊపందుకోవడంతో ఈ సారి కొత్తగా వీసీగా వచ్చే వారైనా తెయూను గాడిలో పెట్టాలని విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావంతులు ఆశిస్తున్నారు. -
జిల్లాలో అకాల వర్షం
బాల్కొండ: బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్, ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల పరిధిలోని కొన్ని గ్రామాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వారం రోజుల నుంచి వర్షాలు పడుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగ సజ్జ పంట కోసిన రైతులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఏర్గట్ల మండలం తొర్తి, మోర్తాడ్ మండలం శెట్పల్లి, ధర్మోరా, ముప్కాల్ మండలం రెంజర్ల, నాగంపేట్లో భారీ వర్షం కురిసింది. వర్ని: వర్ని, జాకోర, కూనిపూర్, శ్రీనగర్, పాత వర్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వానాకాలం పంటలకు దుక్కి దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడానికి వాన ఉపయోగ పడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ టౌన్: ఆర్మూర్లో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. బీబీపేట: బీబీపేట మండలంలోని పలు గ్రామాల్లో వర్షం పడటంతో వడ్లు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేసిన బస్తాలు సైతం తడిసి ముద్దయ్యాయి.వర్నిలో నిలిచిన నీరు ఉమ్మడి జిల్లాలో గురువారం అకాల వర్షం కురిసింది. పలు గ్రామాల్లో భారీ వర్షం పడటంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఉచిత సేవలు ఉత్తవేనా?
బాన్సువాడ: బాన్సువాడకు చెందిన శ్రీనివాస్ తాడ్కోల్ రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్ బంక్లు పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లాడు. పెట్రోల్ పోయించుకుని బైక్ టైర్లలో గాలి చెక్ చేయాలని అక్కడి సిబ్బందిని అడగ్గా.. ఇక్కడ మిషన్ పనిచేయడం లేదని సమాధానం చెప్పారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు మెకానిక్ వద్ద డబ్బులు చెల్లించి టైర్లలో గాలి నింపుకుని వెళ్లాడు. ఇలా చాలా పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వేసవి దృష్ట్యా బంకుల్లో నీరు తాగుదామంటే తాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలు ఎక్కడ కనిపించడం లేదు. బంకుల్లో టైర్లలో గాలి నింపడం, తాగునీరు, మూత్రశాలలు తదితర సేవలు ఉచితంగా కల్పించాలి. వీటిపై అవగాహన లేకపోవడంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే అదనపు వ్యయం భారంగా మారుతోంది. ప్రతీ బంకులో టాయిలెట్, మంచినీరు, ఎయిర్ ఫ్రీగా అందించాలి. ఇలా అందిస్తేనే బంకు నిర్వహణకు అనుమతి దొరుకుంది. మనం పెట్రోల్, డీజిల్ కోసం చెల్లించే డబ్బులో వీటి మెయింటెన్స్ కోసం కూడా వసూలు చేస్తారు. కానీ వసతులు మాత్రం కల్పించడం లేదు. ఏ బంకుల్లోనైనా తాగునీటి వసతి లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు. స్వచ్ఛభారత్లో భాగంగా అన్ని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో చరవాణి వినియోగించుకునే సదుపాయం పంపుల్లో ఉండాల్సిందే. ప్రతీ బంకులో ఫిర్యాదు పెట్టె లేదా రిజిస్టర్ అందుబాటులో ఉంచాలి. అందులో వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. ప్రథమ చికిత్స కిట్ ఉంచాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోంచుకునే వీలుంది. కానీ ఈ సౌకర్యాలు ఏ ఒక్క బంకులో పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. సంబంధిత అధికారులు తనిఖీలు చేసిన దాఖలలు లేవు. దీంతో బంకు నిర్వాహకులు ఇష్ట్యారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి బంకుల్లో వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పెట్రోల్ బంకుల్లో కానరాని సేవలు పట్టించుకోని అధికారులు -
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జేఏవో!
నిజామాబాద్ నాగారం: విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్(జేఏవో)గా విధులు నిర్వహిస్తున్న 327 యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి పూదరి గంగాధర్(జేఏఓ) ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కోడ్ అమలు ఉండగా జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ ఐటీఐ కళాశాల ఆవరణలో ఉదయం వాకింగ్ సమయంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డికి పుష్పగుచ్ఛం అందించారు. దీనిపై సీ విజిల్ యాప్లో ఏప్రిల్ 3న ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు విచారణ చేసి నివేదిక అందజేయాలని ఎస్ఈ రవీందర్ను ఆదేశించారు. విద్యుత్శాఖ సీఎండీ కార్యాలయం నుంచి సైతం ఏపీటీఎస్ సీఐ గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేయాలని ఆదేశాలు వచ్చాయి. అధికారులు వేర్వేరుగా విచారణ చేపట్టారు. ఈ నెల 9న విచారణ చేసి, 12న నివేదికలను కలెక్టర్కు అందజేశారు. కాగా గంగాధర్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డికి పుష్పగుచ్ఛం అందించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అధికారుల చర్యల నుంచి తప్పించుకోవడానికి సదరు ఉద్యోగి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వాకర్స్ అసోసియేషన్ నుంచి సదరు ఉద్యోగికి ఎలాంటి సంబంధం లేదని విన్నవించిన్నట్లు తెలిసింది. వాకింగ్కు వెళ్లడంతోనే అందరితో పాటు కలిశామని చెబుతున్నారు. నివేదిక అందించాం జేఏవో గంగాధర్ ఐటీఐ కళాశాల మైదానంలో అభ్యర్థి జీవన్రెడ్డిని కలిసిన విషయమై సీ విజిల్ యాఫ్లో ఫిర్యాదు వెళ్లింది. కలెక్టర్, సీఎండీ ఆదేశాల మేరకు విచారణ చేసి ఇప్పటికే నివేదిక అందించాం. కోడ్ అమలులో ఉండగా ఎప్పుడు కూడా రాజకీయ నాయకులను కలువకూడదు. – రవీందర్, విద్యుత్శాఖ ఎస్ఈ -
17 నుంచి బ్యాక్లాగ్ పరీక్షలు
నిజామాబాద్అర్బన్: డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బ్యాక్లాగ్ పరీక్షలు ఈ నెల 17 నుంచి నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ రంజిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని, హాల్ టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరు నిజామాబాద్అర్బన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు రూ.1000 అపరాధ రుసుంతో గురువారం వరకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్నాగారం: అగ్నిపథ్ స్కీం ద్వారా భారతీయ వాయుసేనలో అగ్నీవీర్ వాయు(మ్యుజీషియన్) ఉద్యోగం కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి జూన్ 5వరకు https:// agnipathvayu. cdac. inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 02–01–2004 నుంచి 02–07–2007 మధ్య జన్మించిన వారు అర్హులని తెలిపారు. పదో తరగతి పాసై ఉండాలని, సంగీతంలో ప్రావీణ్యం ఉండాలని వివరించారు. ఎన్ఐటీలో 17వ ర్యాంక్ ఎల్లారెడ్డి రూరల్: ఎల్లారెడ్డి కి చెందిన ముత్యాల వైష్ణ వి నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) జాతీయ స్థాయిలో 17వ ర్యాంకు సాధించినట్లు స్థానికులు తెలిపారు. పట్టణంలోని ముత్యాల లక్ష్మి– రామేశ్వర్రావు దంపతుల కూతురు వైష్ణవి ఎన్ఐటీ ఫ్యాషన్ టెక్నాలజీ నిర్వహించిన ఎంట్రెన్స్లో జాతీయ స్థాయిలో 17వ ర్యాంకు సాధించినట్లు వారు తెలిపారు. ఆమెను కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అభినందించారు. కొబ్బరి చెట్టుపై పిడుగు బాన్సువాడ రూరల్: బాన్సువాడలోని మహే శ్వరి థియేటర్ ఆవరణలో గల కొబ్బరి చెట్టుపై మంగళవారం రాత్రి పిడుగు పడింది. దీంతో మంటలు వ్యాపించాయి. కొబ్బరి చెట్టు కొమ్మ లు ఎండిపోయి ఉండటంతో చెట్టు ఆకులు కా లిపోయాయి. పెద్దశబ్దంతో పిడుగుపడి మంట లు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గు రయ్యారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. జీజీహెచ్లో జూనియర్ డాక్టర్ల మధ్య గొడవ ● ఆలస్యంగా వెలుగులోకి ఘటన నిజామాబాద్ నాగారం: నగరంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల మధ్య పది రోజుల క్రితం గొడవ జరగ్గా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూనియర్ డాక్టర్లు, బయట వ్యక్తుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు వైరలయ్యాయి. జూనియర్ వైద్యుల మధ్య గొడవ జరగ్గా.. దీనిలోకి ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు. దీంతో గంటపాటు వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ, ఎస్పీఎఫ్ సిబ్బంది, నర్సులు ఆపే ప్రయత్నం చేసినా వాళ్లు వినలేదు. గొడవలో మహిళా జూనియర్ డాక్టర్లు కూడా ఉండడం గమనార్హం. ప్రైవేట్ వ్యక్తులతో ఉన్న సాన్నిహిత్యంతో గొడవ జరిగినట్లు సమాచారం. అధికారుల పర్యవేక్షణ లేకనే జీజీహెచ్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement