-
ఒడిశా రాజకీయాల్లో ‘లుంగీ’ వార్..
భువనేశ్వర్: ఒడిశా రాజకీయాల్లో లుంగీల వార్ నడుస్తోంది. అధికార బీజేడీ నేతలు లుంగీలు కట్టుకుని బీజేపీకి కౌంటర్ ఇస్తున్నారు. అసలీ లుంగీల గోల ఏంటి.. బీజేడీ నాయకులు సంప్రదాయ కుర్తా పైజామా, ప్యాంట్-షర్ట్ కాకుండా లుంగీలు ఎందుకు ధరిస్తున్నారో ఈ కథనంలో చూద్దాం.ఒడిశాలో 21 లోక్సభ స్థానాలతో పాటు 147 అసెంబ్లీ సీట్లకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఓటర్లను ఉద్దేశించి ఒక వీడియోలో ప్రసంగించారు. ఇందులో ఆయన లుంగీ కట్టుకొని కనిపించారు. పార్టీ గుర్తైన శంఖం ఉన్న ప్లకార్డులను పట్టుకుని లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.నవీన్ పట్నాయక్ లుంగీ కట్టుకొని వీడియోలో మాట్లాడటాన్ని బీజేపీ నేత, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎద్దేవా చేశారు. దీంతో ధర్మేంద్ర ప్రధాన్కు కౌంటర్గా బీజేడీ నాయకులు సస్మిత్ పాత్ర, స్వయంప్రకాశ్ మహోపాత్ర లుంగీలు ధరించి ప్రెస్మీట్ నిర్వహించారు. నవీన్ పట్నాయక్ ఫొటో ముందు లుంగీలతో పోజులిచ్చారు. దీంతో ఇప్పుడు బీజేపీ, బీజేడీ మధ్య లుంగీ వార్ ముదురుతోంది. -
నందన్కానన్ జూలో తెల్లపులి మృతి
భువనేశ్వర్: నగర శివారులోని బారంగ్ నందన్కానన్ జూలాజికల్ పార్క్లో 14 ఏళ్ల తెల్లపులి ‘స్నేహ’ శుక్రవారం జూలో చికిత్స పొందుతూ మరణించింది. గురువారం అస్వస్థతకు గురవ్వడంతో సత్వర చికిత్స ప్రారంభించారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న తరుణంలో తీవ్రమైన వడగాలుల కారణంగా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. స్నేహ 2010 మార్చి 1న జన్మించింది. 14 ఏళ్ల జీవిత కాలంలో 3 ఈతల్లో 9 పిల్లల తల్లిగా జూలో పులుల సంతతి వృద్ధికి తోడ్పడింది. వీటిలో 3 తెలుపు, 4 సాధారణ, 2 మెలనిస్టిక్ వన్నెల పులులు ఉండడం విశేషం. 2022 అక్టోబర్లో 11 ఏళ్ల తెల్లపులి బిజయ మృతి చెందింది. ఊపిరితిత్తుల క్యాన్సర్కు గురై ఇది మరణించింది. అంతకుముందు 2019 అక్టోబర్లో కాలేయ సంబంధిత అనారోగ్యంతో సుభ్రాంశు అనే ఐదేళ్ల తెల్ల మగ పులి కూడా మరణించింది. నందన్కానన్ అధికారిక వనరుల సమాచారం ప్రకారం ప్రస్తుతం జూలో 27 పులులు ఉన్నాయి. వీటిలో సాధారణ పులులతో 7 తెలుపు మరియు 3 మెలనిస్టిక్ పులులు ఉన్నాయి.మావో డంప్ స్వాధీనం మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి బోడిగేట్ట అడవిలో కూంబింగ్ నిర్వహించిన కోబ్రా, బీఎస్ఎఫ్ జవాన్లు మావోలు అమర్చిన భారీ డంప్ను వెలికితీశారు. వివరాల్లోకి వెళ్తే.. బేజాంగ్వాడ అడవిలో మావోల డంప్లు ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా జిల్లా ఎస్పీ నితీష్ వాద్వానికి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో కోబ్రా, బీఎస్ఎఫ్ జవాన్లు ముమ్మరంగా గురువారం సాయంత్రం నుంచి కూంబింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఎలక్కనూర్ గ్రామం వద్ద డంప్ను స్వాధీనం చేసుకున్నారు. డంప్లో ఒక ఐఈడీ టిఫిన్ బాక్స్ బాంబ్, ఆరు గన్లు, 36 హైడ్ గ్రానేట్స్, రెండు సోలార్ ఎల్క్ట్రికల్ ప్యానెల్స్, ఒక గ్యాస్ సిలిండర్, 20 మీటర్ల కరెంట్ వైరు ఉన్నట్లు వెల్లడించారు. డంప్ స్వాధీనం చేసుకున్న జవాన్లను అధికారులు అభినందించారు. నలుగురు దోపిడీ దొంగలు అరెస్టు బరంపురం: నగర శివారులోని శ్రీక్షేత్ర విహార్ పక్కన పడియాలో దోపిడీకి సిద్ధమవుతున్న ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. ఐఐసీ అధికారి గోపినాథ్ ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో నిమ్మఖండి పోలీసుస్టేషన్ పరిధిలో అర్థరాత్రి దోపిడీకి సిద్ధమవుతున్న ముఠా పోలీసుల కంటపడింది. దీంతో పోలీసులు వీరిని వెంబడించి చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో గంజాం జిల్లాలోని గంగపూర్ గ్రామానికి చెందిన తపన్ సాహు, పద్మపూర్ గ్రామానికి చెందిన నిమోయ్ చరణ్ నాయక్, తెంతులిఖండి గ్రామానికి చెందిన దేబనంద గౌడ, అస్కాకి చెందిన కె.సుర్యారావులు ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 2 బైక్లు, తుపాకీ, 5 గుండ్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.బీజేడీలోకి చేరికలు పర్లాకిమిడి: గుమ్మా సమితి సభ్యులు బర్నింగ్ గొమాంగో, గుసాని సమితిలో ఎం.ఎస్.పూర్ పోలాకి విష్ణుప్రసాద్లు శుక్రవారం బీజేడీలో చేరారు. స్థానిక బీజేడీ పార్టీ కార్యాలయంలో మిశ్రణ్ పర్వ్ శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కెంగం సూర్యారావు కాంగ్రెస్ నుంచి బీజేడీలో చేరిన బర్నింగ్ గొమాంగో, విష్ణుప్రసాద్లను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీజేడీ పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లినవారు పార్టీ ఽద్రోహులని బీజేడీ ఛత్ర విభాగం అధ్యక్షుడు సుర్జిత్ త్రిపాఠి అన్నారు. -
శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024
● ఓటెత్తాలిఓటుహక్కు వినియోగంపై జిల్లా యంత్రాంగం విరివిగా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 85 శాతంకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో జిల్లాలోని గుడారిలో శుక్రవారం ఓటుహక్కు వినియోగంపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. గుడారి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల్లో చైతన్యం కల్పించేవిధంగా సిబ్బంది బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. – రాయగడన్యూస్రీల్ -
మహిళాభివృద్ధే బీజేడీ లక్ష్యం
రాయగడ: రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సాహించి, అభివృద్ధిలో వారిని అగ్రస్థానంలో నిలపడమే బీజేడీ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, రాయగడ జిల్లా ఎన్నికల పరిశీలకుడు అతున్ సవ్యసాచి నాయక్ అన్నారు. స్థానిక తేజస్వీ హోటల్ మైదానంలో కొత్తగా నిర్మించిన బీజేడీ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ముందుగా స్థానిక కొత్త బస్టాండ్ వద్ద దివంగత ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన భారీ బైకు ర్యాలీలో పాల్గొన్నారు. బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాయగడ శాసనసభ నుంచి పోటీ చేస్తున్న అనసూయా మాఝి, కొరాపుట్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కౌలస్య హికకలు ర్యాలీలో పాల్గొన్నారు. కొత్త బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ మార్కెట్ మీదుగా ఫ్లైవర్ బ్రిడ్జి నుంచి తేజస్వీ ైమెదానం వరకు కొనసాగింది. వేల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ● మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో అతున్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలియజేశారు. మహిళల ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి స్వయం సహాయక బృందాలు, మిషన్ శక్తి వంటి పథకాలను బీజేడీ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. గడిచిన రెండు దశాబ్ధాలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న బీజేడీ ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. రాయగడ శాసనసభ, కొరాపుట్ లోక్సభ వంటి స్థానాల్లో మహిళలకు టిక్కెట్టు ఇచ్చి ఎన్నికల బరిలో నిలబెట్టిన నవీన్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చని వివరించారు. ● ఆశీర్వదించండి ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రప్రథమంగా రాయగడ శాసనసభ నుంచి, అదేవిధంగా కొరాపుట్ లోక్సభ నుంచి మహిళలు పోటీ చేస్తున్నారు. దీంతో ప్రజల ఆశీర్వాదంతో తాము ముందుకు వెళ్లి అభివృద్ధికి కృషి చేస్తామని అనసూయా మాఝి, కౌసల్య హికకలు వేదికపై నుంచి అభ్యర్థిచారు. కార్యకర్తల సహకారం ఉంటే తమ విజయం సునాయాసమవుతుందన్నారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు. ● బీజేడీలో చేరికలు ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకుడు, ప్రముఖ న్యాయవాది బాబు రాజ్గురు, అతని మద్దతుదారులు బీజేడీ తీర్ధం పుచ్చుకున్నారు. మంత్రి నాయక్ వారికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జితు పూజారి, దయానిధి కొంధొపాణి, నందు మండంగి, విశ్వనాథ్ పిడిక, కృష్ణ సరక, శాంత గౌరి పూజారి వంటి కాంగ్రెస్ యువ నాయకులు బీజేడీలో చేరినవారిలో ఉన్నారు. మంత్రి సవ్యసాచి నాయక్ రాయగడలో భారీ బైక్ ర్యాలీ -
ఓటే.. నీ ఆయుధం..!
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వినియోగం ప్రక్రియ అత్యంత బృహత్తరమైనది. ఈ ప్రక్రియని విజయవంతం చేయడంలో యువతని భాగస్వాములుగా మేల్కొలిపేందుకు ఎన్నికల సంఘం అంకితభావంతో కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) మార్గదర్శకంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాస్థాయిలో పలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలాసోర్ జిల్లాలోని వివిధ కళాశాలల్లో విద్యార్థులు ఈ కార్యకలాపాల్లో చురుకుగా పాలుపంచుకున్నారు. ప్రధానంగా తొలిసారి ఓటుహక్కు పొందిన సరికొత్త విద్యార్థి ఓటర్లు ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఓటుహక్కు ప్రాధాన్యత ఇతివృత్తంగా బాలాసోర్ ప్రాంతంలో పలు పాఠశాలలు, కళాశాలల్లో ఇటువంటి చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. మొదటిసారి ఓటు వేయనున్న యువతలో ఓటుహక్కు సద్వినియోగంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మన ప్రజాస్వామ్యం భవిష్యత్తును రూపొందించడంలో మన యువతను శక్తివంతం చేయడం చాలా కీలకం అని ఎన్నికల సంఘం తెలిపింది. డీఈవో బాలాసోర్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఓటు వేయనున్న విద్యార్థులను అవగాహన కల్పించే దృక్పథంతో రంగోలీ పోటీలు నిర్వహించారు. వీరు రూపుదిద్దిన ప్రతి రంగవల్లి భారత ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను ప్రతిబింబించిందని నిర్వాహక వర్గం అభినందించింది. – భువనేశ్వర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
కింగ్స్ పోరులో పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు
IPL 2024 RR vs SRH: సై అంటే సై అంటున్న కొదమసింహాలు
ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా?
తగ్గిన యూపీఐ చెల్లింపులు.. ఎంతంటే..
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు
ఒకసారి ఆ క్లిప్ చూడండి.. చంద్రబాబు ఎంత నీచుడో..!
నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
ఒకసారి ఆ క్లిప్ చూడండి.. చంద్రబాబు ఎంత నీచుడో..!
నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
Advertisement