విషవాయువు సోకి | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Thu, Apr 11 2024 8:40 AM

-

ఇద్దరు కార్మికుల మృతి

అన్నానగర్‌: మనలి ప్రైవేటు ఫ్యాక్టరీలో మంగళవారం ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువు సోకి ఇద్దరు కార్మికులు మరణించారు. మనలి సా తంగాడు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేసే ప్రైవేట్‌ పారిశ్రామికవాడ ఉంది. ఈ పారిశ్రామికవాడలో జెయింట్‌ ట్యాంక్‌లోని పెట్రోలు వ్యర్థాల ట్యాంక్‌ను శుభ్రప రిచే పనిని మంగళవారం మధ్యాహ్నం కొందరు కాంట్రాక్టు కార్మికులు చేపట్టారు. ట్యాంక్‌ లోపల దిగి శుభ్రం చేసే పనిలో నిమగ్నమైన కార్మికులు తి రువొత్తియూర్‌కి చెందిన దీనదయాళన్‌ (41), సత్యమూర్తి నగర్‌కు చెందిన బజ్‌నాథ్‌ ఠాగూర్‌ (59)కి ఒక్కసారిగా విషవాయువు సోకింది. దీంతో వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని తోటి కార్మికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం మాధవరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తర లించారు. ఈ ఘటనపై సాత్తాంగాడు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement