-
నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు
ఒంగోలు: రాష్ట్రంలో సీబీఎస్ఈ పాఠశాలలుగా ఎంపికై న 63 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పరిశీలకులైన ఆర్.ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ముండ్లమూరు ఏపీ మోడల్ స్కూల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. స్ట్రక్చర్డ్ పెడగాగీ లెసన్ ప్లాన్స్ 2024–25 అకడమిక్ ఇయర్ శిక్షణ (నాన్ రెసిడెన్షియల్) నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఇంగ్లిష్, సోషల్, బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు ఈ నెల 17, 18 తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయన్నారు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉపాధ్యాయులకు ఈ నెల 20, 21 తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. సబ్జెక్టుల వారీగా ఆంగ్లం 97, సోషల్ 89, బయోలాజికల్ సైన్స్ 116, గణితం 128, ఫిజిక్స్ 58, కెమిస్ట్రీ 58 మంది వెరసి 546 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణకు ఎంపికై న ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణకు హాజరయ్యేలా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు చర్యలు చేపట్టాలని సూచించారు. 108 కలశాలతో శోభాయాత్ర ● వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు ప్రారంభం ఒంగోలు మెట్రో: వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి జయంతి వేడుకలు స్థానిక గాంధీరోడ్డులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి వీధిలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు స్థానిక రంగారాయుని చెరువు నుంచి 108 కలశాలతో నగరంలోని ఆర్యవైశ్య మహిళలు అభిషేక జలాన్ని శోభాయాత్రగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. డాక్టర్ చావల ప్రకాష్ వాసవీ పతాకను ఆవిష్కరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవీ ఆలయ తదియారాధన సంఘ సభ్యులు పాల్గొన్నారు. వాలీబాల్ శిక్షణకు ఎంపికలు ఒంగోలు సెంట్రల్: ప్రకాశం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు ఉచితంగా వేసవి రెసిడెన్షియన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు సూదనగుంట కోటేశ్వరరావు (బుజ్జి), ఎం.ఆంజనేయులు తెలిపారు. బాలబాలికల ఎంపికను శనివారం స్థానిక డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 13 నుంచి 16 సంవత్సరాల వయసు గల బాలబాలికలు అర్హులని తెలిపారు. బాలురు 178 సెం.మీ, బాలికలు 168 సెం.మీ ఆపైన ఎత్తు కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు 94901 96274, 94903 82802, 77290 61966 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
చెప్పాడంటే.. చేస్తాడంతే..!
సంక్షేమ శాఖల వారీగా విడుదలైన నిధులు... సంక్షేమశాఖ విద్యార్థుల విద్యార్థుల విడుదలైన సంఖ్య తల్లుల సంఖ్య నిధులు (రూ.లో) ఎస్సీ 12,460 11,196 8,54,04,869 ఎస్టీ 1,107 1,009 75,24,724 బీసీ 15,774 14,297 11,38,71,905 ఈబీసీ 12,250 10,985 11,40,52,489 ముస్లిం 3,006 2,725 2,10,41,998 కాపు 2,768 2,534 2,20,06,142 క్రిస్టియన్ 57 51 5,27,624 మొత్తం 47,422 42,797 36,44,29,757 నియోజకవర్గాల వారీగా నిధుల విడుదల ఇలా... నియోజకవర్గం విద్యార్థుల విద్యార్థుల విడుదలైన సంఖ్య తల్లుల సంఖ్య నిధులు (రూ.లో) దర్శి 6,247 5,657 1,21,52,075 గిద్దలూరు 6,049 5,498 1,57,65,392 కనిగిరి 6,223 5,586 1,52,87,210 కొండపి 6,482 5,847 1,51,32,550 మార్కాపురం 5,357 4,861 1,19,11,323 ఒంగోలు 6,387 5,691 1,85,79,073 ఎస్.ఎన్.పాడు 5,288 4,731 1,31,07,315 వై.పాలెం 5,389 4,926 1,19,36,967 మొత్తం 47,422 42,797 36,44,29,751 ఎన్నికల అనంతరం సైతం ప్రజా సంక్షేమంపైనే సీఎం జగన్ దృష్టి జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల 2023–24 విద్యా సంవత్సరం మొదటి విడత నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 42,797 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.36.44 కోట్లు జమ ఎన్నికలకు ముందే జమకావాల్సి ఉండగా, ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకున్న టీడీపీ కూటమి పోలింగ్ పూర్తయిన వెంటనే నిధులు విడుదల చేసిన సీఎం జగన్ -
No Headline
ఒంగోలు సెంట్రల్: జగనన్న విద్యాదీవెన పథకం 2023–24 విద్యా సంవత్సరం మొదటి విడత నిధులు గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమయ్యాయి. ఎన్నికలకు ముందే ఈ నిధులు తల్లుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. ఆ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టా రు. కానీ, టీడీపీ కూటమి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి నిధులు జమకాకుండా అడ్డుకుంది. కోర్టులకు సైతం వెళ్లినా నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. టీడీపీ కుట్రల వలన ఆగిన ఈ పథకం నిధులను ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే విడుదల చేస్తామని సీఎం జగన్ బహిరంగ సభలో ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 2023–24 విద్యా సంవత్సరంలో మొదటి విడతగా 47,422 మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లులు 42,797 మంది బ్యాంక్ ఖాతాలకు రూ.36.44 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. వీరంతా డిగ్రీ, పీజీతో పాటు ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, సాధికారత నోడల్ అధికారి ఎన్.లక్ష్మానాయక్ తెలిపారు. -
శ్రీశైలం ఘాట్లో రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: మల్లన్న దర్శనానికి వెళ్తుండగా కారు అదుపు తప్పి లోయలో బోల్తా పడిన ఘటన గురువారం చిన్నారుట్ల సమీపంలోని దయ్యాల మలుపు వద్ద చోటుచేసుకుంది. ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై అంకమ్మరావు కథనం మేరకు.. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన ఉమ్మడి కుటుంబ సభ్యులు దైవదర్శనం నిమిత్తం కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాదంలో ప్రేమ్కుమార్, నగేష్, వెంకట్రాముడు, రమేష్, కేశవులు, మనోహర్, సురేష్, కుమార్తోసహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న శ్రీశైలం, పెద్దదోర్నాల 108 వాహనాల సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు శ్రీశైలం పోలీసు సిబ్బందితో కలిసి ఎస్సై అంకమరావు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన కారు సుమారు 15 మందికి తీవ్ర గాయాలు క్షతగాత్రులది కర్నూలు జిల్లా ప్యాలకుర్తి -
గుండెల్లో పెట్టుకుంటా
కష్టించి పనిచేసిన వారిని సీఎస్పురం(పామూరు): వైఎస్సార్ సీపీ బలోపేతం, ఎన్నికల్లో పార్టీ విజయానికి పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వైఎస్సార్ సీపీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణయాదవ్ అన్నారు. ఈ నెల 13న సీఎస్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 84వ పోలింగ్బూత్లో టీడీపీ ఏజెంట్ల దురాగతాలను వైఎస్సార్ సీపీకి చెందిన టీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల బాలుయాదవ్ ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన టీడీపీ వారు పెద్ద సంఖ్యలో మేకల బాలుయాద్పై దాడిచేసి గాయపరిచారు. దీంతో బుధవారం రాత్రి డాక్టర్ దద్దాల నారాయణయాదవ్ మేకల బాలు స్వగ్రామం కొండబోయినపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి దాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దద్దాల మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాభవం కనిగిరితో పాటు అటు రాష్ట్రంలోను చవిచూడబోతోందని దీంతో టీడీపీ శ్రేణులు ఏం చేయాలో దిక్కుతోచక ఇతర పార్టీల వారిపై దాడులకు దిగుతున్నారన్నారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, దాడికి పాల్పడ్డ వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని, మరోమారు ఇలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా చూస్తాన్నారు. ఆయన వెంట పీడీసీసీబీ చైర్మన్ వైఎం.ప్రసాద్రెడ్డి, జెడ్పీటీసీల సంఘ జిల్లా అధ్యక్షుడు, వెలిగండ్ల జెడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి, మండల జేఏసీ కన్వీనర్ బైరెడ్డి తిరుపతిరెడ్డి, పార్టీ యూత్ మండల అధ్యక్షుడు బొర్రాజు రమణయ్యయాదవ్, బొట్లా చిరంజీవి, ఇర్లా వీరాంజనేయులు, బత్తుల మాల్యాద్రి, పలువురు నాయకులు ఉన్నారు. దద్దాల నారాయణ యాదవ్ -
No Headline
ఒంగోలు సెంట్రల్: జగనన్న విద్యాదీవెన పథకం 2023–24 విద్యా సంవత్సరం మొదటి విడత నిధులు గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమయ్యాయి. ఎన్నికలకు ముందే ఈ నిధులు తల్లుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. ఆ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టా రు. కానీ, టీడీపీ కూటమి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి నిధులు జమకాకుండా అడ్డుకుంది. కోర్టులకు సైతం వెళ్లినా నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. టీడీపీ కుట్రల వలన ఆగిన ఈ పథకం నిధులను ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే విడుదల చేస్తామని సీఎం జగన్ బహిరంగ సభలో ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 2023–24 విద్యా సంవత్సరంలో మొదటి విడతగా 47,422 మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లులు 42,797 మంది బ్యాంక్ ఖాతాలకు రూ.36.44 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. వీరంతా డిగ్రీ, పీజీతో పాటు ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, సాధికారత నోడల్ అధికారి ఎన్.లక్ష్మానాయక్ తెలిపారు. -
No Headline
మార్కాపురం: ప్రకాశం, గుంటూరు, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. జిల్లాలో మార్కాపురం పరిధిలో 900 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉంది. దాదాపు 84 పెద్ద పులులతో పాటు 400కుపైగా చిరుతలు, జింకలు, దుప్పులు, నెమళ్లు తదితర వన్యప్రాణులకు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, గుంటూరు జిల్లాలోని విజయపురిసౌత్ రేంజ్లు ఉండగా, గిద్దలూరు పరిధిలో గిద్దలూరు, గుండ్లకమ్మ, తురిమెళ్ల, కనిగిరి, ఒంగోలు ఉన్నాయి. మూడు వారాలుగా నల్లమల పరిసర ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనుషులే ఎండవేడికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నోరులేని వణ్యప్రాణుల పరిస్థితి ఊహించలేము. అటవీ ప్రాంతంలో నీటి లభ్యత కూడా కరువైంది. దీంతో తాగునీటి కోసం దోర్నాల–శ్రీశైలం, దోర్నాల–ఆత్మకూరు రహదారిపైకి, గ్రామాల వైపు వణ్యప్రాణులు వెళ్తున్నాయి. తిరిగి అవి అరణ్యంలోకి వెళ్లలేకపోతున్నాయి. వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఇవి అటవీ ప్రాంతాన్ని వదిలిరాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నారు. నీటి వనరుల కోసం ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో 175 సాసర్పిట్లు ఏర్పాటు చేసి ప్రతి రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటితో నింపుతున్నారు. వీటితో పాటు సహజసిద్ధంగా 275 నుంచి 300 నీటి కుంటలు ఉన్నాయి. వీటికి అదనంగా 40 నీటి కుంటలు ఏర్పాటు చేశారు. 20 సోలార్ పంప్సెట్ల ద్వారా నీటితో నింపుతున్నారు. దీంతో పెద్ద పులులు, చిరుతలు, దుప్పులు ఇతర వన్యప్రాణులు అక్కడికి వచ్చి నీళ్లు తాగుతున్నాయి. దీని వలన రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురికాకుండా ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా వీటి కదలికలను పరిశీలిస్తున్నారు. బేస్ క్యాంపులు ఏర్పాటు... నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు బేస్ క్యాంప్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటి కదలికల కోసం సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంప్, ఇష్టకామేశ్వరీ, దొరబైలు, నారుతడికల, పాలుట్ల, కొలుకుల, తుమ్మలబైలు, వెదురుపడియ, కొర్రపోలు, చినమంతనాల, రోళ్లపెంట తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంప్లు ఉన్నాయి. ఇందులో ఐదుగురు అటవీ అధికారులు ఉంటారు. అడవిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, శిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 120 మంది ప్రొటెక్షన్ వాచర్లు పులుల సంరక్షణలో ఉన్నారు. రాత్రి సమయంలో అడవి జంతువులు వచ్చి దాహం తీర్చుకుంటాయి. నల్లమల అటవీ ప్రాంతంలో సహజ కుంటల్లో వేసవిలో కూడా ఇక్కడ నీరు ఉండటం విశేషం. దీంతో అడవి జంతువులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి. -
No Headline
మండు వేసవిలో మంచి వర్షం కురిసింది. గురువారం ఉదయం 8.30 నుంచి 10.30 వరకూ రెండు గంటలకుపైగా దంచికొట్టింది. ఒంగోలు నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాతావరణం ఒక్కసారిగా వర్షాకాలాన్ని తలపించింది. రోడ్లపై వర్షం నీరు పొంగిపొర్లి వాహనదారులు కొద్దిసేపు అవస్థపడ్డారు. వర్షం వెలిసిన గంట తర్వాత నీళ్లన్నీ కాలువల ద్వారా జారుకోవడంతో ప్రశాంతంగా రాకపోకలు సాగించారు. వర్షానికి సూర్యుడు మొహం చాటేసి వాతావరణం చల్లబడినప్పటికీ.. తీవ్రస్థాయిలో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. చెమటలతో తడిసిముద్దయ్యారు. ఏదిఏమైనప్పటికీ మండుటెండల సమయంలో భారీ వర్షంతో ఊరట చెందారు. -
ప్రశాంతంగా ఏపీఈఏపీసెట్
ఒంగోలు సెంట్రల్: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఏపీఈఏపీసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రెన్స్ టెస్ట్) ప్రశాంతంగా ముగిసింది. ఒంగోలులోని రెండు కేంద్రాల్లో 940 మంది విద్యార్థులకుగానూ 870 మంది హాజరై పరీక్ష రాశారు. ఆయా కేంద్రాల వద్ద ముందస్తుగా విద్యార్థులను తనిఖీ చేసి పరీక్షకు అనుమతిచ్చారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో విడత ఎంట్రెన్స్ పరీక్షల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. -
No Headline
ప్రత్యేక రక్షణ చర్యలు నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు 175 సాసర్పిట్లు ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నాం. వన్యప్రాణుల సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. ఎత్తైన అరుదైన వృక్షాలు, జంతువులు నల్లమలలో ఉన్నాయి. వేసవిలో జంతువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసకున్నాం. ఘాట్ రోడ్డులో ఎవరైనా వాహనాలు ఆపి బీడీ, సిగరేట్ తాగితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నాం. – విఘ్నేష్ అప్పావు, డీడీ, మార్కాపురం -
గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ సురేష్కుమార్ ఒంగోలు టౌన్: గర్భిణుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.సురేష్ కుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా కార్యాలయంలో వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు వారి పరిధిలోని గర్భిణుల వివరాలను సకాలంలో రిజిస్టర్ చేయాలని, సమగ్ర వివరాలతో ఆర్సీహెచ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రసవం నుంచి ప్రసవానంతరం వరకు అన్ని రకాల సేవలను క్రమం తప్పకుండా అందజేయాలని చెప్పారు. గర్భిణులకు అందించిన సేవల వివరాలను వెబ్ పోర్టల్లో నమోదు చేయాలని, ప్రతి ఒక్కరికీ ఎంసీపీ కార్డ్ అందజేయాలని చెప్పారు. గర్భిణులకు అందించే వైద్య సేవలను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని, తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్సీహెచ్, చెయిల్డ్ హెల్త్, ఇమ్యూనైజేషన్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలన్నింటిలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, లక్ష్యాలు సాధించలేని సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఒంగోలు ఉప వైద్యాధికారి డాక్టర్ మాధవీలత, డీపీఎంఓ డాక్టర్ వాణిశ్రీ, డీపీహెచ్ఎన్ఓ సుగుణమ్మ, డీపీఓ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించాలి
● కలెక్టర్ దినేష్కమార్ ఒంగోలు టౌన్: డెంగీ వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యంతో డెంగీ వ్యాధిని నివారించేందుకు సమర్థవంతంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని చెప్పారు. ప్రతి ఏడాది దర్శి ప్రాంతంలో డెంగీ వ్యాధి ఎక్కువగా ప్రబలుతున్నందున దానికి కారణాలను అన్వేషించి పరిష్కార చర్యలు చేపట్టాలని చెప్పారు. పంచాయతీ శాఖ, పశుసంవర్థకశాఖ, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వెక్టార్ వెబ్ కంట్రోల్ యాప్ పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావులకు సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. శాఖల వారీగా డెంగీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ, డీపీఓ, వైద్య విధాన పరిషత్, వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్, డీఆర్డీఏ, ఎస్సీ, రూరల్ వాటర్ సప్లయ్, విద్యాశాఖ, డీడీ మైన్స్, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కలెక్టర్తో జీజీహెచ్ సూపరింటెండెంట్ భేటీ
ఒంగోలు టౌన్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ దుర్గాదేవి గురువారం కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీజీహెచ్లో చికిత్స కోసం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య శ్రీ సేవలు గణనీయంగా పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. తెలుగు తమ్ముళ్ల శవ రాజకీయం! ● అయ్యపురాజుపాలెంలో వృద్ధుడు మృతి ● ఆస్తి పంచాయితీ తేలేవరకు అంత్యక్రియలొద్దని మంకుపట్టు మర్రిపూడి: మండలంలోని అయ్యపురాజుపాలెంలో తెలుగుతమ్ముళ్లు శవరాజకీయం చేశారు. రెండు రోజుల క్రితం మరణించిన వృద్ధుడిని ఖననం చేయనివ్వకుండా రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి ఆస్తి పేరిట తెలుగు తమ్ముళ్లు కుటిల రాజకీయం చేశారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని అయ్యపురాజుపాలెం గ్రామానికి చెందిన గుట్లపల్లి వెంకటేశ్వర్లు(72)కు ఆదే గ్రామానికి చెందిన రమణమ్మతో సుమారు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహం అయిన కోద్దిరోజులకే భార్యాభర్తల మధ్య సంబంధం తెగిపోయింది. భర్తను వీడి భార్య రమణమ్మ మరో ప్రాంతానికి వెళ్లిపోయింది. ఒంటరి అయిన గుంట్లపల్లి వెంకటేశ్వర్లు తన అన్న వెంకయ్య వద్దే ఉంటున్నాడు. చేరదీశారన్న కృతజ్ఞతతో తన పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిని అన్న కుమారులకు వెంకటేశ్వర్లు రిజిస్ట్రేషన్ చేశారు. విషయం తెలుసుకున్న రమణమ్మ ముగ్గురు కుమార్తెలు తరచూ అయ్యపురాజుపాలెం గ్రామానికి చేరుకుని టీడీపీ నేతల సహకారంతో గొడవకు దిగారు. ఈ క్రమంలో గుట్లపల్లి వెంకటేశ్వర్లు ఈ నెల 15న ఉదయం తన అన్న కొష్టంలో మరణించాడు. అన్న వెంకయ్య కుమారులు అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగా రమణమ్మ, ఆమె ముగ్గురు కుమార్తెలు అయ్యపురాజుపాలెం చేరుకుని అంత్యక్రియలను అడ్డుకున్నారు. వృద్ధుడు మృతి చెంది రెండు రోజులు కావడంతో దుర్వాసన వస్తోంది. మృతదేహం ఉన్న మంచాన్ని వెంకయ్య కుమారుల ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆస్తి ఇస్తేనే అంత్యక్రియలు చేయనిస్తాం, లేదంటే శవం పూర్తిగా కుళ్లిపోయేవరకు ఇక్కడే ఉంటుందని భీష్మించారు. లేదా శవాన్ని మేమే ఖననం చేస్తాం.. మూడు నెలలు పాటూ ఈ ఇంట్లోనే ఉండనివ్వండి అని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శివబసవరాజు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేయించారు. -
అడవిలో ఆర్తనాదాలు..!
పర్యావరణ రక్షణ అందరి బాధ్యత ● ట్రైనీ ఐఎఫ్ఎస్ శివకుమార్ హంగల్ పెద్దదోర్నాల: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ట్రైనీ ఐఎఫ్ఎస్ శివకుమార్ హంగల్ పేర్కొన్నారు. గురువారం శ్రీశైలం రహదారిలో ప్లాస్టిక్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలం వచ్చే భక్తులు, యాత్రికులు శ్రీశైలం వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో ఉన్న పెద్దదోర్నాలలో నీటి బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన తినుబండారాలు సర్వ సాధారణంగా కొనుగోలు చేస్తుంటారన్నారు. అయితే రుచి చూసిన ఆహార పదార్థాల వ్యర్థాలను మార్గ మధ్యంలో అభయారణ్యంలో పడేయడం వల్ల వాటిని వన్యప్రాణులు ఆత్రంగా తిని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, యాత్రికులు వదిలి వెళ్లిన ప్లాస్టిక్ వ్యర్థాలను స్వచ్ఛ సేవక్ల సాయంతో సేకరించి, రీసైక్లింగ్ చేసి పునర్వినియోగించేలా చర్యలు చేపట్టామని వివరించారు. నల్లమలలోని బేస్ క్యాంపులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దదోర్నాల: పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే కొందరు అధికారుల దుందుడుకు నిర్ణయాలు శ్రీశైలం వెళ్లే యాత్రికులు, భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్తున్న యాత్రికుల నుంచి ప్లాస్టిక్ నీటి బాటిళ్ల(నిండువి)ను గణపతి చెక్ పోస్టు వద్ద బలవంతంగా స్వాధీనం చేసుకోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్న నేటి తరుణంలో ప్లాస్టిక్ ఫ్రీజోన్ను బూచిగా చూపిస్తూ నీటి బాటిళ్లను పెద్దదోర్నాల చెక్పోస్టు వద్దే స్వాధీనం చేసుకోవడంపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించారా? ప్లాస్టిక్ బాటిళ్లతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్లాస్టిక్ సీసాలను అభయారణ్యంలో నిషేధిస్తున్నట్లు ముందుగానే సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకు సుమారుగా గంటన్నర సమయం పడుతుంది. ఉన్నట్టుండి కఠిన ఆంక్షలు అమలు చేయడం వల్ల మార్గమధ్యంలో దాహం వేస్తే తాము ఏమి చేయాలన్న భక్తుల ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. అభయారణ్యంలో తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఏకపక్షంగా ప్లాస్టిక్ సీసాలను నిషేధించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. కొర్రప్రోలులో ఒకలా.. గణపతి చెక్పోస్టులో మరోలా.. అభయారణ్యాన్ని ప్టాస్టిక్ ఫ్రీ జోన్గా ప్రకటిస్తే కొర్రప్రోలు చెక్పోస్టు వద్ద కర్నూలు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లను స్వాధీనం చేసుకోవాలి. కానీ కేవలం గణపతి చెక్పోస్టు వద్దే స్వాధీనం చేసుకోవడంలో ఆంతర్యమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నల్లమల అభయారణ్యంలో రోడ్డు వెంట ప్లాస్టిక్ బాటిళ్లను ఏరివేసేందుకు కొంత మంది స్వచ్ఛసేవక్లను నియమించారు. వారిని అలాగే కొనసాగిస్తూ, అభయారణ్యంలో తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ప్లాస్టిక్ బాటిళ్లను పూర్తిగా నిషేధిస్తే బాగుండేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. తాగునీటికి ప్రత్యామ్నాయం చూపే వరకు కఠిన ఆంక్షలు నిలిపేయాలని కోరుతున్నారు. భక్తుల నీటి అవస్థలపై అటవీశాఖ రేంజ్ అధికారి విశ్వేశ్వరరావును వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్లాస్టిక్ బాటిళ్లను స్వాధీనం చేసుకుంటున్నామని ముక్తాయించారు. ప్టాస్టిక్ ఫ్రీ జోన్ పేరిట అటవీశాఖ అధికారుల అత్యుత్సాహం శ్రీశైలం యాత్రికుల నుంచి తాగునీటి బాటిళ్లు స్వాధీనం విస్తృతంగా అవగాహన కల్పించకుండానే ఆంక్షలపై భక్తుల ఆగ్రహం కొర్రప్రోలు చెక్పోస్టు వద్ద లేని రూల్స్ శ్రీశైలం చెక్పోస్టు వద్దే ఎందుకని మండిపాటు -
కనిగిరి టీడీపీలో కలవరం
కనిగిరి రూరల్: సార్వత్రిక ఎన్నికల్లో కనిగిరి పట్టణంలో మహిళల ఓట్లే అత్యధికంగా పోలయ్యాయి. కనిగిరి మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 34,281 ఓట్లు ఉండగా 27,712 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 34 పొలింగ్ బూత్లు ఉండగా 29 బూత్ల్లో పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఓటు వేశారు. 5 బూత్లలో(132, 142, 143, 152, 168) మాత్రమే మహిళలకంటే పురుషులు ఎక్కువ శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని 34 బూత్ల్లో పురుషులు 13,119 మంది, మహిళలు 13,882 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళలు 763 మంది ఎక్కువగా ఓటు వేశారు. మహిళల ఓటింగ్పై టీడీపీలో ఆందోళన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. అందులో ప్రతి పథకంలో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి ఇంట్లో రూ లక్ష నుంచి రూ.20 లక్షల వరకు లబ్ధి చేకూరింది. దీంతో ఎక్కువ మంది మహిళల ఓట్లు వైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. అంతేగాక ముస్లిం మైనార్టీల ఓట్లు అధికంగా నియోజకవర్గంలో సుమారు 22 వేలు ఉండగా, అందులో కనిగిరి పట్టణంలోనే 14 వేల మంది ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ముస్లింల 4 శాతం రిజర్వేషన్ రద్దు చేస్తారని ముస్లింలు బలంగా నమ్మారు. దీంతో టీడీపీ అభిమానుల్లోని ముస్లిం ఓటర్లు సైతం పొలింగ్ కేంద్రాల్లో ఉత్సాహంగా కనిపించలేదు. కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని వాదనలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా పట్టణంలో మహిళల ఓటింగ్ శాతం పెరగడం, అంతేగాక ముస్లిం సామాజిక వర్గం అత్యధికంగా ఉండే (119, 120, 121, 122, 126, 129, 140, 141, 143, 144, 149, 151) బూత్ల్లో, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే 123, 132,133,150, 152 బూత్ల్లో కూడా దాదాపు మహిళలే ఎక్కువ శాతం ఓటు వేశారు. దీంతో ఆయా సామాజికవర్గాల ఓట్లు ఎక్కువ శాతం వైఎస్సార్ సీపీకే అనుకూలంగా ఉంటాయనేది విశ్లేషకులు అంచనా. అంతేగాక మరో సామాజికవర్గం ఓట్లపై పూర్తిగా క్లారిటీ లేకపోవడంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. కనిగిరిలో 29 బూత్ల్లో మహిళల ఓట్లే అత్యధికం 5 బూత్ల్లో మాత్రమే పురుషుల ఓట్లు ఎక్కువ పురుషుల కంటే అధికంగా ఓటేసిన 763 మంది మహిళలు మహిళలు, మైనారిటీల ఓట్లు తమవే అంటున్న వైఎస్సార్ సీపీ -
ఓటర్లకు ఎమ్మెల్యే కేపీ కృతజ్ఞతలు
బేస్తవారిపేట: గిద్దలూరు నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులు, శ్రేయోభిలాసులకు వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. జగనన్న ఆశీస్సులతో గిద్దలూరు నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిపించేందుకు ఇచ్చిన సహకారం ఎన్నటికీ మరువలేనన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా గిద్దలూరులోని ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు తరలివెళ్లి ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
వాదంపల్లి నాయకులకు తాటిపర్తి పరామర్శ
మార్కాపురం: యర్రగొండపాలెం మండలం వాదంపల్లిలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడి మార్కాపురంలోని జీజీహెచ్లో చికిత్స పొందుతున్న కన్నెబోయిన వెంకటసాయిని బుధవారం సాయంత్రం యర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా రూ. 10 వేలు అందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఓబులరెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రి సురేష్ మోకాలికి త్వరలో శస్త్ర చికిత్స జరుగుమల్లి(సింగరాయకొండ): రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కుడి మోకాలికి శస్త్ర చికిత్స చేయనున్నట్లు పీఆర్ఓ బి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం మంత్రి హైదరాబాద్ వెళ్లినట్లు తెలిపారు. గతంలో మంత్రి సురేష్ ఎడమ కాలికి శస్త్ర చికిత్స జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంత్రి సురేష్ కొండపి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేయడంతో కుడి కాలు కూడా ఒత్తిడికి గురైందని, వైద్యులు పరీక్షించి శస్త్ర చికిత్స చేయాలని నిర్ధారించారని వివరించారు. మంత్రి సురేష్ హైదరాబాద్ లో శస్త్ర చికిత్స చేయించుకుంటారని, కావున కొద్దిరోజులపాటు నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరని, ఈ విషయాన్ని గమనించాలని పీఆర్ఓ విజ్ఞప్తి చేశారు. 33 ఆర్మీ మద్యం బాటిళ్లు సీజ్ కొమరోలు: మండల కేంద్రమైన కొమరోలులో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన ఆర్మీ మద్యం బాటిళ్లను స్థానిక ఎస్సై మధుసూదన్రావు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కొమరోలులోని ఓ ఇంటిలో మద్యం నిల్వ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో తనిఖీ చేశారు. 33 ఆర్మీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు. ఏపీఆర్జేసీ ఫలితాల్లో ప్రతిభ ఒంగోలు: ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఫలితాల్లో స్థానిక వికాస్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు కై వసం చేసుకున్నారు. కొండపికి చెందిన కె.జ్యోత్స్నతేజ బైపీసీ గ్రూప్ విభాగంలో 110 మార్కులతో రాష్ట్రస్థాయిలో 115వ ర్యాంకు కై వసం చేసుకుంది. కొత్తపట్నం పల్లెపాలెంకు చెందిన చాపల నవీన్ ఎంపీసీ విభాగంలో 119 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 174వ ర్యాంకు సాఽధించాడు. 500లోపు 15మంది, వెయ్యిలోపు 25 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి.వీరయ్య తెలిపారు. -
వేడుకగా చెన్నకేశవస్వామి కల్యాణం
కొనకనమిట్ల: మండలంలోని పెదారికట్ల గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి, పార్వతి సమేత రాజనగరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. బుధవారం చెన్నకేశవస్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. కల్యాణ ఉభయదాతలుగా మద్దూరి, చెన్నారెడ్డి, చాగంరెడ్డి, గంగవరపు కుటుంబాలకు చెందిన దంపతులు వ్యవహరించారు. అలాగే గరుడసేవ కార్యక్రమానికి ఉభయదాతలుగా దమ్మాలపాటి, ముత్యాల, అవిసినేని, గంగవరపు కుటుంబాల వారు వ్యవహరించారు. వేదపండితులు నంద్యాల వెంకటకృష్ణకిరన్, నుదురుపాటి వెంకటకృష్ణారావు స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించి కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కల్యాణాన్ని తిలకించారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
విజయ మనదే.. ధీమాగా ఉండండి
పామూరు: కనిగిరిలో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమాగా ఉండాలని, తాను అన్నివేళలా అండగా ఉంటానని ఆ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణయాదవ్ భరోసా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత సోమవారం కంబాలదిన్నె గ్రామంలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన దమ్ము శ్రీనివాసులు, యాదాల అలివేలమ్మను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులపై టీడీపీ నేతల దాడులు హేయమన్నారు. దాడికి పాల్పడిన వారికి తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు. అనంతరం మండల కేంద్రమైన పామూరులోని మిరియం రామారావు, గుంటుపల్లె సుబ్బరాయుడు నివాసాలకు వెళ్లి వారితో చర్చించారు. అదేవిధంగా పోలింగ్ సరళి, ఇతర అంశాలపై పార్టీ నాయకులతో చర్చించారు. ఆయన వెంట జెడ్పీటీసీ చప్పిడి సుబ్బయ్య, పార్టీ మండల అధ్యక్షుడు గంగసాని హుసేన్రెడ్డి, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి రామిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పువ్వాడి రాంబాబు, కందుల శ్రీనివాసరెడ్డి, అంబటి కొండారెడ్డి, జె.గోవిందయ్య, నీలం వెంకటేశ్వర్లు, రమణమ్మ, రమణయ్య, నక్కా మాల్యాద్రి, కొల్లా రమణయ్య, గాజులపల్లి వెంకటేశ్వరరెడ్డి, గుడిమెట్ల వేణుగోపాల్ ఉన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులకు దద్దాల పరామర్శ -
ప్రజలకు తాటిపర్తి కృతజ్ఞతలు
యర్రగొండపాలెం: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రతిక్షణం పార్టీకి అండగా నిలిచి రాత్రింబవళ్లూ కష్టపడి ప్రచార కార్యక్రమాల్లో అంతా తామై వ్యవహరించిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, వైఎస్సార్ సీపీ నాయకులకు, కార్యకర్తలకు, సచివాలయాల కన్వీనర్లకు, బూత్ కమిటీ సభ్యులకు ఆ పార్టీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్న నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకే సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, జగనన్న సాయంతో నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి తన వంతు పాటుపడతానని పేర్కొన్నారు. తాటిపత్రి చంద్రశేఖర్ గెలుపు ఖాయమని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్కు గాయాలు
పెద్దారవీడు: ఎదురుగా వస్తున్న లారీని వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో తహసీల్దార్కు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలో హనుమాన్ జంక్షన్ కుంట వద్ద బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఎర్రగొండపాలెం తహసీల్దార్ సోమ్లానాయక్ కారులో మార్కాపురం నుంచి ఎర్రగొండపాలెం బయల్దేరారు. త్రిపురాంతకం నుంచి ఇటుకల లారీ కంభం వైపు వెళ్తోంది. హనుమాన్ జంక్షన్ కుంట వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న తహసీల్దార్ సోమ్లానాయక్ తలకు గాయాలయ్యాయి. కారులో సర్వేయర్ దిలీప్, సిబ్బంది ఉన్నారు. వారికి ప్రమాదం తప్పింది. వెంటనే సిబ్బంది మరో కారులో సోమ్లానాయక్ను చికిత్స కోసం మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
దర్శిలో రౌడీ ముఠామేస్త్రీ
దర్శి: ప్రశాంతంగా ఉండే దర్శి నియోజకవర్గంలో పచ్చమూకలు భీబత్సం సృష్టించాయి. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా వివాదాలు చోటుచేసుకున్న సందర్భాలు స్వల్ప స్థాయిలోనూ లేవు. పోలింగ్ రోజున ఎవరికి వారు ఓటు వేసి ఆ నాలుగు రోజులు పార్టీల పేరు చెప్పుకున్నా, ఆ తర్వాత అందరూ కలసి మెలసి ఉంటారు. అయితే దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో తరచూ అధికార వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ రోజున రౌడీలను ఉసిగొల్పి రాళ్ల దాడులు చేయించడం లక్ష్మి వైఖరి బట్టబయలైంది. పోలింగ్ను అడ్డుకునేందుకు కుట్ర ఎన్నికల్లో ఓటమిని ముందే గ్రహించిన గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త కడియాల లలిత్ సాగర్ కుట్రలకు తెరలేపారు. ముందస్తు పథకం ప్రకారం నరసరావుపేట నుంచి దర్శికి 150 మందితో కూడిన అల్లరిమూకను రప్పించారు. పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి మెజార్టీ వచ్చే బూత్ల వద్ద గొడవలు సృష్టించేందుకు పూనుకున్నారు. ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి పోలింగ్ బూత్ల వద్దకు రాకుండా చేయాలనేది వారి ఉద్దేశంగా కనిపించింది. బొట్లపాలెంలో పథకం ప్రకారం అలజడి సృష్టించారు. ఆ వంకతో బూత్లోకి ప్రవేశించిన లక్ష్మి, తన అనుచరులు ఓట్లు ఎలా వేస్తారో వేయండంటూ కాలు మీద కాలేసి కూర్చుని బెదిరించారు. కళ్లు సరిగా కనిపించని వృద్ధురాలితో ఓటు వేయించేందుకు యవకుడిని అడ్డుకోవడంతో అక్కడే ఉన్న మహిళలంతా ఒక్కసారిగా ఎదురు ప్రశ్నించడంతో పోలింగ్ ఆపాలని బూత్ బయట ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి రౌడీ మూకలను తరిమేశారు. లక్ష్మి భర్త కడియాల లలిత్సాగర్ దేవవరం సమీపంలో ఉండి బూత్ వద్దకు రౌడీ మూకను పంపి గొడవ సృష్టించారు. కర్రలతో దాడులు చేసి, రాళ్లు రువ్వి మహిళలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు వచ్చిన తరువాత వచ్చిన లలిత్ సాగర్ను అక్కడి జనం నిలదీశారు. ప్రశాంతంగా ఉండే దేవవరంలో గొడవలు పెట్టి తలలు పగులగొట్టి మీరు ఏం సాధిస్తారని నిలదీయడంతో అక్కడి నుంచి జారుకున్నారు. దర్శి పట్టణంలోని కొత్తరెడ్డి పాలెం, పొదిలి రోడ్డులో బూత్ను టార్గెట్ చేసుకున్న పేట రౌడీలు మరోమారు రచ్చ చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత బూత్లోకి ప్రవేశిస్తూ నరసరావుపేటకు చెందిన రౌడీలను వెంట తీసుకెళ్లారు. ఇక్కడ పోలింగ్ నిలిపివేసి ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓటర్లు, పేట రౌడీలకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు ఏమి చేయలేక చూస్తుండిపోయారు. ఈ సమయంలో డీఎస్పీ వచ్చి అందరినీ బయటకు పంపారు. ఇక్కడ రౌడీలతో పోలీసులపై రాళ్లు రువ్వించగా వారికి స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తోడయ్యారు. పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి డీఎస్పీని బూత్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. వరుస ఘటనలలో దర్శి నియోజకవర్గ ప్రజలు భీతిల్లారు. దూర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు వచ్చిన వారు కూడా ప్రయాణం వాయిదా వేసుకున్నారు. పోలీసుల మౌనం వెనుక కారణమేంటి? వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఎన్నికలకు రెండు రోజుల ముందే లక్ష్మి వైఖరిని తూర్పారబట్టారు. నరసరావుపేట నుంచి 150 మంది రౌడీలను తీసుకొచ్చారని, పోలింగ్ రోజున భీబత్సం సృష్టించేందుకు స్కెచ్ వేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అదనపు పోలీసు బలగాలు పూర్తి స్థాయిలో రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలింగ్ బూత్ల్లో రచ్చ చేసిన రౌడీలను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని దర్శికి తీసుకొచ్చిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త, రౌడీషీటర్లు, పార్టీ నాయకులతో కలిసి పోలింగ్ బూత్ల వద్ద హల్ చల్ ఓటర్లతోపాటు పోలీసులను సైతం భయభ్రాంతులకు గురిచేసిన వైనం పచ్చ మూకను ఉసిగొల్పి వైఎస్సార్ సీపీ శ్రేణులపై రాళ్ల దాడి ప్రశాంతంగా ఉండే దర్శిలో చిచ్చురేపిన టీడీపీ రౌడీలు ఓటమి భయంతో అడుగడుగునా అరాచకాలు నరసరావుపేట రౌడీలు 150 మంది వచ్చారని ముందే చెప్పిన బూచేపల్లి -
విజయబావుటా ఎగురవేస్తాం
● ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు: ఒంగోలు నియోజకవర్గంలో మరోమారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేస్తుందని స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పాలనకు ప్రజలు మొగ్గుచూపారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎక్కువ శాతం చంద్రబాబు మేనిఫెస్టోను నమ్మలేదని ఉద్యోగ సంఘాలు తనకు తెలిపారన్నారు. బకాయిలు చెల్లించడంలో కొంత ఆలస్యం అయినా జగన్మోహన్రెడ్డి నయం అని పేర్కొన్నారన్నారు. ఏది ఏమైనా మండుటెండను సైతం లెక్కచేయకుండా తనతోపాటు ప్రయాణం చేసి కష్టపడిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు, తనను ప్రోత్సహించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల విధి నిర్వహణలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. -
పరుగు..
పొగాకు ధరలపొగాకు సాగు రైతులకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సీజన్ అమ్మకాలు ప్రారంభ దశలోనే మంచి ధరలు రావడంతో రైతులు లాభాల బాట పడుతున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువగా ఉండడంతోపాటు, స్థానికంగా వ్యాపారులు పోటీ పడుతుండడం రైతులకు కలిసివస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నాణ్యత మెరుగ్గా ఉండడంతో ఈ సీజన్లో ప్రారంభ ధర రూ.230 పలుకగా అత్యధికంగా రూ.300లకు చేరింది. వ్యాపారుల మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రీజియన్ పరిధిలో ప్రస్తుతం 42 మిలియన్ కేజీలు కొనుగోళ్లు అయ్యాయి. గత రెండు సీజన్లలో రైతులకు మంచి రేట్లు రావడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం నాలుగు వేల హెక్టార్లు పెరిగింది.సరాసరి ధర రూ.238.78 పలికింది ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన పొగాకు కొనుగోళ్లలో కేజీ పొగాకు సరాసరి ధర రూ.238.78 పలికింది. కనిష్ట ధర రూ.205, గరిష్ట ధర రూ.300, ప్రారంభ ధర రూ.230 పలికింది. మొత్తం 130 మిలియన్ కేజీలు కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించగా ఇప్పటి వరకు 42 మిలియన్ కేజీల పొగాకును కొనుగోలు చేశారు. ఇంకా పొగాకు కొనుగోళ్లు ఆగస్టు నెల వరకు కొనసాగుతాయి. – ఆర్.లక్ష్మణ్రావు, ఆర్ఎం, టుబాకోబోర్డు, ఒంగోలు చీమకుర్తి: పొగాకు రైతుల పంట పండింది. వరుసగా మూడో ఏడాది కూడా రైతులు పండించిన పొగాకుకు రైతులు ఆశించిన ధరకంటే ఎక్కువగా రావడంతో ఆనందోత్సాహం వ్యక్తమవుతోంది. పొగాకు కొనుగోళ్లు ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రారంభం కాగా మొదటి రోజే కేజీ పొగాకు ధర రూ.230 పలికింది. ప్రారంభ ధరకు తగ్గకుండా గరిష్ట ధర కేజీ రూ.300 వరకు, సరాసరి ధర రూ.238.78 పలికినట్లు పొగాకు బోర్డు అధికారులు ధ్రువీకరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 11 వేలం కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో ఈ ఏడాది 72 వేల హెక్టార్లలో రైతులు పొగాకు సాగు చేశారు. 130 మిలియన్ కేజీల పొగాకును కొనుగోలు చేసేందుకు బోర్డు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 11 వేలం కేంద్రాల్లో 42 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. బ్రైట్ కలర్ పొగాకే కాకుండా పచ్చ, మాడు రంగులోనున్న పొగాకుకి కూడా కేజీ ధర సరాసరిన రూ.250 పలుకుతోంది. దాంతో రైతుల వద్ద నాణ్యమైన పొగాకుతో పాటు మాడు, పచ్చ వంటి లోగ్రేడ్ పొగాకు కూడా మిగలకుండా బయ్యర్లు కొనుగోలు చేస్తుండటంతో వరుసగా మూడో ఏడాది పొగాకు రైతులకు లాభాల పంట పండింది. 4 వేల హెక్టార్లలో సాగు అదనం: పొగాకు బోర్డు ప్రకాశం రీజియన్ పరిధిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో ప్రకాశం జిల్లా పరిధిలో 7 వేలం కేంద్రాలుంటే, జిల్లాలోని కందుకూరులో రెండు, డీసీపల్లి, కలిగిరి వేలం కేంద్రాలున్నాయి. ఈ వేలం కేంద్రాల పరిధిలో 2022–23 ఏడాది పొగాకు సీజన్లో వేలంలో రికార్డు ధరలు వచ్చాయి. కేజీ పొగాకు సరాసరిన రూ.214 వరకు ధర పలికింది. దీంతో రైతులకు గత సీజన్ సిరులు కురిపించింది. ఈ నేపథ్యంలో 2023–24 ఏడాదిలో కూడా పొగాకు పంట భారీగా సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే 11 వేలం కేంద్రాల పరిధిలో దాదాపు 72 వేల హెక్టార్లలో పొగాకు పంట సాగైంది. 2022–23 ఏడాదిలో 68 వేల హెక్టార్ల సాగు ఉంటే ఇది ప్రస్తుతం 72 వేల హెక్టార్లకు పెరిగింది. గతేడాది కంటే దాదాపు 4 వేల హెక్టార్లలో ఎక్కువగా సాగైంది. గతేడాది వచ్చిన లాభాలకు తోడు ఈ ఏడాది ఇతర పంటల సాగుకు వాతావరణం అంత అనుకూలంగా లేకపోవడం కూడా పొగాకు సాగు పెరగడానికి కారణమని బోర్డు అధికారులు చెప్తున్నారు. ఒక్కో ఎకరానికి రూ.లక్ష పైనే లాభం: ఈ ఏడాది 72 వేల హెక్టార్ల విస్తీర్ణంలో 23,930 బ్యారన్ల ద్వారా 30 వేల మంది రైతులు పొగాకు సాగు చేసినట్లు బోర్డు అధికారుల అంచనా. ఒక్కో రైతు తన సొంత బ్యారన్తో పాటు మరో రెండు మూడు బ్యారన్లను కూడా అద్దెకు తీసుకొని పొగాకు సాగు చేశారు. గత రెండు విడతలుగా పొగాకులో మంచి లాభాలు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రైతుల అంచనాలు వమ్ము కాకుండా వరుసగా మూడో ఏడాది కూడా ఇప్పుడు లాభాలు రావడంతో ఒక్కో ఎకరానికి రూ.1 లక్షకు తగ్గకుండా లాభాలు వస్తున్నాయని అధికారులే స్పష్టం చేస్తున్నారు. నాణ్యత సైతం మెరుగ్గా ఉండడంతో రైతులు లాభాలపై మరింత ఆశలు పెట్టుకున్నారు. క్యూరింగ్లో దాదాపు 70 శాతం పొగాకు బ్రైట్ గ్రేడ్ దిగుబడి వస్తుండగా, 20 శాతం వరకు లోగ్రేడ్, మిగిలినవి ఇతర గ్రేడ్లు వస్తున్నాయని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. గత సీజన్లో బోర్డు అనుమతిని మించి దాదాపు 123.10 మిలియన్ కేజీల వరకు పొగాకు అమ్మకాలు సాగాయి. ఈ సారి 130 మిలియన్ కేజీల వరకూ కొనుగోలు చేసేందుకు బోర్డు ముందుకు వచ్చింది. ఒంగోలు–1 కేంద్రం టాప్, కనిగిరి చివరి స్థానం: పొగాకు కొనుగోళ్లలో జిల్లాలోని 11 వేలం కేంద్రాల్లో ఒంగోలు–1 వేలం కేంద్రంలో అత్యధికంగా 5.4 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లు జరిగాయి. కొండపి వేలం కేంద్రం 5.1 మిలియన్ కేజీలతో ద్వితీయ స్థానంలో, కనిగిరి వేలం కేంద్రం 2.5 మిలియన్ కేజీలతో చివరి స్థానంలో ఉంది. ప్రారంభ ధర రూ.230కు తగ్గకుండా సరాసరిన రూ.238 వద్ద కొనుగోళ్లు కేజీ పొగాకు గరిష్ట ధర రూ.300 130 మిలియన్ కేజీలకు అనుమతి రాగా ఇప్పటికే 42 మిలియన్ కేజీల కొనుగోళ్లు పూర్తి పచ్చ, మాడు అనే తేడా లేకుండా లోగ్రేడ్ పొగాకు కూడా కొనుగోళ్లతో రైతుల్లో హర్షాతిరేకాలు వరుసగా మూడో ఏడాదీ రైతులకు లాభాల పంట ఎకరానికి కనీసం లక్ష రూపాయలకు తగ్గకుండా లాభాలు -
దర్శి టాప్
పోలింగ్లో మొత్తం ఓట్లు 2,26,370 పోలైన ఓట్లు 2,05,993దర్శి: దర్శి ఓటర్లు మరోసారి చైతన్యం చూపారు. ఇక్కడ మూడు ఎన్నికల నుంచి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతూ వస్తోంది. దాన్ని ఈసారీ కొనసాగించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన పోలింగ్లో 91 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రంలోనే టాప్గా నిలిచారు. ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని రాత్రి పది గంటల వరకూ లైన్లోనే ఉండి ఓటు వేశారు. గత ఎన్నికల్లోనూ ఇంచుమించు ఇదే పోలింగ్ శాతం నమోదుకాగా వైఎస్సార్ సీపీ విజయపతకాన్ని ఎగురవేసింది. ఇప్పుడు కూడా ఇదే ఫలితాలు వస్తాయన్న చర్చ జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో 2,26,370 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1,14,233 మంది, మహిళలు 1,12,129 మంది ఉన్నారు. వీరిలో 2,05,993 మంది ఓటు హక్కు వినియోగించుకోగా అందులో పురుషులు 1,03,765 మంది, మహిళలు 1,02227 మంది ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో 91 శాతం పోలింగ్ నమోదైంది. మహిళలకంటే 1,538 ఎక్కువ మంది పురుషులు ఓటు వేశారు. పట్టణ ప్రాంతంలో మాత్రం దర్శి అర్బన్లో 29,717 ఓట్లు ఉండగా, 24,219 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 82 శాతం పోలింగ్ నమోదైంది. దర్శి రూరల్ మండలంలో 43,171 మంది ఓటర్లు ఉండగా 40,016 మంది ఓటు హక్కు వినియోగించుకుని 92.69 శాతం పోలింగ్ నమోదైంది. దొనకొండ మండలంలో 37,805 మంది ఓటర్లు ఉండగా 34,848 మంది ఓటు హక్కు వినియోగించుకుని 92.21 శాతం, కురిచేడు మండలంలో 32330 మంది ఓటర్లు ఉండగా 29570 మంది ఓటేసి 91.82 శాతం, ముండ్లమూరు మండలంలో 45625 మంది ఓటర్లు ఉండగా 42342 మంది ఓటు వేసి 93.22 శాతం, తాళ్లూరు మండలంలో 37722 మంది ఓటర్లు ఉండగా 34797 మంది ఓటు హక్కు వినియోగించుకుని 91.98 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో పోలింగ్ నమోదులో మొదటి స్థానంలో ముండ్లమూరు మండలం, ఆ తరువాత వరుసగా దర్శి రూరల్, దొనకొండ, తాళ్లూరు, కురిచేడు, దర్శి అర్బన్ ఉన్నాయి. 2014లోనూ 91.52 శాతం పోలింగ్ నమోదైంది. దర్శి నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల నుంచి 90 శాతానికిపై ఓటర్లు ఓట్లేసేందుకు ఆసక్తి చూపడం ఇక్కడ ప్రజల చైతన్యాన్ని రుజువు చేస్తోంది. 91 శాతం పోలింగ్ నమోదు రాష్ట్రంలోనే మొదటి స్థానం చైతన్యం చూపిన దర్శి ఓటరు 2019లో 90.35 శాతం నమోదు 2014లో 91.52 శాతం పోలింగ్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
'నా కొడుకు రాహుల్ని మీకు అప్పగిస్తున్నాను': సోనియా గాంధీ
అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు
చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..
తప్పక చదవండి
- ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
Advertisement