కేసులను సత్వరమే పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

కేసులను సత్వరమే పరిష్కరించాలి

Published Sat, May 18 2024 7:25 AM

కేసులను సత్వరమే పరిష్కరించాలి

సూర్యాపేట: లోక్‌ అదాలత్‌లను సద్వినియోగ చేసుకుంటూ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు పోలీసులు కృషిచేయాలని జిల్లా ప్రధాన జడ్జి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో సైబర్‌ నేరాల నియంత్రణకు సైబర్‌ సెక్యూరిటీ పోలీసు విభాగం చేపడుతున్న చర్యలను సైబర్‌ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం సూర్యాపేటలో జిల్లా జడ్జిని కలిసి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన జడ్జి మాట్లాడుతూ నాణ్యమైన దర్యాప్తు చేసి సకాలంలో కేసు అభియాగ పత్రాలను కోర్టుకు అందించాలన్నారు. అనంతరం పోలీసు కార్యాలయంలో సైబర్‌ వారియర్‌ పోలీసు సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ టోల్‌ ఫ్రీ నంబర్లు, వెడ్‌ సైట్స్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులు, పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిశీలిస్తూ కేసుల నమోదు, దర్యాప్తు వేగంగా చేసి బాధితులకు భరోసా కల్పించాలని సైబర్‌ సెక్యురిటీ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సైబర్‌ మోసాలపై ప్రజలను చైతన్య పర్చాలని సిబ్బందికి సూచించారు.

ఫ జిల్లా ప్రధాన జడ్జి గోవర్ధన్‌రెడ్డి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement