తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి | Sakshi
Sakshi News home page

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

Published Thu, May 16 2024 12:35 PM

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

అబ్దుల్లాపూర్‌మెట్‌: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన గండేటి తేజ(50) కొన్నేళ్ల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని మజీద్‌పూర్‌ గ్రామానికి వలస వచ్చాడు. ఆయన తాటిచెట్లు ఎక్కి కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఉదయం బాటసింగారంలోని దొడ్డ శాంతికుమార్‌ వ్యవసాయ భూమిలో తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సంతోష ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మృతుడు చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం వాసి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement