సాక్షి, ముంబై : కాలుష్యపు కోరల్లో చిక్కుకుని నగరం విలవిల్లాడుతోంది. ముఖ్యంగా విపరీతంగా పెరిగిన ధ్వని కాలుష్యం వల్ల చెవుడు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో తేరుకున్న మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నగరంలో కీలకమైన 1,200 చోట్ల ధ్వని కాలుష్యాన్ని నియంత్రించే ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏ కంపెనీ బీఎంసీకి దొరకడం లేదు. పరిపాలన విభాగం ఆందోళనలో పడిపోయింది. రోజురోజుకూ అనేక రకాల కాలుష్యాలతోపాటు ధ్వని కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
సెలైన్స్ జోన్లోనూ యథాతథం
నగరంలో విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, ఆస్పత్రులున్న ప్రాంతాలను రెండు సంవత్సరాల కిందట హై కోర్టు ‘సెలైన్స్ జోన్’ గా ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో పరిస్థితులు యథాతథంగా ఉన్నాయి. కొన్ని సార్వజనిక ఉత్సవాలను నియంత్రించారు. వాహనాల నుంచి వెలువడే ధ్వని కాలుష్యం ఏ మాత్రం తగ్గలేదు. నియమాల ప్రకారం సెలైన్స్ జోన్ ప్రకటించిన ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలి.
అందుకు నగరంలో అధ్యయనం చేయగా 1,200 చోట్ల ధ్వని కాలుష్యన్ని కచ్చితంగా నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ఉపాయాన్ని ఆలోచించేందుకు సలహాదారుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రకాశ్ పాటిల్ చెప్పారు. రెండు సార్లు టెండర్లను ఆహ్వానించినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఆసక్తి కనబర్చ లేదు.
ఎమ్మెమ్మార్డీయే ఆధ్వర్యంలో..
ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) కొద్ది రోజుల కిందట పవయి. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిసరాల్లో ధ్వని కాలుష్య నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసింది. అప్పట్లో ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, ఆస్పత్రులున్న ప్రాంతాల్లో వేగ నియంత్రణ (స్పీడ్ బ్రేకర్స్) ఏర్పాటు చేసింది. వీటివల్ల కొంత శాతమే నియంత్రించగలిగారు. పూర్తగా అరికట్టేందుకు బీఎంసీ ప్రయత్నాలు ప్రారంభించింది. నగరంలో ఏర్పాటు చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పెరిగిన వాహనాల సంఖ్య
నగరంలో విపరీతంగా పెరిగిపోయిన వాహనాల సంఖ్యవల్ల ధ్వని కాలుష్యం కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. అస్పత్రులున్న చోట వాహనాలకు అనుమతివ్వక పోవడం, కొన్ని కీలకమైన రహదారులపై భారీ వాహనాలకు నిషేధించడం, నో హార్న్ జోన్గా ప్రకటించడం లాంటి ప్రయత్నాలు చేసింది. అవికూడా అనుకున్నంతమేర ఫలితాలివ్వలేకపోయాయి. త్వరలో నియమించనున్న సలహదారుల కమిటీ సూచనల ప్రకారం స్వయంగా ఆ ప్రాజెక్టు చేపట్టాలని యోచిస్తున్నట్లు పాటిల్ చెప్పారు.
ముంబైపై శబ్ద‘భేరీ’..!
Published Fri, Jul 11 2014 11:46 PM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు.. ఏపీఎల్-3 వేలంలో వాళ్లు సైతం!
లవ్ మ్యారేజ్.. పిల్లలెప్పుడని ఒత్తిడి తెచ్చారు.. ఎనిమిదేళ్లకు..
వైఎస్సార్సీపీకి అదే కలిసొచ్చింది.. ఎగ్జిట్ పోల్స్పై సజ్జల కీలక వ్యాఖ్యలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (01-06-2024)
బ్రిటీష్ కాలేజ్లో.. భారతీయ ఆయుర్వేదం
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్
ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
T20 WC: బంగ్లాతో మ్యాచ్.. కోహ్లి లేకుండానే! ఓపెనర్గా సంజూ విఫలం
వెంటనే ఫోటో డిలీట్ చేయండి: ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్బీఐ
డూప్ లేకుండా కాజల్ యాక్షన్.. భయపడ్డాం: దర్శకుడు సుమన్
తప్పక చదవండి
- రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం ఆ రూలే: ఆర్పీ సింగ్
- 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
- రోహిత్, విరాట్ భార్యలను చూస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
- శుబ్మన్ గిల్తో బుల్లితెర నటి పెళ్లి? స్పందించిన బ్యూటీ!
- T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
- న్యూయార్క్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
- తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?
- ‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది’
- TG: గవర్నర్కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన
Advertisement