-
35 మంది మావోయిస్టుల లొంగుబాటు
చర్ల: ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో ఆదివారం 35 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ గౌరవ్రాయ్ వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ పోలీస్శాఖ చేపట్టిన పూనా నార్కొమ్ ప్రచారానికి ఆకర్షితులవుతున్న మావోయిస్టులు పెద్ద సంఖ్యలో వనం వీడి జనం బాట పడుతున్నారని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల అటవీ ప్రాంత గ్రామాల్లో కొంత కాలంగా కొనసాగుతున్న లోన్ వర్రాటో (ఇంటికి తిరిగి రండి) కార్యాక్రమంలో భాగంగా బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లోని వివిద ప్రాంతాల్లో పని చేస్తున్న 35 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. వారిలో ముగ్గురిపై రూ. లక్ష చొప్పున రివార్డు ఉందని, లొంగిపోయిన వారందరికీ పోలీస్ శాఖ, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు అందజేసినట్లు వెల్లడించాచారు. లోన్ వర్రాటో కార్యక్రమం చేపట్టిన నాటి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 796మంది మావో యిస్టులు లొంగిపోయారని, వారిలో 180 మందిపై రివార్డులు ఉన్నాయని ఎస్పీ వివరించారు. వివరాలు వెల్లడించిన దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్ -
ఇక దోస్త్ షురూ..
ఖమ్మంసహకారనగర్ : రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను ఈనెల 3వ తేదీన విడుదల చేసింది. ఈనెల 6 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం తదితర కోర్సుల్లో చేరాలనుకునే వారు దోస్త్ వెబ్సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది. దోస్త్ వెబ్ఆప్షన్ల ప్రక్రియలో విద్యార్థులు ఆన్లైన్ ద్వారా తాము చేరదలుచుకున్న కళాశాలను, సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ అడ్మిషన్ ప్రక్రియ మూడు విడతలుగా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 37 ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. ఖమ్మం నగరంలో ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, సత్తుపల్లి, నేలకొండపల్లి, మధిరల్లో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కలిపి 15,840 సీట్లు ఉన్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 16 ప్రైవేటు కళాశాలలు ఉండగా 7,380 సీట్లు ఉన్నాయి. మీ సేవ, ఆన్లైన్ సర్వీస్లతో పాటు దోస్త్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దోస్త్ ప్రక్రియ ఇలా.. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా డిగ్రీలో ప్రవేశాల కోసం మూడు విడతల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తొలి విడత ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుండగా వచ్చే నెల 25వ తేదీ వరకు విద్యార్థులు రూ.200 రుసుంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూన్ 3న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటాయి. 4 నుంచి 10వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కళాశాల ఫీజు, సీటు రిజర్వేషన్ ఫీజు ఆన్ౖలైన్ ద్వారా చెల్లించాలి. ● ఇక 2వ విడతలో రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజుతో ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల (జూన్) 4 నుంచి 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు ఉండగా, 4 నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. 18న సీట్లు కేటాయిస్తారు. 19 నుంచి 24వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కళాశాల ఫీజు, సీటు రిజర్వేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ● 3వ విడత ప్రక్రియ జూన్ 19 నుంచి 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు జరగనుండగా రూ.400 ఫీజు చెల్లించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 19 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, 29న సీట్ల కేటాయింపు జరగనుంది. 29 నుంచి జూలై 3వ తేదీ వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 1, 2, 3 విడతల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా జూన్ 29నుంచి జూలై 5వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి 6వ తేదీల్లో ఆయా కళాశాలల్లో విద్యార్థులతో ఓరిఝెంటేషన్ కార్యక్రమాలు ఏర్పాటుచేసి 8 నుంచి తరగతులు నిర్వహించనున్నారు. మూడు విడతల్లో డిగ్రీలో ప్రవేశాలు నేటి నుంచి దరఖాస్తులు రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థులకు కావాల్సినవి.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్టికెట్ నంబర్ ఆధార్కార్డు జిరాక్స్ ఆధార్కార్డుకు లింకై న ఫోన్ నంబర్. టెన్త్, ఇంటర్మీడియట్ మెమోలు 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు ఇంటర్మీడియట్ టీ.సీ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పాస్పోర్టు సైజ్ ఫొటో ఆధార్కార్డు ఓటీపీలు ఇతరులకు చెప్పొద్దు దోస్త్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఓటీపీని ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే కళాశాలలో ఉన్న హెల్ప్డెస్క్లో సంప్రదించవచ్చు. లేదంటే సమీపంలోని కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. – ఎం.సుబ్రహ్మణ్యం, దోస్త్ కో ఆర్డినేటర్, ఖమ్మం -
అందని పెన్షన్లతో అవస్థలు
ఖమ్మంవ్యవసాయం: పెన్షన్లు సకాలంలో అందకపోవటంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ విశ్రాంత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా మార్కెట్ కమిటీల విశ్రాంత ఉద్యోగుల సంఘంఽ అధ్యక్ష, కార్యదర్శులు కనపర్తి బాబు, జల్లా వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఉన్నతాధికారులకు, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా వినతిపత్రం అందించామని, వృద్ధాప్యంలో పెన్షన్తో జీవనం సాగిస్తున్న తమకు సకాలంలో నెలసరి పెన్షన్లను అందించి ఆదుకోవాలని కోరారు. వడదెబ్బతో వ్యక్తి మృతి పెనుబల్లి: వడదెబ్బకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వీఎంబంజరలో చోటుచేసుకుంది. మండలంలోని సూర్యబంజరతండాకు చెందిన భూక్య రాములు (44) ఈ నెల 3న వీఎం బంజరకు ఓ పార్టీ మీటింగ్కు హాజరై, అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. రాములు కోసం రెండు రోజులుగా కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఆదివారం వీఎంబంజర – బయ్యన్నగూడెం గ్రామాల మధ్య చెరువు సమీపంలో రాములు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాములు వడదెబ్బకు గురై మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు వీఎం బంజర పోలీసులు కేసు నమెదు చేశారు. రాములు మృతదేహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. గొర్రెలు మేపేందుకు వచ్చి.. వడదెబ్బతో నారాయణపేట వాసి మృతి నేలకొండపల్లి: గొర్రెలు మేపేందుకు నారాయణపేట జిల్లా నుంచి వడదెబ్బతో ఓ వ్యక్తి మృతిచెందాడు. నారాయణపేట జిల్లా దన్వాడ మండలంలోని గోటూరు గ్రామానికి చెందిన నర్సప్ప (55) తనకున్న వంద గొర్రెలను మేత కోసం తీసుకొచ్చాడు. ఇటీవల తన కుమారుడి పెళ్లి కోసం వెళ్లి రెండు రోజుల కిందట తిరిగొచ్చాడు. ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి మంద మధ్యలోనే కుప్పకూలాడు. చాలా సేపటి తర్వాత రైతులు నర్సప్పను గమనించి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. కుటుంబసభ్యులు వచ్చి మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లారు. రెండు చోట్ల చోరీ బోనకల్: మండల కేంద్రంలోని ఖమ్మం రోడ్డులో డెయిరీ మిల్క్, పక్కన ఉన్న ఫ్యాన్సీ స్టోర్స్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. షాపుల వెనుక తలుపులు పగులగొట్టిన దుండగులు లోపలికి ప్రవేశించి రూ.20 వేలు నగదు ఎత్తుకెళ్లారని డెయిరీ మిల్క్ యజమాని రాజు తెలిపారు. పక్కనే ప్యాన్సీ షాపులోకి వెళ్లి సామగ్రిని అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ మధుబాబు తెలిపారు. చెరువు కట్టపై ఉద్రిక్తత నేలకొండపల్లి: మండలంలోని భైరవునిపల్లి చెరువు వద్ద శనివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెరువు లూటీ అవుతోందనే ప్రచారంతో రాజకీయ నాయకులు అక్కడికి చేరుకున్నారు. చెరువులో ఆదివారం చేపల వేటకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, శనివారం రాత్రి చెరువు లూటీ జరుగుతోందని గ్రామంలో ప్రచారం జరగటంతో రెండు వర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకుల మధ్య ఘర్షణ పడ్డారు. అసభ్య పదజాలంతో ఒకరిపై ఒకరు దూషణలు, అరుపులు, కేకలతో చెరువు కట్ట వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. కాగా, సొసైటీకి చెందిన సభ్యులు 32 మందిపై బైండోవర్ ఉండటంతో ఒక్కరూ కూడా చెరువు కట్ట వద్దకు రాకపోవడం కొసమెరుపు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. అదివారం చేపల వేట సాగించిన అధికారులకు కేవలం క్వింటా చేపలు మాత్రమే లభ్యం కావటం విశేషం. లారీ పైనుంచి కిందపడి వ్యక్తికి గాయాలు బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల గ్రామంలో శనివారం రాత్రి లారీ పైనుంచి కిందపడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. మొక్కజొన్న బస్తాలు లారీలో లోడ్ చేస్తున్న క్రమంలో గాలి దుమారంతో కూడిన వర్షం వచ్చింది. ఈ క్రమంలో టార్పాలిన్ కప్పేందుకు లారి ఎక్కిన పెద్దిపాక కోటేశ్వరరావు గాలి దుమారానికి టార్పాలిన్తో సహా లారీ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుబాబు తెలిపారు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఖమ్మంక్రైం: నగరంలోని వన్టౌన్ పరిధిలో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చర్చికాంపౌండ్ ప్రాంతానికి చెందిన కాళంగి మధు (45) కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు కృపాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాలీ ఆటో పల్టీ రఘునాథపాలెం: మండలంలోని రాంక్యాతండా రోడ్డులో మూలమలుపు వద్ద ట్రాలీ ఆటో పల్టీకొట్టిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. నగరంలోని బాలాపేటకు చెందిన 10 మంది యువకులు ఓ శుభకార్యానికి డీజే తీసుచొచ్చేందుకు ట్రాలీ ఆటోలో రాంక్యాతండాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో పల్టీ కొట్టగా ఆనంద్, మంగీలాల్, నాగేశ్వరరావుతో పాటు వికాస్ గాయపడ్డారు. వారందరినీ ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. -
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి..
ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు రఘురాంరెడ్డి, బలరాంనాయక్ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్రెడ్డి, పూల రవీందర్ అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించామని, ఆయన అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించి ఎన్నికల కోడ్ ముగియగానే సమస్యల పరిష్కారానికి హామీనిచ్చారన్నారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏల్లో రెండింటిని విడుదల చేస్తామని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు, పెండింగ్ బిల్లులను జూన్ 30లోగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. సమావేశంలో మోతు కూరి మధు, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులను ఓడించాలి
తిరుమలాయపాలెం: దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులను ఓడించాలని ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పిండిప్రోలులో జరిగిన జనరల్బాడీ సమావేశంలో మాట్లాడారు. దేశ ప్రధానమంత్రి అయి ఉండి మతాల మధ్య కులాల మధ్య చిచ్చురేపేలా బహిరంగంగా ప్రసంగిస్తున్నారని దుయ్యబట్టారు. మతతత్త్వ బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ కేంద్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య హక్కులను హరించే విధానాలను మోదీ అవలంబించడం దారుణమని, దానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ సమావేశంలో మాస్లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు గుర్రం అచ్చయ్య, జిల్లా నాయకులు కమ్మకోటి నాగేశ్వరరావు, మలీదు నాగేశ్వరరావు, రాయల రవికుమార్, తిమ్మిడి హనుమంతరావు, సోమనపల్లి వెంకటేశ్వర్లు, మారుతి మల్లయ్య, పగిడికత్తుల రామదాసు, ఈర్ల వెంకటఅప్పారావు, ఆరెంపుల వెంకన్న, ఎడ్లపల్లి నవీన్, పులిగుజ్జు వెంకటస్వామి, గోకనపల్లి సరోజన పాల్గొన్నారు. ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం -
ఇండియా కూటమిని గెలిపించాలి
● మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న పోరాటం ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నెహ్రూసెంటర్: దేశ సమాగ్రాభివృద్ధి, పరిరక్షణ, సంక్షేమం కోసం ఇండియా కూటమిని (కాంగ్రెస్) గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ను గెలిపించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్లో ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఎత్తుగడలు ఎండగట్టాలని, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు పేదలు, పెట్టుబడిదారులకు, మంచికి, చెడుకు జరుగుతున్న పోరాటమని, ఈ పోరాటంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభమైందని, ఇందులో ఇండియా కూటమి తప్పక గెలుస్తుందని ఽధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపు కోసం కృషి చేయాలని, అత్యధిక మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్న బీజేపీని గద్దె దించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సుంకరి వీరయ్య చెప్పారు. సభలో డోర్నకల్, మానుకోట ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్చందర్రెడ్డితోపాటు జి.నాగయ్య, వెన్నం శ్రీకాంత్రెడ్డి, ఘనపురపు అంజయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ సత్తా చాటాలి మరిపెడరూరల్: మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మరిపెడ మండలం గాలివారిగూడెం స్టేజీ ఏఎన్నార్ గార్డెన్స్లో నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బలరాంనాయక్ను గెలిపించాలని కోరారు. -
వేసవి అభ్యాసం
‘జాగ్రత్తమ్మా సుభద్ర... అక్కడకు వెళ్లాక ఆ వైభోగంలో మమ్మల్ని మర్చిపోతావేమో’ అంటుంది రేవతి పాత్రధారి ఛాయాదేవి సుభద్ర పాత్రధారైన ఋష్యేంద్రమణితో ‘మాయాబజార్’లో. అప్పటికి పాండవుల స్థితి చెడలేదు. ఇంద్రప్రస్థం నుంచి పుట్టిల్లైన ద్వారకకు సుభద్ర రాకపోకలు సాగుతున్నాయి. సోదరులైన బలరాముడు, కృష్ణుడు ఆదరిస్తున్నారు. మేనకోడలైన శశిరేఖను తన కుమారుడైన అభిమన్యుడికి చేసుకోవాలని సుభద్ర తలపోస్తోంది. రేవతి ఉబలాటపడుతోంది. పిల్లలు ముచ్చటపడి ఆశ కూడా పెట్టుకున్నారు. కాని ఒక్కసారిగా పరిస్థితి మారి జూదంలో పాండవుల రాజ్యం పోయింది. అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఒకనాడు సుభద్ర రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసిన రేవతి ఇప్పుడామె చెడి పుట్టింటికి చేరితే ఏం చేసింది? దొంగ శిరోభారంతో పడకేసింది. పొడ గిట్టనట్టుగా చూసింది. మనుషులు అలా ఉంటారు.పాండవులకు అన్యాయం జరిగిందని తెలిసి బలరామ పాత్రధారి గుమ్మడి వీరావేశంతో కౌరవుల భరతం పట్టడానికి బయలుదేరినప్పుడు భయంతో దుర్యోధన పాత్రధారి ముక్కామల కంపిస్తే, శకుని పాత్రధారి సి.ఎస్.ఆర్. ‘భయమెందుకు? ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అని ఊరుకోబెడతాడు. వేంచేసిన బలరాముడిపై పూలవర్షం కురిపించి, కన్యకామణుల చేత పన్నీరు చిలకరింపచేసి ప్రసన్నం చేసుకుంటాడు. భరతం పడతానన్న బలరాముడే ‘ధర్మజూదంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే’ అని రాజ్యం లాక్కున్న కౌరవులను ప్రశంసిస్తాడు. అంతేనా? దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి తన కుమార్తె శశిరేఖను కట్టబెట్టే వరం ఇస్తాడు– చెల్లెలు సుభద్రకు ఇచ్చిన మాట మరిచి. మనుషులు అలా కూడా ఉంటారు.ధర్మరాజు రాజసూయం చేయడం, మయసభ కట్టడం దుర్యోధనుడికి కంటగింపు అయ్యింది. కయ్యానికి అసలు కారణం అదే. ద్రౌపది నవ్వు మిష. అది గమనించిన శకుని ‘తలలో ఆలోచనలు చేతిలో పాచికలు... వీటితో పాండవులను సర్వనాశనం చేస్తాను’ అన్నప్పుడు ప్రకృతి కలవరపడి వెర్రిగాలితో వద్దు వద్దు అని సంకేతం ఇస్తుంది. కాని దుర్యోధనుడు వినడు. శకుని విననివ్వడు. సిరిని ప్రదర్శనకు పెట్టి ధర్మరాజు చెడ్డాడు. అది చూసి అసూయతో దుర్యోధనుడు మునిగాడు. ‘రాజ్యాలు పోయినా పరాక్రమాలు ఎక్కడికి పోతాయి’ అని సుభద్ర అంటుంది కాని పరాక్రమం లేకపోయినా అందలం ఎక్కాలనుకునేవారు ఉంటారు. వారికి భజన చేసి పబ్బం గడుపుకునేవారూ ఉంటారు. లక్ష్మణ కుమారుడు రేలంగి ఎప్పుడూ అద్దం ముందే ఉంటాడు. అలంకరణప్రియుడు వీరుడే కాదు. మరి ఇతని గొప్పతనమో? ‘అటు ఇద్దరె ఇటు ఇద్దరె అభిమన్యుని బాబాయిలు. నూటికి ఒక్కరు తక్కువ బాబాయిల సేన తమకు’. ఇతనికి స్తోత్రాలు వల్లించే శర్మ, శాస్త్రులు ఉద్దండ పండితులేగాని ‘ప్రభువుల ముందు పరాయి వారిని పొగడకూడదనే’ ఇంగితం లేని వారు. అందుకే శకుని ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదయ్యా’ అని చివాట్లు పెడతాడు. బుద్ధి లేని మనుషులు బుద్ధి ఉన్న మనుషుల్ని పితలాటకంలో పెట్టడమే లోకమంటే.స్వభావరీత్యా చెడ్డవాళ్లు, పరిస్థితుల రీత్యా చెడ్డతనం ప్రదర్శించేవాళ్లు... వీళ్లు మాత్రమే కిటకిటలాడితే జనులు నిండిన ఈ భూమి భ్రమణాలు చేయకపోవును. కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చే మనుషులు తప్పక ఉంటారు. అడవులు పట్టిన సుభద్ర, అభిమన్యుల కోసం హిడింబి, ఘటోత్కచుడు, చిన్నమయ్య, లంబు, జంబు వీరితోపాటు దుందుభి, దుందుభ, ఉగ్ర, భగ్ర, గందరగోళక, గగ్గోలక తదితర అసుర సేన పరిగెత్తుకొని రాలేదూ? వీరందరి కంటే అందరి మొర వినే మురారి ఉండనే ఉన్నాడాయె. చివరకు కౌరవుల ఆటకట్టి సుభద్ర పౌరుషం నిలిచి శశిరేఖ ఆమె కోడలు కావడంతో ‘మాయాబజార్’ ముగుస్తుంది.తెలుగు వారికి మాత్రమే దొరికిన అమూల్యమైన వ్యక్తిత్వ వికాస సంగ్రహం ‘మాయాబజార్’ చిత్రం. అస్మదీయులను కలుపుకు వెళ్లి, తస్మదీయులతో జాగ్రత్తగా మెసలి, పైకి ఒకలాగా ఆంతర్యాలు వేరొకలాగా ఉండేవారిని కనిపెట్టుకుంటూ, ప్రగల్భాలరాయుళ్లను గమనించుకుంటూ, ఉబ్బేసే వాళ్ల ఊబిలో పడకుండా, దుష్ట పన్నాగాలతో బతికే వారితో దూరంగా ఉంటూ, అనూహ్యంగా మారిపోతూ ఉండే మనుషుల చిత్తాలను అర్థం చేసుకుంటూ, చిన మాయల పెను మాయల నడుమ ముందుకు సాగడం ఎలాగో ఈ సినిమా చెబుతుంది. అది కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ‘నిష్కర్షగానూ కర్కశంగానూ’ కాదు. ‘సౌమ్యంగా సారాంశం’ అందేలాగానే. వేసవి వచ్చింది. నెల సెలవులున్నాయి. పిల్లలకు అందాల్సిన చాలా వాటిని నాశనం చేశాం. దుంప తెంచి ధూపం వేశాం. కనీసం ఈ సినిమా చూపించండి. వారు ఘటోత్కచుణ్ణి చూసి ‘హై హై నాయకా’ అంటారు. భక్ష్యాలకూ చిత్రాన్నాలకు తేడా తెలుసుకుంటారు. శాకాంబరీ దేవి ప్రసాదాన్ని నాలుక మీద వేసి ‘ఠ’ అంటూ లొట్టలు వేస్తారు. తల్పం గిల్పం కంబళి గింబళి చూసి కిలకిలా నవ్వుతారు. ఆ రోజుల్లోనే వీడియో కాల్ చేయగలిగిన ‘ప్రియదర్శిని’ పెట్టెకు నోళ్లు తెరుస్తారు. ‘సత్యపీఠం’ అను ‘లైడిటెక్టర్’తో సైన్స్ ఊహలు చేస్తారు. ‘ముక్కుకు తగలకుండా నత్తును కొట్టే’ ప్రావీణ్యం విద్యలో కలిగి ఉండాలని తెలుసుకుంటారు. తియ్యటి తెలుగుల ధారలలో లాహిరీ విహారం చేస్తారు. తెలుగు నేల మీద ఎప్పుడు వేసవి వచ్చినా పిల్లలకు ప్రిస్క్రయిబ్ చేయాల్సిన తొలి అభ్యాసం ‘మాయాబజార్’. అది చూసిన పిల్లలకు ఒక వీరతాడు, చూపించిన తల్లిదండ్రులకు రెండు వీరతాళ్లు. మాయాబజార్... నమో నమః -
1957 నుంచి ఎవరు ఎప్పుడు గెలిచారంటే...
సంవ గెలుపొందిన పార్టీ పోలైన ద్వితీయ స్థానంలో పార్టీ పోలైన మెజార్టీ త్సరం అభ్యర్థి ఓట్లు నిలిచిన అభ్యర్ధి ఓట్లు 1957 మండలి వెంకట కృష్ణారావు కాంగ్రెస్ 1,23,242 యలమంచిలి నాగభూషణం ఇండిపెండెంట్ 1,15,691 7,551 1962 మండలి వెంకటస్వామి ఇండిపెండెంట్ 1,53,720 మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్ 1,49,508 4,215 1967 యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ కాంగ్రెస్ 1,99,885 మోటూరి హనుమంతరావు సీపీఎం 1,22,293 77,592 1971 మేడూరి నాగేశ్వరరావు కాంగ్రెస్ 2,78,514 మండల వెంకటస్వామి స్వతంత్ర పార్టీ 73,640 2,04,874 1977 మాగంటి అంకినీడు కాంగ్రెస్ 2,62,551 వడ్డె శోభనాద్రీశ్వరరావు లోక్దళ్ 1,85,622 76,929 1980 మాగంటి అంకినీడు కాంగ్రెస్ (ఐ) 2,49,444 బూరగడ్డ నిరంజనరావు జనతా పార్టీ 1,15,108 1,34,336 1984 కావూరి సాంబశివరావు కాంగ్రెస్ 2,72,513 వడ్డి రంగారావు టీడీపీ 2,63,420 9,093 1989 కావూరి సాంబశివరావు కాంగ్రెస్ 3,54,533 బొప్పన గంగాధరచౌదరి టీడీపీ 3,11,044 43,489 1991 కె.పి.రెడ్డియ్య టీడీపీ 2,98,348 కావూరి సాంబశివరావు కాంగ్రెస్ 2,71,026 27,322 1996 కై కాల సత్యనారాయణ టీడీపీ 2,75,713 కె.పి. రెడ్డియ్య కాంగ్రెస్ 1,94,206 81,507 1998 కావూరి సాంబశివరావు కాంగ్రెస్ 3,55,030 కై కాల సత్యనారాయణ టీడీపీ 2,73,938 81,092 1999 అంబటి బ్రాహ్మణయ్య టీడీపీ 3,87,533 కావూరి సాంబశివరావు కాంగ్రెస్ 3,04,537 82,996 2004 బాడిగ రామకృష్ణ కాంగ్రెస్ 3,87,127 అంబటి బ్రాహ్మణయ్య టీడీపీ 3,36,789 50,338 2009 కొనకళ్ల నారాయణరావు టీడీపీ 4,09,939 బాడిగ రామకృష్ణ కాంగ్రెస్ 3,97,480 12,459 2014 కొనకళ్ల నారాయణరావు టీడీపీ 5,87,280 కొలుసు పార్థసారథి వైఎస్సార్ సీపీ 5,06,223 81,057 2019 వల్లభనేని బాలశౌరి వైఎస్సార్ సీపీ 5,71,436కొనకళ్ల నారాయణరావు టీడీపీ 5,11,295 60,141 -
కాంగ్రెస్లో చేరికల లొల్లి..
వైరా/కొణిజర్ల: వైరా నియోజకవర్గ కాంగ్రెస్లో చేరికల లొల్లి షురువైంది. ఇప్పటికే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చేరికలు ప్రారంభం కావడంతో కాంగ్రెస్లో ఇప్పటివరకు పనిచేసిన నాయకులు వారిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్లో చేరేందుకు వరస కట్టిన ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు తమ అవసరాల నిమిత్తం కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతుండగా.. ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారు వ్యతిరేకిస్తున్నారు. ఆదివారం వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ క్యాంపు కార్యాలయం వద్ద కొణిజర్ల మండల కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున సుమారు 3 గంటలకు పైగా ఆందో ళన చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యుత్ కూడా తొలగించి బీఆర్ఎస్ నుంచి వచ్చే వారిని చేర్చుకోవద్దని స్పష్టం చేశారు. కొణిజర్ల మండలంలో సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన చిరంజీవి, శ్రీనవాసరావు, మాజీ సర్పంచ్ ఒకరు, సీనియర్ నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు యత్నిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి.. మంత్రికి దగ్గరగా ఉండే మండల నాయకుడి ద్వారా కాంగ్రెస్ కండువా కప్పించు కోవాలని ప్రయత్నించారు. దీనిని మంత్రి పొంగులేటి వ్యతిరేకించి, ఎమ్మెల్యే సమక్షంలో చేరాలని సూచించినట్లు సమాచారం. దీంతో మండల కాంగ్రెస్ అధ్యక్షుడినని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో పార్టీలో చేరేందుకు వైరాలో ఆదివారం భారీ ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న కొణిజర్ల మండలానికి చెందిన కోసూరి శ్రీనివాసరావు నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. టెంట్లు పీకి రచ్చ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే రాందాస్నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తలను సముదాయించారు. అయినప్పటికీ కార్యకర్తలు ఎమ్మెల్యేను పట్టించుకోకుండా గలాటా సృష్టించారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ప్రోత్సహించిన కొణిజర్ల మండల నాయకుడు వడ్డె నారాయణరావు క్యాంపు కార్యాలయంలో ఉన్నాడని తెలుసుకుని విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. సుమారు 3 గంటల పాటు కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే సమక్షంలోనే రెండు వర్గాల మధ్య వాగ్వాదం