-
గంటల్లోనే పరిహారం
2020, మే 7వ తేదీన జరిగిన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు. అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆ పరిశ్రమ చుట్టు పక్కల గ్రామాలను తరలించింది. వారందరికీ వారం రోజుల పాటు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించింది. అలాగే మృతుల కుటుంబాలకు రూ.కోటి, ఆస్పత్రిలో చికిత్ప పొందిన వారికి రూ.10 లక్షలు, ఆ ప్రాంతంలో ఉన్న ఒక్కరికీ రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం కేవలం మూడు నుంచి వారం రోజుల్లోనే అందించింది. అంత భారీ స్థాయిలో పరిహారం సీఎం జగన్ ప్రకటించడంతో ప్రతిపక్షాల సైతం నోరెళ్లబెట్టాయి. -
కన్నీటి సుడులు.. కరిగె సూరీడు
విశాఖ సిటీ : చంద్రబాబుకు అరచేతిలో వైకుంఠం చూపించడంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఏ సంఘటనైనా, ప్రమాదన్నైనా తన రాజకీయ లబ్ధికి వినియోగించుకుంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాద బాధితులకు సత్వర సాయం అందించాలని పరితపించారు. టీడీపీ హయాంలో సంభవించిన విపత్కర పరిస్థితుల్లో హడావుడి, ప్రచార ఆర్భాటాలకే పరిమితమైతే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలపై దృష్టి సారించింది. అప్పట్లో నష్టపరిహారం కోసం బాధితులు ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రాగా.. ఈ ప్రభుత్వం ప్రమాదం జరిగిన గంటల్లోనే బాధితుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమచేసింది. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రమాద సమయాల్లో గత, ప్రస్తుత ప్రభుత్వాలు స్పందించి సహాయం అందించిన తీరుపై ఓటర్ల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అప్పట్లో హుద్హుద్ తుపాను సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు గాలికి కొట్టుకుపోయాయి. ఈ ఐదేళ్లలో ఎల్జీ పాలిమర్స్, హార్బర్ ఘటనల్లోను, అలాగే వరదలతో పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా అల్లూరి జిల్లాలో నాలుగు మండలాలు నీట మునిగిన సమయంలో ప్రభుత్వం కేవలం 72 గంటల్లోనే బాధితులకు నష్ట పరిహారం అందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. -
జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం
అరకులోయ టౌన్: పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం అరకులోయలో ఆర్ ఐటీఐ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ స్థాయిలో నిర్వహించిన బైక్, ఆటో,కార్ల ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జంక్షన్ వద్ద నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మ తనూజారాణి, అసెంబ్లీ అభ్యర్థి రేగం మత్స్యలింగంను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చేతులు జోడించి అడుగుతున్నామన్నారు. ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుతున్నవి అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడి, అనేక సంక్షేమ పథఽకాలు అమలు చేశారన్నారు. పేదల జీవితాలు నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అమ్మ ఒడి ప్రవేశపెట్టి ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15 వేలు జమ చేస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. మహిళలు వారి కాళ్లపై నిలబడేందుకు చేయుత పథకం ద్వారా ఐదేళ్లలో రూ. 75 వేలు వారి ఖాతాల్లో జమ చేశారన్నారు. వికలాంగులు, వృద్ధులకు ప్రతినెలా ఒకటో తేదీన ఉదయం ఏడు గంటలకే పింఛను అందేలా చర్యలు చేపట్టారన్నారు. మెరుగైన వైద్యం అందించే చర్యల్లో భాగంగా పాడేరులో రూ.500 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వైద్య కళాశాల జగన్మోహన్రెడ్డి నిర్మించారన్నారు. అరకు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలోని అన్ని ఆస్పత్రులు, పాఠశాలలు అత్యాధునికంగా తీర్చిదిద్దారన్నారు. పేదల వైద్యానికి ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 25 లక్షలకు పెంచారన్నారు. గ్రామాల్లోనే సేవలందించేందుకు సచివాలయ వ్యవస్ధ, రైతుల కోసం ఆర్బీకేలు నిర్మించామన్నారు. 2014 ఎన్నికల్లో జతకట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు అనేక సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మోసం చేసిన చరిత్ర వారిదన్నారు. మళ్లీ ఈ ఎన్నికల్లో అదే పార్టీలు జతకట్టి మళ్లీ రాష్ట్ర ప్రజలకు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రజ లంతా అప్రమత్తంగా ఉండాలని, వారికి అవకాశం ఇవ్వకూడదన్నారు. ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు రాబోయే రోజుల్లో కూడా అందాలంటే మళ్లీ జగనన్న సీఎంను చేయాలన్నారు. ఎంపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మ తనూజరాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంత అభివృద్ధికి సీఎం జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. గతంలో కన్నా మరింత మెరుగైన పథకాలు ప్రవేశపెడుతూ మేనిఫెస్టోను ప్రకటించారన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. అసెంబ్లీ అభ్యర్థి రేగం మత్స్యలింగం మాట్లాడుతూ అసెంబ్లీ సీటు కేటాయించి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని జగనన్న కల్పించారన్నారు. ప్రతిఒక్కరు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తనతోపాటు ఎంపీ అభ్యర్థి తనూజారాణిని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు. ర్యాలీల్లో పార్టీ శ్రేణులు జై జగన్ నినాదాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లి పల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే, అరకు అసెంబ్లీ పరిశీలకురాలు శోభ హైమావతి దేవి, మెడికల్ కౌన్సిల్ మెంబర్ నర్సింగరావు, ఆరు మండలాల ఎంపీపీలు, జెడ్పీటిసిలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించండి టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అరకులోయలో భారీ బైక్ ర్యాలీ జైజగన్ నినాదంతో హోరెత్తిన అరకులోయ -
హార్బర్ ప్రమాదంలో మూడో రోజే పరిహారం
2023, నవంబర్ 19న ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 49 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదాన్ని కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధికి వినియోగించుకోవాలని ప్రయత్నించింది. మత్స్యకారులను ప్రభుత్వంపై రెచ్చగెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు, ఇతర పార్టీలకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎప్పటిలాగే ప్రమాదం జరిగిన మూడో రోజే నష్టపోయిన బోటు యజమానులకు రూ.7.11 కోట్లు అందజేసింది. అలాగే బోట్లపై ఆధారపడి జీవనోపాధి కోల్పోయిన 400 మంది కలాసీలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది. -
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రమాద, విపత్కర పరిస్థితుల్లోను చేతికి ఎముక లేదు అన్న చందంగా సీఎం జగన్మోహన్రెడ్డి బాధితులకు సహాయం అందిస్తూ వస్తున్నారు. చంద్రబాబులా ప్రమాదాలలో రాజకీయ లబ్ధి కోసం పాకులాడకుండా.. బాధితులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యంగా భావించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయా ప్రాంతానికి వెళ్లి హడావుడి, ప్రచార ఆర్భాటాలు చేయకుండా యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేస్తూ.. బాధితులకు పరిహారం కూడా రెండు, మూడు రోజుల్లోనే అందించారు. ఆ తరువాతే సీఎం జగన్ బాధితులను పరామర్శిస్తూ వారికి పరిహారం అందిందా? లేదా? అని మరోసారి వాకబు చేస్తూ మనసున్న ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అప్పటి టీడీపీకి.. ఇప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మేలుపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
తాత్త్వికథ: 'ద.. ద.. ద..' మెరుపులోంచి వచ్చిన మూడు రహస్యసంకేతాలు..
భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
వాహనాల తనిఖీ
మోదీ పాలనలోనే దేశం సుభిక్షం
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
శిల్ప సంపద అద్భుతం
పోలింగ్ సమయం గంట పెంపు
గ్రామాల్లో హోం ఓటింగ్
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement