మల్లాపూర్: ఆశీర్వదిస్తే సేవకుడిగా పనిచేస్తానని కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన పార్టీ బూత్ లెవల్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. రైతుల సంక్షేమానిక అహర్నిశలు పనిచేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి వచ్చే ఏడాది డిసెంబర్లోగా చెరుకు క్రషింగ్ జరిపించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్నారు. గత ఎన్నికల్లో బాండ్పేపర్లతో రైతులను మభ్యపెట్టి గెలిచిన అర్వింద్ నయా పైసా పనిచేయలేదని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ పచ్చిఅబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, నాయకులు కల్వకుంట్ల సుజిత్రావు, వాకిటి సత్యంరెడ్డి, ఎలాల జలపతిరెడ్డి, రుత్త నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరికలు
జగిత్యాలటౌన్: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆరుగురు కౌన్సిలర్లు ఆదివారం కాంగ్రెస్లో చేరగా వారికి జీవన్రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. యూనిఫాం సివిల్కోడ్, ఎన్ఆర్సీ, 370ఆర్టికల్పై పార్టీ విధానమే తన విధానమన్నారు. బల్దియా చైర్పర్సన్ అడువాల జ్యోతి, నాయకులు గిరి నాగభూషణం, తాటిపర్తి విజయలక్ష్మి, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ముంజాల రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.