-
డంప్యార్డ్లో ధనుష్.. ఫ్యాన్స్ అభినందనలు
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ముంబై మహానగరంలో అత్యంత భారీ డంప్యార్డ్లో ధనుష్తో ఒక సీన్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ ఆ డంప్ యార్డ్ను సెట్టింగ్స్తో క్రియేట్ చేయాలని అనుకున్నారట. అయితే సినిమాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ సీన్ను సహజంగా రావడం కోసం డంప్ యార్డ్లోనే షూటింగ్ చేద్దామని ధనుష్ చెప్పడమే కాకుండా.. అందుకు తగ్గట్లుగా సుమారు 10 గంటల పాటు మాస్క్ లేకుండానే డంప్యార్డ్లో ధనుష్ నటించారట. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ధనుష్ను అభినందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్లో కూడా ధనుష్ డీగ్లామరైజ్గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనున్న నాగార్జున ఫస్ట్ లుక్ను కూడా మీకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నాగ్ను చూసిన ఆయన ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కుబేర ఇదే ఏడాదిలో విడుదల కానుంది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చంపేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటే భయమేస్తోంది. ఇలాంటి టైంలో థియేటర్కి వెళ్లి చూడటం కంటే ఓటీటీలో మూవీస్ చూడటానికే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రస్తుతం 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)హీరోయిన్ అంజలి తెలుగమ్మాయి. అప్పట్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ ఓ మాదిరి సక్సెస్ మాత్రమే అందుకుంది. తన 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చేసింది. ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో జనాలు అంతంత మాత్రంగానే వెళ్లారు.థియేటర్లలోకి ఏప్రిల్ 11న వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాని ఇప్పుడు నెల తిరిగిసరికల్లా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుందని సమాచారం. హిట్ మూవీ కాదు కాబట్టి పెద్దగా హడావుడి లేకుండా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 2014లో వచ్చిన 'గీతాంజలి' మూవీకి దీన్ని సీక్వెల్గా తెరకెక్కించారు. కాకపోతే తొలి భాగంలా హిట్ కొట్టలేకపోయారు.(ఇదీ చదవండి: సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్లు) -
పెళ్లి చేసుకోనున్న బుల్లితెర జంట.. నటి ఏమందంటే?
బుల్లితెర సెలబ్రిటీలు శివంగి జోషి, కుషల్ టండన్ ప్రేమించుకుంటున్నారని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఈ రూమర్స్పై ఇరువురూ స్పందించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.నాకు ఎంగేజ్మెంట్ జరగబోతుందా?ఈ మేరకు శివంగి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. 'నాకు రూమర్స్ అంటే ఎంతో ఇష్టం. నా గురించి నాకే తెలియని విషయాలను తెలుసుకుంటుంటే భలే అనిపిస్తుంది. మీడియా మిత్రులారా.. నాకు ఎంగేజ్మెంట్ జరగబోతుందా? ఇది నాక్కూడా తెలీదే.. నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం థాయ్లాండ్లో ఉన్నాను. మీరేమో ఏదేదో రాసేస్తున్నారు.సీరియల్లో కలిసి..కాస్త వార్త రాసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి' అని సూచించింది. అటు కుషల్ కూడా ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు పోస్ట్ చేశాడు. కాగా శివంగి, కుషల్.. బర్సాతే మౌసమ్ ప్యార్ కా అనే సీరియల్లో కలిసి నటించారు. గతేడాది ప్రారంభమైన ఈ సీరియల్ ఇటీవలే ముగిసింది. ఇద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ఆన్స్క్రీన్లో జంటగా కనిపించిన వీరు ఆఫ్స్క్రీన్లోనూ కలిసి కనిపించడంతో ఇద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందని అందరూ భావించారు. గతంలోనూ శివంగి.. బాలికా వధు సీరియల్ నటుడు రణ్దీప్ రాయ్తో డేటింగ్లో ఉందని రూమర్స్ వచ్చాయి. అయితే అవేవీ నిజం కాదని నటి క్లారిటీ ఇచ్చింది. అతడు కేవలం తన స్నేహితుడు మాత్రమేనని చెప్పింది.చదవండి: ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ -
ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్.. హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. కానీ 'పుష్ప' విలన్గానే తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్తో హిట్స్ కొట్టే ఇతడు.. రీసెంట్గానే 'ఆవేశం' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. దీన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అవన్నీ కాదన్నట్లు నేరుగా ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. ఇంతకీ ఆ సంగతేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)మలయాళంలో ఫహాద్ ఫాజిల్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. ఈ మధ్య 'ఆవేశం' అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో వచ్చాడు. ఇందులో గ్యాంగస్టర్ రంగా అనే పాత్రలో అదరగొట్టేశాడు. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే దీన్ని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తారేమో అని కొందరు ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారు.ఫహాద్ 'ఆవేశం' సినిమా థియేటర్లలో ఏప్రిల్ 11న రిలీజ్ కాగా.. ఇప్పుడు నెలలోనే ఓటీటీలోకి వచ్చేయబోతుంది. డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. మే 9 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతుందట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానుందని సమాచారం. (ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. రిలీజ్ డేట్ ఇదే) -
పవన్ కల్యాణ్కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నాడు. గెలుస్తాడో లేదో పక్కనబెడితే ఇతడిని నమ్ముకున్న దర్శక నిర్మాతలు మాత్రం మెంటలెక్కిపోతున్నారు. అలాంటిది సడన్గా 'హరిహర వీరమల్లు' టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు వరస అప్డేట్స్ ఇస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ నుంచి ఏమంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ఈ సినిమా ఒకటి ఉందనే చాలామంది మర్చిపోయారు. ఇవన్నీ కాదన్నట్లు డైరెక్టర్ విషయంలో సరికొత్త రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)2019 ఎన్నికల టైంలో పూర్తిగా సినిమాలే చేయనని చెప్పిన పవన్.. భీమవరం, గాజువాకలో పోటీ చేసిన చిత్తుగా ఓడిపోయాడు. దీంతో మాట మార్చేసి మళ్లీ మూవీస్ చేశాడు. అలా ఒప్పుకొన్న వాటిలో 'హరిహర వీరమల్లు' ఒకటి. మూడు నాలుగేళ్ల క్రితం సెట్స్పైకి వెళ్లిన ఈ పాన్ ఇండియా చిత్రానికి క్రిష్ దర్శకుడు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. అయితే దీని తర్వాత ఒప్పుకొన్న వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు రిలీజై పోయాయి గానీ 'హరిహర' మాత్రం మూలకి పడిపోయింది.దీంతో అభిమానులతో సహా ప్రేక్షకులు 'హరిహర..' సినిమా ఉందనే విషయమే మర్చిపోయారు. ఇప్పుడు ఉన్నఫలంగా టీజర్ అని చెప్పి నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో నిర్మాత, నిర్మాణ సంస్థ పేర్లు మాత్రమే ఉన్నాయి. డైరెక్టర్ క్రిష్ పేరు ఎక్కడా లేదు. తాజాగా రిలీజ్ చేసిన మరో పోస్టర్లోనూ లేకపోవడం షాకిచ్చింది. అయితే ఆలస్యం అవుతుండటం వల్ల క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడని, అతడి బదులు నిర్మాత కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వం చేస్తారని అంటున్నారు. అయితే క్రిష్ కావాలనే తప్పుకొన్నాడా? లేదంటే తప్పించారా? అనే టాక్ నెటిజన్ల మధ్య నడుస్తోంది. మరి కారణం ఏమై ఉంటుందంటారు?(ఇదీ చదవండి: పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చిన నటి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement