-
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఆదివారం కావడంతో పూజాది కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అమ్మవారి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరపగా, భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ జి.సుదర్శన్, భక్తులు పాల్గొన్నారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడిపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకుల సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సందర్శకులు డ్యామ్, జలాశయాన్ని, డీర్ పార్కును వీక్షించారు. దుప్పులు తదితర అటవీ జంతువులను చూస్తూ ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 354 మంది పర్యాటకులు రాగా ప్రవేశ రుసుం ద్వారా వైల్డ్లైఫ్ శాఖ రూ.9,680 ఆదాయం, 250 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్కు రూ.10,890 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. హోం ఓటింగ్ 162.. పోస్టల్ బ్యాలెట్ 78అశ్వారావుపేటరూరల్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం కూడా హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో 85 ఏళ్లకు పైబడిన వృద్ధలు మొత్తం 172 మంది ఉండగా, తొలి రోజు 108 ఓట్లు పోలయ్యాయి. రెండో రోజు 54 ఓట్లు పోలుకాగా, మొత్తం 162 ఓట్లు నమోదయ్యాయని తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. మరో 10 మంది ఓటు వేయాల్సి ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 372 ఉండగా, ఇప్పటివరకు 78 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేశారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ సిబ్బంది నవీన్, లక్ష్మి, హరిత, సందీప్, పద్మావతి, రామారావు, వీరయ్య, శ్రీశైలం, రాము, కిరణ్కుమార్, రాంసుందర్, గోపాల స్వామి శ్రీహరి పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన నీట్
పాల్వంచ: పాల్వంచలోని నవభారత్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తరలి రావడంతో పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. కేంద్రంలోకి ఉదయం 11.30 గంటల నుంచి అనుమతించగా, పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నిర్వహించారు. మొత్తం 696 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 668 మంది పరీక్ష రాశారు. 28 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను సిటీ కో ఆర్డినేటర్ ఏవీ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. పట్టణ ఎస్ఐలు బి.రాము, రాఘవయ్య ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. -
ర్యాంకులు, సౌకర్యాల ఎర!
● ప్రైవేటు విద్యాసంస్థల అడ్మిషన్ల వేట ● తల్లిదండ్రులకు పీఆర్వోల ద్వారా ఫోన్లు ● టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందితో ఇంటింటి ప్రచారం ● మభ్యపెడుతూ ఒప్పించుకుంటున్న యాజమాన్యాలు కొత్తగూడెంఅర్బన్: ప్రైవేటు విద్యాసంస్థలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. ర్యాంకులు, సౌకర్యాలంటూ తల్లిదండ్రులకు ఎరవేస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు వచ్చాయని, మీ పిల్లలను చేర్చితే మంచి భవిష్యత్ ఉంటుందంటూ కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు ప్రచారం చేస్తున్నాయి. పీఆర్వోల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి, వారు ఒప్పుకునేవరకు వెంటపడుతున్నాయి. ఇళ్లకు వెళ్లి అడ్మిషన్లు ఓకే చేయించుకుంటున్నాయి. పాఠశాల స్థాయి నుంచే ఇంజనీరింగ్, ఐఐటీ శిక్షణ ఇస్తున్నామని నమ్మబలుకుతున్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జీరో ఉత్తీర్ణతాశాతం నమోదైంది. కానీ పీఆర్వోలు అనేక మాటలు చెప్తూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. ఇక అడ్మిషన్ తీసుకుంటే రూ. వేలు, రూ.లక్షలు ఫీజు రూపంలో దండుకుంటాయి. ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందితో వేసవి సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి ఉదయం, సాయంత్రం వేళ అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అధికారంగా ప్రకటన వచ్చాకే అడ్మిషన్ల కోసం ప్రచారం చేపట్టాల్సి ఉండగా, కార్పొరేట్, ప్రైవేటు విద్యాంస్థల యాజమాన్యాలు వేసవి సెలవులు మొదటి రోజు నుంచే ప్రచారం చేయడం గమనార్హం. ప్రచారం నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో కూడా ప్రైవేటు, కార్పొరేట్కు దీటుగా బోధన, సౌకర్యాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక ఫీజులతో భారం కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. నిబంధనలు పాటించినవారికే జిల్లా విద్యాశాఖల అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే దరఖాస్తులు చేసుకున్న అందరికీ అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. అడ్మిషన్ల సమయంలో విశాలమైన తరగతి గదులు, క్రీడాప్రాంగణాలు, ఇంటిని తలపించే హాస్టల్ గదులు అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో ఉన్న హంగూఆర్భాటం కళాశాలలు, పాఠశాలల్లో కనిపించడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇరుకు గదులు, రేకుల షెడ్లలో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ కూర్చోవాల్సివస్తుందని పేర్కొంటన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో అధికారులు తనిఖీలు చేయాలని కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకే రూ.10 వేలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక పదో తరగతి వరకు అయితే రూ.లక్షల్లో తీసుకుంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటర్మీడియట్కు రూ.2 లక్షల వరకు ఫీజులుంటున్నాయని, హాస్టల్తో కలిపి రూ.2.50 లక్షల వరకు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు ప్రైవేటు పాఠశాలలు, 30 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లోనూ ఫీజులుగా అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఫీజుల వివరాలను ప్రతి పాఠశాల, కళాశాలలో నోటీసు బోర్డులో ఏర్పాటు చేయాలని విద్యాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చాకే అడ్మిషన్లు ప్రభుత్వ ఆదేశాలు, నోటిఫికేషన్ వచ్చాకే ఇంటర్మీడియట్ ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవాలి. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని గ్రూపులు, సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు. సర్కారు కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి. – సులోచనరాణి, నోడల్ అధికారి -
అభివృద్ధి చేస్తా..
అవకాశం ఇస్తేసాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన సంకల్పపత్రం చూస్తే గత పదేళ్లలో ఏం చేశారు.. రానున్న 27 ఏళ్లలో వారి విజన్ ఏమిటో ఉంది. దాన్ని ప్రజలు నమ్ముతున్నారు. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే గత పదేళ్లలో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా. నాకున్న ఎక్స్పోజర్ ఇక్కడి పొలిటీషియన్లలో ఎవరికీ లేదు. ప్రజలతో నాకు నేరుగా సంబంధాలున్నాయి. నాది అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామం. పారాచూట్ వేసుకుని దిగలేదు. ఇక్కడి సమస్యలు తెలుసు, ఇక్కడి ప్రజల్లో ఒకడిని.. ఖమ్మం పార్లమెంట్ ప్రజలు నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా’ అని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. -
నేటి నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ కోర్సుల 2వ, ఆరవ సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 6 నుంచి, నాలుగో సెమిస్టర్ల పరీక్షలు 7 నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి ఆదివారం తెలిపారు. 2వ సెమిస్టర్ల పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు 7, 9, 15, 17, 20, 22, 28, 30 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరో సెమిస్టర్ పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్ 7, 11, 12, 13 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని వివరించారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 68,139, నాలుగో సెమిస్టర్కు 56,899, ఆరో సెమిస్టర్కు 46,077 మొత్తం 1,71,115 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్లో 44, ఉమ్మడి ఖమ్మంలో 30, ఉమ్మడి ఆదిలాబాద్లో 49 మొత్తం 123 సెంటర్లు ఏర్పాటు చేసి 123 మంది చీఫ్సూపరింటెండెంట్లను నియమించామని పేర్కొన్నారు. ఒక్కో సెంటర్కు ఒక అజ్జర్వర్, వర్సిటీ పరిధిలో పది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించినట్లు తెలిపారు. హాల్టికెట్లు కళాశాలల వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, కళాశాలల నుంచి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెచ్చిపోతున్న ‘పచ్చ’ మంద
అధికారంలోకి వస్తే పాతేస్తాం
జేఎన్టీయూ పురోగతికి సహకరిస్తా
భూముల కబ్జాకోరులు, కరుడుగట్టిన నేరస్తులకు చంద్రబాబు టికెట్లు
మహిళలే మహరాణులు
హైదరాబాద్ శివారులో బద్రీనాథుడు.. అచ్చం ఉత్తరాఖండ్ లాగే నిర్మాణం (ఫొటోలు)
పెనమలూరులో తుఫ్యాన్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement