-
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర
వనపర్తి: రాష్ట్రానికి తలమానికంగా ఉన్న హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకు కాంగ్రెస్ అంతర్గతంగా సహకరిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాల పాటు కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతుల్లో పెట్టే దిశగా రాష్ట్ర కాంగ్రెస్ పాలకులు అడుగులు వేస్తున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్పార్టీకి ప్రస్తుత ఎన్నికల్లో ఓటు వేస్తే.. తమకు తామే అన్యాయం చేసుకున్నట్లు అవుతుందన్నారు. కృష్ణా జలాల విషయంలో పక్క రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, గోదావరి–కావేరి నదులను అనుసంధానిస్తూ గోదావరి బేసిన్ను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్న బీజేపీ నిర్ణయాలకు కాంగ్రెస్ వంత పాడుతోందని విమర్శించారు. ముందుచూపుతో ప్రధాన పట్టణాలు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు, పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేసిన చిన్న జిల్లాలను కుదించేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం పూనుకుంటోందని.. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ప్రశ్నించినా మంత్రులుగాని, సీఎంగాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పదేళ్ల పాలనతో కొంత వ్యతిరేకత వచ్చిన కారణంగా కేవలం 1.85 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాలం కలిసొచ్చి వచ్చిన ముఖ్యమంత్రి పదవిని రేవంత్రెడ్డి కాపాడుకోవాలని హితవు పలికారు. దుర్భాషలాడటం సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి సరికాదనే విషయాన్ని గమనించాలన్నారు. యాసంగి రైతుబంధు నేటికీ చాలామంది రైతులకు అందలేదని.. మళ్లీ వానాకాలం సీజన్ వస్తుందనే విషయం ప్రభుత్వం తెలుసుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మాటిమాటికి పాలమూరు బిడ్డనని చెప్పుకొనే సీఎం చిత్తశుద్ధి ఉంటే పాలమూరు–రంగారెడ్డి పథకం పనులు పూర్తిచేసి వానాకాలం నాటికి సాగునీరు అందించాలని సవాల్ విసిరారు. 2003లో పార్టీలో చేరుతానని రేవంత్రెడ్డి వస్తే తానే కేసీఆర్తో గులాబీ కండువా కప్పించానని మాజీ మంత్రి గుర్తుచేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మాజీ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ బి.లక్ష్మయ్య, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రమేష్గౌడ్, పట్టణ ఇన్చార్జ్ శ్రీనివాస్యాదవ్, గొర్రెల కాపరుల సంఘం మాజీ అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, నాయకులు జోహెబ్, రాము పాల్గొన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి -
ఆశీర్వదించాలి..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్గాంధీ ఐదు గ్యారంటీలు అందిస్తారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతి ఇంటికి 11 పథకాలు వస్తాయి. ప్రజలు తమ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో పేదల ప్రభుత్వం ఎన్నుకునేలా కాంగ్రెస్ను ఆశీర్వదించాలి. – మల్లు రవి, నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి -
No Headline
నేను భారత్ జోడోయాత్రలో నాలుగు వేల కిలోమీటర్లు నడిచాను. బీజేపీ దేశంలో మతవిద్వేషాలు రేకెత్తించింది. మనుషుల మధ్య చిచ్చుపెట్టింది. మేము విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచాం. విద్వేషాలతో ఏమీ రావు.. ప్రేమతో దేశం ముందుకెళ్తుంది. పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మోదీ ధనవంతుల కోసం సర్కారును నడుపుతాడు. దాని వల్ల దేశానికి మేలు జరగదు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. -
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం : కాంగ్రెస్
పెబ్బేరు రూరల్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు తప్పకుండా అమలు చేస్తామని.. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చూస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని యాపర్ల, గుమ్మడం, గుమ్మడంతండా, తిప్పాయిపల్లి, అయ్యవారిపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొన్ని పథకాలు అమలు చేయలేదని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఆగష్టు 15లోపు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామన్పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో నీటిమట్టం నిలకడగా ఉంది. ఆదివారం 1,012 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ సింగిరెడ్డి రనీల్రెడ్డి తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా నీటి సరఫరా లేదని.. తాగునీటి అవసరాలకు జలాశయం నుంచి రోజుకు 20 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. కూలి పెంచకపోతే పోరాటం తీవ్రం : ఇఫ్టూ అమరచింత: బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కూలి ఆశించిన మేర పెంచకపోతే తీవ్రమైన పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని ఇఫ్టూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, టీపీబీడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సూర్యం పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మార్క్ భవనంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో కార్మిక సంఘాల డిమాండ్లను పక్కనబెట్టి యాజమాన్యం అతి తక్కువగా వేతనం పెంచుతామని చెప్పడం శోచనీయమన్నారు. రెండోదఫా చర్చల్లో ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి బీడీల తయారీకి రూ.207కు మరో రూ.పది పెంచుతామని ప్రకటించడం కార్మికవర్గాన్ని అవమానించడమేనని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో వెయ్యి బీడీల తయారీకి రూ.245.75 అమలైందని.. వాటిని కూడా పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ నెల 9న మూడోదఫా చర్చల్లో తగినంత కూలి పెంచకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్మికులకు చట్టపరంగా వేతనాలు, పీఎఫ్లో యాజమాన్య వాటా 50 శాతం అమలు చేయాలని, గ్రాట్యూటీ చట్ట ప్రకారం చెల్లించాలని, పీఎఫ్లో తప్పులను యాజమాన్యమే సరిచేయాలన్న డిమాండ్ల సాధనకు భవిష్యత్లో కార్మికవర్గం సంఘటితంగా బలమైన పోరాటాలకు కార్యాచరణ చేస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సామేలు, అరుణ్కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో జోష్..
మోసం చేస్తున్న కాంగ్రెస్ మాదిగలను కాంగ్రెస్పార్టీ మోసం చేస్తోందని బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్పీ ఆరోపించారు.వరుసగా కొత్తకోట, ఎర్రవల్లిలో జనజాతర సభలు వివరాలు IIలో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/అలంపూర్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ అగ్రనేతల వరుస పర్యటనలతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా శనివారం కొత్తకోటలో రోడ్షో, కార్నర్ మీటింగ్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గద్వాల జిల్లా ఎర్రవళ్లి చౌరస్తాలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ క్రమంలో నేతలు పాలమూరుకు ఏం చేస్తారో వివరిస్తూనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడం.. సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఎర్రవల్లి చౌరస్తాలో జరిగిన సభలో నాయకులు ఏమన్నారో వారి మాటల్లోనే.. అభివాదం చేస్తున్న రాహుల్గాంధీ ● భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు ● అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగానికి విశేష స్పందన ● పాలమూరుకు ఏం చేస్తారో వివరిస్తూనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement