-
No Headline
● కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందింది. ఏటా శ్రావణ, కార్తీక మాసాల్లో ప్రతి శని,మంగళవారాల్లో దేవాలయానికి ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివస్తారు. ● నియోజకర్గంలోని గుతి ్తకోట అత్యంత పురాతనమైన దుర్గాల్లో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినదిగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. గుత్తి కోట సందర్శనకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ● గుత్తి మండలంలోని చెర్లోపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సేవాగఢ్ సంత్సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్యదైవంగా విరాజిల్లుతున్నాడు. ఏటా జరిగే జయంత్యుత్సవాలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో బంజారాలు తరలివస్తుంటారు. ● గుంతకల్లు పట్టణంలోని మస్తానయ్య దర్గా కులమతాలకు అతీతంగా ఖ్యాతిగాంచింది. ఏటా జరిగే మస్తానయ్య ఉరుసులో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ● పామిడి వస్త్ర రంగానికి ప్రసిద్ధి, ఈ గ్రారమంలోని సగం జనాభా వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. దీంతో పామిడిని రెండో ముంబాయిగా పిలుస్తుంటారు. నియోజవర్గ ప్రత్యేకతలు.. -
తాడిపత్రిపై భానుడి ప్రతాపం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా అంతటా శనివారం భానుడు మండిపోయాడు. తాడిపత్రిపై అయితే, మరింతగా విరుచుకుపడ్డాడు. పట్టణంలో 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ‘అనంత’ అగ్నిగుండంలా కాగుతోంది. ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత కారణంగా జిల్లా వాసులు అట్టుడికిపోతున్నారు. మరీ ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు తూర్పు, ఉత్తర మండలాల్లో వేసవితాపం తీవ్రస్థాయికి చేరుకుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఉమ్మడి జిల్లా అంతటా 26 నుంచి 33 డిగ్రీల వరకు నమోదవుతుండడం గమనార్హం. గాలిలో తేమశాతం మధ్యాహ్న సమయంలో 18 నుంచి 25 శాతం రికార్డు కాగా, వడగాల్పులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో జనానికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.సహదేవరెడ్డి, డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
గుత్తి/తాడిపత్రి: జిల్లాలోని గుత్తి, తాడిపత్రి ప్రాంతాల్లో రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపిన మేరకు... గుత్తి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన జనార్దన్ (46) రెండేళ్లుగా గుత్తి ఆర్ఎస్లోని సుందరయ్య కాలనీలో నివాసముంటున్నాడు. అర్థిక సమస్యలు తలెత్తడంతో మానసికంగా కుదేలైన ఆయన శనివారం ఉదయం ఎంఎంస్ హైస్కూల్ సమీపంలోని పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ● తాడిపత్రిలోని శ్రీనివాసపురానికి చెందిన రఫీ, రషీదా దంపతుల కుమారుడు షాహీద్ బాషా (20) ఇంటర్ పూర్తి చేశాడు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు. కొంత కాలంగా మానసిక స్థిమితం కోల్పోయి అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయేవాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన షాహిద్ బాషా అర్ధరాత్రి సమయంలో యల్లనూరు – పుట్లూరు మార్గంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని తాడిపత్రి స్టేషన్ మాస్టర్కు లోకో పైలట్ తెలపడంతో శనివారం ఉదయం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపారు. -
నీటి టబ్బులో పడి చిన్నారి మృతి
చెన్నేకొత్తపల్లి: టబ్బులో ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు... చెన్నేకొత్తపల్లి మండలం యర్రజినన్నగారిపల్లి (కొండకింద పల్లి) గ్రామానికి చెందిన బొగ్గు మురళి, అరుణ దంపతులకు ఓ కుమార్తెతో పాటు 14 నెలల వయసున్న కుమారుడు ఉన్నారు. శనివారం వేసవి తాపం అధికంగా ఉండడంతో సాయంత్రం టబ్లో నీరు పోసి అందులో కుమారుడిని కూర్చొబెట్టి తల్లి ఆడించింది. ఈ క్రమంలోనే పనిపై చిన్నారిని టబ్లోనే వదిలేసి ఇంట్లోకి వెళ్లిన ఆమె బయటకు వచ్చి చూసే లోపు నీట మునిగి బాలుడు మృతి చెందాడు. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
అనంతపురం అర్బన్: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ స్పష్టం చేశారు. రాప్తాడు అసెంబ్లీ, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక పంగల్రోడ్డులోని టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన, ఇతర జిల్లాలకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. జిల్లాలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి మూడు మండలాలు ఉన్నాయని, మిగిలిన మండలాలు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నాయన్నారు. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే విషయంలో కొద్దిపాటి గందరగోళం ఉందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని పోలింగ్ సిబ్బంది, అభ్యర్థులు కోరారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన వారు ఇక్కడికి శిక్షణకు వచ్చామని, ఇక్కడే ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నామన్నారు. వారికి ఇక్కడ ఓటుహక్కు కల్పిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి నిబంధనలు మారిన నేపథ్యంలో అవగాహన పొందాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని ఫారం–12 ఇచ్చిన ఉద్యోగులందరికీ వాయిస్ కాల్, మెసేజ్ ద్వారా తెలియజేశామన్నారు. కార్యక్రమంలో రాప్తాడు రిటర్నింగ్ అధికారి వసంతబాబు తదితరులు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement