-
ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
సుల్తానాబాద్రూరల్: డ్రైవర్ సీటు కింది స్ప్రింగ్ ఊడిపోవడంతో ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడడంతో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్, మృతుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం..సుల్తానాబాద్ మండలం చిన్న కూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ మల్యాల వెంకటేశ్ మియాపూర్ గ్రామ పరిధిలో చేను కౌలుకు తీసుకొని మొక్కజొ న్న సాగు చేశాడు. పంట చేతికి రావడంతో తన భార్య మల్యాల వైష్ణవి(35)తోపాటు పోచంపల్లి రాజమ్మ(61), బేతి లక్ష్మి(50), పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మి ని ట్రాక్టర్లో తీసుకొని ఆదివారం ఉదయం 7గంటల సమయంలో చేను వద్దకు వెళ్లాడు. మొక్కజొన్న కంకులు కోసి ట్రాక్టర్లో లోడ్ చేసుకున్నాడు. తిరుగుప్రయాణంలో వారిని ట్రాక్టర్ ట్రాలీ పై ఎక్కించుకొని కాలువ వెంట ఉన్న దారి నుంచి వస్తున్నాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో డ్రైవర్ సీటు కింద ఉన్న స్ప్రింగ్ ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ కుప్పకూలిపోయాడు. స్టీరింగ్ చేజారి ట్రాక్టర్ అదుపు తప్పింది. వేగంగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో ట్రాలీ కింద మహిళా కూలీలు నలిగిపోయారు. ఇందులో మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ, బేతి లక్ష్మి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మికి తీవ్ర గాయాలు సమీపంలోని రైతులు వెంటనే కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వెంకటేశ్కు స్వల్ప గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు ఎస్సై కేసు నమోదు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, నాయకులు నల్ల మనోహర్రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. -
‘నల్లసూరీడు’పై నజర్
● మూడు దశాబ్దాలుగా స్పష్టతలేని ఆదాయపు పన్ను మాఫీ ● మోక్షం లభించని కొత్తగనుల ఏర్పాటు, యువతకు ఉద్యోగాల కల్పన ● అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై రాజకీయ నేతల హామీలు గోదావరిఖని: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం. దీంతో వారిని మచ్చిక చేసుకుని తమ పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. రెండు జిల్లాలు.. రెండు లక్షల ఓట్లు.. ● పెద్దపల్లి పార్లమెంట్ పరిధి విస్తరించిన మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సుమారు రెండు లక్షలకుపైగా ఓట్లు ఉన్నాయి. ● రామగుండం రీజియన్లో రామగుండం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఆర్జీ–1,2,3, ఏపీఏ ఏరియాల్లో సుమారు 12వేలకు పైగా పర్మినెంట్, 8వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ● బెల్లంపల్లి రీజియన్లోని మంచిర్యాల, చెన్నూ రు, బెల్లంపల్లి నియోజవర్గాల్లో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో 16వేలకుపైగా పర్మినెంట్ కార్మికులు, మరో 7వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ● వీరి కుటుంబాలతో సహా ఒక్కో ఇంటికి నలుగురు చొప్పున లెక్కించినా సుమారు రెండులక్షలకుపైగా ఓట్లు ఉంటాయని నాయకులు అంచనా వేస్తున్నారు. ● దీంతో వీరి ఓట్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించారు. ● ఉదయం బొగ్గుగనులపై గేట్ మీటింగ్లు నిర్వహిస్తూ, సాయంత్రం కార్మిక వాడల్లో పర్యటిస్తూ ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ● మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన నేతల తాకిడి ఈప్రాంతాల్లో పెరుగుతోంది. ● ఈనెల 3న మాజీ సీఎం కేసీఆర్ పర్యటించారు. 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నలుగుతున్న ఆదాయపు పన్ను మాఫీ.. సింగరేణి కార్మికులను సైనికులతో సమానంగా గుర్తిస్తామని అన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయి. తాము గెలిచిన వెంటనే ఆదాయపు పన్ను మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నాయి. అయితే, గెలిచాక పార్లమెంట్లో కొద్దిరోజులు పోరాటం చేయడం, ఆ తర్వాత హామీ అటకెక్కించడం సర్వసాధారణంగా మారింది. ఇలా దశాబ్దాలుగా ఈ అంశం నలుగుతోంది. నూతన భూగర్భగనులు.. తాము గెలిస్తే సింగరేణి సంస్థకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు కార్మికుల సంఖ్య పెంచేందుకు కొత్తగా భూగర్భ గనులు తవ్విస్తామని ప్రధాన రాజకీయ పార్టీలు హామీ ఇస్తున్నాయి. కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తామని అంటున్నాయి. స్కిల్ ట్రైనింగ్ సెంటర్లపై దృష్టి అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించకపోయినా.. నిరుద్యోగులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేలా చూస్తామని పలు పార్టీల నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయగా, రామగుండం నియోజవర్గంలోని గోదావరిఖనిలో మరో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించేందుకు సింగరేణి సిద్ధమవుతోంది. జాడలేని మారుపేర్ల మార్పు.. సుమారు 20ఏళ్లుగా నలుగుతున్న మారుపేర్ల మార్పుపై గత పాలకులు హామీలు ఇచ్చినా సింగరేణి ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో 400మందికి పైగా కార్మిక కుటుంబాల డిపెండెంట్ కేసులు కార్పొరేట్ కార్యాలయంలో నాలుగేళ్లుగా ముందుకు కదలడంలేదు. దీనిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కనీసం ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారిన ఈ సమస్యలకు గెలిచిన పార్టీలు పరిష్కారం చూపాలని కార్మికులు, వారి కుటుంబాలు కోరుతున్నారు. -
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
గోదావరిఖని: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటువేసి బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ కోరారు. ఆదివారం రాత్రి స్థానిక రమేశ్నగర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో వారు మాట్లాడారు. తాలు పేరిట సాగుతున్న దోపిడీకి అడ్డుకట్టవేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని వారు అన్నారు. నాయకులు ఉన్నారు. ‘కూటమి’ అభ్యర్థిని గెలిపించండి ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోరారు. స్థానిక భాస్కర్రావు భవన్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోశం, మడ్డి ఎల్లాగౌడ్, వైవీరావు, ఎల్.ప్రకాశ్, కందుకూరి రాజారత్నం, జిగురు రవీందర్, ఎంఆర్సీ రెడ్డి, మాదన మహేశ్, సంకె అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ కల్పన కాంగ్రెస్తోనే సాధ్యం జ్యోతినగర్(రామగుండం): నిరుద్యోగలకు ఉద్యోగ కల్పన కాంగ్రెస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే రాజ్ఠా కూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా ఆధ్వర్యంలో జరిగి ఈ సమావేశంలో నాయకులు కొలిపాక సుజాత, బొంతల రాజేశ్, వెంగల పద్మలత, కత్తెరమల్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ -
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
అవుట్ సమయాలు మార్చాలి డ్యూటీ ఇన్టైం కొనసాగిస్తూనే అవుట్ టైం తగ్గించాలి. మొదటి షిఫ్టు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఉంచాలి. రెండో షిఫ్టు సాయంత్రం 4 నుంచి రాత్రి 11గంటల వరకు కొనసాగించాలి. కొందరు ఆపరేటర్లు ఏసీలో పనిచేస్తున్నారని సాకు చూపుతూ మిగ తా వారందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదు. – రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు, హెచ్ఎంఎస్ అనుకూలంగా ఉండాలి ఓసీపీ కార్మికులకు అనుగుణంగా షిఫ్టు వేళలు మార్చాలి. గతంలో కొనసాగిన పద్ధతి అనుసరించాలి. గత వేసవి కన్నా ఈసారి మేలో ఎండలు మండిపోతున్నాయి. క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్రఅస్వస్థతకు గురవుతున్నారు. ఒకరోజు డ్యూటీ చేస్తే రెండు రోజులు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. – సీఐటీయూ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సీఎండీతో మాట్లాడతాం గత వేసవిలో అనుసరించిన పద్ధతి ఇప్పుడూ కొనసాగించాలి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొదటి షిఫ్టు, సాయంత్రం 4 నుంచి రాత్రి 11గంటల వరకు రెండో షిఫ్టు గతంలో అమలు చేశారు. సోమవారం సీఎండీతో మాట్లాడతాం. పాత పద్ధతి కొనసాగించకపోతే యాజమాన్యంతో పోరాటం చేస్తాం. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ ● క్వారీల్లో మండుతున్న ఎండలు ● 50 డిగ్రీల సెల్సియస్పైనే నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ● విధులు నిర్వర్తించేందుకు జంకుతున్న కార్మికులు ● షిఫ్ట్ సమయాలు మార్చాలని డిమాండ్ గోదావరిఖని: పైన మండుటెండ, క్వారీలో రగులుతున్న బొగ్గు వేడితో ఓసీపీల్లో పనిచేస్తున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకరోజు డ్యూటీకి వస్తే రెండు రోజులు విధులకు గైర్హాజరవుతున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సింగరేణి యాజమాన్యం గతంలో మే నెలలో షిఫ్టు సమయాలు మార్చేది. ఈసారి ఎండలు మండుతున్నా దృష్టి సారించడం లేదు. 46 డిగ్రీల సెల్సియస్కు పైగానే ఉష్ణోగ్రతల నమోదు.. ● గోదావరిఖని పరిసరాల్లో వారం రోజులుగా 46 డిగ్రీల సెల్సియస్కు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ● ఓసీపీల్లో 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయని కార్మికులు చెబుతున్నారు. ● బయటి ఎండలకు తోడు క్వారీలోని బొగ్గు వేడికి పనిస్థలాల్లో విధులు నిర్వర్తించలేక కార్మికులు నీరసించిపోతున్నారు. ● వర్క్షాప్ల్లో పనిచేసే కార్మికులు, క్వారీల్లోని కేబుల్బాయ్లు, ఓబీ బ్లాస్టింగ్ సిబ్బంది, ట్రిప్మెన్ తదితర విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు ఎండవేడికి తల్లడిల్లి పోతున్నారు. ● సింగరేణి యాజమాన్యం భారీ యంత్రాల్లో పనిచేసే ఆపరేటర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నా.. బ్లాస్టింగ్, సర్వే, ఓబీ కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ● ఈక్రమంలో ఉదయం షిఫ్టు మధ్యాహ్నం 1గంట వరకు, రెండో షిఫ్టు సాయత్రం 4గంటల నుంచి 11గంటల వరకు కొనసాగించాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యామ్నాయం చూడాలి.. ఓసీపీల్లో షిఫ్టు వేళలు మార్చాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా ఉదయం షిఫ్టు 1గంట వరకు పూర్తి చేసి, రెండో షిఫ్టు సాయంత్రం 4గంటల తర్వా త ప్రారంభించాలని కార్మికులు కోరుతున్నారు. అయితే సింగరేణి యాజమాన్యం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు విరామం ప్రకటిస్తామని చెబుతోంది. మూడు షిఫ్టుల సమయాలు మార్చి కొనసాగిస్తామని అంటోంది. దీనిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సవరించిన సమయాలివే ఎండలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి యాజమాన్యం సోమవారం నుంచి షిఫ్టు సమయాలు మార్చుతోంది. ఉదయం 6గంట నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మొదటి షిఫ్టు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిఫ్టు కొనసాగించాలని నిర్ణయించింది. ఈమేరకు సమయాలను కూడా ప్రకటించింది. దీనిపై కార్మికులు, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
నేడు జేపీ నడ్డా రాక
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో సోమవారం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారు. సభా ఏర్పాట్లు తదితర కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్, రాష్ట్ర నాయకులు చిలారపు పర్వతాలు, గొట్టిముక్కుల సురేశ్రెడ్డి, పోచయ్య తదితరులు ఆదివారం పర్యవేక్షించారు. ఓటు వేసిన పోలీసు అధికారులుజ్యోతినగర్(రామగుండం): పోలీసు అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ అజయ్బాబు, ఎస్సైలు ఉదయ్కిరణ్, సతీశ్, వెంకటస్వామి ఆదివారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేశ్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. బీఆర్ఎస్తోనే మెరుగైన పాలన జ్యోతినగర్(రామగుండం): బీఆర్ఎస్తోనే మెరుగైన ప్రజాపాలన సాధ్యమని, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ రెండో డివిజన్ ఇందిరమ్మకాలనీ, న్యూపీకేరామయ్య కాలనీ, సిక్కువాడలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యేందుకు పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని ఆయన అన్నారు. ఇందుకోసం కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్ ఎన్వీ రమణారెడ్డి, నాయకులు రాంమోహన్రావు, నారాయణదాసు మారుతి తదితరులు పాల్గొన్నారు. చాలీసా పారాయణం రామగుండం: పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయంలో ఆదివారం హనుమాన్ మాలాధారణ చేసిన స్వాములు చాలీసా పారాయం గావించారు. పట్టణానికి చెందిన కౌశిక వెంకటరమణ–విజయ దంపతులు దీక్షాపరులకు అన్నదానం చేశారు. రాబోయే హనుమాన్ పెద్ద జయంతి వరకు మాలాధారణ స్వాములకు రోజుకొకరు దాతలు అన్నదానం చేస్తుండడంపై హర్షం వ్యక్తమవుతోంది. ప్యాక్స్ ఉద్యోగుల జిల్లా కార్యవర్గం సుల్తానాబాద్రూరల్: ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా కెశెట్టి విక్రమ్(ఎలిగేడ్)ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా దాసరి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా సురేశ్, గౌరవ అధ్యక్షుడిగా గొళి అంజిరెడ్డి, క్యాషియర్గా శ్రీనివాస్, ముఖ్య సలహాదారుగా మదన్మోహన్, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితుడిగా వల్లకొండ రమేశ్, ప్రచార కార్యదర్శిగా ప్రభంజన్, డైరెక్టర్లుగా ఏపీ రాజు, కల్వల కిరణ్, రమణ, అశోక్, శంకర్ ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు బొంగొని శంకర్గౌడ్ నూతన కమిటీని సన్మానించి అభినందించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement