-
కాంగ్రెస్తోనే పేదలకు సంక్షేమ ఫలాలు
డిచ్పల్లి: రాష్ట్రంలోని పేదలకు కాంగ్రెస్తోనే సంక్షేమ ఫలాలు అందుతాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. మండలంలోని మెంట్రాజ్పల్లి, నడిపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన కార్నర్ మీటింగ్లలో పాల్గొని ప్రసంగించారు. ఆగస్ట్ 15 లోపే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఎంపీ అర్వింద్ నిజామాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనిదినాలు పెంచుతామన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డిని గెలిపించాలని కోరారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. టీపీసీసీ డెలిగేట్ చంద్రశేఖర్గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, సొసైటీ చైర్మన్ చింత శ్రీనివాస్రెడ్డి, నాయకులు ఆనంద్, ధర్మాగౌడ్, శ్యాంసన్, దేవకరుణ, వాసుబాబు, నవీన్రెడ్డి, శ్రీనివాస్, సాగర్, వెంకటస్వామి, సుదర్శన్ పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పలు గ్రామాల్లో కార్నర్ మీటింగ్స్ -
రిజర్వేషన్లు తొలగించిన చరిత్ర కాంగ్రెస్ది
సుభాష్నగర్: యూనివర్సిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తొలగించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఓట్ల కోసం రిజర్వేషన్ల తొలగింపు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్ ధర్మపు రి పేర్కొన్నారు. నగరశివారులోని వైస్రాయ్గార్డెన్ లో ఆదివారం మేధావులు, విద్యావంతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ చట్టాన్ని తెచ్చిందని, ఆ చట్టం ద్వారా అనేకమంది హిందువుల ఆస్తులను ముస్లింలు ఆక్రమించుకున్నారని తెలిపారు. హిందువులకు ప్రస్తుత ఎన్నికలు అతి ముఖ్యమైనవని తెలిపారు. ఈ అంశాలను సమాజంలో ప్రజలకు అవగాహన కల్పించాలని, దేశ, ధర్మ రక్షకుడైన నరేంద్ర మోదీని మనమందరం బలపర్చి, మూడోసారి ప్రధానిని చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఐఎంఏ హాల్లో అసో సియేషన్ సభ్యులతో ఎంపీ అర్వింద్ సమావేశం నిర్వహించి, మాట్లాడారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నాయకులు, మేధావులు లోక భూపతిరెడ్డి, టక్కర్ హన్మంత్రెడ్డి, నర్సింహారెడ్డి, కొండా ఆశన్న, రజనీష్, స్రవంతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్ ధర్మపురి -
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతాం
నిజామాబాద్నాగారం: ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించి, బీఆర్ఎస్ సత్తాచాటుతుందని పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అన్నారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ప్రజలు భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్కు, కేంద్రంలో ఉన్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ రోడ్షోలకు ఆదరణ వస్తుందన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ను సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. సోమవారం సాయంత్రం 6.30నిమిషాలకు గాంధీచౌక్, నెహ్రుపార్కు ప్రాంతంలో కేసీఆర్ రోడ్షో సమావేశం ఉందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. ఎంపీ కేఆర్ సురేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జెడ్పీచైర్మన్ విఠల్రావు, మాజీఎమ్మెల్సీ వీజీగౌడ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి -
ఇటుక బట్టీలకు చెరువుల మట్టి
మోపాల్(నిజామాబాద్రూరల్): చెరువుల్లోని నల్లమట్టిని నిబంధనలకు విరుద్ధంగా ఇటుకబట్టీలకు తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులుగా పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా రాత్రి, పగలూ తేడా లేకుండా దందా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే దందా కొనసాగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలువురు ఫిర్యాదులు చేసినా.. అధికార యంత్రాంగం స్పందించడం లేదు. ఇదీ పరిస్థితి.. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి, కంజర్, మో పాల్, ముదక్పల్లి, సిర్పూర్, న్యాల్కల్, కులాస్పూ ర్, తదితర గ్రామాల్లో 15 వరకు ఇటుక బట్టీలు ఉ న్నాయి. నల్లమట్టిని ప్రతి వేసవిలో చెరువుల్లో నుంచి తరలించి ఏడాదికి సరిపడా నిల్వలు చేసుకుంటా రు. అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల హడావుడిలో ఉంటే.. ఇక్కడ వ్యాపారులు యథేచ్ఛగా మ ట్టి దందాకు తెరలేపారు. ప్రస్తుతం కాల్పోల్, మంచిప్ప చెరువుల నుంచి నల్లమట్టిని తరలిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో కొందరు వ్యాపారు లు మూడు, నాలుగు రోజులుగా టిప్పర్ల ద్వారా ర వాణా చేస్తున్నారు. ఒక్కో టిప్పర్ కాల్పోల్ చెరువు నుంచి రూ.3,300, మంచిప్ప నుంచి రూ.3,100 వ రకు వసూలు చేస్తున్నారు. పెద్ద పెద్ద జేసీబీలతో రాత్రి, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా దందా సా గిస్తున్నారు. టిప్పర్ డ్రైవర్లు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు అధికారుల కు ఫిర్యాదు చేశారు. అయినా వారు స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నల్లమట్టి తరలింపునకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి తరలిస్తున్న అక్రమార్కులు ‘మామూలు’గా తీసుకుంటున్న అధికార యంత్రాంగంఅధికారులు పట్టించుకోవడం లేదు.. మట్టిని ఇటుకబట్టీలకు తీసుకెళ్లే క్రమంలో టిప్పర్ డ్రైవర్లు వాహనాన్ని అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతాయోనని భయాందోళన చెందుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. –ఇందల్ నాయక్, బైరాపూర్ చర్యలు తీసుకుంటాం.. చెరువుల్లోని నల్లమట్టిని పంట పొలాలకు తరలించేందుకు ఎవరి అనుమతి అవసరం లేదు. ఇటుకబట్టీలకు తరలించడం మాత్రం నిబంధనలకు విరుద్ధం. ఇటుక బట్టీలకు తరలిస్తున్నట్లు మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఒకవేళ అలా జరుగుతున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. –రామేశ్వర్, తహసీల్దార్, మోపాల్ -
No Headline
హోల్సేల్ రిటైల్ హోల్సేల్ రిటైల్టమాట 10 20 బెండకాయ 35 50 బీరకాయ 40 70 దొండకాయ 20 40 బీర్నిసుకాయ 30 60 కాకరకాయ 50 70 వంకాయ 30 60 పాలకూర 25 50 మెంతికూర 20 40 కొత్తిమీర 25 50 పుదీనా 50 75 క్యాప్సికం 50 80 గాజరుగడ్డ 40 60 పచ్చిమిర్చి 40 60 దోసకాయ 20 40 ఆలుగడ్డ 20 50 గోబిగడ్డ 25 50 గోబిపువ్వు 60 80 బీట్రూట్ 25 50 కరివేపాకు 60 80 చామగడ్డ 50 70 గోరుచిక్కుడు 40 60 చిక్కుడుకాయ 50 75 – సుభాష్నగర్కూరగాయల ధ రలు(రూ.)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
తాత్త్వికథ: 'ద.. ద.. ద..' మెరుపులోంచి వచ్చిన మూడు రహస్యసంకేతాలు..
భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
వాహనాల తనిఖీ
మోదీ పాలనలోనే దేశం సుభిక్షం
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
శిల్ప సంపద అద్భుతం
పోలింగ్ సమయం గంట పెంపు
గ్రామాల్లో హోం ఓటింగ్
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement