వాహనాల తనిఖీ | Sakshi
Sakshi News home page

వాహనాల తనిఖీ

Published Mon, May 6 2024 7:45 AM

వాహనాల తనిఖీ

రేగొండ: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎస్సై రవికుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని చిట్యాల క్రాస్‌ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రవాణా చేసే చర్యలు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై తెలిపారు. ప్రజలు ఎన్నికల నియమావళి పాటించాలని చెప్పారు. ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో సివిల్‌, సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఉన్నారు.

Advertisement
Advertisement