గ్రామాల్లో హోం ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో హోం ఓటింగ్‌

Published Mon, May 6 2024 7:45 AM

గ్రామాల్లో హోం ఓటింగ్‌

రేగొండ(కొత్తపల్లిగోరి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 85 ఏళ్ల పైబడిన ఓటర్లు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో కొత్తపల్లిగోరి మండలంలో దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందిన ఆరుగురి ఇంటి వద్దకు చేరుకుని ఆదివారం ఓటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. మండలంలోని చెన్నాపూర్‌, కొత్తపల్లిగోరి, చిన్నకోడేపాక, రాజక్కపల్లి, నిజాంపల్లి గ్రామాలలో ఐదుగురు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్‌ ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రావు, మండల రూట్‌ ఆఫీసర్‌ ఆర్‌ఐ నరేష్‌, పంచాయతీ కార్యదర్శి రాంబాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement