-
కాకర్ల విజయం క్లిష్టమే..!
ఉదయగిరి: టీడీపీ ఉదయగిరి అభ్యర్థి కాకర్ల సురేష్ విజయం అంత సులువు కాదంటూ ఓ యూట్యూబ్ చానల్తో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు చేసిన వ్యాఖ్యలు తమ్ముళ్లలో అంతర్మథనానికి దారితీశాయి. దీనిపై కాకర్ల సురేష్ వర్గీయులు భగ్గుమంటున్నారు. రాజకీయ ప్రకంపనలు ఎన్నికలకు మరో వారం రోజుల వ్యవధి ఉంది. ఈ తరుణంలో టీడీపీ విజయానికి సహకరిస్తామంటూనే.. ఉదయగిరిలో టీడీపీ గెలుపు అంత తేలిక కాదన్న బొల్లినేని వ్యాఖ్యలు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2012 నుంచి నియోజకవర్గంలో టీడీపీని.. కేడర్ను సర్వశక్తులొడ్డి కాపాడుకుంటూ వచ్చానని.. అయితే అధిష్టానం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎన్నారై కాకర్ల సురేష్కు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయానని చెప్పారు. అయినా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఉదయగిరిలో సురేష్ విజయానికి సహకరించాలని భావించానని, ఆయన తనకు తగిన గౌరవమివ్వడంలేదని తెలిపారు. నామినేషన్ సమయంలో తాను నియోజకవర్గంలోనే ఉన్నా, ఆహ్వానం అందకపోవడంతో మనస్తాపానికి గురై హైదరాబాద్ వెళ్లానని సదరు యూట్యూబ్ చానల్తో చెప్పారు. ఆయన ప్రవర్తన సక్రమంగా లేదు వాస్తవానికి ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేయడం తనకిష్టం లేదని.. అయితే మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, వంటేరు వేణుగోపాల్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ మాట కాదనలేక తాను ప్రచారం చేయాలని భావించానని చెప్పారు. అయితే ఇక్కడి అభ్యర్థి ప్రవర్తన సక్రమంగా లేదన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో తొమ్మిది సార్లు కాంగ్రెస్, వైఎస్సార్సీపీయే విజయం సాధించాయని.. టీడీపీ రెండుసార్లే గెలుపొందిన అంశాన్ని ప్రస్తావించారు. దీని బట్టి కాకర్ల విజయం అంత తేలిక కాదని వ్యాఖ్యానించడం కేడర్లో తీవ్ర అయోమయానికి దారితీసింది. వివాదాస్పదమైన బొల్లినేని వ్యాఖ్యలు భగ్గుమన్న సురేష్ వర్గీయులు తమ్ముళ్లలో అంతర్మథనం రగిలిపోతున్న కాకర్ల వర్గీయులు ఉదయగిరి సీటును తమ నేతకు ఖరారు చేసిన నాటి నుంచి పార్టీకి నష్టం కలిగించేలా బొల్లినేని వ్యవహరిస్తున్నారని కాకర్ల వర్గీయులు మండిపడుతున్నారు. ఉదయగిరిలో కాకర్ల విజయం సాధిస్తారనే సమాచారంతో జిల్లా కేంద్రానికి బొల్లినేని వచ్చారని, అయితే ఇక్కడ టీడీపీ గెలవదంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని.. ఈ వారంలో ఆయనతో తమకు ఒరిగేదేమీలేదని.. కేవలం పార్టీకి నష్టం కలిగించేందుకే ఉదయగిరి వచ్చారని కాకర్ల వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బొల్లినేని వ్యవహార శైలి కాకర్ల కొంపముంచేలా ఉందని టీడీపీ కేడర్ అంతర్గతంగా చర్చించుకుంటోంది. -
నోటుతో ఓటుకు ఎర
● వీఓఏలకు గాలం వేసిన వీపీఆర్ కోవూరు: ఎన్నికల్లో విజయమే పరమావధిగా టీడీపీ నెల్లూరు లోక్సభ, కోవూరు అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు డబ్బులను ఏరులై పారిస్తున్నారు. తాజాగా బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని వీఓఏలకు వీరు గాలం వేశారు. కనుపర్తిపాడులోని వీపీఆర్ ఫంక్షన్ హాల్కు వీఓఏలను ఏపీఎం లలిత ఆదివారం తెల్లవారుజామున 4.30కు తీసుకెళ్లారు. అక్కడ వీఓఏలకు రూ.25 వేల చొప్పున అందజేశారని సమాచారం. ఈ ప్రక్రియకు సహకరించిన ఏపీఎం లలితకు భారీగా ముట్టజెప్పారని తెలుస్తోంది. కాగా ఇలాంటి వారిని విధుల నుంచి వెంటనే తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలి నెల్లూరు(క్రైమ్): సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. నగరంలోని డీకేడబ్ల్యూ, వీఆర్ కళాశాలల్లోని పోలింగ్, ఫెసిలిటేషన్ కేంద్రాలను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. పోలింగ్ రోజున కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఓటర్లు మినహా ఇతరులెవరూ ఉండకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ముందస్తు భద్రత చర్యలు చేపట్టామని వివరించారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వీరిపై సీ విజిల్ యాప్, టోల్ ఫ్రీ నంబర్ 112 లేదా స్థానిక పోలీస్స్టేషన్లకు సమాచారం అందించాలని కోరారు. ఎస్బీ, చిన్నబజార్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారెడ్డి, అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఓపీ సేవలందించాలి నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రైవేట్ వైద్యశాలల్లో సైతం పేదలకు 20 శాతం ఉచిత ఓపీ వైద్యసేవలందించాలని డీఎంహెచ్ఓ పెంచలయ్య సూచించారు. నగరంలోని మినీబైపాస్ రోడ్డులో శారదా హాస్పిటల్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆస్పత్రి డాక్టర్లు సుప్రజ, విజయలక్ష్మి, నిరుపమ, రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, చిన్నపిల్లల చీఫ్ కార్డియాలజిస్ట్ నాగేశ్వరరావు, ఐఎంఏ రాష్ట్ర నేత అశోక్, వైద్యులు గోవిందు, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బుర్రా సమక్షంలో టీడీపీ నాయకుల చేరిక
కందుకూరు: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కందుకూరు పట్టణంలోని 13వ వార్డుకు చెందిన 25 కుటుంబాలు టీడీపీని వీడాయి. వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ సమక్షంలో ఆదివారం పార్టీలో చేరాయి. వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో బుర్రా వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గుమ్మడి వెంకట్రావు, గుమ్మడి భాస్కర్, చెంచయ్య, షేక్ షంషీర్ బాబు, కాలేషా, ఎస్కే మహబూబ్బాషా, షాహిద్, మన్సూర్, షామినా, ఫాతిమా, జరీమా, కరిమున్నీషా తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అలాగే గుడ్లూరు మండలం రాళ్లపాడులో టీడీపీకి చెందిన 10 కుటుంబాలు బుర్రా సమక్షంలో పార్టీలో చేరాయి. గొల్లప్రోలు రవి, కొల్లూరు కొండయ్య, పాపబోయిన మహేంద్ర, దగ్గుమాటి రవి తదితరులు చేరిలో వారిలో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మంచిని ప్రజలకు వివరించి ఓట్లు వేయించాలని ఈ సందర్భంగా బుర్రా వారికి సూచించారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
● వైఎస్సార్సీపీ ఉదయగిరి అభ్యర్థి రాజగోపాల్రెడ్డి వింజమూరు(ఉదయగిరి): తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని వైఎస్సార్సీపీ ఉదయగిరి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి తెలిపారు. మండలంలోని బుక్కాపురం, చవటపాళెం, చంద్రపడియ, చింతలపాళెంలో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయసాయిరెడ్డి సహకారంతో ఉదయగిరి ప్రాంతాన్ని డెల్టాతో సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 40 ఏళ్ల నుంచి మేకపాటి కుటుంబం విద్య, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం ఎంతో కృషి చేసిందన్నారు. ఇది మరింత ముందుకు సాగాలంటే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. పేదల పక్షాన పోరాడే జగనన్నకు మద్దతివ్వాలో.. పెత్తందారులకు ప్రతినిధిగా ఉన్న చంద్రబాబుకు అవకాశమివ్వాలో ఆలోచించాలని కోరారు. పొరపాటున బాబుకు అవకాశమిస్తే పేదలు అన్యాయమైపోతారని, పెత్తందారులు దోపిడీ చేస్తారన్నారు. పేదల సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని రెండోసారి సీఎంను చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రేవునూరు శ్రీనివాసులురెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఆనంగి రమణయ్య, స్థానిక నేతలు పల్లాల కొండారెడ్డి, ఎం.విజయ్రెడ్డి, కాటంరెడ్డి రమణారెడ్డి, సర్పంచ్ రసూల్, కాటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తిరుపతిరెడ్డి, లక్ష్మీరెడ్డి, రవికుమార్రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు – నేడుతో ప్రభుత్వ బడులకు కొత్త కళ
● నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి నెల్లూరు సిటీ: వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు – నేడు పథకంతో ప్రభుత్వ బడులు కొత్త కళ సంతరించుకున్నాయని ఆ పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి అన్నారు. రూరల్ మండలంలోని గమళ్లపాళెం, కల్తీకాలనీ, కోడూరుపాడు ప్రాంతాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ జానా నాగరాజ్గౌడ్, మాజీ కార్పొరేటర్ లేబూరు పరమేశ్వర్రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో ఆదాల మాట్లాడారు. పార్టీలు మారే నాటకాల రాయుళ్ల బెదిరింపులకు ఎవరూ భయపడొద్దన్నారు. కోడూరుపాడు గ్రామానికి ఇప్పటి వరకు రూ.24 కోట్లకు పైబడి నిధులు ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయించినట్లు చెప్పారు. పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్రెడ్డి, ఎంపీపీ బూడిద విజయకుమార్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి లంకా రామశివారెడ్డి, రూరల్ పరిశీలకుడు మల్లు సుధాకర్రెడ్డి, రెండో డివిజన్ కార్పొరేటర్ పడిగినటి రామ్మోహన్ యాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్, వి.సుధాకర్రెడ్డి, నాగ శ్రీనివాస్రెడ్డి, లేబూరు అమర్నాథ్రెడ్డి, బొమ్మి శ్రీనివాసులురెడ్డి, బొమ్మి వెంకటరెడ్డి, షేక్ మౌలా, సొసైటీ అధ్యక్షుడు నడవటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు
హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement