-
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
సాక్షి, తూర్పుగోదావరి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని.. ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని మంత్రి వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టైట్లింగ్ యాక్ట్పై ఇంకా రూల్స్ తయారు కాలేదన్నారు.‘‘భూములన్నీ లాక్కుంటున్నారని విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు.. బినామీలు బయటపడతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే కుటిల రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు.‘‘అమరావతి పేరుతో అసైన్డ్ భూములను, ఎస్సీల భూములను చంద్రబాబు గుంజుకున్నాడు. చంద్రబాబు సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నాడు. ఇంకా అమలులోకి రాని చట్టాన్ని ఆయన రద్దు చేస్తాడట. తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధానితో చెప్పించగలరా. చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదు. వాలంటీర్ల విషయంలో వారికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరు....? చంద్రబాబు కాదా..?’’ అని మంత్రి వేణు ప్రశ్నించారు. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని బీజేపీ నేతలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కచ్చితంగా సీఐడీ ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటుంది’’ మంత్రి వేణు చెప్పారు. -
No Headline
పథకం లబ్ధిదారులు మొత్తం సొమ్ము కోట్లలో 1.వైఎస్ఆర్ పెన్షన్ కానుక 2,23,431 రూ. 902.48 కోట్లు 2.జగనన్న అమ్మ ఒడి 84302 రూ. 113.05 కోట్లు 3.జగనన్న వసతి దీవెన 20247 రూ. 25.22 కోట్లు 4.జగనన్న విద్యా దీవెన 24363 రూ. 39.06 కోట్లు 5. రైతు భరోసా 1,20,613 రూ. 149.89కోట్లు 6.వైఎస్ఆర్ రైతు సున్నా వడ్డీ 29616 రూ. 49.26 కోట్లు 7.రైతుల ఇన్పుట్ సబ్సిడీ 47813 రూ. 32.80 కోట్లు 8.వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా 63946 రూ. 15.29 కోట్లు 9.వైఎస్ఆర్ మత్యకార భరోసా 605 రూ. 2.56 కోట్లు 10.మహిళా సంఘాల సున్నా వడ్డీ 128760 రూ. 13.78కోట్లు 11.వైఎస్ఆర్ చేయూత 36463 రూ. 39.23 కోట్లు 12.వైఎస్ఆర్ ఆసరా 133767 రూ. 123.27 కోట్లు 13.వైఎస్ఆర్ బీమా క్లైం 1097 రూ. 5.87 కోట్లు 14.వైఎస్ఆర్ కాపు నేస్తం 15441 రూ. 23.76 కోట్లు 15.వైఎస్ఆర్ నేతన్న నేస్తం 3030 రూ. 10.11 కోట్లు 16.జగనన్న చేదోడు 3404 రూ. 2.92 కోట్లు 17. వైఎస్ఆర్ వాహనమిత్ర 4477 రూ. 3.82 కోట్లు 18.వైఎస్ఆర్ పంటల బీమా 48466 రూ. 104.81 కోట్లు 19. జగనన్న విద్యా దీవెన 344 రూ. 14.19 కోట్లు -
కోటలో పాగా వేసేదెవరో..!
5 సార్లు ఇండిపెండెంట్లకు పట్టంరామచంద్రపురం నియోజకవర్గం మొత్తం ఓటర్లు : 2,03,207 పురుషులు : 1,00,684 మహిళలు : 1,02,524 థర్డ్ జెండర్ : 1రామచంద్రపురం: రాజరాజ నరేంద్రుని పాలన, రాజా కాకర్లపూడి రాజవంశీయులు, చాళుక్య రాజుల శాసనం నాటి నుంచి నేటి వరకు సంచలన రాజకీయాల వేదిక రామచంద్రపురం నియోజకవర్గం. పంచారామాల్లో ఒకటిగా, అష్టాదశ పీఠాల్లో ఒకటిగాను చాళుక్య రాజుల కాలం నాటి ద్రాక్షారామ భీమేశ్వరాలయం ఒక ప్రసిద్ధి. దీంతో పాటుగా గోదావరి జిల్లాల కూల్డ్రింక్ ఆర్టోస్ కూడా రామచంద్రపురానికి ఒక ప్రత్యేకత ఉంది. 1947 స్వాతంత్య్రానంతరం 1955లో రామచంద్రపురం నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడింది. ఇప్పటివరకు 17 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఎంఎస్ సంజీవయ్య ఎన్ఎస్జే పార్టీ నుంచి పోటీ చేయగా 1970లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా రామచంద్రపురం నియోజకవర్గం ఇండిపెండెంట్లకు పెట్టింది పేరు. ఇప్పటివరకు అయిదుగురు ఇండిపెండెంట్లుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు కీలక నేతలు వైఎస్సార్ సీపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తు రాజ్యాంగబద్ధమైన మూడు పదవులు నిర్వహించారు. ఈ నియోజకవర్గానికి చెందిన తోట తిమూర్తులు ఎమ్మెల్సీగా మండపేటకు ఇన్చార్జ్గా ఉంటూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన రాజ్యసభ సభ సభ్యుడు పిల్లి సుభాష్ఛంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేస్తుండగా 2019లో రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా ఉన్న చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం రూరల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేయటం విశేషం. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రామచంద్రపురం అర్బన్తో పాటు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పఽథకాల ద్వారా లబ్ధి పొందిన వారునియోజకవర్గ భౌగోళిక స్వరూపం మున్సిపాలిటీ – రామచంద్రపురం మండలాలు : రామచంద్రపురం, కె.గంగవరం కాజులూరుమండలం మొత్తం పాఠశాలలు కె.గంగవరం 76 రామచంద్రపురం రూరల్, అర్బన్ 86 కాజులూరు 79 మండలం నాడు–నేడు ద్వారా ఆధునీకరించిన పాఠశాలలు కె.గంగవరం 49 రామచంద్రపురం రూరల్, అర్బన్ 65 కాజులూరు 72 మండలం నాడు–నేడు ద్వారా చేసిన మొత్తం ఖర్చు కె.గంగవరం రూ.14.20 కోట్లు రామచంద్రపురం రూరల్, అర్బన్ రూ.10.32 కోట్లు కాజులూరు రూ.11.76 కోట్లు మండలం మొత్తం ఉపాధ్యాయులు కె.గంగవరం 265 రామచంద్రపురం రూరల్ అర్బన్ 364 కాజులూరు 278 మండలం మొత్తం విద్యార్థులు కె.గంగవరం 5642 రామచంద్రపురం రూరల్, అర్బన్ 7995 కాజులూరు 7768 మండలం 2018–19లో విద్యార్థులు కె.గంగవరం 4353 రామచంద్రపురం రూరల్, అర్బన్ 6680 కాజులూరు 6428 మండలం పెరిగిన విద్యార్థులు కె.గంగవరం 1289 రామచంద్రపురం రూరల్, అర్బన్ 1315 కాజులూరు 1340 -
లూటుకుర్రు..అభివృద్ధిలో సూపరు
లూటుకుర్రు గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం లూటుకుర్రు మేజర్ గ్రామం. ఈ గ్రామ జనాభా 3,750 మంది. ఈ గ్రామంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. రూ.6 కోట్ల ఒక లక్షా 20 వేల నిధులతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రూ.1.41 కోట్లతో పాశర్లపూడిలంక–ఆదుర్రు సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మించారు. రూ.కోటి 50 లక్షల 41 వేల జల్జీవన్ మిషన్ నిధులతో వాటర్ ట్యాంకు నిర్మాణం, సంప్, పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. రూ.21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, రూ.22.80 లక్షలతో వెల్నెస్ సెంటర్, నాడు–నేడు ద్వారా రూ.63 లక్షలతో జెడ్పీ ఉన్నత పాఠశాల, రూ.36 లక్షలతో మెయిన్ స్కూల్, రూ.12 లక్షలతో భూతాలచెరువు స్కూల్ ఆధునీకరించారు. రూ.10 లక్షలతో జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద సీసీ రోడ్డు నిర్మించారు. రూ.5 లక్షలతో మెయిన్ స్కూల్ షెడ్డు ఏర్పాటు చేశారు. గడప గడపకు నిధులు రూ.8 లక్షలు, మండల పరిషత్ నిధులు రూ.2 లక్షలతో సిమెంట్ రోడ్లు నిర్మించారు. లూటుకుర్రు గ్రామంలో నిర్మించిన వాటర్ ట్యాంకు -
స్వతంత్రమేవ జయతే..
● ఐదుసార్లు స్వతంత్రులకే పట్టం ● అందులో ‘కుడుపూడి’ త్రయానిది ప్రత్యేక ముద్ర అమలాపురం టౌన్: ఎన్నికలు.. ప్రజా తీర్పునకు సరైన వేదికలు. పార్టీ ఏదైనా, పోటీ చేసే అభ్యర్థికే ప్రజలు పట్టం కడతారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకూ 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేసి సత్తా చాటారు. ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు నేటికీ పాలనలో ప్రత్యేక ముద్ర వేశారు. 1952లో నియోజకవర్గం ఆవిర్భవించి ద్వి సభ నియోజకవర్గంగా ఉండేది. 1955లో జరిగిన ఎన్నికల్లో ద్వి సభకు ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా జి.నరసింహమూర్తి, బి.అప్పలస్వామి బరిలో నిలబడి విజయకేతనం ఎగురవేశారు. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గ అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత 1962లో తొలిసారిగా జరిగిన ఏక అసెంబ్లీ నియోజకవర్గానికి కుడుపూడి సూర్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి సత్తా చాటారు. తండ్రి కుడుపూడి సూర్యనారాయణ బాటలోనే ఆయన కుమారుడు కుడుపూడి ప్రభాకరరావు 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యే అయ్యారు. ఇదే కుడుపూడి కుటుంబం నుంచి 2004లో జరిగిన ఎన్నికల్లో కుడుపూడి చిట్టబ్బాయి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయ బావుటా ఎగురవేశారు. కుడుపూడి త్రయం.. ప్రత్యేకం నియోజకవర్గంలో ఐదుగురు స్వంతంత్రులు ఎమ్మెల్యేలుగా గెలవడం, అందులోనూ ముగ్గురు కుడుపూడి కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. కుడుపూడి సూర్యనారాయణ స్వంతంత్ర ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. తర్వాత ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అంతకు ముందు అమలాపురం మున్సిపాలిటీ మొదటి చైర్మన్గా పనిచేసి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన కుమారుడు కుడుపూడి ప్రభాకరరావు తొలుత స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా 1972, 1985, 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయపరంపర కొనసాగించారు. మొత్తంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకరరావు 1989 కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కుడుపూడి చిట్టబ్బాయి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంపై అభిమానంతో ఆయన ప్రభుత్వంలో చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఇప్పుడు అమలాపురం నుంచి ఎమ్మెల్సీగా పనిచేస్తున్న కుడుపూడి సూర్యనాయణరావు గతంలో స్వంతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన కుడుపూడి సూర్యనారాయణకు మనమడు అవుతారు. తర్వాత స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన కుడుపూడి ప్రభాకరావు కూడా చిన్నాన్న కావడం విశేషం. ఇలా కుడుపూడి వంశీయులు అమలాపురాన్ని ఏలుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు
కాంగ్రెస్లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement