నెక్కొండ : నిద్రమత్తులో బిల్డింగ్ మెట్లు దిగుతూ..ప్రమాదవశాత్తు పైనుంచి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండలోని వరంగల్ రోడ్డులో గల అశ్విని బిర్యానీ పాయింట్లో చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామానికి చెందిన దాసరి కుమార్(34) వేయిటర్గా పని చేస్తున్నాడు. కాగా రాత్రి వరకు పని ఉండడంతో ఇంటికి వెళ్లకుండా అక్కడే డాబాపై నిద్రిస్తున్నాడు. శనివారం రాత్రి యజమాని సైతం బిర్యాని పాయింట్ను మూసేసి ఇంటికి వెళ్లారు. కాగా రాత్రి సమయంలో కుమార్ మూత్రవిసర్జన కోసం డాబా నుంచి దిగుతున్న క్రమంలో మెట్లపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడగా షెటర్, గేటు తగిలింది. దీంతో కుమార్ తలకు, ముఖం ముందు భాగంలో తీవ్ర గాయాలై రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమీప గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఆదివారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో శవ పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్సై పేర్కొన్నారు.
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
Published Mon, May 6 2024 3:40 AM
1/2
2/2
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
టమాట రేటు.. మిర్చి ఘాటు
నేడు అక్కడక్కడా వర్షాలు
తొలి ఫలితం పుట్టపర్తిదే!
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
14 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగావకాశం
‘108’లో ప్రసవం
అతిసారం నివారణకు చర్యలు చేపట్టాలి
త్యాగానికి ప్రతిరూపం కల్లూరు
ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
డీఆర్ కాలనీలో చోరీ
తప్పక చదవండి
- నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్ఫుల్
- ఛత్తీస్గఢ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది మృతి
- అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
- AP: తొలి ఫలితం వచ్చేది అప్పుడే!
- Kavya Maran: శెభాష్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. వీడియో వైరల్
- ‘నేను ఏలియన్ని’..మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- కిషన్ లీలలెన్నో..!
- అన్నమయ్య: YSRCP కార్యకర్త దారుణ హత్య
- నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
Advertisement