-
ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చిందే కేంద్రం
● అవ్వాతాతల గోష్ట చంద్రబాబు, పవన్కు తగులుతుంది ● ఆరణి శ్రీనివాసులు మెదడు కోడిపుంజు మెదడు ● కూటమికి ప్రజామద్దతు లేకే కార్పొరేటర్లకు వల ● ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ధ్వజంతిరుపతి మంగళం : కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ల్యాండ్ టైటిల్ యాక్ట్ను చంద్రబాబు, పవన్కళ్యాణ్లు పట్టుకుని ఆ యాక్ట్ వస్తే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల భూములను లాక్కుంటారంటూ విషప్రచారం సృష్టిస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఆ యాక్ట్ తెచ్చిందే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీయే కూటమి అన్న విషయాన్ని పక్కనబెట్టి వారు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతసేపు చంద్రబాబు, పవన్కళ్యాణ్ జగనన్నపైన బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి 4, 5 డివిజన్లలో ఆదివారం కార్పొరేటర్ పుల్లూరు అమరనాథ్రెడ్డి, కో–ఆప్షన్ సభ్యురాలు రుద్రరాజు శ్రీదేవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎంపీ మద్దిల గురుమూర్తి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ రాజకీయ పరిణతిలేని వ్యక్తి సభ్యసమాజం తలదించుకునేలా, ఓ బజారు మనిషిలాగ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిపై నోరుపారేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్కళ్యాణ్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాజకీయమంటే డైలాగులు, బూతులు మాట్లాడే సినిమా కాదని హెచ్చరించారు. ఇంటి వద్ద అవ్వాతాతలకు పింఛన్లు అందకుండా చేసిన దుర్మార్గులు చంద్రబాబు, పవన్కళ్యాణ్ అని మండిపడ్డారు. తిరుపతిలో కోడిపుంజు మెదడంత మెదడు ఉన్న కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరును ఏలి దోచుకున్నది చాలక తిరుపతిని దోచుకోవడానికి వచ్చారని ఆరోపించారు. ప్రజలకు ఏమి చేస్తారో చెప్పి ఓట్లు అడగాల్సిన ఆరణి .. ఎంతసేపు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అనంతరం ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ ఎలాగైన అధికారంలోకి రావాలన్న దురాలోచనతో చంద్రబాబు, పవన్కళ్యాణ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను భూతద్దంలో చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రవేశపెట్టిని మేనిఫెస్టోను దేశ ప్రధాని నరేంద్రమోదీనే అంగీకరించలేదన్నారు. తిరుపతిలో ఎవ్వరీకి సాధ్యం కాని విధంగా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం అభినయ్ వల్లేనన్నారు. జగనన్న అందించిన సంక్షేమం, తిరుపతిలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేగా అభినయ్కి, ఎంపీగా తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. -
పెల్లెటూర్లో పట్నమొచ్చినట్టుంది
మా గ్రామం జాతీయ రహదారి పక్కనే ఉంది. ఇక్కడ ఒకే చోట గ్రామ సచివాలయ భవనం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రం వంటి భవనాలు నిర్మించారు. దీంతో నెలబల్లి ప్రాంతం ఓ చిన్న పట్టణ తరహాలో రూపుదిద్దుకుంది. గతంలోకంటే ఇప్పుడు మా ఊర్లో ఎంతో మార్పు వచ్చింది. ఒకే ప్రాంతంలో అన్ని ప్రభుత్వ భవనాలు ఏర్పడడంతో రోడ్డు పక్కనే టిఫిన్ అంగళ్లు, కూల్డ్రింక్ షాపులు, టీ సెంటర్లు వెలిశాయి. ఇప్పుడు ఇక్కడ చిన్న టౌన్ తరహాలో కనిపిస్తోంది. ఈ సారి మాట మీద నిలబడే నాయకుడ్ని ఎన్నుకుంటాము.– నల్లారెడ్డి రాజేష్, నెలబల్లి గ్రామం, దొరవారిసత్రం -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి వరకు 77,848 మంది స్వామివారిని దర్శించుకోగా 39,317 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.95 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. నేటి నుంచి వేసవి శిక్షణ తరగతులు తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణలో భాగంగా వేసవి శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరగతులు సోమవరాం నుంచి మే 27 వరకు రోజూ ఉదయం 8 నుంచి 10.30గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 16 ఏళ్లలోపు బాలబాలికలకు వివిధ దేవత సంబంధమైన ధ్యాన శ్లోకాలు, విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతకంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 16 ఏళ్లు పైబడిన విద్యార్థినీ, విద్యార్థులకు లలితా సహస్రనామ స్తోత్రం, వివిధ దేవతా స్తోత్రాలు, వ్రతాలు, నవవిధభక్తి మార్గాల పట్ల అవగాహన, సనాతన ధర్మం పట్ల అవగాహన, వేదాలకు సంబంధించి స్వశాఖాపరమైన సంధ్యావందనం నేర్పన్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు అడ్మిషన్ల కొరకు 9550071629, 9000850325 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రశాంతంగా నీట్ ● తిరుపతిలో 9 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ ● 97.37 శాతం మంది హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం తిరుపతిలోని 9 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన నీట్ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నీట్ పరీక్షను ఎన్టీఏ ఆఫ్లైన్ విధానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. తిరుపతిలోని విశ్వం హైస్కూల్, ఎడిఫై, శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, గీతమ్, లిటిల్ ఏంజల్స్, శ్లోకా బిర్లా, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల, మార్గ్ చిన్మయ విద్యాలయా సీనియర్ సెకండరీ స్కూల్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు సీసీ కెమెరాల నిఘాలో పరీక్షను నిర్వహించారు. నీట్ రాసేందుకు ఉదయం 11గంటల నుంచే విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. వీరిని నిబంధనలకు అనుగుణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. తిరుపతిలోని 9 పరీక్షా కేంద్రాల్లో 4,692 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వాల్సి ఉండగా.. వీరిలో 105 మంది గైర్హారు కావడంతో 4,569(97.37శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. -
10 గ్రామాలకు మేలు
సూళ్లూరుపేట–శ్రీకాళహస్తి రోడ్డు డబుల్ రోడ్డుగా విస్తరించడం వల్ల ప్రయాణం సులువుగా ఉంది. గత ప్రభుత్వంలో ఈ రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉండేది. ఈ మార్గంలో సూళ్లూరుపేట మండలంలోని సుమారు పది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముందుగా ఇచ్చిన మాట ప్రకారం దీన్ని డబుల్రోడ్డుగా విస్తరించారు. ఇలాంటి మంచి పనులు చేసిన వారు ప్రజాప్రతినిధులుగా ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని రుజువు చేశారు. అందుకే మంచి చేసే వారినే ఎన్నుకుంటాము. – పుల్లూరు అంకమ్మ, మన్నారు పోలూరు -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
తిరుపతి అర్బన్ : జిల్లాలో తొలిరోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం పలు ఫెసిలిటేషన్ కేంద్రాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ తనిఖీ చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, ఓటింగ్ సరళిని ఆయన ఆదివారం అధికారులతో కలసి పర్వవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫెసిలిటెషన్ సెంటర్లలో ఈనెల 7, 8 తేదీలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పీఓలు, ఏపీఓలు, అబ్జర్వర్లు, అత్యవసరశాఖ సిబ్బంది, మీడియా ప్రతినిధులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫెసిలిటేషన్ కేంద్రాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 22,299 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసు కోగా అందులో 12.310 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నట్టు కలెక్టర్ తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
తాత్త్వికథ: 'ద.. ద.. ద..' మెరుపులోంచి వచ్చిన మూడు రహస్యసంకేతాలు..
భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
వాహనాల తనిఖీ
మోదీ పాలనలోనే దేశం సుభిక్షం
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
శిల్ప సంపద అద్భుతం
పోలింగ్ సమయం గంట పెంపు
గ్రామాల్లో హోం ఓటింగ్
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement