-
తిరుమలలో నేటి భక్తుల రద్దీ
సాక్షి , తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. .శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. నిన్న 89,161 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 36,450 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.77 కోట్లు.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించిందిజూన్ 1 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలుఆకాశగంగ అంజనా దేవి – బాలాంజనేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకం– జాపాలి తీర్థం వద్ద హనుమాన్ చాలీసా యొక్క సామూహిక పఠనంతిరుమల, 2024 మే 26: జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.ఇందులో భాగంగా ఈ ఐదు రోజులు పాటు ఆకాశ గంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడంతోపాటు జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ఆకాశ గంగలోని అంజనాద్రి ఆంజనేయ ఆలయంలోహనుమత్ జయంతి సందర్భంగా ఆకాశ గంగలోని శ్రీ అంజనాదేవి- శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో ఈ ఐదు రోజుల పాటు ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. మొదటి రోజు జూన్ 1న మల్లెపూలు, జూన్ 2న తమలపాకులు, జూన్ 3న ఎర్ర గన్నేరు మరియు కనకాంబరం, జూన్ 4న చామంతి మరియు చివరి రోజైన జూన్ 5న సింధూరంతో అభిషేకం చేస్తారు.వేద పండితులచే శ్రీ ఆంజనేయ సహస్ర నామార్చన, మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి, అంజనాదేవికి అభిషేకం నిర్వహిస్తారు.ఉదయం 10 గంటలకు ఆకాశ గంగ వద్ద శ్రీ ఆంజనేయ జన్మ వృత్తాంతంపై ప్రవచన కార్యక్రమం ఉంటుంది.జపాలిలో:ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా యొక్క సామూహిక పారాయణం నిర్వహించనున్నారు. జూన్ 1న హరికథ, జూన్ 2 న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే సంకీర్తనలు, జూన్ 3న పురంధర దాస సంకీర్తనలు, జూన్ 4న హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే భజన, జూన్ 5న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే హరికథ గానం నిర్వహిస్తారు.ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులచే నృత్య కార్యక్రమాలు ఉంటాయి.నాద నీరాజనం వేదికపై:నాద నీరాజనం వేదికపై ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య శ్రీ హనుమన్ జననం మరియు శ్రీ హనుమంతునికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాలపై ప్రముఖ వేద పండితులచే ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. -
తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
తిరుపతి, సాక్షి: చంద్రగిరిలో ఈ వేకువ ఝామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారిపల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతులు నెల్లూరువాసులుగా పోలీసులు చెబుతున్నప్పటికీ.. వాళ్ల వివరాలను మాత్రం వెల్లడించలేదు. కారు కల్వర్ట్లో ఇరుక్కున్న స్థితిని బట్టి అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. గడ్డపార సాయంతో ఇరుక్కున్న కారు డోర్లను బద్ధలుకొట్టి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ AP 26 BH 3435 కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
అల్లుడొచ్చాడు!
నాటకాలు కట్టిపెట్టు నాని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని దొంగనాటకాలపై స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ధ్వజమెత్తారు.– 8లో● అత్తాంటికి చేరిన పెనుశిల నరసింహుడు ● పండగ చేసుకున్న గిరిజనులురాపూరు: మండలంలోని పెంచలకోనలో ఆరు రోజులపాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి, చెంచులక్ష్మిని వివాహం చేసుకుని సతీసమేతంగా చెంచులక్ష్మి స్వగ్రామమైన గోనుపల్లి గిరిజన కాలనీకి చేరుకున్నా రు. మండలంలోని గోనుపల్లి గ్రామంలో ఉన్న పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను బ్రహ్మోత్సవాల ముందు రోజు పెంచలకోనకు పల్లకీలో తీసుకెళ్లి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత మళ్లీ గోనుపల్లి గ్రామానికి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా కోనలోని అలంకార మండపం వద్ద స్వామి, అమ్మవార్లను పల్లకీలో కొలువుదీర్చి వివిధ పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పెంచలకోన ఆర్చి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వీడ్కోలు పలికారు. స్వామి, అమ్మవార్లను గోనుపల్లి గ్రామంలోని గిరి జన కాలనీ వద్ద ఉన్న చెంచురాజు ఇంటికి దొడ్డిదారిలో తీసుకొచ్చారు. శ్రీవారి కల్యా ణం అనంతరం స్వామి వారు దొంగదారిలో గ్రామానికి వచ్చారని నానుడి. పెంచలస్వామి గిరిజన వనిత అయిన చెంచులక్ష్మిని వివాహం చేసుకోవడంతో ఆయనను తమ అల్లుడిగా భావిస్తారు. గోనుపల్లి నుంచి ఉత్సవ విగ్రహాలు కోనకు వెళ్లే సమయంలో స్వామిని గిరిజనులు పెళ్లికొడుకును చేసి అల్లుడికి ఇవ్వాల్సిన కట్నకానుకల కింద ఆరి మొలతాడు, ఇంజేటి గడ్డ, పుట్ట తేనె మొద లైనవి స్వామివారికి సమర్పిస్తారు. అలాగే స్వామి తిరిగి వచ్చే సమయంలో అడవి ఫలాలను అందించా రు. శ్రీవారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు గిరిజన కాలనీలోనే ఉంచడంతో గిరి జనులు తమ కొత్త అల్లుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండుగ జరుపుకున్నారు. అనంతరం గోనుపల్లిలో గ్రామోత్సవం నిర్వహించారు. డీసీ విజయసాగర్బాబు, ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, ఉప ప్రధానార్చకులు సీతా రామయ్యస్వామి పాల్గొన్నారు. -
అచ్చ తెలుగు పదం అన్నమయ్య సొంతం
తిరుపతి కల్చరల్: శ్రీతాళ్లపాక అన్నమయ్య నాడు జన బాహుళ్యంలో ఉన్న అచ్చ తెలుగు పదాలతో తిరుమల శ్రీవారిపై వేలాది సంకీర్తనలు రచించారని ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి తెలిపారు. శ్రీతాళ్లపాక అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు శనివారంతో రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య రాణి సదాశివమూర్తి ‘అన్నమయ్య– పద సౌందర్యం’ అనే అంశంపై ఉపన్యసించారు. నాడు పండితుల భాషగా ఉన్న సంస్కృతాంధ్ర పదాలను కాకుండా సాధారణ జనం మాట్లాడే భాషతో రాయలసీమలోని మాండలికాలతో కీర్తనలు రచించినట్లు తెలిపారు. దీన్ని బట్టి అన్నమయ్యను వ్యవహారిక భాషోద్యమానికి ఆధ్యుడని భావించవచ్చన్నారు. అన్నమాచార్యులు తెలుగు పద సాహిత్యానికి ఆద్యుడని, ఆయన పద సంపదను భావితరాలకు అందించాలన్నారు. అనంతరం జాతీయ సంస్కృత వర్శిటీ ఆచార్యుడు డాక్టర్ దక్షిణామూర్తి అన్నమయ్య –సంస్కృత కీర్తనలు అనే అంశంపై ప్రసంగించారు. అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ విభీషణశర్మ, ఉప సంపాదకుడు డాక్టర్ నరసింహాచార్యులు, ప్రోగ్రాం అసిస్టెంట్ కోకిల పాల్గొన్నారు. -
కాణిపాకంలో భక్తుల పాట్లు
కాణిపాకం: వరసిద్ధి వినాయకుడి ఆలయానికి పెద్దఎత్తున వచ్చిన భక్తులకు, ఆలయ సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది.‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో.. బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ తిరుపతి అర్బన్: ‘సాక్షి’ మైత్రి మహిళా ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఉంటుంది. ఈ మేరకు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డైఅప్లికేషన్, మేకప్స్ (బ్రెడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యునికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 27 వరకు బైరాగిపట్టిడలో ఆర్చి రోడ్డు అనంగా బ్యూటీ స్టూడియో ట్రైనింగ్ సెంటర్లో రూ.3 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం 9553454335, 8555974855ను సంప్రదించగలరు. -
No Headline
తేదీ ర్యాంకు ర్యాంకు నుంచి వరకు 27–05–2024 1 12,000 28–05–2024 12,001 27,000 29–05–2024 27,001 43,000 30–05–2024 43,001 59,000 31–05–2024 59,001 75,000 01–06–2024 75,001 92,000 02–06–2024 92,001 1,08,000 03–06–2024 1,08,001 చివరి ర్యాంకు -
ఇంటర్ పరీక్షకు 733 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 733 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఉదయం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు జనరల్, ఒకేషనల్లో కలిపి 13,046 మంది హాజరవ్వాల్సి ఉండగా వారిలో 660 మంది, మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షకు జనరల్, ఒకేషనల్లో కలిపి 614 మంది హాజరవ్వాల్సి ఉండగా వారిలో 73 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఈ పరీక్షలో భాగంగా సోమవారం ఉదయం ఇంటర్ ప్రథమ, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్, బోటనీ, సివిక్స్ సబ్జెక్టుల్లో పరీక్ష జరుగుతుందని ఆర్ఐఓ పేర్కొన్నారు. -
నాటకాలు కట్టిపెట్టు నాని!
‘పులివర్తి నానిని రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప శత్రువుగా ఎన్నడూ చూడలేదు.. గతంలో నా బావమరిదిపై నాని చేయి చేసుకున్నాడు.. నామినేషన్ రోజు నా కారుపై దాడి చేశారు. అవమానాన్ని భరించామే తప్ప ఆవేశాలకు పోలేదు.. పద్మావతీ యూనివర్సిటీ దగ్గర నాని కారుపై దాడిచేయడం తప్పే.. అందుకే శిక్ష అనుభవిస్తున్నారు.. కారుపై కర్రతో దాడి జరగగానే అక్కడి నుంచి యాక్టివ్గా నడుచుకుంటూ దూరంగా వెళ్లిన నాని రెండు గంటల తర్వాత వీల్ చైర్లో మీడియా ముందు కనిపించాడు.. ఇదంతా ఓ డ్రామా.. నాటకాలు కట్టిపెట్టు నాని’ అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన వరుస దొంగనాటకాలను ఆయన వీడియోల ద్వారా మీడియాకు వివరించారు. తిరుపతి రూరల్: ‘నాయకుడంటే వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి..’ అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సూచించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి జరిగిన ఘటనలు, వాటి వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులపై శనివారం సాయంత్రం ఆయన తుమ్మలగుంటలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో వివరించారు. నామినేషన్ రోజున తన కారుపై దాడి చేసిన విధానం, పోలింగ్ రోజున తన కుమారుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్రెడ్డిని అడ్డగించి, కార్లను దగ్ధం చేయడం, సర్పంచ్ చంద్రశేఖర్రెడ్డి ఇంటిని కాల్చివేయడం, పద్మావతి వర్సిటీలో నాని కారుపై దాడి జరగడం, ఆయనకు ఎలాంటి గాయాలు లేకుండా నడుస్తున్న విధానం, రెండు గంటల తర్వాత వీల్చైర్కు మారడం, తర్వాత జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలను పవర్ పాయింట్ ప్రజెంటెషన్ చేశారు. కేవలం వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియాలనే లక్ష్యంతోనే విడియోలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక వ్యక్తి ప్రచారం కోసం, ఒక వ్యక్తి తన పేరును జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఆధ్యాత్మిక తిరుపతి నగరం పేరును, ప్రతిష్టను అప్రదిష్ట పాలు చేస్తున్నారని విమర్శించారు. నాయకుడంటే పది మందికీ ఆదర్శంగా ఉండాలని, ప్రజలను రెచ్చగొట్టి దాని ద్వారా ప్రచారంపొంది, వ్యక్తిగత లబ్ధి పొందాలంటే అది తాత్కాలిక ప్రయోజనమేనన్నారు. కానీ నిజాలు బయటకు వచ్చిన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని హితవు పలికారు. చంద్రగిరి, తిరుపతిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను చూస్తే నిజం కన్నా వ్యక్తిగత ప్రచారం కోసం చేసిన డ్రామాలు అత్యంత రక్తి కట్టించినట్లు తెలుస్తోందన్నారు. కారుపై దాడి చేశారు... కార్లను దగ్ధం చేశారు చంద్రగిరి నియోజకవర్గంలో పలు ఘటనలను పరిశీలిస్తే కావాలనే రెచ్చగొట్టే విధానాలకు ప్రయత్నించినట్లు తెలుస్తోందన్నారు. నామినేషన్ రోజున సాక్ష్యత్తు ఎన్నికల అధికారి కార్యాలయంలోనే తన కారుపై రాళ్లు, కర్రలు, జెండాలతో దాడి చేశారని చెప్పారు. దాడి సమయంలో తాను కారులోనే ఉన్నానని, అయినా సంయమనం పాటించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజున తన కుమారుడు మోహిత్రెడ్డిని కూచువారిపల్లిలో అడ్డగించారని, రెండు కార్లను కాల్చివేశారని, గన్మన్ సహకారంతో వేరే కారులో మోహిత్రెడ్డిని పక్క గ్రామానికి తీసుకెళ్లారని చెప్పారు. మోహిత్రెడ్డిని పక్కకు పంపించారనే కోపంతో గన్మన్ను, మాజీ సైనికుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హించించారని, ఈ మేరకు నాటి ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. కూచువారిపల్లిలోనే తమ పార్టీకి చెందిన మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి ఇంటిని పెట్రోలు పోసి కాల్చివేశారని తెలిపారు. నాని కారుపై దాడిని ఖండించాం పద్మావతి వర్సిటీలో నాని కారుపై దాడిని తాము ఖండించామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా అది మంచింది కాదన్నారు. అయితే కారుపై దాడిని కూడా తన ప్రచారం కోసం వాడుకోవాలనే ప్రయత్నాలను ఆయన విమర్శించారు. భానుతో పాటు వ్యక్తులు కారుపై మాత్రమే దాడి చేశారని, కానీ ఈ ఘటనలో నానికి ఎక్కడా గాయాలు కాలేదన్నారు. ఈమేరకు నాటి సంఘటన తర్వాత వర్సిటీ సీసీ కెమెరాల్లో నమోదైన వీడియోలను ప్రదర్శించారు. ఒక్కగాయం కూడా కాని నాని నడుస్తూ, అరుస్తూ, కొడుతూ వర్సిటీ ముందు ఆందోళన చేస్తున్న వీడియోలను సైతం చూపించారు. రెండు గంటల తర్వాత ఇంటికి వెళ్లి డ్రస్ మార్చుకుని దాడిలో గాయాలయ్యాయని వీల్చైర్ ఎక్కారని తెలిపారు. అమాయకులపై దాడులు నాని వర్సిటీ ముందు రెచ్చగొట్టడం వల్లే పదుల సంఖ్యలో అమాయకులపై టీడీపీ శ్రేణులు దాడులు చేసినట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపించారు. పోలీసు అధికారులపై రాడ్లతో దాడులు చేశారని, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారని, అమాయకులను చావబాదారని, వాహనాలకు నిప్పు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్న రోగిని పరామర్శించేందుకు వెళ్లిన వారిపై కూడా స్విమ్స్ ఐసీయూలోనే టీడీపీ మూకలు మూకుమ్ముడిగా దాడి చేశారని, ఇది ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఇలాంటివి ఒక్కటైనా జరిగాయా? ప్రభుత్వ విప్గా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వంలో కీలక వ్యక్తుల్లో ఒకరిగా తాను ఎప్పుడూ రాజకీయ వేధింపులకు, కక్షలకు పాల్పడలేదని ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. అందుకు నిదర్శనమే అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు నానిపైనగానీ, ఆయన కుటుంబ సభ్యులపైన గానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని గుర్తుచేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకున్నామే తప్ప, ఎక్కడా గొడవలు సృష్టించ లేదన్నారు. పోలింగ్ తర్వాత కూడా అందరూ స్నేహ భావంతో ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వ్యక్తినే తప్ప, తనకు దాడులు చేయడం, చేయించడం రెండూ తెలియవన్నారు. తాను ఏపని చేసినా కష్టపడడం, ఆ తర్వాత దేవుడిని నమ్ముకుని వెళ్లడం మాత్రమే తెలుసన్నారు. రాజకీయాల్లో కూడా అలాగే ముందుకు వెళుతున్నానని, తన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా అలాగే పెంచానని చెప్పారు. అధికారం ఇచ్చిన ప్రజలకు భయపడి పనిచేయడం మాత్రమే తమకు తెలుసని, అధికారం కోసం ఎంతకై నా దిగజారడం తెలియదన్నారు. తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, ఆరు మండలాల నాయకులు పాల్గొన్నారు. కారుపై దాడి జరిగితే కాలుకు కట్టా ? పులివర్తి నాని నాటకాలతో శాంతి భద్రతలకు విఘాతం నానిని రాజకీయ ప్రత్యర్థిగా చూశానే తప్ప శత్రువుగా కాదు నా కారుపై దాడి చేసినా.. ప్రతి దాడి చేయలేదు.. ఐదేళ్లలో నాని కుటుంబంపై ఒక్క కేసూ పెట్టలేదు మీడియాతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వెల్లడి నాయకుడంటే హుందాగా ఉండాలి నాయకుడంటే హుందాగా ఉండాలి. కార్యకర్తలు, నమ్మిన ప్రజలకు మంచి చేయాలి. వారికి భరోసా కల్పించే విధంగా ముందుండాలి. వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. ఉన్నత చదువులు చదివిన వ్యక్తిగా నా లక్ష్యాలు వేరు.. నా ఆలోచనలు వేరు.. నా బాధ్యతలు వేరు.. నా చదువు, సంస్కారాన్ని మంచి చేయడానికి తప్ప చెడు కోసం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించను. అలాంటి మనస్తత్వం కూడా నాది కాదు.. నా కుమారు డు చెవిరెడ్డి మోహిత్డ్డి కూడా అలాగే పెరిగాడు.. రాజకీయాల్లోకి తీసుకువచ్చినపుడు ఒకే మాట చెప్పాను. ఎన్నికల్లో ఓడిపోతే.. ఒక మంచి వ్యాపారవేత్తగా వెళతావు.. ప్రజలు నీకు అవకాశం ఇస్తే.. నువ్వు జీవితాంతం వాళ్లకు సేవకుడిగా ఉండిపోతావు.. మనం ప్రజలకు మంచి చేసుంటే మనకు వాళ్లు కూడా మంచే చేస్తారు.. ఏది జరిగినా మన మంచికే అనుకుని ముందుకు వెళుతున్నాం’ -
రేపటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
తిరుపతి ఎడ్యుకేషన్ : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ నెల 27 నుంచి జూన్ 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన(కౌన్సెలింగ్) నిర్వహించనున్నారు. ఆ మేరకు తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24 నుంచి జూన్ 2వ తేదీలోపు ‘ఏపీపీఓఎల్వైసీఈటీ.ఎన్ఐసీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఆయా తేదీల్లో ర్యాంకుల వారీగా ఏర్పాటుచేసిన కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. ఈ నెల 31 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని, జూన్ 5న ఆప్షన్స్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని, 7వ తేదీన అలాట్మెంట్ ప్రకటిస్తారని, 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, పలమనేరు, మదనపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్టీ అభ్యర్థులు మాత్రం తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనే సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని సూచించారు. స్పెషల్ కేటగిరి కలిగిన అభ్యర్థులు (పీహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మొదలగు అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరిశీలన చేయించుకోవాలని తెలిపారు. సర్టిఫికెట్లు ఇవే కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు రిసీప్ట్, పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంకు కార్డు, పది, తత్సమాన విద్యార్హత మార్క్స్ మెమో, 4 నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువ పత్రం, ఓసీ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, టీసీ తీసుకురావాలని తెలిపారు. -
ఏపీ హంస జిల్లా అధ్యక్షుడిగా రాజా
తిరుపతి తుడా: ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా రాజా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఓ ప్రైవేట్ హోటల్లో ఏపీ హంస రాష్ట్ర కమిటీ సమక్షంలో శనివారం జిల్లా ఎన్నికలను నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు అరవ పాల్ నేతృత్వంలో నిర్వహించిన జిల్లా ఎన్నికల్లో శ్రీనివాస్రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అలానే హంస జిల్లా సెక్రటరీగా టాటాబాయ్, ఉపాధ్యక్షులుగా ఇమ్రాన్, గీత, రత్నాకర్ రావు, ఆర్గనైజింగ్ పబ్లిసిటీ సెక్రటరీగా భాస్కర్, జిల్లా మహిళా సెక్రటరీగా రోహిణి, జాయింట్ సెక్రటరీలుగా గోవర్దన్ బాబు, రాజేశ్వరమ్మ, డేవిడ్ పొన్నుస్వామి, వెంకటసుబ్బమ్మ, వంశీకృష్ణ, ట్రెజరర్గా రీటా ఎన్నికయ్యారు. ఏపీ హంస జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న రాజా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం తనపై నమ్మకంతో మరోమారు అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. మరింత ఉత్సాహంతో అసోసియేషన్ అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. క్లుప్తంగా -
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 83,866 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 44,479 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ4.15 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది -
వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
తిరుపతి క్రైమ్: తిరుపతిలో వైఎస్సార్సీపీ నాయకుడిపై శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అలిపిరి సీఐ రామారావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఎన్జీవో కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు వెంకటశివారెడ్డి ఇంటి ఎదురుగా గిరీష, శ్రీలక్ష్మి అనే వ్యక్తులు నివాసం ఉండేవారు. వీరు ప్రతి రోజు మద్యం, గంజాయి తాగి రచ్చరచ్చ చేస్తుండేవారు. వారి ప్రవర్తన వల్ల ఎదురు ఇంట్లో ఉంటున్న వెంటకశివారెడ్డి కుటుంబానికి నిద్ర ఉండేది కాదు.ఈ విషయంపై వెంకటశివారెడ్డి, గిరీషకు మధ్య తరచూ గొడవలు జరిగేవి. అదేవిధంగా గిరీష కొద్దికాలం కిందట హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి స్టలం ఇప్పిస్తానని రూ.20లక్షలు తీసుకుని మోసం చేశాడు. హైదరాబాద్కు చెందిన వ్యక్తి స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉన్న వెంకటశివారెడ్డిని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. దీంతో గిరీష కుటుంబ సభ్యులను వెంకటశివారెడ్డి పిలిపించి వారి డబ్బులు ఇవ్వాలని సూచించారు. దీంతో వెంకటశివారెడ్డి, గిరీష మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఆ గొడవలు జరిగిన అనంతరం గిరీష, శ్రీలక్ష్మి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వారు ఎన్నికలకు ముందు తిరిగి వచ్చారు.హైదరాబాద్కు చెందిన వ్యక్తికి ఇవ్వాల్సిన డబ్బులు గురించి ఎన్నికల తర్వాత మాట్లాడదామని గిరీష చెప్పాడు. ఈ నేపథ్యంలో వెంకటశివారెడ్డి శనివారం ఉదయం ఎన్జీవో కాలనీలోని తన నివాసం నుంచి వాకింగ్కు బయలుదేరి వెళ్లారు. మెయిన్ రోడ్డులో ఉన్న అరవింద స్కూల్ సమీపాన ఆటోస్టాండ్ వద్దకు వెళ్లగానే ఆయనపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన వెంకటశివారెడ్డిని స్థానికులు హుటాహుటిన ఆస్పపత్రికి తరలించారు.వెంకటశివారెడ్డిపై గిరీష కక్ష పెంచుకుని, ఆయన ఉదయం వాకింగ్కి వెళ్లే సమయంలో దాడి చేయాలని ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది. వెంకటశివారెడ్డి కుమారుడు బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ రామారావు వెల్లడించారు. -
Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు ౩౦- 40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వుంది.సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా.. జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని.. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు అన్ని నిండిపోయి.. ఏకంగా రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ కట్టి ఉన్నారు. భక్తులు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 24 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది. టీటీడీ రద్దీని గమనిస్తూ.. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. -
Tirumala: తిరుమలలో భారీ రద్దీ.. బారులు తీరిన భక్తులు
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 70,668 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 38,036 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.64 కోట్లు.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది -
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
తిరుపతి అర్బన్ : ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగికీ కౌంటింగ్పై అవగాహన తప్పనిసరని కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా సిబ్బందికి మొదటి ర్యాండమైజేషన్ పూర్తిచేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన కౌంటింగ్ సందర్భంగా సిబ్బంది ర్యాండమైజేషన్ సజావుగా చేపట్టామన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్లు 310 మందికి గాను 311 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 383 గాను 395 మంది, మైక్రో అబ్జర్వర్లు 346 గాను 347 మందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 1,039 మంది 208 కౌంటింగ్ టేబుళ్లకు అవసరమైన నేపథ్యంలో రిజర్వ్తో కలిపి 120 శాతంతో 1,053 మందిని కేటాయించామని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్ఓ పెంచలకిషోర్, నోడల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, ఎన్ఐసీ డీఐఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
గూడూరు రూరల్: మగ బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే ఓ బాలింత మృతిచెందింది. ఈ ఘటన శుక్రవారం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. గూడూరు రూరల్ పరిధిలోని చవటపాళెంకు చెందిన వేముల హరిక్రిష్ణ, తిరుపతిలోని మంగళం గ్రామానికి చెందిన శ్రావణికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర పాప ఉంది. శ్రావణి మళ్లీ గర్భం దాల్చడంతో ఉప్పొంగిపోయారు. కొడుకు పుడతాడని, కుమార్తెకు తోడుగా ఉంటాడని కలలుగన్నారు. ఆస్తిపాస్తులేమీ లేకపోయినా కూలిపనులు చేసుకుంటూ.. రెక్కలు ముక్కలు చేసుకుని ఆరోగ్యాన్ని చూపించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో భర్త హరిక్రిష్ణ బంధువులతో కలిసి శ్రావణిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఆపై కూలిపనులు ఉండడంతో వెళ్లిపోయాడు. మధ్యాహ్నం శ్రావణికి పురిటి నొప్పులు ఎక్కువగా రావడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి పురుడు పోశారు. పండంటి మగబిడ్డ జన్మించడంతో తల్లితోపాటు కుటుంబ సభ్యులు బంధువులకు ఫోన్లు చేసి సంతోషం పంచుకున్నారు. కానీ వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఏమైందో ఏమోగానీ శ్రావణి అపస్మారక స్థితికి చేరిందని, వెంటనే నెల్లూరుకు తీసుకెళ్లాలని డాక్టర్లు సెలవిచ్చారు. ఇంతలో అంబులెన్స్ మాట్లాడి నెల్లూరుకు తీసుకెళ్లగా శ్రావణి మృతి చెంది గంటకుపైగా అయ్యిందని అక్కడి డాక్టర్లు నిర్ధారించారు. శ్రావణికి రెండో కాన్పు కావడంతో సిజేరియన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని.. ఆమె ఆరోగ్యం విషమించినా డాక్టర్లు ఎందుకు చెప్పలేదని మృతురాలి కుటుంబ సభ్యులు డాక్టర్లు నిలదీశారు. కానీ వాళ్లెవరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో శ్రావణి మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలింత మృతిపై వివరణ కోరేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్తోపాటు ఇతర వైద్యులను ‘సాక్షి’ సంప్రదించగా వారు అందుబాటులో లేరు. -
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
రాయలసీమ జిల్లాలోని న్యాయమూర్తులను వివిధ అంశాలపై నిర్వహించిన శిక్షణ తరగతులు ముగిశాయి.సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ తిరుపతి క్రైమ్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ రవి మహోహరాచారి తెలిపారు. శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలింగ్ తర్వాత తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఇప్పటికే తగు చర్యలు తీసుకున్నామన్నారు. కేసులకు సంబంధించిన అన్ని పార్టీల వారిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఎక్కడా అమాయకులపై కేసులు పెట్టి ఇరికించలేదని, చట్ట ప్రకారమే అరెస్ట్లు జరిగాయని వివరించారు. కౌంటింగ్ రోజున సమస్యలు సృష్టించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిని ముందస్తుగానే గుర్తించి బైండోవర్ చేస్తామన్నారు. కౌంటింగ్ రోజున గెలిచిన వారితోపాటు ఓడిన వారికి కూడా ఎస్కార్ట్ ఇచ్చి నేరుగా ఇంటికి పంపనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే అనుమతి తీసుకుని సంబరాలు జరుపుకోవాలని సూచించారు. కౌంటింగ్ రోజు విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. భక్తులకు మాత్రమే రూమ్లు జూన్ 1 నుంచి 4వ తేదీ రాత్రి వరకు తిరుపతిలోని అన్ని లాడ్జిల్లో శ్రీవారి దర్శనానికి వచ్చిన వారికి మాత్రమే రూమ్లు కేటాయించాలన్నారు. రాజకీయ నాయకులు, ఇతర పనులపై వచ్చిన వారికి రూమ్లు కేటాయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో నిరంతరం లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో యూనివర్సిటీ సీఐ మురళీమోహన్ పాల్గొన్నారు. – 8లో -
వైభవం.. వసంతోత్సవం
చంద్రగిరి(తిరుచానూరు): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన వార్షిక వసంతోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. అందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. కార్యక్రమంలో జేఈఓ గౌతమి, డిప్యూటీ ఈఓ గోవింద రాజన్, అర్చకుడు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు గణేష్, సుభాష్ పాల్గొన్నారు. శోభాయమానంగా ముగిసిన సంబరాలు -
● ఘనంగా ముగిసిన పెనుశిల బ్రహ్మోత్సవాలు ● నృసింహునికి విశేష అభిషేకాలు ● శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించిన అర్చకులు ● తెప్పపై ఊరేగిన దేవదేవరులు
రాపూరు : పెంచలకోనలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఉదయం శ్రీవారి చక్రస్నాన ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లతోపాటు చక్రతాళ్వార్ను పల్లకిలో కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా శ్రీవారి నందన వనంలోని పుష్కరిణి వద్ద మండపంలోకి వేంచేపు చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, కుంకుమ, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం వేదపండితులు మంత్రోచ్ఛరణల నడుమ పుష్కరిణిలో చక్రతాళ్వార్కు స్నానం చేయించారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించి తన్మయత్వం చెందారు. మూడుసార్లు చక్ర స్నానం చేయించారు. వైభవంగా వసంతోత్సవం స్వామివారి అలంకార మండపంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేతంగా పెంచలస్వామివారిని కొలువుదీర్చారు. అనంతరం వేడుకగా వసంతోత్సవం నిర్వహించారు. దేవదేవేరులకు ప్రత్యేక పూజలు చేపట్టి విశేష అభిషేకాలు జరిపించారు. తెప్పోత్సాహం శోభాయమానంగా అలంకరించిన తెప్పపై పెనుశిల నృసింహస్వామి ఉభయనాంచారులతో కలసి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై దేవదేవేరులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి 10 గంటలకు స్వామివారిని అశ్వవాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. రాత్రి 11 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరిపించి బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేశారు. కార్యక్రమాల్లో కార్యక్రమంలో డీసీ విజయసాగర్బాబు, ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, ెఉప ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతా రామయ్యస్వామి, టీటీడీ పాంచరాత్ర ఆగమపండితులు రామానుజాచార్యులు పాల్గొన్నారు. నేడు గోనుపల్లెలో గ్రామోత్సవం స్వామి అమ్మవార్లకు శనివారం రాత్రి గోనుపల్లె గిరిజనకాలనీలో గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.శ్రీవారి సేవలకు హాజరైన భక్తులు, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీదేవి సమేతంగా కొలువైన పెంచలస్వామివారు -
వృద్ధుడి ఆత్మహత్య
దొరవారిసత్రం : మండలంలోని ఉచ్చూరు పంచాయతీ ఆర్మేనికండ్రిగ ఎస్సీకాలనీకి చెందిన మొద్దూరు రాఘవయ్య(74) అనే వృద్ధుడి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. రాఘవయ్య మద్యానికి బానిసగా మారి నిత్యం డబ్బుల కోసం కనిపించిన ప్రతి ఒక్కరినీ వేధించేవాడు. ఆ రోజు తాగేందుకు ఎవరూ డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగేశాడు. స్థానికులు గుర్తించి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రాత్రి మరణించాడు. రాఘవయ్య మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఎస్ఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో కార్డెన్ సెర్చ్ తిరుమల : తిరుమలలో పోలీసులు గురువారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. టూటౌన్ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో బాలాజీ నగర్లోని ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో... బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
తిరుపతి అర్బన్ : సాక్షి, మైత్రి మహిళా ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి జూన్ 25వ తేదీ వరకు మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఉంటుంది. ఈ మేరకు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రెడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యునికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్లు అందిస్తారు. ఆసక్తి గలవారు ఈ నెల 27వ తేదీలోపు బైరాగిపట్టెడలో ఆర్చి రోడ్డులోని అనంగా బ్యూటీ స్టూడియో ట్రైనింగ్ సెంటర్లో రూ.3 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 9553454335, 8555974855 నంబర్లలో సంప్రదించాలి. కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు తిరుపతి సిటీ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఆదేశించారు. శుక్రవారం పద్మావతి మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో పక్కాగా సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. భారీకేడింగ్, సీటింగ్, భద్రత తదితర అంశాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్, సీసీ టీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ను సందర్శించి రిజిస్టర్లో సంతకం చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ పెంచల కిషోర్, అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, రిటర్నింగ్ అధికారులు రవిశంకర్రెడ్డి, నరసింహులు, సర్వే అధికారి జయరాజ్ పాల్గొన్నారు. శిక్షణకు 14 మంది డుమ్మా తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్యంలో బాధ్యతతో కూడిన అంశమని కలెక్టర్ ప్రవీణ్కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు ఉద్యోగులు తమకు కేటాయించిన విధులను బాధ్యతగా చేపట్టాల్సి ఉందన్నారు. అయితే కొందరు ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అఫీసర్లు రెండో విడత శిక్షణకు డుమ్మా కొట్టారని చెప్పారు. అందులో 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అందులో ఐదుగురు ఉద్యోగులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో వారిని సస్పెండ్ చేసినటు్ల్ వెల్లడించారు. అలాగే పోలింగ్ విధులకు 272 మంది ఉద్యోగులు గైర్హాజరయ్యారని, వారికి సైతం షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. 5 రోజులలో వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వేడుకగా నమ్మాళ్వార్ శాత్తుమొర తిరుపతి కల్చరల్ : కపిలతీర్థం సమీపంలోని ఆళ్వార్ తీర్థంలో కొలువైన నమ్మాళ్వార్ సన్నిధిలో శుక్రవారం వైభవంగా శాత్తుమొర నిర్వహించారు. ఈ పురాతన ఆలయంలో రామానుజాచార్యులు తొలిసారి తిరుపతికి వచ్చినప్పుడు ఒక ఏడాది పాటు ఇక్కడే ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయయంలో ఆచార్యులవారు అలిపిరి పాదాల మండపం వద్ద రామాయణ కాలక్షేపం, అధ్యయనం చేసేవారని పేర్కొనబడి ఉంది. అప్పుడే ఈ ఆలయంలో నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, రామానుజులు, తిరువరంగత్తు ఆముదనార్ విగ్రహాలను ప్రతిష్టించినట్లు ప్రతీతి. నమ్మాళ్వార్ శాత్తుమొర కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
దొరవారిసత్రం : మండలంలోని వెదురుపట్టు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. ఏకొల్లు గ్రామానికి చెందిన పునబాక నవీన్(23) తడ మండలం మాంబట్టులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి కోటపోలూరులో పార్టీ చేసుకుని బైక్పై తిరిగి వస్తుండగా అదుపుతప్పి కింద పడిపోయాడు. అదే సమయంలో వెనుక వస్తున్న గుర్తుతెలియని వాహనం నవీన్పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. మరో బైక్పై వస్తున్న స్నేహితులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాదిలోపే ఇద్దరు.. మృతుడి నవీన్ తల్లిదండ్రులు కృష్ణయ్య, సుబ్బరత్నమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరి పెద్దకుమారుడు ప్రవీణ్ కొద్ది నెలల క్రితం కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతలో రెండో కుమారుడిని సైతం రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ఏడాదిలోపే ఇద్దరు బిడ్డలు దూరమయ్యారని రోదిస్తున్నారు. -
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
తిరుపతి అర్బన్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల ఫలితాలపై అందరికీ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఓట్ల లెక్కింపునకు మరో పదిరోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రజానీకం సైతం జూన్ 4వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. హోరాహోరీగా తలపడిన అభ్యర్థులు తమ విజయావకాశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఓట్ల శాతంపై లెక్కలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు సైతం కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు.. అభిమానులు సహకరించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. మీడియా ద్వారా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఆధిక్యంపై లెక్కలు సార్వత్రిక ఎన్నికల్లో 85 ఏళ్లు దాటి ఇంటికే పరిమితమైనన 583 మంది ఓటర్లు హోమ్ ఓటింగ్ను సద్వినియోగం చేసుకున్నారు. అలాగే ఇంటికే పరిమితమైన దివ్యాంగులు 485 మంది సైతం హోమ్ ఓటింగ్ను వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 20,153 మంది సద్వినియోగం చేసుకున్నారు. మరోవైపు ఈవీఎంల ద్వారా అసెంబ్లీకి 14,25,477 మంది ఓటర్లు, పార్లమెంట్కు 13,68,324 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వాడుకున్నారు. వీరిలో ఎవరికి ఎక్కువ మంది ఓటేశారు. ఏపార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి. ఏ నియోజకవర్గలో ఎవరికి ఎంత ఆధిక్యం వచ్చే అవకాశముందని జనం చర్చించుకుంటున్నారు. అందరి చూపు పోస్టల్ బ్యాలెట్ పైనే.. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులతోపాటు అత్యవస సేవలను అందించే వివిధ విభాగాల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో 20,153 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో 20శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వివిధ కారణాలతో చెల్లుబాటు కాలేదు. ఈ సారి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి గెజిటెడ్ అధికారి సంతకం ఉంటేనే బ్యాలెట్ ఓటు చెల్లుతుంది. ఈ క్రమంలో పలువురు గెజిటెడ్ అధికారి సంతకం లేకుండా వేశారనే చర్చ సాగుతోంది. ఈ అంశంపైనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తరుణంలో అన్ని కోణాల నుంచి లెక్కలు వేస్తున్నారు. మొత్తంగా కౌంటింగ్కు రోజులు దగ్గర పడుతున్న కొద్ది ఫలితాలపై చర్చ జోరుగా సాగుతోంది.కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రవీణ్కుమార్, ఎస్పీ హర్షవర్ధన్రాజు (ఫైల్) -
27న ఐటీఐలో క్యాంపస్ రిక్రూట్మెంట్
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 27వ తేదీన క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వి.శ్రీలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా సంస్థ ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చేపడతారని వెల్లడించారు. ఐటీఐ (కోపా) పాసైన వారు, ఇంటర్ పాస్/ఫెయిలైన వారు రిక్రూట్మెంట్కు హాజరయ్యేందుకు రావచ్చన్నారు. ఆసక్తి గల వారు బయోడేటా, ఎస్ఎస్సీ, ఐటీఐ ప్రొవిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాలకు 96764 86678, 85000 21856 నంబర్లలలో ట్రైనింగ్ ఆఫీసర్ విక్రమ్ను సంప్రదించాలని కోరారు. -
మధ్యవర్తిత్వానికి సహకరించాలి
తిరుపతి లీగల్ : మధ్యవర్తిత్వానికి న్యాయవాదుల సహకారం అందించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎస్పీడీ వెన్నెల, సీనియర్ ట్రైనీ సుదర్శన్ సుందర్ కోరారు. శుక్రవారం తిరుపతి న్యాయవాదుల అసోసియేషన హాల్లో మధ్యవర్తిత్వం అనే అంశంపై న్యాయవాదులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి న్యాయ సేవాసంస్థ పలువురు న్యాయవాదులను మధ్యవర్తులుగా నియమిస్తోందన్నారు. మధ్యవర్తిత్వంతో కలిగే లాభాలను వివరించారు. కార్యక్రమంలో తిరుపతి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు టి.గోపిచంద్, ప్రధాన కార్యదర్శి మార్టిన్ పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 63.36 శాతం
- నేడు ‘హజ్ యాత్ర’ ప్రారంభం
- భారత్పే, ఫోన్పే మధ్య వివాదం పరిష్కారం
- IPL 2024: కోల్కతాకే కిరీటం
- గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
Advertisement