-
ఉన్నత స్థాయికి ఎదగాలి
గద్వాల అర్బన్: జీవితంలో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా న్యాయ అధికార సేవ సంస్ధ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి గంట కవితదేవి అన్నారు. బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని బాలసదనంలో హోమ్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాలికల విద్యకు చిన్నపాటి తోడ్పాటు అందిస్తే చాలు ఉన్నతస్థాయిలో రాణిస్తారనేందుకు నిదర్శనమే బాలనందనమన్నారు. బాలసదనంలో, ఇతర సంరక్షణ గృహంలో నివాసం ఉంటున్న పిల్లలు దేనిలో తక్కువ కాదని, తల్లిదండ్రులు, సంరక్షకులు లేరని చింత వద్దన్నారు. ప్రభుత్వం అన్నీ తానే చూసుకుంటుందన్నారు. అదేవిధంగా ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో బాలసదనంలోని చిన్నారులు అనూష (జీపీఏ 8.8), అక్షయ (జీపీఏ 8.7), సునీత (జీపీఏ 6.8) పాయింట్లు సాధించారు. వీరిని జడ్జీ ప్రత్యేకంగా ఆభినందించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డీడబ్ల్యూఓ సుధారాణి, బాలల సంక్షేమ సమితి మెంబర్స్ జయభారతి, శైలజ, డీసీపీఓ నర్సింహ్మ, బాలసదనం సూపరింటెండెంట్ సుధారాణి, సిబ్బంది పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళిక
రాజోళి: గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని వాటర్గ్రిడ్ ఎస్ఈ జగన్మోహన్ అన్నారు. మండలంలోని ఆరెంజ్ జోన్లో ఉన్న తుమ్మిళ్ల, పెద్ద తాండ్రపాడు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. తుమ్మిళ్లలో నది నుంచి గ్రామానికి నీరు సరఫరా చేస్తున్న మోటార్లు, నీటి లభ్యత గురుంచి అధికారులను అడిగారు. అనంతరం పెద్ద తాండ్రపాడులో పర్యటించిన ఆయన గ్రామంలో నీటి ట్యాంకులు ఎన్ని ఉన్నాయి వాటి సామర్థ్యం ఎంత అనే విషయాలను అడిగారు. నీటి ఎద్దడి రాకుండా తీసుకుంటున్న చర్యలేంటని అడిగారు. గ్రామంలో ఉన్న బోర్ల ద్వారా గ్రామంలో ఎద్దడి రాకుండా ఎలాంటి ప్రణాళిక అవలంభించాలనే అంశాలను అధికారులకు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు నీటి కష్టాలు రాకుండా ఎప్పటికప్పుడు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ తేజవర్ధన్, ఎంపీఓ ఖాజా మెయినుద్దీన్ తదిదరులు పాల్గొన్నారు. -
ఆయిల్పాం రైతులు జాగ్రత్తలు పాటించాలి
ఎర్రవల్లిచౌరస్తా: ఆయిల్ఫామ్ తోటలు సాగు చేస్తున్న రైతులు వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని అలంపూర్ డివిజన్ హార్టికల్చర్ అధికారి రాజశేఖర్ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండలంలోని కొండపేట గ్రామంలో రైతు సందీప్ ఆచారి సాగు చేసిన ఆయిల్ఫామ్ తోటను సందర్శించారు. సాగులో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై రైతులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా వేసిన ఆయిల్ఫామ్ తోటలతో పాటు ఎదిగిన మొక్కలను కాపాడుకుంటూ మంచి దిగుబడి సాధించేందుకు రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. మూడు సంవత్సరాలలోపు మొక్కలకు చుట్టూ మూడు అడుగుల దూరంలో జనుమును పచ్చిరొట్ట ఎరువుగా వేసుకోవాలన్నారు. పూత దశకు రాగానే చిన్న చిన్న ముక్కలుగా కోసి పాదులో వేయాలన్నారు. వేసవిలో చిన్న మొక్కకు 150–165 లీటర్లు, ఎదిగిన మొక్కలకు 250–330 లీటర్ల నీటిని ప్రతి రోజు అందించాలన్నారు. అంతర పంటలు సాగుచేస్తే సిఫారస్సు మేరకు నీటిని తప్పనిసరిగా అందించాలన్నారు. సిఫారసు పద్ధతిలో మాత్రమే పోషకాలను అందించాలన్నారు. గెలలు కోసిన తర్వాత నరికి ముక్కలు చేసిన ఆయిల్ఫామ్ ఆకులను, మగపూత గుత్తులను పాదుల్లో మల్చింగ్ వేయాలన్నారు. పక్వానికి వచ్చిన గెలలను కోయడానికి అల్యూమీనియం కడ్డీని లేదా కత్తిని ఉపయోగించి మాత్రమే కత్తిరించాలన్నారు. రైతులకు ఏమైనా సందేహాలుంటే స్థానిక అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ అధికారి వెంకటేష్, వివిధ గ్రామాల రైతులు ఉన్నారు. డివిజన్ హార్టికల్చర్ అధికారి రాజశేఖర్ -
శత్రువంచన చేరి దెబ్బతీయాలని చూస్తున్నారు..
పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దు.. ఈ ప్రభుత్వాన్ని పడగొడ్తామని అంటున్నారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ముఖ్యమంత్రిగా నాకు వచ్చింది. కానీ ఇక్కడి వారే శత్రువంచన చేరి మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీకే అరుణ ఏమంటాంది.. రేవంత్రెడ్డి నా మీద పగబట్టిండు. రేవంత్ నన్ను ఒడగొట్టాలని చూస్తున్నాడు. నేను మాత్రం కాంగ్రెస్ను ఓడగొట్టే వరకు ఊరుకోను. కాంగ్రెస్ను ఖతం చేస్తా అని అంటది. కాంగ్రెస్ నీకు ఏం అన్యాయం చేసింది? పాన్గల్ నుంచి జెడ్పీటీసీగా, గద్వాల ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు కాంగ్రెస్ను ఓడగొట్టాల్నా? దేశంలో, రాష్ట్రంలో నిన్ను గుర్తు పడుతోంది కాంగ్రెస్తోనే కదా. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు.. మోదీ చుట్టంలాగా వస్తడు, పోతడు. పదేండ్లు ప్రధానమంత్రిగా ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు.. మాదిగల వర్గీకరణ చేయలేదు.. ముదిరాజ్లను ఆదుకోలేదు.. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చలేదు? అరుణమ్మ గద్వాలను కదా.. బోయల గురించి ఆమెకు తెలుసుకదా ? వీళ్ల గురించి ఆమె ఎప్పుడైనా మాట్లాడిందా? తుమ్మిళ్ల, ఆర్డీఎస్ పూర్తి చేయాలని చూసిందా? జూరాల నీళ్లు రాకపోతే మాట్లాడిందా? భీమా నెట్టెంపాడు, కోయిల్సాగర్, రామన్పాడు మరమ్మతుల ఆలోచన చేసిందా? కానీ ఆమె మాత్రం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షరాలు పదవి తెచ్చుకుంది. ఆమెకు కర్ణాటకలో వ్యాపారాలకు ఇబ్బంది లేదు. ఏ రోజైనా ఈ జిల్లాకు సంబంధించి హైదరాబాద్–బెంగళూరు హైవేపై పరిశ్రమల కోసం మోదీతో మాట్లాడిందా? ఏ ప్రయత్నం చేయలేదు.. పరిశ్రమలు వస్తే వేలాది మందికి ఉద్యోగాలొచ్చేవి. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు.. ఆలోచన చేయండి. సభలో నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, ఢిల్లీలో అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, మహబూబ్నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డి, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
4వేల బస్తాల జొన్నల కొనుగోలు
రాజోళి: రాజోళి, పచ్చర్ల, వడ్డేపల్లి మండలంలోని కొంకలలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాల వద్ద శనివారం కొనుగోళ్లు జరిగినట్లు పీఏసీఎస్ సిబ్బంది తెలిపారు. మూడు కేంద్రాల వద్ద శనివారం 40 మంది రైతుల నుండి 4వేల బస్తాల జొన్నలను కొనుగోలు చేసి ధాన్యాన్ని గోదాంకు తరలించారు. వేరుశనగ క్వింటా రూ.6,667 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శనివారం 378 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6,667, కనిష్టం రూ.4,019, సరాసరి రూ.5,269 ధరలు పలికాయి. అలాగే, 19 క్వింటాళ్ల ఆముదం రాగా గరిష్టం రూ.5402, కనిష్టం రూ.5211, సరాసరి రూ.5368 ధరలు వచ్చాయి. 1474 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2401, కనిష్టం రూ.1707, సరాసరి ధర రూ.2111 ధరలు వచ్చాయి. 26 క్వింటాళ్ల వరి (హంస) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి ధర రూ. 1746 పలికింది. 3 క్వింటాళ్ళ కంది రాగా, గరిష్టం రూ. 9666, కనిష్టం రూ. 8319, సరాసరి రూ.9666 ధరలు వచ్చాయి. ఆదిశిలా క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో పోటేత్తింది. వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించడంతోపాటు, దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, చంద్రశేఖర్రావు, నాగరాజుశర్మ తదితరులు పాల్గొన్నారు. జోగుళాంబ సన్నిధిలో కేంద్రమంత్రి జోగుళాంబ శక్తిపీఠం: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి లోగనాథన్ మురగన్ దర్శించుకున్నారు. వారికి ఆలయ పాలకమండలి చైర్మన్ చిన్నకృష్ణయ్య ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ, ప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ చిన్నకృష్ణయ్య ఆలయాలను కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి చేయాలని అలాగే కేంద్ర పురాతత్వ శాఖ తరపున పలు అభివృద్ది పనులకు అనుమతులు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. వీరితోపాటుగా బిజేపీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి జలగిరి అశోక్, ఉపాధ్యక్షుడు మధసూదన్ గౌడు, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. సోనామసూరి ధర రూ.2,442 దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన టెండర్లలో సోనామసూరి ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,442, కనిష్టంగా రూ.1,900 ధరలు లభించాయి. హంస ధాన్యం సరాసరిగా రూ.1,909 ఒకే ధర పలికింది. మార్కెట్కు దాదాపు 2 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. అడవిని నరికితే సహించం కొల్లాపూర్ రూరల్: అడవిని నరికితే సహించమని డీఎఫ్ఓ రోహిత్ గోపిడి అన్నారు. శనివారం మండలంలోని నల్లమల అడవిలో ఉన్న పవర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏరియాలో నరికిన చెట్లను ఫారెస్ట్ రేంజర్ శరత్చంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ అడవిని నరికిన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రేంజర్ను ఆదేశించారు. అక్కడ కొత్తగా మొక్కలు నాటించి, పెంచాలని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement