-
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు మెరుగుపరుస్తున్నట్లు ఈఓ భాస్కర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాదం కొనుగోలులో భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను గ్రహించి శివాలయం ఎదుట ప్రత్యేకంగా టికె ట్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. శని, ఆది వారాలు, సెలవు రోజుల్లో కొండపైన బస్టాండ్లో తాత్కాలిక అదనపు ప్రసాదం కౌంటర్లు ఏర్పా టు చేశామని చెప్పారు. హెల్ప్డెస్క్, వేసవి దృష్ట్యా చలి వేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిత్య కై ంకర్యాలు, స్వామివారి సంకీర్తనలు భక్తులకు వినిపించేలా ప్రత్యేక దివ్యవాణి ఏర్పాటు చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో మైకులు, స్పీకర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే క్యూకాంప్లెక్స్లో వాల్మోటింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులను ఆహ్లాదం పంచేందుకు ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు సంగీత, నృత్య సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 8లక్షల మందికి ఉచిత రవాణా సౌకర్యం ఒక్క ఏప్రిల్లోనే 369 బస్సులను కొండపైకి, కొండ కిందకు 9,825 ట్రిప్పులు నడిపించామని తెలిపా రు. 8లక్షల మంది భక్తులు ఉచితంగా రవాణా సౌకర్యం పొందారని, ఇందులో 70 శాతం మహిళలు, 30శాతం పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదాయం రూ.15,64,05,949 ఏప్రిల్ నెలలో దేవస్థానానికి వివిధ విభాగాల ద్వారా మొత్తం రూ.15,64,05,949 ఆదాయం సమకూరినట్లు ఈఓ భాస్కర్రావు తెలిపారు. ఇందులో బ్రేక్ దర్శనాల ద్వారా రూ.69,10,200, వీఐపీ దర్శనం రూ.96,50,650, ఆర్జిత సేవలు రూ.1,34,56,805, వ్రతాలు రూ.43,37,300, ప్రసాద విక్రయం రూ.3,05,08,630, హుండీలు రూ.2,33,53,382, విచారణ శాఖ రూ.24,37, 718, ఇతర పూజల ద్వారా రూ.5,58,51,264 వచ్చినట్లు వెల్లడించారు. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు
భానుపురి (సూర్యాపేట): మరో తొమ్మిది రోజుల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వంద శాతం పోలింగ్ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఇంటింటికీ పోల్ చిట్టీల పంపిణీని ప్రారంభించారు. జిల్లాలోని బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లకు పోల్ చిట్టీలను అందజేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 90.02 శాతం చిట్టీల పంపిణీ పూర్తయింది. ఈనెల 8వ తేదీ వరకు పోల్చిట్టీ ఇచ్చేందుకు అవకాశముంది. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో 76.35 శాతం చిట్టీలను అందించగా.. మిగతా చోట్ల 90 శాతానికి పైగానే పంపిణీ చేశారు. ఓటర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఓటు హక్కును వినియోగించుకునే వారికి పోల్చిట్టీలు ఉపయోగకరంగా ఉంటాయి. గతంలో పోలింగ్కు ముందురోజు రాజకీయ పార్టీల నాయకులు తమ గుర్తులతో కరపత్రాలను పంపిణీ చేయగా.. ఈ పత్రాలు ఓటర్లకు సరిగా అందకపోవడంతో ఓటు ఎక్కడ ఉన్నది.. పోలింగ్ కేంద్రం ఎక్కడ.. అసలు ఓటు ఉందా.. లేదా అనే విషయంలో స్పష్టత లేకపోయేది. దీంతో ఓటర్లు చాలా ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం పోల్చిట్టీల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో ఓటర్ల సమాచారంతో పాటు సంబంధిత బీఎల్ఓ పేరు, ఫోన్ నంబర్, పోలింగ్ కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలు, పోలింగ్ రోజున పాటించాల్సిన నిబంధనలు ఇందులో పొందుపర్చారు. జిల్లాలో పది లక్షలకు పైగా ఓటర్లు..! ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 9.85 లక్షల మంది ఓటర్లుగా నమోదు కాగా ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు 10.02 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. నూతనంగా 14,050 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరందరికీ ఈ పోల్చిట్టీలను పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఈనెల 8వ తేదీని గడువుగా నిర్దేశించింది. ఇప్పటికే జిల్లాలో 90.02 శాతం పోల్ చిట్టీలు పంచారు. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో 95.39 శాతం మంది ఓటర్లకు, కోదాడ పరిధిలో 92.65శాతం మంది ఓట ర్లకు, సూర్యాపేటలో 76.35 శాతం, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో 95.97 శాతం మంది ఓటర్లకు చిట్టీలు చేరాయి. మరో 97,787 మంది ఓటర్లకు అందాల్సి ఉంది.ఫ ఇప్పటికే 90.02 శాతం ఓటర్లకు చేరిన చిట్టీలు ఫ 8వ తేదీ వరకు పంపిణీకి గడువు -
పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట: లోక్సభ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా పోస్టల్ బ్యాలెట్తో ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకటరావు సూచించారు. శనివారం సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు, ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన పెసిలిటేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చన్నారు. ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని సిబ్బంది చివరి అవకాశంగా ఈనెల 7న ఉదయం 10 గంటలకు ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణకు హాజరు కాకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్లు శ్యామ్ సుందర్రెడ్డి, కృష్ణయ్య, మహీందర్రెడ్డి ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. సోషల్ మీడియాపై నిఘా పెంచాలి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై నిఘా పెంచి క్షుణంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకటరావు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసం ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు. చెక్ పోస్టుల వద్ద, బ్యాంకు లావాదేవీలపైనా నిఘా పెంచాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు నగదు రూ.277.38 లక్షలు, రూ.149.16 లక్షల విలువైన 37,369.21 లీటర్ల మద్యం, రూ.24.56లక్షల విలువైన 46 వాహనాలు, రూ.121.43 లక్షలు విలువైన బంగారం, ఇతర ఆభరణాలు, రూ.93.51 లక్షలు విలువైన వస్తువులతో మొత్తం 6.66.04కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ఫ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు ఇంటి వద్ద ఓటేసిన 644 మంది జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఈ నెల 3, 4 తేదీల్లో నిర్వహించిన హోం ఓటింగ్లో 644 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకటరావు తెలిపారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 508 మంది, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 136 మందితో కలిపి మొత్తం 644 మంది హోం ఓటింగ్ విధానంలో ఓట్లు వేశారని పేర్కొన్నారు. -
ఓటర్లు ఇబ్బంది పడొద్దు
నాగారం: లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బంది పడకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డీపీఓ సురేష్కుమార్ సూచించారు. శనివారం నాగారం మండల కేంద్రంతో పాటు నాగారంబంగ్లా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కెమెరాల ఏర్పాటును పరిశీలించి మాట్లాడారు. అనంతరం నాగారంబంగ్లా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ ధార శ్రీనివాస్, కార్యదర్శులు శోభన్బాబు, చంద్రశేఖర్, జీపీ సిబ్బంది ఉన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణం మఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం జరిపారు. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా ముస్తాబుచేసి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. కల్యాణతంతు నిర్వహించి శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రవేశం గావించి నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రే ఆలయానికి చేరుకున్న భక్తులు రాత్రి బసచేసి తెల్లవారుజాముననే శ్రీస్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు క్రిష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. నిబద్ధతతో పనిచేస్తేనే గుర్తింపు : డీఎంహెచ్ఓ సూర్యాపేట: ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తేనే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. వైద్యారోగ్య శాఖలో ప్రోగ్రాం అధికారిగా సేవలందించి పదవీ విరమణ పొందిన డాక్టర్ వాసిరెడ్డి సాహితీ దంపతులను శనివారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ జయ, అంజయ్య, లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి సూర్యాపేట: జూన్ 2, 3 తేదీల్లో సూర్యాపేటలో జరగనున్న ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి చండ్ర అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.శిరోమణి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు వివక్ష, అణచివేత, దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను చైతన్యం చేసేందుకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిక్షణ తరగతుల నిర్వహణకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట కోశాధికారి ఝాన్సీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారసాని చంద్రకళ, కొత్తపల్లి రేణుక, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, ఐతరాజు పద్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇండియా కూటమితోనే దేశరక్షణ
నేరేడుచర్ల, పాలకవీడు: ఇండియా కూటమితోనే దేశ రక్షణ సాధ్యమని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం రాత్రి నేరేడుచర్లలో నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డితో కలిసి రోడ్డు షో, సభ నిర్వహించారు. అంతకుముందు పాలకవీడు మండలం జాన్పహాడ్ గ్రామంలో ఎన్నికల ప్రచార సభకు మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి వస్తున్న ప్రజాదరణ చూసి బీజేపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి రఘువీర్రెడ్డిని దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలపించాలని కోరారు. ఈ ఎన్నికలతో దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్లకు డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోని వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు నెరవేర్చిందని, త్వరలో రైతు రుణమాఫీ చేయబోతున్నామన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ రఘువీర్రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 13న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నేరేడుచర్లలో మున్సిపల్ కౌన్సిలర్ వేమురి నాగవేణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వి.రమేష్బాబు, మాజీ సర్పంచ్ గంటా మల్లారెడ్డి, మత్స్య సొసైటీ చైర్మన్ యామిని వీరయ్యలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేరేడుచర్లలో జరిగిన రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ, నల్లగొండ డీడీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్నాయక్, పార్టీ నేరేడుచర్ల మండల అధ్యక్షుడు కొణతం చిన వెంకట్రెడ్డి, నేరేడుచర్ల జెడ్పీటీసీ రాపోలు రాపోలు నర్సయ్య, మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాశ్, వైస్ చైర్మన్ అలక సరిత, కౌన్సిలర్లు లలిత, నాగవేణి, సులోచన, బాషా, నాయకులు జ్యోతిబాబు, గోపాల్, నాగిరెడ్డి, శకుంతల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జానపహాడ్లో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివారెడ్డి, పార్టీ పాలకవీడు మండల అధ్యక్షుడు ఏవీ.సుబ్బారావు, ఎంపీపీ భూక్యా గోపాల్, జెడ్పీటీసీ మాలోతు మోతీలాల్, నాయకులు బైరెడ్డి జితేందర్రెడ్డి, బెల్లంకొండ నరసింహారావు, సందీప్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ నేరేడుచర్ల, జాన్పహాడ్లో ఎన్నికల ప్రచారం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement