-
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
టేకుమట్ల: ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటు హక్కు వజ్రాయుధమని, ప్రతీ ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వర్ ధీరజ్సింగ్ అన్నారు. ఓటు హక్కుపై తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కును ప్రలోభాలకు లొంగి అమ్ముకోరాదన్నారు. ఓటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి ఉంటుందన్నారు. ప్రజలకు ప్రజా పాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు చక్కటి అవకాశమని చెప్పారు. అనంతరం గర్మిళ్లపల్లిలో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీ వాహనాన్ని నిశితంగా పరిశీలించి, మద్యం, నగదు రవాణా చేస్తే సీజ్ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అసిస్టెంట్ ఎన్నికల అబ్జర్వర్ శ్రీనివాస్రావు, లైజనింగ్ అధికారి నయిం, నోడల్ అధికారి శైలజ, ఆర్ఐ సంతోష్, రెవెన్యూ సిబ్బంది తిరుపతి ఉన్నారు.పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వర్ ధీరజ్సింగ్ -
ఉచిత ఆన్లైన్ దరఖాస్తు
కాటారం: రైల్వే పోలీస్(ఆర్పీఎఫ్) కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఆసక్తి గల అభ్యర్థులకు కాటారం సబ్ డివిజన్ పోలీస్ శాఖ ద్వారా ఉచితంగా ఆన్లైన్ దరఖాస్తు చేయనున్నట్లు కాటారం డిఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి తెలిపారు. ఎస్పీ కిరణ్ఖరే ఆదేశాల మేరకు నోటిఫికేషన్కు సంబంధించి నిరుద్యోగ యువతీ యువకులకు పోలీస్ శాఖ ద్వారా ఉచితంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ పూర్తిచేసి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆర్పీఎఫ్లో 4,208 కానిస్టేబుల్ పోస్టులు, 452 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ జారీ అయినట్లు తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు నిండి పదో తరగతి లేదా డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు అర్హులని చెప్పారు. ఆసక్తి గలవారు విద్యార్హత, కులం సర్టిఫికెట్, తెలుపు బ్యాక్ గ్రౌండ్లో ఉన్న పాస్పోర్టు సైజ్ ఫొటో, ఆధార్కార్డు, ఈ మెయిల్ అడ్రస్, మొ బైల్ నంబర్తో డీఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకుంటే పోలీస్శాఖ ద్వారా ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ నెల 14 వరకు అప్లికేషన్ చివరి గడువు ఉందని చెప్పారు. ఆసక్తి గల నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పోలింగ్ సమయం గంట పెంపు
● వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య కాళోజీ సెంటర్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పార్లమెంట్ నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలో ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుందన్నారు. -
మోదీ పాలనలోనే దేశం సుభిక్షం
భూపాలపల్లి రూరల్/టేకుమట్ల/మొగుళ్లపల్లి: మోదీ పాలనలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని.. మూడోసారి మోదీనే ప్రధాని కావాలంటే ప్రజలు నిండుమనసుతో తనను ఆశీర్వదించాలని బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేశ్ కోరారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడు సామల మధుసూదన్రెడ్డి అధ్యక్షతన ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డితో కలిసి రమేశ్ పాల్గొని మాట్లాడారు. అంతకుముందు మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల్లో కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. గెలిపిస్తే భూపాలపల్లికి రైల్వేలైన్ ఏర్పాటు చేయిస్తానని హామీఇచ్చారు. మరోసారి కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోవడం ఖాయమన్నారు. మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయడానికి ప్రతీ కార్యకర్త పట్టుదలతో కృషి చేయాలని కోరారు. రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో లేకున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం వరంగల్పై ప్రేమతో మోదీ ములుగులో గిరిజన యూనివర్శిటీ, భూపాలపల్లి డిగ్రీ కళాశాల ఏర్పాటు, జాతీయ రహదారులు, గ్రామాల్లో సీసీరోడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్రెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అంబాల చంద్రమౌళి, బీజేపీ నాయకులు వెన్నంపల్లి పాపయ్య, కన్నం యుగేందర్, బట్టు రవి, దొంగల రాజేందర్, మందల రఘునాథరెడ్డి, మారెల్ల సేనాపతి, రాంరెడ్డి, సర్కిల్ సుధాకర్, రాంరెడ్డి, కంబాల రాజయ్య, ఊనగొండ రామకృష్ణ, ఆయా మండలాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ -
గ్రామాల్లో హోం ఓటింగ్
రేగొండ(కొత్తపల్లిగోరి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 85 ఏళ్ల పైబడిన ఓటర్లు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో కొత్తపల్లిగోరి మండలంలో దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందిన ఆరుగురి ఇంటి వద్దకు చేరుకుని ఆదివారం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. మండలంలోని చెన్నాపూర్, కొత్తపల్లిగోరి, చిన్నకోడేపాక, రాజక్కపల్లి, నిజాంపల్లి గ్రామాలలో ఐదుగురు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, మండల రూట్ ఆఫీసర్ ఆర్ఐ నరేష్, పంచాయతీ కార్యదర్శి రాంబాబు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement