ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం

Published Mon, May 6 2024 7:50 AM

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం

టేకుమట్ల: ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటు హక్కు వజ్రాయుధమని, ప్రతీ ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికల అబ్జర్వర్‌ ధీరజ్‌సింగ్‌ అన్నారు. ఓటు హక్కుపై తహశీల్దార్‌ కార్యాలయంలో ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కును ప్రలోభాలకు లొంగి అమ్ముకోరాదన్నారు. ఓటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి ఉంటుందన్నారు. ప్రజలకు ప్రజా పాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు చక్కటి అవకాశమని చెప్పారు. అనంతరం గర్మిళ్లపల్లిలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీ వాహనాన్ని నిశితంగా పరిశీలించి, మద్యం, నగదు రవాణా చేస్తే సీజ్‌ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అసిస్టెంట్‌ ఎన్నికల అబ్జర్వర్‌ శ్రీనివాస్‌రావు, లైజనింగ్‌ అధికారి నయిం, నోడల్‌ అధికారి శైలజ, ఆర్‌ఐ సంతోష్‌, రెవెన్యూ సిబ్బంది తిరుపతి ఉన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల అబ్జర్వర్‌ ధీరజ్‌సింగ్‌

Advertisement
Advertisement