-
పేదల పక్షాన నిలిచింది జగనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో పేదల పక్షాన నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి నిలిచారు. ప్రస్తుతం ఆయన తనయుడు జగనన్న ఉన్నారు. పేదలందరి పక్షాన.. జగన్ ఒక్కరే పోరాటం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు పెద్దపీట వేసి సామాజిక సమన్యాయం తీసుకొచ్చారు. జనం మెచ్చిన నేత జగనన్న. మరోసారి జగన్ను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పెద్దకొడుకులా.. అండగా నిలిచారు. వైఎస్ జగన్ కోసం ప్రతి ఒక్కరూ.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కాలని కోరుతున్నా. – జె.శాంత, వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బాలయ్యను సాగనంపుదాం హిందూపురం నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చే బాలకృష్ణను సాగనంపుదాం. స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యల్లో ప్రతి ఒక్కరికీ తోడుంటా. నన్ను ఆశీర్వదించండి. జగనన్న గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలతో ప్రజల్లోకి వెళ్లి.. మరోసారి వైఎస్సార్ సీపీని గెలిపించుకుందాం. వైఎస్ జగన్ సీఎంగా ఉంటే సంక్షేమ పథకాలన్నీ ముంగిటకే వస్తాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమన్యాయం చేసింది జగన్ ఒక్కరేనని గర్వంగా చెప్పుకోవచ్చు. మహిళా సాధికారతకు జగన్ పెద్దపీట వేశారు. మహిళల అభివృద్ధికి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీ మహిళలకు సీట్లు ఇచ్చారు. టీడీపీకి బీజేపీ, జనసేన తోడుగా వస్తున్నాయి. కానీ జగన్ సింహంలా సింగిల్ గానే బరిలో దిగుతున్నారు. – టీఎన్ దీపిక, వైఎస్సార్సీపీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి -
సీఎం సభ విజయవంతం
హిందూపురం: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం హిందూపురంలో నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభ విజయవంతమైందని, ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నవీన్నిశ్చల్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. నీటి టబ్బులో పడి చిన్నారి మృతి చెన్నేకొత్తపల్లి: టబ్బులో ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు... చెన్నేకొత్తపల్లి మండలం యర్రజినన్నగారిపల్లి (కొండకింద పల్లి) గ్రామానికి చెందిన బొగ్గు మురళి, అరుణ దంపతులకు ఓ కుమార్తెతో పాటు 14 నెలల వయసున్న కుమారుడు ఉన్నారు. శనివారం వేసవి తాపం అధికంగా ఉండడంతో సాయంత్రం టబ్లో నీరు పోసి అందులో కుమారుడిని కూర్చొబెట్టి తల్లి ఆడించింది. ఈ క్రమంలోనే పనిపై చిన్నారిని టబ్లోనే వదిలేసి ఇంట్లోకి వెళ్లిన ఆమె బయటకు వచ్చి చూసే లోపు నీట మునిగి బాలుడు మృతి చెందాడు. -
జగనన్న వెంట నడుస్తాం
హిందూపురం: రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలో తాము నడిచేందుకు సిద్ధమయ్యామని పలువురు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం రాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలాజీ మనోహర్, ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆదిమూర్తి, అమానుల్లా తదితరులు 200 మంది కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి సీఎం జగన్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీలో చేరిన వారు మాట్లాడుతూ... హిందూపురంలో వైఎస్సార్ సీపీ గెలుపులే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్నిశ్చల్, వైఎస్సార్ సీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు టీఎన్ దీపిక, శాంతమ్మ, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డి, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూపురంలో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం సీఎం సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ నాయకులు -
ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి
తాడిపత్రి: ఎన్నికల విధుల్లో భాగంగా శిక్షణకు వచ్చిన ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న మద్ద రామాంజనేయులు (55) ఉరవకొండలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య మాలతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి శుక్రవారం ఆయన హాజరయ్యారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు రోజూ వేకువజామున వాకింగ్కు వెళ్లే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున కడప మార్గంలో వాకింగ్కు వెళ్లిన ఆయన శివాలయం వద్ద రహదారి పక్కన మృతదేహమై కనిపించారు. అటుగా వెళుతున్న వాహనదారులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
No Headline
సాక్షి, పుట్టపర్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో శనివారం హిందూపురం మురిసి పోయింది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరాగా పట్టణం కిక్కిరిసింది. బస్టాండు వద్ద నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు వీధులన్నీ జనంతో పోటెత్తాయి. అభిమానుల సందడితో ‘పురం’లో విజయోత్సాహం కనిపించింది. దారి పొడవునా అపూర్వ స్వాగతం.. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయం నుంచి సీఎం వైఎస్ జగన్ హెలికాప్టర్లో బయలుదేరి స్థానిక ఎంజీఎం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్ సీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎంజీఎం మైదానం నుంచి బస్సులో బయలుదేరిన వైఎస్ జగన్కు అభిమానులు దారిపొడవునా అపూర్వ స్వాగతం పలికారు. ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపైనే నిలబడి ‘జై జగన్’ అంటూ నినదించారు. కొందరు మహిళలు దూరం నుంచే సీఎం ప్రయాణించే బస్సుకు గుమ్మడికాయలతో దిష్టితీశారు. అప్పటికే అంబేడ్కర్ సర్కిల్ నుంచి మేళాపురం సర్కిల్ వరకు.. మరోవైపు పరిగి బస్టాండ్ వరకు ఇసుకేస్తే రాలనంత జనంతో రహదారులన్నీ నిండిపోయాయి. సీఎం జగన్ స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్దకు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ‘జై జగన్.. జై జై జగన్’ అంటూ నినదించారు. మధ్యాహ్నం 12 గంటల వేళ ఎర్రటి ఎండలోనూ కట్టుకదలకుండా సీఎం ప్రసంగం విని తమ సంకల్పం ఎంత గొప్పదో చాటారు. సీఎం ప్రసంగం ఆద్యంతం ఈలలు వేస్తూ మద్దతు తెలిపారు. జగన్ ఫ్యాన్ చూపించగానే ‘ఫ్యాన్స్’ ఆనందంతో చిందులు వేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేవీ ఉషశ్రీచరణ్, రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్నిశ్చల్, హిందూపురం పార్లమెంటు అభ్యర్థి జె.శాంత, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి టీఎన్ దీపిక, మడకశిర అభ్యర్థి ఈరలక్కప్ప, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘని, హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్లు బలరామిరెడ్డి, జబీవుల్లా, నాయకులు కొండూరు వేణుగోపాల్రెడ్డి, గుడ్డంపల్లి వేణురెడ్డి, మధుమతిరెడ్డి, కొటిపి హనుమంతరెడ్డి, జనార్దన్రెడ్డి, ఆనంద్రెడ్డి, శ్రీరామిరెడ్డి, పట్టణ, మండల కన్వీనర్లు మన్సూర్, రాము, నారాయణస్వామి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. విమానాశ్రయంలోనూ ఘన స్వాగతం.. అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయంలో మంత్రి పెద్దిరెడ్డి, శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి తదితరులు సీఎం జగన్కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సీఎం పర్యటన సాగిందిలా.. ఉదయం 10.50 గంటలు: సీఎం వైఎస్ జగన్ పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయం చేరుకున్నారు. 11 గంటలు : పుట్టపర్తి నుంచి హెలికాప్టర్లో హిందూపురం బయలుదేరారు. 11.25 గంటలు : హిందూపురంలోని ఎంజీఎం మైదానంలో హెలిప్యాడ్కు చేరుకున్నారు. 12 గంటలు : అంబేడ్కర్ సర్కిల్లో బహిరంగ సభ వద్దకు వచ్చారు 12.10 గంటలు : అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగం ప్రారంభించారు. 12.50 గంటలు : ప్రసంగం ముగించారు. 1.25 గంటలు : ఎంజీఎం మైదానం నుంచి హెలికాప్టర్లో పలమనేరు బయలుదేరి వెళ్లారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు
కాంగ్రెస్లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement