-
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 77,848 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 39,317 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.95 కోట్లు.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది -
మామిడి రైతుకు గిట్టుబాటు ధర
చిత్తూరు అగ్రికల్చర్: మామిడి రైతుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏటా గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని జిల్లా పండ్ల సమాఖ్య కార్యదర్శి గోవర్ధన్బాబీ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం మామిడి గుజ్జు పరిశ్రమలను బలిచేయడం మంచి పద్దతి కాదన్నారు. గత ఏడాది మే10వ తేదీన గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలతో కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో టన్నుకు రూ.19వేలు రైతులకు చెల్లించాలని ఆదేశించినా అమలు కాలేదని ఈనాడు దినపత్రికలో వార్త ప్రచురించారని, అయితే అప్పట్లో కలెక్టర్ ఆదేశించింది వారం రోజులు ఆ ధర చెల్లించాలని మాత్రమే సూచించారని వెల్లడించారు. ఆ సమయంలో మామిడి దిగుబడి రాలేదని, జూన్లో కాయల దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్ రేటు కంటే రూ.2లు అధికంగా రైతులకు చెల్లించామని వివరించారు. కనీస ధర కిలోకు రూ.10 తక్కువ కాకుండా రైతులకు ఇచ్చామని తెలిపారు. వాస్తవాలను కప్పిపుచ్చి తప్పుడు వార్తలు రాయడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
పక్కాగా ఈవీఎంల ర్యాండమైజేషన్
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఈవీఎంల ర్యాండమైజేషన్ను పక్కాగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో అబ్జర్వర్లు,అభ్యర్థుల సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిఘా నీడలో 2,318 బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించా రు. కార్యక్రమంలో డీఆర్ఓ పుల్లయ్య పాల్గొన్నారు. ఇంట్లో చోరీ వి.కోట: పట్టణంలోని సిద్ధార్థనగర్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన విషయం శనివారం వెలుగుచూసింది. కాలనీలో నివసిస్తున్న నవనీతమ్మ తమ కుటుంబీకులతో కలిసి ఈ నెల 2వ తేదీన బెంగళూరు వెళ్లింది. తిరిగి శనివారం ఇంటికి వచ్చింది. తలుపులు, బీరువా పగులగొట్టి ఉండడంతో దిగ్భ్రాంతి చెందింది. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి, కొంత నగదు అపహరించినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగప్ప తెలిపారు. గడ్డివాము దగ్ధం వెదురుకుప్పం : మండలంలోని ఆళ్లమడుగు ఎస్సీ కాలనీలో శనివారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో గోవిందస్వామి అనే రైతుకు చెందిన గడ్డివాము దగ్ధమైంది. పశువుల మేత కోసం నిల్వ ఉంచిన గడ్డి పూర్తిగా కాలిపోవడంతో రూ.25 వేలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
పకడ్బందీగా ఓటరు స్లిప్పుల పంపిణీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పకడ్బందీగా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, సోమవారంలోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. శనివారం ఆయన క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లందరికీ స్లిప్పులు చేరేలా ఆర్ఓలు చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 5,6 తేదీల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్బ్యాలెట్కు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బంది పోస్టల్బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోస్టల్బ్యాలెట్ రికార్డులు పక్కాగా నిర్వహించాలని కోరారు. పోలీస్శాఖతో సమన్వయం చేసుకుని క్యూలు, శాంతిభద్రతలను పర్యవేక్షించాలన్నారు. పోస్టల్బ్యాలెట్ ప్రక్రియ ముగిసిన వెంటనే బాక్సులను పకడ్బందీ భద్రతతో స్ట్రాంగ్రూమ్లో భద్రపరచాలని చెప్పారు. ఈ నెల 6,7 తేదీల్లో హోం ఓటింగ్ ప్రక్రియను జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇక్కడ పనిచేస్తూ ఇతర జిల్లాల్లో పోస్టల్బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్బ్యాలెట్ వేయాలని స్పష్టం చేశౠరు. పోస్టల్బ్యాలెట్ వేసేందుకు వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా ఎపిక్కార్డు, ఆధార్కార్డు, ప్రభుత్వం జారీచేసిన గుర్తింపుకార్డుల్లో ఏదైన ఒకటి, ఎన్నికల విధులకు కేటాయించిన ఉత్తర్వులను తీసుకుని రావాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్బ్యాలెట్ వినియోగించుకునేందుకు అవకాశముంటుందని వెల్లడించారు. -
మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
గుడిపాల/చిత్తూరు అర్బన్: చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఎస్సీ, ఎస్టీ మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అందరి ఎదుటే దళిత మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి వెంటనే అతడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని.. ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం కనకనేరి ఆది అంధ్రవాడలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.టీడీపీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలాజీ నాయుడు తదితరులు మందీ మార్బలంతో శనివారం కనకనేరి గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. ఇక్కడున్న ఆది ఆంధ్రవాడకు చెందిన మహిళలు యానాదులకు చెందిన మహిళలను ఓం శక్తి గుడి వద్దకు జగన్మోహన్ నాయుడు పిలిపించాడు. మీకు గ్రామంలో ఏం సమస్య ఉందో చెప్పాలని మహిళలను అడగగా.. నీటి సమస్య ఎక్కువగా ఉందని పారిశుద్ధ్యం సరిగా లేదని మహిళలు సమాధానమిచ్చారు. దీంతో టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ నాయుడు ‘నేను ఐదేళ్ల ముందే వచ్చినప్పుడు మీకు చెప్పినాను కదా ఫ్యాన్కు ఓటేయవద్దు అని. నా మాట వినలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు, అనుభవించండి. ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తారు, సమస్యలు మాకు చెబుతారా? ఎగేసుకొని పోయి ఓటు వేసినారు కదా ఫ్యానుకు.. అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఈసారి మాకే ఓటేస్తామని మహిళలంతా వచ్చి దేవుని ఎదుట ప్రమాణం చేయాలని హుకుం జారీ చేశాడు. అంతటితో ఆగకుండా.. ‘ఏమిరా మీ ఊరులో పెళ్లిళ్లు చేసుకుని మొగుళ్లని వదిలేస్తారంట కదా.. ఆమేమో మొగుడ్ని వదిలేసాను అంటది ఈమేమో మొగుడు ఉండాడు యాడికో పోయినాడు అంటాది. మీ ఊరంతా ఇట్లాంటోల్లేనా ఉండేది’ అంటూ దళితుల మనోభావాలు కించపరిచేలా మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపిస్తే దళితులపై ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే తగ్గకుండా చివర్లో తాము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామంటూ మహిళలంతా తేల్చి చెప్పడంతో జగన్మోహన్ నాయుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు కులాహంకారాన్ని వ్యక్తపరిచేలా జగన్మోహన్ నాయుడు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరుకు చెందిన మేయర్ అముద, మాజీ చైర్మన్ తదితరులు జగన్మోహన్ నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గుడిపాల మండలంలోని దళిత నాయకులు మాట్లాడుతూ గురజాల జగన్మోహన్ నాయుడును ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement