అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: రాష్ట్రంలో 80లక్షలకు పైగా ఉన్న మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా మాదిగలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం అచ్చంపేట పట్టణంలోని ఫంక్షన్హాలులో మాదిగ రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాదిగల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. అదేవిధంగా ఉప్పునుంతలలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓట్లు వేయడానికి మాదిగలు కావాలి కానీ, ఎంపీ సీట్లు ఇవ్వరా? అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాదిగలకు బీఆర్ఎస్ సముచిత స్థానం కల్పించిందన్నారు. కేంద్రంలో బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. చరిత్ర తిరగ రాయాలన్నా.. చరిత్ర సృష్టించాలన్నా మాదిగలకే సాధ్యమన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్లు సంపాదించిన నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎంతోమంది స్వార్థపరులు పదవులను అనుభవించి బీఆర్ఎస్ను వీడితే.. తాను మాత్రం కేసీఆర్ నికార్సయిన పాలనకోసం, పేద ప్రజల సంక్షేమం కోరి బీఆర్ఎస్లోకి వచ్చానని ప్రవీణ్కుమార్ తెలిపారు. తాను గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్న సమయంలో పేద విద్యార్థులను ఎంతోమందిని ఉన్నత స్థితికి తీసుకెళ్లానన్నారు. ప్రస్తుత ఎంపీ రాములు రాజకీయ లబ్ధి కోసం బీజేపీలో చేరి తన కుమారుడి అధికారం కోసం తహతహలాడుతున్నాడే తప్పా ఈ ప్రాంత అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. నవీన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సత్తు భూపాల్రావు, గోపాల్రెడ్డి, రవీందర్రావు, భాస్కర్, శంకర్, విజయ్, వెంకటయ్య, రవీందర్, సురేష్ పాల్గొన్నారు.
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
Published Mon, May 6 2024 2:40 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
టమాట రేటు.. మిర్చి ఘాటు
నేడు అక్కడక్కడా వర్షాలు
తొలి ఫలితం పుట్టపర్తిదే!
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
14 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగావకాశం
‘108’లో ప్రసవం
అతిసారం నివారణకు చర్యలు చేపట్టాలి
త్యాగానికి ప్రతిరూపం కల్లూరు
ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
డీఆర్ కాలనీలో చోరీ
తప్పక చదవండి
- నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్ఫుల్
- ఛత్తీస్గఢ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది మృతి
- అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
- AP: తొలి ఫలితం వచ్చేది అప్పుడే!
- Kavya Maran: శెభాష్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. వీడియో వైరల్
- ‘నేను ఏలియన్ని’..మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- కిషన్ లీలలెన్నో..!
- అన్నమయ్య: YSRCP కార్యకర్త దారుణ హత్య
- నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
Advertisement