రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం

Published Mon, May 6 2024 2:40 AM

రోడ్డు ప్రమాదంలో  నవ వరుడు దుర్మరణం

తెలకపల్లి: పెళ్లి జరిగిన రెండు నెలలకే ఓ నవ వరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి ఎస్‌ఐ నరేష్‌ కథనం ప్రకారం.. మండలంలోని పెద్దూరు గ్రామానికి చెందిన కోళ్ల నగేష్‌(30)కు రెండు నెలల క్రితమే ఓ యువతితో వివాహం జరిగింది. అయితే ఆదివారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై తెలకపల్లికి వెళ్తుండగా గౌరెడ్డిపల్లి శివారులో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నగేష్‌కు తీవ్రగాయాలు కాగా.. కారు బోల్తాపడి లక్నారం గ్రామానికి చెందిన భగవంతురావు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు తీవ్రంగా గాయపడిన నగేష్‌ను నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. నగేష్‌ మృతితో గ్రామంలో, కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై నగేష్‌ చిన్నాన్న బిచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement